ఒత్తిడిని జయిద్దాం..హాయిగా జీవిద్దాం
ఇటీవలి కాలంలో చిన్నా, పెద్ద తేడా లేకుండా అన్ని వయస్సుల వారిని వేధిస్తున్న ప్రధాన సమస్య ఒత్తిడి.
మిర్యాలగూడ పట్టణం, న్యూస్టుడే: ఇటీవలి కాలంలో చిన్నా, పెద్ద తేడా లేకుండా అన్ని వయస్సుల వారిని వేధిస్తున్న ప్రధాన సమస్య ఒత్తిడి. చిన్నారులు, విద్యార్థులు చదువుల్లో, యువతలో ప్రేమ, స్నేహం, ఉద్యోగం, అనుకున్నది సాధించలేకపోవడం వంటి వాటితో.. పెద్దవారిలో పిల్లల భవిష్యత్తుతో పాటు ఆర్థిక పరిస్థితుల కారణంగా తీవ్ర ఆందోళనకు గురవుతూ అనేక అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. ఉమ్మడి జిల్లాలోనూ అనేక మంది ఒత్తిడితో అనారోగ్యం బారిన పడడంతో పాటు ఆత్మహత్యలు వంటి చర్యలకు సైతం పాల్పడుతున్నారు.
ఉమ్మడి జిల్లాలో యువతే అధికం..
ఉమ్మడి జిల్లాలో సుమారు ఆరు లక్షల మంది యువత ఉన్నారు. వీరిలో జూనియర్ కళాశాల విద్యార్థులు సుమారు 12 వేల మంది ఉండగా.. 18-19 ఏళ్ల వయసున్న వారు 65 వేల మంది ఉన్నారు. వీరిలో అనేక మంది చదువుతో పాటు ఆర్థిక, ప్రేమ వ్యవహారాల వల్ల తీవ్ర ఒత్తిడి బారిన పడుతున్నారు. దీంతో మద్యం, మత్తు పదార్థాలకు వ్యసనపరులవుతూ తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఇటీవల గంజాయి రవాణా, వినియోగంలో పట్టుబడుతున్న వారిలో 99 శాతం మంది యువతే ఉండడం గమనార్హం. తమలోని ఒత్తిడిని తగ్గించుకునేందుకు గంజాయి వాడుతూ.. అనంతరం ఆర్థిక పరిస్థితులతో ఇతరులకూ విక్రయిస్తున్నారు.
గత సంఘటనలు..
- మేళ్లచెరువులో అప్పులతో ఒత్తిడికి గురై ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకోగా.. ఆర్నెళ్ల వ్యవధిలో అతడి భార్య సైతం బలవన్మరణానికి పాల్పడింది.
- క్రికెట్ బెట్టింగ్కు అలవాటు పడి మేళ్లచెరువు మండలం రేవూరుకు చెందిన ఓ యువకుడు దొంగతనానికి సైతం పాల్పడి..ఆ తర్వాత ఆత్మహత్య చేసుకున్నాడు.
- హుజూర్నగర్కు చెందిన యువకుడు భార్య తరఫు వారి వేధింపులు తాళలేక ఒత్తిడితో ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
- 2023లో హైదరాబాద్ రామాంతపూర్లో ప్రేమించిన యువతితో వివాహం జరగకపోవడంతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు.
వచ్చే అనారోగ్య సమస్యలివి..
ముఖ్యంగా గుండెపోటు, రక్తపోటు, మధుమేహం, అజీర్తి, శ్వాస వంటి అనారోగ్య సమస్యలు ఒత్తిడి, ఆందోళన వల్లనే వస్తాయి. హార్మోన్ల అసమతుల్యత, నిద్రలేమి కారణంగా మూర్చవ్యాధి సైతం వచ్చే అవకాశాలున్నాయి. ఇవి మెదడుపై తీవ్ర ప్రభావం చూపి ఆత్మహత్యలు, హత్యలు వంటి ఆలోచనలకు దారి తీస్తాయి.
చిట్కాలు...
- నచ్చిన ఆహారం తినాలి.
- నడకతో మనసు, మెదడు ప్రశాంతంగా మారి ఒత్తిడి తగ్గుతుంది.
- నచ్చిన ప్రదేశాన్ని, వ్యక్తులను ఊహించుకోవాలి.
- మంచి సంగీతాన్ని వినాలి.
చిన్నప్పటి నుంచే క్రమశిక్షణ నేర్పించాలి: డాక్టర్ భవాని, మానసిక నిపుణులు, మిర్యాలగూడ
చిన్నప్పటి నుంచి పిల్లలకు ఏది అడిగితే అది వెంటనే ఇవ్వకుండా ప్రయత్నిస్తే సాధించగలమనే ఆలోచనతో పాటు క్రమశిక్షణను అలవాటు చేయాలి. పరీక్షల సమయంలోనే కాకుండా ఒక ప్రణాళికతో చదివేలా ప్రోత్సహించాలి. పిల్లలను ఆటలు ఆడించడంతో గెలుపోటములు సహజమనే విషయాన్ని గ్రహించి యుక్త వయస్సు తర్వాత పరీక్షల్లో ఉత్తీర్ణత, ఉద్యోగం రాకపోయినా, ప్రేమ విఫలమైనా ఒత్తిడికి గురి కాకుండా తట్టుకుని నిలబడే స్వభావం అలవడుతుంది. ఆటలు, యోగా, డ్రాయింగ్, స్నేహం వంటివి అలవాటు చేయాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తొలకరి నిరాశే..!
[ 04-07-2024]
వానాకాలం ప్రారంభమై నెల గడిచినా.. మూడు జిల్లాల్లోనూ లోటు వర్షపాతమే నమోదు అయింది.దీంతో పంటల సాగులో తీవ్ర జాప్యం నెలకొంటోంది. ఈ ఏడాది నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి జిల్లాల్లో కలిపి పంటల సాగు సగటు 15 శాతానికి కూడా మించలేదు. -
దళారీ.. అధికారి.. మధ్యలో రాయబారి
[ 04-07-2024]
రోడ్డు రవాణా సంస్థ కార్యాలయంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించడానికి ఓ యజమాని (రాయబారి) రంగంలోకి దిగారు. అధికారులకు.. దళారులకు మధ్య సయోధ్య కుదర్చడం కోసం ముమ్మర ప్రయత్నం చేశారు. -
ఉచితానికి పచ్చజెండా..!
[ 04-07-2024]
కరెంటు కోసం ఇబ్బందులు పడుతున్న రైతులకు ప్రభుత్వం శుభవార్త అందించింది. గత ఏడాది కాలంగా పెండింగ్లో ఉన్న ఉచిత విద్యుత్తు వ్యవసాయ బోరుబావుల దరఖాస్తులకు పచ్చజెండా ఊపింది. -
గౌరవం ఏదీ..?
[ 04-07-2024]
గౌరవ వేతనాల కోసం స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు ఎదురు చూస్తున్నారు. -
సాంకేతికత మూలకేనా..!
[ 04-07-2024]
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు సాంకేతిక విద్యను అందించేందుకు ప్రభుత్వం తీసుకున్న చర్యలు నిరర్ధకం అయ్యాయి. -
ప్రగతిచక్రంలో.. నియామకాల పర్వం
[ 04-07-2024]
ఆర్టీసీలో కొలువుల జాతర మొదలు కానుంది. సుమారు 12 ఏళ్లుగా ఎటువంటి నియామకాలు లేకపోగా.. ఉద్యోగ విరమణ పొందుతున్న వారితో సిబ్బంది భారీగా తగ్గుతూ వస్తున్నారు. -
చౌటుప్పల్ పట్టణాన.. పైవంతెన
[ 04-07-2024]
చౌటుప్పల్ పట్టణంలో జాతీయ రహదారి- 65పై ఫ్లైఓవర్ నిర్మాణం కానుంది. వంతెన నిర్మాణానికి జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్హెచ్ఏఐ) రూ.114.40 కోట్లు మంజూరు చేసింది. -
తప్పు నుంచి మెప్పు దిశగా..!
[ 04-07-2024]
రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జైళ్లలో జీవిత ఖైదు అనుభవిస్తున్న 213 మంది ఖైదీలను సత్ప్రవర్తన పేరుతో ప్రభుత్వం విడుదల చేసింది. -
అనుమానాస్పద స్థితిలో విద్యార్థి మృతి
[ 04-07-2024]
అనుమానాస్పద స్థితిలో వసతిగృహ విద్యార్థి మృతి చెందిన ఘటన మండల కేంద్రంలోని ఎస్సీ సాంఘిక సంక్షేమ వసతి గృహంలో బుధవారం చోటు చేసుకుంది. -
నిరుద్యోగుల నిరీక్షణ!
[ 04-07-2024]
ప్రభుత్వ కొలువులు దక్కని, ఉన్నత చదువులు చదివిన యువతకు ప్రభుత్వం జిల్లా కేంద్రంలో ప్రతినెల ఉద్యోగ మేళాను నిర్వహిస్తోంది. -
మక్త అనంతారం ప్రభుత్వ పాఠశాలకు ప్రత్యేక గుర్తింపు
[ 04-07-2024]
ప్రభుత్వ పాఠశాలల్లో రాష్ట్రంలోనే స్వచ్ఛతకు కేరాఫ్గా నిలిచిన యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం మక్త అనంతారం గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలకు రాష్ట్రంలో మరో ప్రత్యేక గుర్తింపు దక్కింది. -
యాదాద్రి పుణ్యక్షేత్రంలో ఆరాధనలు
[ 04-07-2024]
యాదాద్రి పుణ్యక్షేత్రంలో బుధవారం మూలవరులను ఆరాధిస్తూ చేపట్టిన ఆస్థాన, ఆర్జిత పూజలు ఆలయ ఆచారంగా కొనసాగాయి. గర్భాలయ ద్వారాలను తెరిచిన పూజారులు హారతితో కొలిచారు.