గర్భిణి మృతికి కారణమైన ఆరుగురి అరెస్టు
చివ్వెంల మండలం ఎంజీనగర్ తండాకు చెందిన ఎనిమిది నెలల గర్భిణి సుహాసిని మృతి కేసులో ఆరుగురిని సోమవారం అరెస్టు చేసినట్లు ఎస్పీ సన్ప్రీత్ సింగ్ తెలిపారు.
సూర్యాపేటలో నిందితుల వివరాలు వెల్లడిస్తున్న ఎస్పీ సన్ప్రీత్ సింగ్, చిత్రంలో డీఎస్పీ రవి, తదితరులు
సూర్యాపేట నేరవిభాగం, న్యూస్టుడే: చివ్వెంల మండలం ఎంజీనగర్ తండాకు చెందిన ఎనిమిది నెలల గర్భిణి సుహాసిని మృతి కేసులో ఆరుగురిని సోమవారం అరెస్టు చేసినట్లు ఎస్పీ సన్ప్రీత్ సింగ్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం బట్టుతండాకు చెందిన బట్టు కృష్ణ, క్రాంతి దంపతుల కుమార్తె సుహాసిని(27)ని చివ్వెంల మండలం ఎంజీనగర్ తండాకు చెందిన రత్నావత్ హరిసింగ్తో ఐదేళ్ల క్రితం వివాహం జరిపించారు. వీరికి ఆడపిల్లలు జస్విక(4), అన్విక(2) జన్మించిన తర్వాత సుహాసిని ఆపరేషన్ చేయించుకుంటానంటే ఆమె భర్త హరిసింగ్, బంధువులు కలిసి వారసుడు(కుమారుడు) కావాలంటూ ఆమెపై ఒత్తిడి చేశారు. మగ పిల్లవాడు లేకపోతే మరో పెళ్లి చేసుకుంటానని బెదిరించి బలవంతం చేయడంతో సుహాసిని భయంతో కు.ని. చేయించుకోలేదు. అనంతరం గర్భం దాల్చడంతో వారందరూ కలిసి స్కానింగ్ చేయించుకొమ్మని బలవంతంగా ఆటోలో కోదాడలోని డాక్టర్ గురవయ్య ఆసుపత్రికి రెండు నెలలుగా నాలుగుసార్లు తీసుకెళ్లి స్కానింగ్ చేయించారు. చివరి సారి గర్భంలో ఆడపిల్ల ఉందని వైద్యులు నిర్ధారించారు. ఆమె భర్త, అతని కుటుంబ సభ్యులు కలిసి సుహాసినిని గర్భవిచ్ఛిత్తి చేయించుకొమ్మని బలవంతం చేశారు. గత నెల 24న హుజూర్నగర్లోని న్యూ కమలా ఆసుపత్రికి తీసుకెళ్లి దవాఖానా మేనేజర్ ఖాసీంతో అబార్షన్ చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు.
నర్సు దేవరకొండ రాణితో గర్భవిచ్ఛిత్తిని ప్రారంభించారు. మరుసటి రోజు ఖాసీం సుహాసినిని పెద్దవీడు గ్రామానికి తీసుకెళ్లి అక్కడ అతని ఇంట్లో ఉంచి, నర్సు రాణిని అక్కడికి పిలిపించి మరోసారి అబార్షన్ టాబ్లెట్స్, ఇంజెక్షన్లు ఇచ్చారు. రక్తస్త్రావం అవుతూ అబార్షన్ కావట్లేదని గుర్తించి ఆమెతోపాటు భర్తను ఖాసీం కారులో మఠంపల్లికి తర్వాత కోదాడకు తీసుకెళ్లి డాక్టర్ గురువయ్య ఆసుపత్రిలో చేర్పించారు. 26న ఉదయం డాక్టర్ స్కానింగ్ నిర్వహించి, ఆమె పరిస్థితి విషమంగా ఉందని చెప్పాడు. అక్కడి నుంచి ఖమ్మం, తర్వాత హైదరాబాద్కు తరలిస్తుండగా మార్గమధ్యలో సూర్యాపేటలో మృతిచెందింది. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు చివ్వెంల ఠాణాలో పీఎన్డీటీ యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేశారు. మృతురాలి భర్త హరిసింగ్, న్యూ కమలా ఆసుపత్రి మేనేజర్ షేక్ ఖాసీం, నర్సు దేవరకొండ రాణి, కోదాడలోని విజయ ఆసుపత్రి కంపౌండర్లు రణపంగు గోపి, షేక్ సైదులు, తాళ్లమల్కాపురానికి చెందిన అమరగాని నవీన్ను సోమవారం అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు ఎస్పీ వివరించారు. గర్భవిచ్ఛిత్తికి సహకరించిన మరికొంత మందిని అరెస్టు చేస్తామన్నారు. డాక్టర్ గురువయ్య పరారీలో ఉన్నాడని తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తొలకరి నిరాశే..!
[ 04-07-2024]
వానాకాలం ప్రారంభమై నెల గడిచినా.. మూడు జిల్లాల్లోనూ లోటు వర్షపాతమే నమోదు అయింది.దీంతో పంటల సాగులో తీవ్ర జాప్యం నెలకొంటోంది. ఈ ఏడాది నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి జిల్లాల్లో కలిపి పంటల సాగు సగటు 15 శాతానికి కూడా మించలేదు. -
దళారీ.. అధికారి.. మధ్యలో రాయబారి
[ 04-07-2024]
రోడ్డు రవాణా సంస్థ కార్యాలయంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించడానికి ఓ యజమాని (రాయబారి) రంగంలోకి దిగారు. అధికారులకు.. దళారులకు మధ్య సయోధ్య కుదర్చడం కోసం ముమ్మర ప్రయత్నం చేశారు. -
ఉచితానికి పచ్చజెండా..!
[ 04-07-2024]
కరెంటు కోసం ఇబ్బందులు పడుతున్న రైతులకు ప్రభుత్వం శుభవార్త అందించింది. గత ఏడాది కాలంగా పెండింగ్లో ఉన్న ఉచిత విద్యుత్తు వ్యవసాయ బోరుబావుల దరఖాస్తులకు పచ్చజెండా ఊపింది. -
గౌరవం ఏదీ..?
[ 04-07-2024]
గౌరవ వేతనాల కోసం స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు ఎదురు చూస్తున్నారు. -
సాంకేతికత మూలకేనా..!
[ 04-07-2024]
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు సాంకేతిక విద్యను అందించేందుకు ప్రభుత్వం తీసుకున్న చర్యలు నిరర్ధకం అయ్యాయి. -
ప్రగతిచక్రంలో.. నియామకాల పర్వం
[ 04-07-2024]
ఆర్టీసీలో కొలువుల జాతర మొదలు కానుంది. సుమారు 12 ఏళ్లుగా ఎటువంటి నియామకాలు లేకపోగా.. ఉద్యోగ విరమణ పొందుతున్న వారితో సిబ్బంది భారీగా తగ్గుతూ వస్తున్నారు. -
చౌటుప్పల్ పట్టణాన.. పైవంతెన
[ 04-07-2024]
చౌటుప్పల్ పట్టణంలో జాతీయ రహదారి- 65పై ఫ్లైఓవర్ నిర్మాణం కానుంది. వంతెన నిర్మాణానికి జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్హెచ్ఏఐ) రూ.114.40 కోట్లు మంజూరు చేసింది. -
తప్పు నుంచి మెప్పు దిశగా..!
[ 04-07-2024]
రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జైళ్లలో జీవిత ఖైదు అనుభవిస్తున్న 213 మంది ఖైదీలను సత్ప్రవర్తన పేరుతో ప్రభుత్వం విడుదల చేసింది. -
అనుమానాస్పద స్థితిలో విద్యార్థి మృతి
[ 04-07-2024]
అనుమానాస్పద స్థితిలో వసతిగృహ విద్యార్థి మృతి చెందిన ఘటన మండల కేంద్రంలోని ఎస్సీ సాంఘిక సంక్షేమ వసతి గృహంలో బుధవారం చోటు చేసుకుంది. -
నిరుద్యోగుల నిరీక్షణ!
[ 04-07-2024]
ప్రభుత్వ కొలువులు దక్కని, ఉన్నత చదువులు చదివిన యువతకు ప్రభుత్వం జిల్లా కేంద్రంలో ప్రతినెల ఉద్యోగ మేళాను నిర్వహిస్తోంది. -
మక్త అనంతారం ప్రభుత్వ పాఠశాలకు ప్రత్యేక గుర్తింపు
[ 04-07-2024]
ప్రభుత్వ పాఠశాలల్లో రాష్ట్రంలోనే స్వచ్ఛతకు కేరాఫ్గా నిలిచిన యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం మక్త అనంతారం గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలకు రాష్ట్రంలో మరో ప్రత్యేక గుర్తింపు దక్కింది. -
యాదాద్రి పుణ్యక్షేత్రంలో ఆరాధనలు
[ 04-07-2024]
యాదాద్రి పుణ్యక్షేత్రంలో బుధవారం మూలవరులను ఆరాధిస్తూ చేపట్టిన ఆస్థాన, ఆర్జిత పూజలు ఆలయ ఆచారంగా కొనసాగాయి. గర్భాలయ ద్వారాలను తెరిచిన పూజారులు హారతితో కొలిచారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
వాయు కాలుష్యంతో భారత్లో ఏటా 33 వేల మరణాలు: లాన్సెట్
-
రికార్డు గరిష్ఠాలకు సూచీలు.. 24,350 ఎగువన నిఫ్టీ
-
మత్తు ఊబిలో ఎంబీఏ విద్యార్థులు.. డ్రగ్ రాకెట్ను ఛేదించిన టీజీ న్యాబ్ పోలీసులు
-
వరంగల్ నిట్ విద్యార్థికి రూ.88 లక్షల వార్షిక వేతన ప్యాకేజీ
-
ఉద్యోగులు పనివేళలు పాటించాల్సిందే
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM