బిందుసేద్యం విస్తరణకు అడుగులు
సాగునీటి సమస్య.. మరోపక్క కూలీల కొరత వెరసి వ్యవసాయం అనుబంధ సాగుకు రైతులు నానా తంటాలు పడుతున్నారు.
నాలుగేళ్ల తర్వాత ప్రభుత్వ నిర్ణయంతో రైతుల్లో సంతోషం
కొత్తజాల గ్రామంలో బిందుసేద్యం పద్ధతిలో బీరతోట సాగు..
రాజపేట, భువనగిరి, న్యూస్టుడే: సాగునీటి సమస్య.. మరోపక్క కూలీల కొరత వెరసి వ్యవసాయం అనుబంధ సాగుకు రైతులు నానా తంటాలు పడుతున్నారు. పెట్టుబడి ఖర్చులు పెరుగుతుండటం, అధిక నీటి వినియోగం, ఏటికేడు దిగుబడి తగ్గుతుండటం వంటి పరిస్థితులు ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా అన్నదాతలను కుంగదీస్తున్నాయి. ఈ నేపథ్యంలో బిందు, తుంపర సేద్యం ద్వారా అధికాదాయం పొందవచ్చని ప్రభుత్వం చెబుతోంది. డ్రిప్ సాగును విస్తరింపజేయాలని వ్యవసాయశాఖ అధికారులకు ఇటీవల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించడంతో ఈ వానాకాలం నుంచే అమలుకు చర్యలు తీసుకుంటున్నారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఆయిల్పామ్ 5,000 ఎకరాలు, 2,246 ఎకరాల్లో పండ్లు, కూరగాయల సాగును బిందుసేద్యం ద్వారా చేపట్టాలని అధికారులు లక్ష్యంగా నిర్దేశించుకున్నారు.
ప్రోత్సహించే పంటలు
ప్రధాన పంటలైన పత్తి, మొక్కజొన్న, మామిడి, జామ, బత్తాయి, మిరప, దానిమ్మ, అయిల్పామ్, కూరగాయల పంటలు, పూల సాగుకు డ్రిప్ విధానం అమలు కానుంది. నల్గొండ జిల్లాలో 3,940, సూర్యాపేట 1,808, యాదాద్రి భువనగిరి 1,498 ఎకరాల్లో బిందుసేద్యాన్ని ప్రోత్సహించాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు.
రాయితీలు ఇలా..
ఎస్సీ, ఎస్టీ రైతులకు పూర్తిగా ఉచితంగా అంటే 100 శాతం రాయితీపై డ్రిప్ పరికరాలను ప్రభుత్వం అందిస్తుంది. బీసీ, సన్న, చిన్నకారు రైతులకు 90 శాతం, ఇతరులకు 80 శాతం రాయితీ వర్తిస్తుంది. పంటల సాగును బట్టి ఒక్కో యూనిట్ ధర ప్రతి హెక్టారుకు రూ.33,500 నుంచి రూ.1,44,000 వరకు రాయితీ అందుతుంది. ఇప్పటి వరకు డ్రిప్ పరికరాలకు రైతులు వందల సంఖ్యలో దరఖాస్తులు చేసుకున్నట్లుగా ఉద్యానవన శాఖ అధికారులు చెబుతున్నారు. బిందుసేద్యం ద్వారా 50 శాతం నీటి ఆదాతో పాటు ఎరువులు, కూలీల ఖర్చు తగ్గుతుందని అంచనా వేస్తున్నారు. ఆసక్తి కలిగిన రైతులు మీసేవ కేంద్రాల్లో దరఖాస్తు చేయాలి. దరఖాస్తులో ఏ పంట సాగు చేస్తారో అనే విషయం తెలిపాల్సి ఉంటుంది.
దరఖాస్తులు స్వీకరిస్తున్నాం
- అన్నపూర్ణ, జిల్లా ఉద్యాన శాఖ అధికారిణి, యాదాద్రి భువనగిరి
సూక్ష్మసేద్యం వైపు రైతులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం రాయితీలు అందిస్తోంది. బిందుసేద్యంపై కర్షకుల నుంచి దరఖాస్తులు స్వీకరించే ప్రక్రియ కొనసాగుతుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తొలకరి నిరాశే..!
[ 04-07-2024]
వానాకాలం ప్రారంభమై నెల గడిచినా.. మూడు జిల్లాల్లోనూ లోటు వర్షపాతమే నమోదు అయింది.దీంతో పంటల సాగులో తీవ్ర జాప్యం నెలకొంటోంది. ఈ ఏడాది నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి జిల్లాల్లో కలిపి పంటల సాగు సగటు 15 శాతానికి కూడా మించలేదు. -
దళారీ.. అధికారి.. మధ్యలో రాయబారి
[ 04-07-2024]
రోడ్డు రవాణా సంస్థ కార్యాలయంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించడానికి ఓ యజమాని (రాయబారి) రంగంలోకి దిగారు. అధికారులకు.. దళారులకు మధ్య సయోధ్య కుదర్చడం కోసం ముమ్మర ప్రయత్నం చేశారు. -
ఉచితానికి పచ్చజెండా..!
[ 04-07-2024]
కరెంటు కోసం ఇబ్బందులు పడుతున్న రైతులకు ప్రభుత్వం శుభవార్త అందించింది. గత ఏడాది కాలంగా పెండింగ్లో ఉన్న ఉచిత విద్యుత్తు వ్యవసాయ బోరుబావుల దరఖాస్తులకు పచ్చజెండా ఊపింది. -
గౌరవం ఏదీ..?
[ 04-07-2024]
గౌరవ వేతనాల కోసం స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు ఎదురు చూస్తున్నారు. -
సాంకేతికత మూలకేనా..!
[ 04-07-2024]
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు సాంకేతిక విద్యను అందించేందుకు ప్రభుత్వం తీసుకున్న చర్యలు నిరర్ధకం అయ్యాయి. -
ప్రగతిచక్రంలో.. నియామకాల పర్వం
[ 04-07-2024]
ఆర్టీసీలో కొలువుల జాతర మొదలు కానుంది. సుమారు 12 ఏళ్లుగా ఎటువంటి నియామకాలు లేకపోగా.. ఉద్యోగ విరమణ పొందుతున్న వారితో సిబ్బంది భారీగా తగ్గుతూ వస్తున్నారు. -
చౌటుప్పల్ పట్టణాన.. పైవంతెన
[ 04-07-2024]
చౌటుప్పల్ పట్టణంలో జాతీయ రహదారి- 65పై ఫ్లైఓవర్ నిర్మాణం కానుంది. వంతెన నిర్మాణానికి జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్హెచ్ఏఐ) రూ.114.40 కోట్లు మంజూరు చేసింది. -
తప్పు నుంచి మెప్పు దిశగా..!
[ 04-07-2024]
రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జైళ్లలో జీవిత ఖైదు అనుభవిస్తున్న 213 మంది ఖైదీలను సత్ప్రవర్తన పేరుతో ప్రభుత్వం విడుదల చేసింది. -
అనుమానాస్పద స్థితిలో విద్యార్థి మృతి
[ 04-07-2024]
అనుమానాస్పద స్థితిలో వసతిగృహ విద్యార్థి మృతి చెందిన ఘటన మండల కేంద్రంలోని ఎస్సీ సాంఘిక సంక్షేమ వసతి గృహంలో బుధవారం చోటు చేసుకుంది. -
నిరుద్యోగుల నిరీక్షణ!
[ 04-07-2024]
ప్రభుత్వ కొలువులు దక్కని, ఉన్నత చదువులు చదివిన యువతకు ప్రభుత్వం జిల్లా కేంద్రంలో ప్రతినెల ఉద్యోగ మేళాను నిర్వహిస్తోంది. -
మక్త అనంతారం ప్రభుత్వ పాఠశాలకు ప్రత్యేక గుర్తింపు
[ 04-07-2024]
ప్రభుత్వ పాఠశాలల్లో రాష్ట్రంలోనే స్వచ్ఛతకు కేరాఫ్గా నిలిచిన యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం మక్త అనంతారం గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలకు రాష్ట్రంలో మరో ప్రత్యేక గుర్తింపు దక్కింది. -
యాదాద్రి పుణ్యక్షేత్రంలో ఆరాధనలు
[ 04-07-2024]
యాదాద్రి పుణ్యక్షేత్రంలో బుధవారం మూలవరులను ఆరాధిస్తూ చేపట్టిన ఆస్థాన, ఆర్జిత పూజలు ఆలయ ఆచారంగా కొనసాగాయి. గర్భాలయ ద్వారాలను తెరిచిన పూజారులు హారతితో కొలిచారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
నిమ్మకాయ నీళ్లకు రూ.28 లక్షలు.. నవ్విపోదురు గాక ‘నా’కేటి సిగ్గ‘ని’
-
కాంగ్రెస్లోకి భారాస గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి?
-
పిల్లర్లే నల్లబల్లలు.. నాడు-నేడు పనులు పూర్తికాక ఇక్కట్లు
-
మంత్రివర్గ విస్తరణ, పీసీసీ అధ్యక్షుడి ఎంపిక వాయిదా
-
సగర్వంగా స్వదేశానికి.. భారత్ చేరుకున్న రోహిత్ సేన
-
ఉచిత ఇసుక మార్గదర్శకాలు సిద్ధం