కృషి ఫలించె.. పురస్కారాలు వరించె
రసాయన ఎరువులు, పురుగు మందులకు దూరంగా.. సేంద్రియ పద్ధతిలో మొక్కలు పెంచుతూ.. అనేక రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్నారు.. భువనగిరికి చెందిన జిట్టా జ్యోతిరెడ్డి.
మోత్కూరు, న్యూస్టుడే
అమేయ కృషి విజ్ఞాన కేంద్రంలో భర్త జిట్టా బాల్రెడ్డితో జ్యోతిరెడ్డి
రసాయన ఎరువులు, పురుగు మందులకు దూరంగా.. సేంద్రియ పద్ధతిలో మొక్కలు పెంచుతూ.. అనేక రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్నారు.. భువనగిరికి చెందిన జిట్టా జ్యోతిరెడ్డి. ఉన్నత చదువులు చదివినప్పటికీ వ్యవసాయం మీద మక్కువతో తన భర్త బాల్రెడ్డితో కలిసి 16 ఏళ్లుగా చెంతనే ఉన్న రామకృష్ణాపురంలోని ఆరున్నరెకరాల వ్యవసాయ క్షేత్రంలో అనేక రకాల మొక్కలు పెంచుతున్నారు. కూరగాయలూ పండిస్తూ, దేశవాలి ఆవులు, కోళ్లు, చేపల పెంపకం చేస్తూ లాభాలు గడిస్తున్నారు.
నర్సరీలో మొక్కలకు డిమాండ్..
వీరిది ప్రధానంగా సాగు మొక్కల పెంపకం. ఒక్క మామిడిలోనే 250కి పైగా రకాల మొక్కలుండటం విశేషం. కొన్ని మొక్కలను థాయిలాండ్, మలేషియా తదితర విదేశాల నుంచి తెప్పించి, వాటిని మన వాతావరణానికి అనుగుణంగా పెంచి, అంటుకట్టి, కొత్త రకాలు సృష్టిస్తున్నారు. ముఖ్యంగా పండ్లు, పూలు, ఆయుర్వేదానికి సంబంధించిన మొక్కలను సేంద్రియ పద్దతిలో పెంచి అమ్ముతున్నారు. చీడపీడల నివారణకు హోమియో మందులు వాడటం వీరి ప్రత్యేకత. అనేక రకాల కూరగాయలు, ఆకుకూరల పండిస్తున్నారు. కూరగాయలను ఎండబెట్టి ఒరుగులు తయారుచేసి విక్రయించడానికి సొలార్ డ్రైయర్స్ ఉపయోగిస్తున్నారు. సంకరజాతి ఆవులు, గేదెలు పెంచి వాటి ఉత్పత్తుల ద్వారా ఆహార పదార్థాలను తయారుచేసి అమ్ముతారు.
ఆన్లైన్లో విక్రయాలు.. యూట్యూబ్లో పాఠాలు
నర్సరీలో పెంచిన మొక్కలను ఎక్కువగా ఆన్లైన్లోనే విక్రయిస్తున్నారు. ఇతర జిల్లాలు, రాష్ట్రాల వారు ఎక్కువగా ఖరీదు చేస్తున్నారు. జిట్ట జ్యోతిరెడ్డి, ఆమె భర్త బాల్రెడ్డి ‘అమేయ కృషి విజ్ఞాన కేంద్రం’ పేరుతో యూట్యూబ్ వేదికగా రైతులతో తమ అనుభవాలను పంచుకుంటున్నారు. నర్సరీల పెంపకం, సాగు పద్ధతులు, చీడపీడల నివారణపై సూచనలు ఇస్తున్నారు.
రైతులతో సేంద్రియ వ్యవసాయం చేయించాలని..
జిట్టా జ్యోతిరెడ్డి
రసాయన ఎరువులు, పురుగు మందులు వాడటంతోనే వ్యవసాయంలో నష్టాలొస్తున్నాయి. అప్పులపాలై రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. సమీకృత వ్యవసాయం ద్వారా రైతులు లాభాల దిశగా పయనించవచ్చని చేసి చూపుతున్నాం. భర్త బాల్రెడ్డి తోడ్పాటుతోనే ఈ రంగంలో రాణిస్తున్నాను. ఎప్పటికైనా అన్నదాతలతో పూర్తిగా సేంద్రియ వ్యవసాయం చేయించాలన్నదే మా ప్రయత్నం.
శ్రమకు దక్కిన అవార్డులు
దున్నకం నుంచి మొదలు, ఆన్లైన్ వ్యాపారం, రైతులకు సలహాలు ఇవ్వడం అన్నీ జ్యోతిరెడ్డే చూసుకుంటున్నారు. ఆమె పని విధానాన్ని చూసి ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ వారు జిల్లా స్థాయిలో ఉత్తమ రైతు అవార్డు ఇచ్చారు. అనేక స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వం మహిళా రైతుగా గుర్తించి పురస్కారాలు, అవార్డులతో గౌరవించాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆర్ఆర్ఆర్ భూసేకరణ వేగిరం
[ 03-07-2024]
రాజధాని హైదరాబాద్తో పాటూ పరిసర ప్రాంతాలకు సంబంధించి వచ్చే 30 ఏళ్ల అవసరాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రస్తుతమున్న బాహ్య వలయ రహదారి (ఓఆర్ఆర్)కి అవతల 30 కి.మీ. దూరంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్మించనున్న ప్రాంతీయ వలయ రహదారి (ఆర్ఆర్ఆర్) నిర్మాణ ప్రక్రియ ఉమ్మడి జిల్లాలో వడివడిగా సాగుతోంది. -
యాదాద్రిలో ఘనంగా లక్ష పుష్పార్చన
[ 03-07-2024]
ఏకాదశి పర్వదినం సందర్భంగా మంగళవారం యాదాద్రి పంచనారసింహుల పుణ్యక్షేత్రంలో విశేష ఆరాధనలు నిర్వహించారు. -
నేరస్థులను పట్టిస్తోంది నిఘా నేత్రం
[ 03-07-2024]
నేరాల నియంత్రణకు, నేరస్థులను పట్టుకునేందుకు, కోర్టులో శిక్ష పడేందుకు సీసీ కెమెరాలు ఎంతో ఉపయోగపడుతున్నాయని పోలీసులు చెబుతున్నారు. -
కొత్త న్యాయచట్టాలతో బాధితులకు ఊరట
[ 03-07-2024]
దేశవ్యాప్తంగా జులై ఒకటో తేదీ నుంచి అమల్లోకి వచ్చిన కొత్త న్యాయ చట్టాలు భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్), భారతీయ నాగరిక్ సురక్షా సంహిత (బీఎన్ఎస్ఎస్), భారతీయ సాక్ష్య అధినీయం (బీఎస్ఏ) ద్వారా బాధితులకు సత్వర న్యాయం జరుగుతుందని జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ వెల్లడించారు. -
అమ్మకు గుర్తుగా మొక్క..!
[ 03-07-2024]
కనకనలాడే ఎండకు శిరస్సు మాడినా.. మనకు తన నీడను అందించే చెట్టే అమ్మాజారెడు నీళ్లయిన తాను దాచుకోక... జగతికి సర్వస్వం అర్పించే మబ్బె అమ్మ ఆ అమ్మలనే మించిన మా అమ్మకు... రుణం తీర్చుకోలేను ఏ జన్మకూ.. కంటేనే అమ్మ అంటే ఎలా... కరుణించే ప్రతి దేవత అమ్మే కదా... కన్న అమ్మే కదా.. -
కస్తూర్బాల్లో కష్టాలు..
[ 03-07-2024]
చదువులు సాగిద్దామంటే సమస్యలు దండిగా ఉంటున్నాయి. పరిష్కరిద్దామంటే నిధుల కష్టం.. ఇవి కస్తూర్బాగాంధీ బాలికల గురుకుల విద్యాలయా(కేజీబీవీ)ల్లో ఎదురవుతున్న ఇబ్బందులు. -
సేంద్రియ సాగులో మేటి
[ 03-07-2024]
ఉన్నత చదువు చదివి.. రూ.వేలల్లో వేతనానికి ఏసీ గదుల్లో పని చేసే ఉద్యోగావకాశాలు ఉన్నా.. అవన్నీ వదిలేసి వ్యవసాయంపై మక్కువ.. భూమిపై ప్రేమతో సాగు రంగంలోకి అడుగు పెట్టారు మిర్యాలగూడ పట్టణానికి చెందిన సోమా పవన్కుమార్. -
నకిలీ ధ్రువపత్రాలతో.. నర్సుల కొలువులు..?
[ 03-07-2024]
వైద్యఆరోగ్యశాఖ పరిధిలో రెండు నెలల క్రితం ఒప్పంద, పొరుగు సేవల కింద స్టాఫ్నర్సులు(20) ఫార్మాసిస్టులు(2), ఆయూష్ ఫార్మాసిస్టు(4) కొలువుల ఎంపిక కోసం దరఖాస్తులు స్వీకరించారు. -
సత్వర న్యాయమే లక్ష్యం
[ 03-07-2024]
ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా సాంకేతిక పురోగతిని దృష్టిలో పెట్టుకుని భారత ప్రభుత్వం తీసుకొచ్చిన భారతీయ న్యాయ సంహిత అధినియం - 2023 కొత్త చట్టంతో భారత న్యాయవ్యవస్థలో పెను మార్పులు చోటు చేసుకోనున్నాయి.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
రైలు ఢీకొని వృద్ధుడి మృతి.. ఇంజిన్కు వేలాడుతూ వచ్చిన మృతదేహం
-
మదుపర్లకు మెయిల్ ద్వారానే ఖాతా స్టేట్మెంట్లు
-
ఆగస్టు 15 నుంచి వందే భారత్ స్లీపర్.. సికింద్రాబాద్, కాచిగూడ నుంచి నడపాలని ప్రతిపాదన
-
వందలో మరో చిరుత.. ఉసేన్ బోల్ట్ను గుర్తుచేస్తూ..
-
పిన్నెల్లితో ములాఖత్ కోసం 4న నెల్లూరు జైలుకు జగన్
-
నేడు దిల్లీకి చంద్రబాబు.. రేపు ప్రధాని మోదీతో భేటీ