స్పౌజ్ బదిలీల్లో అక్రమాలు
ఉపాధ్యాయ బదిలీల్లో అక్రమాలు చోటు చేసుకున్నాయి. బదిలీలు పారదర్శకంగా చేపడుతున్నామని జిల్లా విద్యాశాఖ అధికారులు చెబుతున్నా తప్పులు బయటపడుతూనే ఉన్నాయి.
నల్గొండ విద్యావిభాగం, న్యూస్టుడే: ఉపాధ్యాయ బదిలీల్లో అక్రమాలు చోటు చేసుకున్నాయి. బదిలీలు పారదర్శకంగా చేపడుతున్నామని జిల్లా విద్యాశాఖ అధికారులు చెబుతున్నా తప్పులు బయటపడుతూనే ఉన్నాయి. అన్యాయం జరిగిందని డీఈవో దృష్టికి తీసుకెళ్లినా వెంటనే పరిష్కరించడం లేదన్న వాదన ఉపాధ్యాయ వర్గాల్లో వ్యక్తమవుతుంది. ఫిర్యాదు చేసినప్పుడు వాటిని పరిశీలించి త్వరితగతిన జరిగిన తప్పులు సరిదిద్దాల్సి ఉన్నా చేయకపోవడంతో ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. నిబంధనల ప్రకారం చేస్తున్నామని అంటున్నా బదిలీల ప్రక్రియలో అక్కడక్కడ అర్హత ఉన్న వారికి అన్యాయం జరుగుతోంది. స్పౌజ్ కేటగిరిలో కొంత మంది అర్హత ఉన్న ఉపాధ్యాయులకు అన్యాయం జరుగుతోంది. దీనిపై స్పౌజ్ పాయింట్లు తీసుకునే వారు స్పౌజ్ పాయింట్ల రేడియస్లోనే బదిలీలకు ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. కానీ అక్కడ ఖాళీలు లేకపోతే పక్క మండలాలు, ఆ తరువాత మండలాలను ఎంపిక చేసుకోవచ్చు. అలా కాకుండా తమకు ఇష్టం ఉన్న మండలాలకు వెళ్లేలా ఆప్షన్లు ఇవ్వడం, అధికారులు పరిశీలించకుండానే ఆర్డర్లు ఇవ్వడంతో అసలు స్పౌజ్ పాయింట్ల నిబంధనలకు విరుద్ధంగా జరిగాయి.
లోటుపాట్లు ఇలా.. స్పౌజ్ పాయింట్లకు సంబంధించి స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ బదిలీల్లో కట్టంగూరు మండలం కరుమర్తి పాఠశాల నుంచి స్పౌజ్ జాబితాలో దగ్గరలో ఉన్నా అదే మండలంలోని తక్కువ దూరంలో ఉన్న ఈదులూరు, కట్టంగూరు, అయిటిపాముల, పరడ, బొల్లేపల్లి తదితర ప్రాంతాలకు బదిలీ కావాలి. అలా కాకుండా ఆ మండలం దాటి దూరంలో ఉన్న తిప్పర్తి మండలానికి బదిలీ అయ్యారు. కట్టంగూరు మండలానికి చెందిన ముగ్గురిలో ఇద్దరు తిప్పర్తికి, మరొకరు నల్గొండ మండలానికి బదిలీ అయ్యారు. అదేవిధంగా మునుగోడు మండలానికి చెందిన వారు అదే మండలంలో స్పౌజ్ రేడియస్లో తీసుకోవాల్సి ఉన్నా చిట్యాల మండలానికి బదిలీ అయినట్లు తెలిసింది. స్పౌజ్ పాయింట్ల కింద ఉన్న ఉపాధ్యాయులు దగ్గర రేడియస్లో కాకుండా ఇష్టం ఉన్న మండలాలకు, అనుకూలంగా ఉన్న మండలాలకు బదిలీ కావడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆప్షన్లు పెట్టేటప్పుడు దగ్గర రేడియస్లో పెట్టకపోవడం, అధికారులు వాటిని పరిశీలించకపోవడంతో సమస్య ఉత్పన్నమైనట్లు తెలుస్తుంది. నిబంధనలకు విరుద్ధంగా జరిగిన బదిలీలపై జిల్లా అధికారి దృష్టికి తీసుకెళ్లి నాలుగు, అయిదు రోజులు గడుస్తున్నా చర్యలు తీసుకోవడం లేదని ఉపాధ్యాయులు వాపోతున్నారు. జాబితాల తయారీలో పరిశీలన చేయకపోవడం, తప్పు జరిగిందని అధికారుల దృష్టికి తీసుకెళ్లినా సమస్య సరిష్కరించే విషయంపై జాప్యం అవుతుండటంపై ఆందోళన చెందుతున్నారు.
కొనసాగుతున్న విచారణ?
నల్గొండ నేరవిభాగం, న్యూస్టుడే: ఇటీవల నల్గొండ మండల పరిధిలోని చందనపల్లిలో రూ.500 నోట్ల కట్టలో పైనా, కింద నిజమైన నోట్లు పెట్టి మధ్యలో తెల్ల కాగితాలు పెట్టి పలు మార్లు మోసాలకు పాల్పడుతున్న ముఠాపై పోలీసులు విచారణ చేపట్టారు. ఈ కేసులో ఐదు రోజుల క్రితం ఇద్దరు నేరస్థులను రిమాండ్కు పంపడంతో పాటు రూ.24 లక్షలు స్వాధీనం చేసుకున్న విషయం విధితమే. ఉన్నత స్థాయి పోలీస్ అధికారుల ఆదేశాలతో మరో రూ.9 లక్షలు స్వాధీనంతో పాటు పరారీలో ఉన్న వ్యక్తి కోసం ముమ్మర గాలింపు చర్యలు చేస్తున్నారు. దీంతో పాటు నగదు రెట్టింపు చేసే వ్యవహారంలో బాధితులకు మొదటి సారిగా రూ.6,500 రెట్టింపు చేసిన నగదు రూ.13,000 ఎక్కడ చలామణి చేశారు. తాజాగా రూ.33 లక్షల నగదుతో నకిలీ నోట్లు రూ.66 లక్షలు తయారు చేస్తే ఎక్కడ చలామణి చేయాలనుకున్నారు. గడిచిన నాలుగేళ్లలో ఎన్నిసార్లు ఇలా తయారు చేశారు.. బాధితుల కోరిక మేరకే నేరస్థులు ఇక్కడికి వచ్చారా.. బిహార్కు చెందిన ముఠాతో బాధితులు గతంలో బ్యాంకు లావాదేవీలు ఉన్నాయా, చరవాణి సంభాషణ ఎన్ని సార్లు జరిగింది. రూ.33 లక్షలు పోగు చేయడం వెనుక ఎంత మంది చేతులు ఉన్నాయనేది పోలీసు ఉన్నతాధికారులు విచారిస్తున్నట్లు సమాచారం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి
[ 03-07-2024]
కళాకారులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని బుధవారం యాదాద్రి భువనగిరి కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన ధర్నా చేపట్టారు. -
ఆర్ఆర్ఆర్ భూసేకరణ వేగిరం
[ 03-07-2024]
రాజధాని హైదరాబాద్తో పాటూ పరిసర ప్రాంతాలకు సంబంధించి వచ్చే 30 ఏళ్ల అవసరాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రస్తుతమున్న బాహ్య వలయ రహదారి (ఓఆర్ఆర్)కి అవతల 30 కి.మీ. దూరంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్మించనున్న ప్రాంతీయ వలయ రహదారి (ఆర్ఆర్ఆర్) నిర్మాణ ప్రక్రియ ఉమ్మడి జిల్లాలో వడివడిగా సాగుతోంది. -
యాదాద్రిలో ఘనంగా లక్ష పుష్పార్చన
[ 03-07-2024]
ఏకాదశి పర్వదినం సందర్భంగా మంగళవారం యాదాద్రి పంచనారసింహుల పుణ్యక్షేత్రంలో విశేష ఆరాధనలు నిర్వహించారు. -
నేరస్థులను పట్టిస్తోంది నిఘా నేత్రం
[ 03-07-2024]
నేరాల నియంత్రణకు, నేరస్థులను పట్టుకునేందుకు, కోర్టులో శిక్ష పడేందుకు సీసీ కెమెరాలు ఎంతో ఉపయోగపడుతున్నాయని పోలీసులు చెబుతున్నారు. -
కొత్త న్యాయచట్టాలతో బాధితులకు ఊరట
[ 03-07-2024]
దేశవ్యాప్తంగా జులై ఒకటో తేదీ నుంచి అమల్లోకి వచ్చిన కొత్త న్యాయ చట్టాలు భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్), భారతీయ నాగరిక్ సురక్షా సంహిత (బీఎన్ఎస్ఎస్), భారతీయ సాక్ష్య అధినీయం (బీఎస్ఏ) ద్వారా బాధితులకు సత్వర న్యాయం జరుగుతుందని జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ వెల్లడించారు. -
అమ్మకు గుర్తుగా మొక్క..!
[ 03-07-2024]
కనకనలాడే ఎండకు శిరస్సు మాడినా.. మనకు తన నీడను అందించే చెట్టే అమ్మాజారెడు నీళ్లయిన తాను దాచుకోక... జగతికి సర్వస్వం అర్పించే మబ్బె అమ్మ ఆ అమ్మలనే మించిన మా అమ్మకు... రుణం తీర్చుకోలేను ఏ జన్మకూ.. కంటేనే అమ్మ అంటే ఎలా... కరుణించే ప్రతి దేవత అమ్మే కదా... కన్న అమ్మే కదా.. -
కస్తూర్బాల్లో కష్టాలు..
[ 03-07-2024]
చదువులు సాగిద్దామంటే సమస్యలు దండిగా ఉంటున్నాయి. పరిష్కరిద్దామంటే నిధుల కష్టం.. ఇవి కస్తూర్బాగాంధీ బాలికల గురుకుల విద్యాలయా(కేజీబీవీ)ల్లో ఎదురవుతున్న ఇబ్బందులు. -
సేంద్రియ సాగులో మేటి
[ 03-07-2024]
ఉన్నత చదువు చదివి.. రూ.వేలల్లో వేతనానికి ఏసీ గదుల్లో పని చేసే ఉద్యోగావకాశాలు ఉన్నా.. అవన్నీ వదిలేసి వ్యవసాయంపై మక్కువ.. భూమిపై ప్రేమతో సాగు రంగంలోకి అడుగు పెట్టారు మిర్యాలగూడ పట్టణానికి చెందిన సోమా పవన్కుమార్. -
నకిలీ ధ్రువపత్రాలతో.. నర్సుల కొలువులు..?
[ 03-07-2024]
వైద్యఆరోగ్యశాఖ పరిధిలో రెండు నెలల క్రితం ఒప్పంద, పొరుగు సేవల కింద స్టాఫ్నర్సులు(20) ఫార్మాసిస్టులు(2), ఆయూష్ ఫార్మాసిస్టు(4) కొలువుల ఎంపిక కోసం దరఖాస్తులు స్వీకరించారు. -
సత్వర న్యాయమే లక్ష్యం
[ 03-07-2024]
ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా సాంకేతిక పురోగతిని దృష్టిలో పెట్టుకుని భారత ప్రభుత్వం తీసుకొచ్చిన భారతీయ న్యాయ సంహిత అధినియం - 2023 కొత్త చట్టంతో భారత న్యాయవ్యవస్థలో పెను మార్పులు చోటు చేసుకోనున్నాయి.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
‘డంక్డ్ రైస్ కేక్’..ఇడ్లీ అనుకున్నానే..!: హర్ష గొయెంకా పోస్ట్ వైరల్
-
‘జికా’ వైరస్ కలకలం.. రాష్ట్రాలకు కేంద్రం అడ్వైజరీ
-
అవినీతిపై పోరు.. దర్యాప్తు సంస్థలకు పూర్తి స్వేచ్ఛనిచ్చాం: మోదీ
-
టీపీసీసీ అధ్యక్షుడి నియామకం తాత్కాలికంగా వాయిదా
-
జింబాబ్వే పర్యటనకు భారత్.. గత హీరోలు ఎవరంటే?
-
అలా కూర్చొని.. ఇలా రికార్డులు నెలకొల్పి: ప్రభాస్పై నాగ్ అశ్విన్ పోస్ట్