శిథిల భవనాల్లో పల్లె పాలన
పరిపాలన సౌలభ్యం కోసం సర్కారు కొత్తగా గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేసింది. వీటిలో కొన్నింటికి మాత్రమే భవన నిర్మాణానికి కొంత నిధులు మంజూరు చేసి పనులు మొదలుపెట్టారు.
తుంగతుర్తి నియోజకవర్గ కేంద్రంలోని పంచాయతీ భవనం శిథిలావస్థకు చేరగా.. దాని పక్కనే రెండేళ్ల కిందట నూతన భవన నిర్మాణ పనులు మొదలు పెట్టారు. కొద్దిమేర పిల్లర్లు వేసి పునాది దశలో వివిధ కారణాలతో పనులు నిలిపివేశారు. దీంతో శిథిలమైన, వానలకు ఉరుస్తున్న భవనంలోనే పాలన సాగుతోంది. సభలు, సమావేశాల సమయంలో వీధిలో టెంట్లు వేసి కార్యక్రమాలు జరుపుతున్నారు.
తుంగతుర్తి, న్యూస్టుడే: పరిపాలన సౌలభ్యం కోసం సర్కారు కొత్తగా గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేసింది. వీటిలో కొన్నింటికి మాత్రమే భవన నిర్మాణానికి కొంత నిధులు మంజూరు చేసి పనులు మొదలుపెట్టారు. నిధుల కొరతతో అవి అసంపూర్తిగా నిలిచిపోయాయి. కొత్త పంచాయతీలకు సొంత భవనాలు లేక అధికారులు, పాలకులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొన్ని గ్రామాల్లో కమ్యూనిటీ, అద్దె భవనాలు, పాఠశాలల్లోని కొన్ని గదుల్లో పల్లె పాలన నిర్వహిస్తున్నారు.
అసంపూర్తిగా నిర్మాణాలు
మొదట్లో జిల్లాలో మొత్తం 301 గ్రామ పంచాయతీలు ఉండగా.. గత ప్రభుత్వం 500 జనాభా ఉన్న తండాలు, ఆవాసాలను పంచాయతీలుగా మార్చింది. దీంతో 174 కొత్త పంచాయతీలు ఏర్పడ్డాయి. జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం ద్వారా 127 పంచాయతీల్లో భవనాలు నిర్మించడానికి అనుమతులు వచ్చాయి. ఒక్కో దానికి రూ.20 లక్షల నిధులు కేటాయించారు. అవి సరిపోక చాలా వరకు అసంపూర్తిగా ఉన్నాయి. దీంతో పాఠశాలలు, ఇతర అద్దె భవనాల్లో పాలనను కొనసాగించాల్సిన పరిస్థితి నెలకొంది. అవి శిథిలావస్థకు చేరుకోగా.. వర్షాలు కురిస్తే మరింతగా దెబ్బతినే అవకాశం ఉంది.
తుంగతుర్తి మండలంలోని రావులపల్లి క్రాస్రోడ్డు తండాను గత ప్రభుత్వ హయాంలో నూతన పంచాయతీగా మార్చారు. సొంత భవనం నిర్మించలేదు. తండాలో ఉన్న ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలోని ఓ గదిని పంచాయతీ కార్యాలయానికి అధికారులు అప్పగించటంతో అందులోనే కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. దీంతో విద్యార్థులు గదుల కొరతతో ఇబ్బందులు పడుతున్నారు.
క్షేత్రస్థాయిలో పరిశీలిస్తాం: సురేష్, జిల్లా పంచాయతీ అధికారి
జిల్లాలో శిథిలావస్థకు చేరిన, అద్దె భవనాల్లో కొనసాగుతున్న, నూతన పంచాయతీ భవనాలను పరిశీలిస్తాం. అసంపూర్తిగా ఉన్న వాటి గురించి ఉపాధిహామీ అధికారులతో మాట్లాడి పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటాం. శిథిల భవనాలను తొలగింపజేసి కొత్త వాటి నిర్మాణానికి ప్రతిపాదనలు పంపిస్తాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తొలకరి నిరాశే..!
[ 04-07-2024]
వానాకాలం ప్రారంభమై నెల గడిచినా.. మూడు జిల్లాల్లోనూ లోటు వర్షపాతమే నమోదు అయింది.దీంతో పంటల సాగులో తీవ్ర జాప్యం నెలకొంటోంది. ఈ ఏడాది నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి జిల్లాల్లో కలిపి పంటల సాగు సగటు 15 శాతానికి కూడా మించలేదు. -
దళారీ.. అధికారి.. మధ్యలో రాయబారి
[ 04-07-2024]
రోడ్డు రవాణా సంస్థ కార్యాలయంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించడానికి ఓ యజమాని (రాయబారి) రంగంలోకి దిగారు. అధికారులకు.. దళారులకు మధ్య సయోధ్య కుదర్చడం కోసం ముమ్మర ప్రయత్నం చేశారు. -
ఉచితానికి పచ్చజెండా..!
[ 04-07-2024]
కరెంటు కోసం ఇబ్బందులు పడుతున్న రైతులకు ప్రభుత్వం శుభవార్త అందించింది. గత ఏడాది కాలంగా పెండింగ్లో ఉన్న ఉచిత విద్యుత్తు వ్యవసాయ బోరుబావుల దరఖాస్తులకు పచ్చజెండా ఊపింది. -
గౌరవం ఏదీ..?
[ 04-07-2024]
గౌరవ వేతనాల కోసం స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు ఎదురు చూస్తున్నారు. -
సాంకేతికత మూలకేనా..!
[ 04-07-2024]
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు సాంకేతిక విద్యను అందించేందుకు ప్రభుత్వం తీసుకున్న చర్యలు నిరర్ధకం అయ్యాయి. -
ప్రగతిచక్రంలో.. నియామకాల పర్వం
[ 04-07-2024]
ఆర్టీసీలో కొలువుల జాతర మొదలు కానుంది. సుమారు 12 ఏళ్లుగా ఎటువంటి నియామకాలు లేకపోగా.. ఉద్యోగ విరమణ పొందుతున్న వారితో సిబ్బంది భారీగా తగ్గుతూ వస్తున్నారు. -
చౌటుప్పల్ పట్టణాన.. పైవంతెన
[ 04-07-2024]
చౌటుప్పల్ పట్టణంలో జాతీయ రహదారి- 65పై ఫ్లైఓవర్ నిర్మాణం కానుంది. వంతెన నిర్మాణానికి జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్హెచ్ఏఐ) రూ.114.40 కోట్లు మంజూరు చేసింది. -
తప్పు నుంచి మెప్పు దిశగా..!
[ 04-07-2024]
రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జైళ్లలో జీవిత ఖైదు అనుభవిస్తున్న 213 మంది ఖైదీలను సత్ప్రవర్తన పేరుతో ప్రభుత్వం విడుదల చేసింది. -
అనుమానాస్పద స్థితిలో విద్యార్థి మృతి
[ 04-07-2024]
అనుమానాస్పద స్థితిలో వసతిగృహ విద్యార్థి మృతి చెందిన ఘటన మండల కేంద్రంలోని ఎస్సీ సాంఘిక సంక్షేమ వసతి గృహంలో బుధవారం చోటు చేసుకుంది. -
నిరుద్యోగుల నిరీక్షణ!
[ 04-07-2024]
ప్రభుత్వ కొలువులు దక్కని, ఉన్నత చదువులు చదివిన యువతకు ప్రభుత్వం జిల్లా కేంద్రంలో ప్రతినెల ఉద్యోగ మేళాను నిర్వహిస్తోంది. -
మక్త అనంతారం ప్రభుత్వ పాఠశాలకు ప్రత్యేక గుర్తింపు
[ 04-07-2024]
ప్రభుత్వ పాఠశాలల్లో రాష్ట్రంలోనే స్వచ్ఛతకు కేరాఫ్గా నిలిచిన యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం మక్త అనంతారం గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలకు రాష్ట్రంలో మరో ప్రత్యేక గుర్తింపు దక్కింది. -
యాదాద్రి పుణ్యక్షేత్రంలో ఆరాధనలు
[ 04-07-2024]
యాదాద్రి పుణ్యక్షేత్రంలో బుధవారం మూలవరులను ఆరాధిస్తూ చేపట్టిన ఆస్థాన, ఆర్జిత పూజలు ఆలయ ఆచారంగా కొనసాగాయి. గర్భాలయ ద్వారాలను తెరిచిన పూజారులు హారతితో కొలిచారు.
తాజా వార్తలు (Latest News)
-
ఉద్యోగులు పనివేళలు పాటించాల్సిందే
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
వంచకుడు అంజాద్పై కేసు.. పెళ్లి చేసుకుంటానని బలవంతాన తీసుకెళ్లినట్లు తేజస్విని స్టేట్మెంట్
-
జగన్ రంగుల మాయకు రూ.కోట్ల ఖర్చు!
-
గురువెక్కడో మేమూ అక్కడే.. ఆయన వెళ్లిన పాఠశాలలోనే చేరిన 133 మంది విద్యార్థులు
-
నేటి నుంచి ఎప్సెట్ కౌన్సెలింగ్