నేటి నుంచి అమల్లోకి పోలీస్ కొత్త చట్టాలు
దేశవ్యాప్తంగా సోమవారం నుంచి జిల్లాలో పోలీస్ నూతన చట్టాలు అమల్లోకి రానున్నాయి.
జిల్లాలో పోలీసులకు ముగిసిన శిక్షణ
నల్గొండ నేరవిభాగం, న్యూస్టుడే: దేశవ్యాప్తంగా సోమవారం నుంచి జిల్లాలో పోలీస్ నూతన చట్టాలు అమల్లోకి రానున్నాయి. అందులో భాగంగా జిల్లాలో పోలీస్ చట్టాలపై శిక్షణ ముగింపు సమావేశంలో ఎస్పీ శరత్ చంద్ర పవార్ మాట్లాడుతూ జిల్లాలో ప్రతి ఒక్క పోలీస్ అధికారి, సిబ్బందికి విడతల వారీగా చట్టాలపై శిక్షణ ముగిసినట్లు తెలిపారు. కొత్త చట్టాలైన సీఆర్పీసీకి బదులుగా భారతీయ నాగరిక్ సురక్ష సంహిత (బీఎన్ఎస్ఎస్), రెండోది ఐపీసీ బదులుగా (బీఎన్ఎస్) భారతీయ న్యాయ సంహిత, మూడోది ఇండియన్ ఎవిడెన్స్ యాక్టు (ఐఈఏ)కు బదులుగా భారతీయ సాక్ష్యా అధినియం (బీఎస్ఏ)గా 2023 డిసెంబర్ 25న పార్లమెంటులో కొత్త చట్టాలను కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. ఈ చట్టాలు సోమవారం నుంచి పూర్తి స్థాయిల్లో జిల్లాలో కూడా అమల్లోకి రానున్నాయి. నూతన చట్టాలపై జిల్లాలో కానిస్టేబుల్ నుంచి డీఎస్పీ స్థాయి వరకు 875 మందికి నెల రోజుల పాటు శిక్షణ ఇచ్చారు. ఒక్కో అధికారికి మూడు రోజుల చొప్పున రోజుకు 120 నుంచి 130 మందికి 18 బ్యాచ్ల్లో అవగాహన కల్పించారు.
కొత్త చట్టాల్లో కొన్ని ఇలా...
- కోర్టు ఎవిడెన్స్ ఇచ్చే వారిలో.. పోలీస్, వైద్యులు, తహసీల్దార్ లాంటి అధికారులు విధులు నిర్వర్తిస్తూనే వీడియో కాల్ ద్వారా న్యాయమూర్తికి సాక్ష్యం చెప్పొచ్చు.
- సెక్షన్ 103(2) ఐదురుగు అంతకంటే ఎక్కువ వ్యక్తులు ఒక వ్యక్తిని హత్య చేస్తే మాబ్లించింగ్ (కులం, మతం, స్థానం)గా గుర్తించారు.
- చైౖన్ స్నాచింగ్ కోసం ప్రత్యేకంగా సెక్షన్ 304 బీఎన్ఎస్ తీసుకొచ్చారు.
- యాసిడ్ దాడికి కొత్తగా సెక్షన్ 124 (బీఎన్ఎస్) అమల్లోకి తెచ్చారు.
- పెళ్లి చేసుకుంటానని మోసం చేయడం, లైంగికంగా వేధించే వారి కోసం కొత్తగా సెక్షన్ 69ని అమల్లోకి తీసుకొచ్చారు.
- మైనర్ (18 ఏళ్లలోపు) పేరును మారుస్తూ చైల్డ్గా గుర్తింపు తీసుకొచ్చారు.
- కొన్ని చీటింగ్ కేసుల్లో పట్టుబడిన నగదు కోర్టుకు మాత్రమే అనుసంధానం చేసేవారు.. కొత్తగా వచ్చిన చట్టంలో పట్టుబడిన నగదు కోర్టుకు అనుసంధానం చేయడంతో బాధితులకు పంచే వెసులుబాటు జిల్లా కలెక్టర్కు ఇచ్చారు.
- తాజా చట్టాల్లో కొన్నింటికి శిక్షలు పెంచడంతో పాటు జరిమానాలు పెంచడం జరిగింది. ఉదాహరణకు ఒక వ్యక్తి చెయ్యి విరగొడితే గతంలో మూడేళ్ల జైలు రూ.1,000 జరిమానా.. ప్రస్తుతం రూ.20 వేలు జరిమానాకు పెరిగింది.
- కొత్తగా టెర్రరిస్టు చట్టం 113 అమల్లోకి తీసుకొచ్చారు.
మార్పులు..
- గతంలో సీఆర్పీసీలో 484 సెక్షన్లు ఉండగా బీఎన్ఎస్ఎస్లో 531కి పెంచారు.
- ఐపీసీలో 511 సెక్షన్లు ఉండగా బీఎన్ఎస్లో 358కి తగ్గించారు.
- ఐఈఏలో 167 సెక్షన్లు ఉండగా బీఎస్ఏలో 170 పెరిగాయి.
- ప్రస్తుత కాలానికి సాంకేతిక విభాగానికి ప్రాధాన్యం ఇస్తూ సంబంధిత స్టేషన్కు వెళ్లలేని పక్షంలో ఎక్కడైనా ఫిర్యాదు చేయొచ్చు. వాట్సాప్, మెయిల్, ఎక్స్, ఫేస్బుక్ ద్వారా కూడా ఫిర్యాదు చేయొచ్చు, కానీ, మూడు రోజుల్లో సంబంధిత పోలీస్ స్టేషన్లో సంతకాలు చేయాలి. కేసుల విషయంలో కోర్టుకు హాజరు కాలేని సాక్షులను వీడియో కాల్ ద్వారా కూడా విచారించొచ్చు.
ప్రజల్లో అవగాహన పెరగాలి
శరత్ చంద్ర పవార్, ఎస్పీ
నూతనంగా వచ్చిన చట్టాలను సోమవారం నుంచి జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్లలో అమలు చేస్తాం. మారిన చట్టాలపై ఇప్పటికే పోలీస్ అధికారులు, సిబ్బందికి పూర్తి స్థాయిల్లో శిక్షణ ఇచ్చాం. ప్రజల్లో కూడా నూతన చట్టాలపై అవగాహన పెరగాల్సిన అవసరం ఉంది. కొన్ని చట్టాల్లో వచ్చిన మార్పుతో నేరస్థులకు తక్షణ శిక్షలు పడటంతో పాటు, జరిమానాలు కూడా పెరిగాయి. వీటి ద్వారా దుండగులు నేరాలు చేయాలనే ఆలోచన వచ్చినా వెనకడుగు వేసే అవకాశం ఉంటుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆర్ఆర్ఆర్ భూసేకరణ వేగిరం
[ 03-07-2024]
రాజధాని హైదరాబాద్తో పాటూ పరిసర ప్రాంతాలకు సంబంధించి వచ్చే 30 ఏళ్ల అవసరాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రస్తుతమున్న బాహ్య వలయ రహదారి (ఓఆర్ఆర్)కి అవతల 30 కి.మీ. దూరంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్మించనున్న ప్రాంతీయ వలయ రహదారి (ఆర్ఆర్ఆర్) నిర్మాణ ప్రక్రియ ఉమ్మడి జిల్లాలో వడివడిగా సాగుతోంది. -
యాదాద్రిలో ఘనంగా లక్ష పుష్పార్చన
[ 03-07-2024]
ఏకాదశి పర్వదినం సందర్భంగా మంగళవారం యాదాద్రి పంచనారసింహుల పుణ్యక్షేత్రంలో విశేష ఆరాధనలు నిర్వహించారు. -
నేరస్థులను పట్టిస్తోంది నిఘా నేత్రం
[ 03-07-2024]
నేరాల నియంత్రణకు, నేరస్థులను పట్టుకునేందుకు, కోర్టులో శిక్ష పడేందుకు సీసీ కెమెరాలు ఎంతో ఉపయోగపడుతున్నాయని పోలీసులు చెబుతున్నారు. -
కొత్త న్యాయచట్టాలతో బాధితులకు ఊరట
[ 03-07-2024]
దేశవ్యాప్తంగా జులై ఒకటో తేదీ నుంచి అమల్లోకి వచ్చిన కొత్త న్యాయ చట్టాలు భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్), భారతీయ నాగరిక్ సురక్షా సంహిత (బీఎన్ఎస్ఎస్), భారతీయ సాక్ష్య అధినీయం (బీఎస్ఏ) ద్వారా బాధితులకు సత్వర న్యాయం జరుగుతుందని జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ వెల్లడించారు. -
అమ్మకు గుర్తుగా మొక్క..!
[ 03-07-2024]
కనకనలాడే ఎండకు శిరస్సు మాడినా.. మనకు తన నీడను అందించే చెట్టే అమ్మాజారెడు నీళ్లయిన తాను దాచుకోక... జగతికి సర్వస్వం అర్పించే మబ్బె అమ్మ ఆ అమ్మలనే మించిన మా అమ్మకు... రుణం తీర్చుకోలేను ఏ జన్మకూ.. కంటేనే అమ్మ అంటే ఎలా... కరుణించే ప్రతి దేవత అమ్మే కదా... కన్న అమ్మే కదా.. -
కస్తూర్బాల్లో కష్టాలు..
[ 03-07-2024]
చదువులు సాగిద్దామంటే సమస్యలు దండిగా ఉంటున్నాయి. పరిష్కరిద్దామంటే నిధుల కష్టం.. ఇవి కస్తూర్బాగాంధీ బాలికల గురుకుల విద్యాలయా(కేజీబీవీ)ల్లో ఎదురవుతున్న ఇబ్బందులు. -
సేంద్రియ సాగులో మేటి
[ 03-07-2024]
ఉన్నత చదువు చదివి.. రూ.వేలల్లో వేతనానికి ఏసీ గదుల్లో పని చేసే ఉద్యోగావకాశాలు ఉన్నా.. అవన్నీ వదిలేసి వ్యవసాయంపై మక్కువ.. భూమిపై ప్రేమతో సాగు రంగంలోకి అడుగు పెట్టారు మిర్యాలగూడ పట్టణానికి చెందిన సోమా పవన్కుమార్. -
నకిలీ ధ్రువపత్రాలతో.. నర్సుల కొలువులు..?
[ 03-07-2024]
వైద్యఆరోగ్యశాఖ పరిధిలో రెండు నెలల క్రితం ఒప్పంద, పొరుగు సేవల కింద స్టాఫ్నర్సులు(20) ఫార్మాసిస్టులు(2), ఆయూష్ ఫార్మాసిస్టు(4) కొలువుల ఎంపిక కోసం దరఖాస్తులు స్వీకరించారు. -
సత్వర న్యాయమే లక్ష్యం
[ 03-07-2024]
ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా సాంకేతిక పురోగతిని దృష్టిలో పెట్టుకుని భారత ప్రభుత్వం తీసుకొచ్చిన భారతీయ న్యాయ సంహిత అధినియం - 2023 కొత్త చట్టంతో భారత న్యాయవ్యవస్థలో పెను మార్పులు చోటు చేసుకోనున్నాయి.