ప్రతిభ చూపితే.. భవిత మీదే!
మూస విధానంలో చదివితే విద్యార్థులకు ఆయా సబ్జెక్టుల్లో మార్కులు పెరగొచ్చు కానీ.. వారిలోని సృజనాత్మకత వెలుగులోకి రాదు.
రాజపేట, ఆలేరు, న్యూస్టుడే: మూస విధానంలో చదివితే విద్యార్థులకు ఆయా సబ్జెక్టుల్లో మార్కులు పెరగొచ్చు కానీ.. వారిలోని సృజనాత్మకత వెలుగులోకి రాదు. ఈ విషయాన్ని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం తరగతి గదుల్లో పుస్తకాలతో కుస్తీ పట్టే విద్యార్థుల దృష్టిని పరిశోధన, ప్రయోగాల వైపు మరల్చడమే లక్ష్యంగా పలు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ప్రభుత్వ పరిధిలోని విజ్ఞాన భారతి, విజ్ఞాన్ ప్రసాద్, ఎన్సీఈఆర్టీ (నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యూకేషన్ రీసెర్చ్ ట్రైనింగ్) సంయుక్తంగా ‘విద్యార్థి విజ్ఞాన్ మంథన్’ (వీవీఎం) పేరిట ఏటా ప్రతిభా పరీక్షలు చేపడుతోంది. ప్రస్తుతం 2024-25 విద్యా సంవత్సరానికి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. ఈ విషయమై ఉమ్మడి నల్గొండ జిల్లాలో చదువుతున్న విద్యార్థులను విద్యాశాఖ వర్గాలు ఇప్పటి నుంచే అప్రమత్తం చేశాయి. ముఖ్యంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు కలిపి సుమారు మూడు వేలకు పైగా పాఠశాలలుండగా సుమారు 2.60 లక్షల మందికిపైగా విద్యార్థులు చదువుతున్నారు. అందులో కొద్దిమందికైనా ఇందులో స్థానం లభిస్తే ప్రయోజనకరంగా ఉంటుందన్నది కొందరి విద్యా నిపుణుల అభిప్రాయం.
దరఖాస్తు విధానం ఇలా..
ఆసక్తి ఉన్న విద్యార్థులు రూ.200 రుసుం చెల్లించి ‘విద్యార్థి విజ్ఞాన్ మంథన్’ అనే వెబ్సైట్లో వివరాలు నమోదు చేసుకోవాలి. ఇందుకు సెప్టెంబరు వరకు గడువు ఉంది. నమోదు చేసుకున్న వారికి జూనియర్, సీనియర్ విభాగాల్లో ప్రకటించిన తేదీల్లో పరీక్షలుంటాయి. తెలుగు, ఆంగ్లం, హిందీతో పాటు ఇతర దేశ భాషల్లోనూ పాల్గొనవచ్చు. పాఠశాల, జిల్లా, రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయిలో పరీక్షలు ఉంటాయి. పరీక్షలకు సన్నద్ధమయ్యేందుకు ఇప్పటికే వెబ్సైట్లో పుస్తకాలు అందుబాటులో ఉంచారు. అక్టోబరు 23, 27న (వీలును బట్టి ఏదైనా తేదీల్లో) జిల్లా స్థాయి పరీక్ష ఉంటుంది. నవంబరు 15న ఫలితాలు విడుదల చేస్తారు. డిసెంబరు 8, 15, 22 తేదీల్లో ఒక రోజు రాష్ట్ర స్థాయి పోటీలుంటాయి. 2025 మే 17 లేదా 18 తేదీల్లో జాతీయ స్థాయి పరీక్ష ఉంటుంది.
విజేతలకు నగదు పురస్కారం
పాఠశాల స్థాయి పోటీల్లో 18 మంది చొప్పున ఎంపిక చేస్తారు. జిల్లా స్థాయి పోటీలకు సబ్జెక్టుకు ముగ్గురు చొప్పున ఎంపిక చేస్తారు. వీరికి ఆన్లైన్ ప్రశంసా ధ్రువపత్రాన్ని అందిస్తారు. రాష్ట్ర స్థాయి పోటీల్లో 20 మందిని ఎంపిక చేస్తారు. వీరికి ధ్రువపత్రంతో పాటు జ్ఞాపిక, రూ.5 వేలు, రూ.3 వేలు, రూ.2 వేలు చొప్పున నగదు అందజేస్తారు. జాతీయ స్థాయిలో ప్రతిభ చూపితే రూ.25 వేలు, రూ.15 వేలు, రూ.10వేల చొప్పున అందిస్తారు. భాస్కర స్కాలర్షిప్ పేరుతో ఏడాది పాటు నెలకు రూ.2 వేల చొప్పున సదరు విద్యార్థులకు ఉపకార వేతనాలు అందించే అవకాశం ఉంటుంది.
పరీక్షలో అంశాల వివరాలు..
- వంద బహుళైచ్ఛిక ప్రశ్నలతో ఆన్లైన్ ద్వారా పరీక్ష నిర్వహిస్తారు.
- సామాన్య, గణితం, పాఠ్యపుస్తకాల్లోని అంశాలు: 90 శాతం
- విజ్ఞాన శాస్త్ర రంగంలో భారతదేశ కృషిపై: 20 శాతం
- శాస్త్రవేత్తల జీవిత విశేషాలపై..: 20 శాతం మార్కులుంటాయి. వీటిని వీవీఎంఏ వారు అందించే స్టడీ మెటీరియల్ ద్వారా ఇస్తారు.
- లాజిక్, రీజనింగ్కు: 10 శాతం మార్కులుంటాయి. వీటిని సమకాలీన అంశాలపై ఇస్తారు.
సద్వినియోగం చేసుకోవాలి
- సీహెచ్.భరణికుమార్, జిల్లా సైన్స్ అధికారి, యాదాద్రి భువనగిరి
పాఠ్యపుస్తకాలతో పాటు సామాజిక అంశాలు, చరిత్రపై పట్టున్న విద్యార్థులు ‘విద్యార్థి విజ్ఞాన్ మంథన్’ ద్వారా జాతీయ స్థాయిలో ప్రతిభ చాటేందుకు అవకాశం ఉంటుంది. జిల్లా విద్యాధికారి నారాయణరెడ్డి సూచనల మేరకు ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు సమాచారాన్ని అందించి ఎక్కువ మంది పోటీలో పాల్గొనేలా చర్యలు చేపడుతున్నాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తొలకరి నిరాశే..!
[ 04-07-2024]
వానాకాలం ప్రారంభమై నెల గడిచినా.. మూడు జిల్లాల్లోనూ లోటు వర్షపాతమే నమోదు అయింది.దీంతో పంటల సాగులో తీవ్ర జాప్యం నెలకొంటోంది. ఈ ఏడాది నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి జిల్లాల్లో కలిపి పంటల సాగు సగటు 15 శాతానికి కూడా మించలేదు. -
దళారీ.. అధికారి.. మధ్యలో రాయబారి
[ 04-07-2024]
రోడ్డు రవాణా సంస్థ కార్యాలయంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించడానికి ఓ యజమాని (రాయబారి) రంగంలోకి దిగారు. అధికారులకు.. దళారులకు మధ్య సయోధ్య కుదర్చడం కోసం ముమ్మర ప్రయత్నం చేశారు. -
ఉచితానికి పచ్చజెండా..!
[ 04-07-2024]
కరెంటు కోసం ఇబ్బందులు పడుతున్న రైతులకు ప్రభుత్వం శుభవార్త అందించింది. గత ఏడాది కాలంగా పెండింగ్లో ఉన్న ఉచిత విద్యుత్తు వ్యవసాయ బోరుబావుల దరఖాస్తులకు పచ్చజెండా ఊపింది. -
గౌరవం ఏదీ..?
[ 04-07-2024]
గౌరవ వేతనాల కోసం స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు ఎదురు చూస్తున్నారు. -
సాంకేతికత మూలకేనా..!
[ 04-07-2024]
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు సాంకేతిక విద్యను అందించేందుకు ప్రభుత్వం తీసుకున్న చర్యలు నిరర్ధకం అయ్యాయి. -
ప్రగతిచక్రంలో.. నియామకాల పర్వం
[ 04-07-2024]
ఆర్టీసీలో కొలువుల జాతర మొదలు కానుంది. సుమారు 12 ఏళ్లుగా ఎటువంటి నియామకాలు లేకపోగా.. ఉద్యోగ విరమణ పొందుతున్న వారితో సిబ్బంది భారీగా తగ్గుతూ వస్తున్నారు. -
చౌటుప్పల్ పట్టణాన.. పైవంతెన
[ 04-07-2024]
చౌటుప్పల్ పట్టణంలో జాతీయ రహదారి- 65పై ఫ్లైఓవర్ నిర్మాణం కానుంది. వంతెన నిర్మాణానికి జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్హెచ్ఏఐ) రూ.114.40 కోట్లు మంజూరు చేసింది. -
తప్పు నుంచి మెప్పు దిశగా..!
[ 04-07-2024]
రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జైళ్లలో జీవిత ఖైదు అనుభవిస్తున్న 213 మంది ఖైదీలను సత్ప్రవర్తన పేరుతో ప్రభుత్వం విడుదల చేసింది. -
అనుమానాస్పద స్థితిలో విద్యార్థి మృతి
[ 04-07-2024]
అనుమానాస్పద స్థితిలో వసతిగృహ విద్యార్థి మృతి చెందిన ఘటన మండల కేంద్రంలోని ఎస్సీ సాంఘిక సంక్షేమ వసతి గృహంలో బుధవారం చోటు చేసుకుంది. -
నిరుద్యోగుల నిరీక్షణ!
[ 04-07-2024]
ప్రభుత్వ కొలువులు దక్కని, ఉన్నత చదువులు చదివిన యువతకు ప్రభుత్వం జిల్లా కేంద్రంలో ప్రతినెల ఉద్యోగ మేళాను నిర్వహిస్తోంది. -
మక్త అనంతారం ప్రభుత్వ పాఠశాలకు ప్రత్యేక గుర్తింపు
[ 04-07-2024]
ప్రభుత్వ పాఠశాలల్లో రాష్ట్రంలోనే స్వచ్ఛతకు కేరాఫ్గా నిలిచిన యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం మక్త అనంతారం గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలకు రాష్ట్రంలో మరో ప్రత్యేక గుర్తింపు దక్కింది. -
యాదాద్రి పుణ్యక్షేత్రంలో ఆరాధనలు
[ 04-07-2024]
యాదాద్రి పుణ్యక్షేత్రంలో బుధవారం మూలవరులను ఆరాధిస్తూ చేపట్టిన ఆస్థాన, ఆర్జిత పూజలు ఆలయ ఆచారంగా కొనసాగాయి. గర్భాలయ ద్వారాలను తెరిచిన పూజారులు హారతితో కొలిచారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
కరకట్టపై దస్త్రాల దహనం.. విచారణకు ఏపీ ప్రభుత్వం ఆదేశం
-
సందేహం అక్కర్లేదు.. నేనే అధ్యక్ష అభ్యర్థిని: బైడెన్
-
వరల్డ్ కప్ మెడల్తో పంత్.. ట్రోల్ చేసిన అక్షర్, సిరాజ్
-
ఇంకా పరారీలోనే భోలే బాబా.. ముమ్మరంగా గాలిస్తున్న పోలీసులు
-
ఘనంగా వరలక్ష్మీ శరత్కుమార్ రిసెప్షన్.. తారల సందడి
-
ప్రధాని మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ