ఫీజులు నొక్కి.. ఇరుకు గదుల్లో కుక్కి
జిల్లాలోని ప్రైవేటు జూనియర్ కళాశాలల్లో విచ్చలవిడిగా ఫీజులు వసూలు చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో తనిఖీ చేయాల్సిన ఇంటర్ విద్యాధికారులు పట్టించుకోకపోవటంతో యాజమాన్యాలు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాయి.
సూర్యాపేట పట్టణం, న్యూస్టుడే: జిల్లాలోని ప్రైవేటు జూనియర్ కళాశాలల్లో విచ్చలవిడిగా ఫీజులు వసూలు చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో తనిఖీ చేయాల్సిన ఇంటర్ విద్యాధికారులు పట్టించుకోకపోవటంతో యాజమాన్యాలు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాయి. ఫీజులకు తగిన విధంగా వసతులు కల్పించాల్సి ఉన్నా అవేవి పాటించకుండా దోపిడీకి పాల్పడుతున్నారు. కళాశాలలో చేరిన తర్వాత అధిక ఫీజుల వసూళ్లపై ప్రశ్నించిన విద్యార్థులను బెదిరింపులకు గురిచేస్తున్నారు. ప్రవేశాలు పొందిన దగ్గరి నుంచి ఉత్తీర్ణత సాధించిన తర్వాత ధ్రువపత్రాలు తీసుకునే వరకు కళాశాలలో చేరినప్పుడు మాట్లాడుకున్న దానికి కంటే ఎక్కువగా వసూలు చేస్తున్నారని విద్యార్థులు తల్లిదండ్రులు వాపోతున్నారు.
వసతులు గగనమే!
జిల్లాలో గతేడాది 32 ప్రైవేటు కళాశాలలు ఉండగా.. ప్రస్తుతం 26 ఉన్నాయి. ఇంకా మూడింటికి అనుమతులు రావాల్సి ఉంది. ప్రస్తుతం ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 4,589 మంది విద్యనభ్యసిస్తున్నారు. మొదటి సంవత్సరంలో చేరికలపై యాజమాన్యాలు దృష్టి సారిస్తున్నాయి. భోజనం, వసతి గృహాల్లో మొదట చేర్చుకునే వరకు ఒకలా... చేరిన కొద్ది రోజుల తర్వాత మరోలా వసతులు కల్పిస్తుండటం విమర్శలకు తావిస్తోంది. ఇరుకైన వసతి, తరగతి గదుల్లో ఎక్కువ మందిని ఉంచుతూ ఇబ్బందులకు గురిచేస్తున్నారని విద్యార్థులు వాపోతున్నారు. చాలా వసతి గృహాల్లో నిబంధనలను విస్మరిస్తున్నారు. ఫైర్ సేఫ్టీ, ఆటస్థలాలు, క్రీడలు, తదితర వసతులు కల్పించకున్నా అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని విమర్శలు వ్యక్తమవుతు న్నాయి. ఒక పెద్ద భవనాన్ని అద్దెకు తీసుకుని అందులోనే తరగతులు, వసతి, భోజనశాల, ఆఫీస్ రూం వంటి అన్నింటినీ నిర్వహిస్తుండటం గమనార్హం.
వసూలు ఇలా..
ప్రైవేటు కళాశాలల్లో ప్రవేశ రుసుం రూ.500, ప్రథమ, ద్వితీయ సంవత్సరంలో పరీక్ష ఫీజు రూ.1500 నుంచి రూ.2500 వరకు వసూలు చేస్తున్నారు. డేస్కాలర్కు ప్రథమ సంవత్సరం రూ.5 వేల నుంచి రూ.7 వేలు, ద్వితీయ సంవత్సరం రూ.10 వేల వరకు తీసుకుంటున్నారు. వసతి గృహాలతో కలిపి రూ.35 వేల నుంచి రూ.55 వేల వరకు వసూలు చేస్తున్నారు. వీటికితోడు పుస్తకాలు, ధోబీ, ఇతర ఫీజులు అదనంగా చెల్లించాలని విద్యార్థులపై ఒత్తిడి తెస్తున్నారు. అధికారులు స్పందించి తనిఖీలు చేపట్టాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.
చర్యలు తీసుకుంటాం
- కృష్ణయ్య, డీఐఈవో, సూర్యాపేట
ప్రైవేటు కళాశాలల్లో వసతులు కల్పించాలని యాజమాన్యాలకు ఆదేశాలు జారీ చేస్తున్నాం. ఫీజుల విషయమై ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పష్టత రాలేదు. యాజమాన్యాలే నచ్చిన విధంగా ఫీజు నిర్ధారించుకున్నారు. పరీక్ష రుసుం అధికంగా వసూలు చేస్తే చర్యలు తీసుకుంటాం. కళాశాలల్లో తగిన వసతులు లేకుంటేే అనుమతులు రద్దు చేస్తాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తొలకరి నిరాశే..!
[ 04-07-2024]
వానాకాలం ప్రారంభమై నెల గడిచినా.. మూడు జిల్లాల్లోనూ లోటు వర్షపాతమే నమోదు అయింది.దీంతో పంటల సాగులో తీవ్ర జాప్యం నెలకొంటోంది. ఈ ఏడాది నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి జిల్లాల్లో కలిపి పంటల సాగు సగటు 15 శాతానికి కూడా మించలేదు. -
దళారీ.. అధికారి.. మధ్యలో రాయబారి
[ 04-07-2024]
రోడ్డు రవాణా సంస్థ కార్యాలయంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించడానికి ఓ యజమాని (రాయబారి) రంగంలోకి దిగారు. అధికారులకు.. దళారులకు మధ్య సయోధ్య కుదర్చడం కోసం ముమ్మర ప్రయత్నం చేశారు. -
ఉచితానికి పచ్చజెండా..!
[ 04-07-2024]
కరెంటు కోసం ఇబ్బందులు పడుతున్న రైతులకు ప్రభుత్వం శుభవార్త అందించింది. గత ఏడాది కాలంగా పెండింగ్లో ఉన్న ఉచిత విద్యుత్తు వ్యవసాయ బోరుబావుల దరఖాస్తులకు పచ్చజెండా ఊపింది. -
గౌరవం ఏదీ..?
[ 04-07-2024]
గౌరవ వేతనాల కోసం స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు ఎదురు చూస్తున్నారు. -
సాంకేతికత మూలకేనా..!
[ 04-07-2024]
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు సాంకేతిక విద్యను అందించేందుకు ప్రభుత్వం తీసుకున్న చర్యలు నిరర్ధకం అయ్యాయి. -
ప్రగతిచక్రంలో.. నియామకాల పర్వం
[ 04-07-2024]
ఆర్టీసీలో కొలువుల జాతర మొదలు కానుంది. సుమారు 12 ఏళ్లుగా ఎటువంటి నియామకాలు లేకపోగా.. ఉద్యోగ విరమణ పొందుతున్న వారితో సిబ్బంది భారీగా తగ్గుతూ వస్తున్నారు. -
చౌటుప్పల్ పట్టణాన.. పైవంతెన
[ 04-07-2024]
చౌటుప్పల్ పట్టణంలో జాతీయ రహదారి- 65పై ఫ్లైఓవర్ నిర్మాణం కానుంది. వంతెన నిర్మాణానికి జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్హెచ్ఏఐ) రూ.114.40 కోట్లు మంజూరు చేసింది. -
తప్పు నుంచి మెప్పు దిశగా..!
[ 04-07-2024]
రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జైళ్లలో జీవిత ఖైదు అనుభవిస్తున్న 213 మంది ఖైదీలను సత్ప్రవర్తన పేరుతో ప్రభుత్వం విడుదల చేసింది. -
అనుమానాస్పద స్థితిలో విద్యార్థి మృతి
[ 04-07-2024]
అనుమానాస్పద స్థితిలో వసతిగృహ విద్యార్థి మృతి చెందిన ఘటన మండల కేంద్రంలోని ఎస్సీ సాంఘిక సంక్షేమ వసతి గృహంలో బుధవారం చోటు చేసుకుంది. -
నిరుద్యోగుల నిరీక్షణ!
[ 04-07-2024]
ప్రభుత్వ కొలువులు దక్కని, ఉన్నత చదువులు చదివిన యువతకు ప్రభుత్వం జిల్లా కేంద్రంలో ప్రతినెల ఉద్యోగ మేళాను నిర్వహిస్తోంది. -
మక్త అనంతారం ప్రభుత్వ పాఠశాలకు ప్రత్యేక గుర్తింపు
[ 04-07-2024]
ప్రభుత్వ పాఠశాలల్లో రాష్ట్రంలోనే స్వచ్ఛతకు కేరాఫ్గా నిలిచిన యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం మక్త అనంతారం గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలకు రాష్ట్రంలో మరో ప్రత్యేక గుర్తింపు దక్కింది. -
యాదాద్రి పుణ్యక్షేత్రంలో ఆరాధనలు
[ 04-07-2024]
యాదాద్రి పుణ్యక్షేత్రంలో బుధవారం మూలవరులను ఆరాధిస్తూ చేపట్టిన ఆస్థాన, ఆర్జిత పూజలు ఆలయ ఆచారంగా కొనసాగాయి. గర్భాలయ ద్వారాలను తెరిచిన పూజారులు హారతితో కొలిచారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
వరంగల్ నిట్ విద్యార్థికి రూ.88 లక్షల వార్షిక వేతన ప్యాకేజీ
-
ఉద్యోగులు పనివేళలు పాటించాల్సిందే
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
వంచకుడు అంజాద్పై కేసు.. పెళ్లి చేసుకుంటానని బలవంతాన తీసుకెళ్లినట్లు తేజస్విని స్టేట్మెంట్
-
జగన్ రంగుల మాయకు రూ.కోట్ల ఖర్చు!
-
గురువెక్కడో మేమూ అక్కడే.. ఆయన వెళ్లిన పాఠశాలలోనే చేరిన 133 మంది విద్యార్థులు