గ్యాస్ లీక్.. ముగ్గురికి అస్వస్థత
రసాయన పరిశ్రమలో గ్యాస్ లీకై ముగ్గురు కార్మికులు అస్వస్థతకు గురైన ఘటన పట్టణ కేంద్రంలోని నారాయణగిరిలోని సాయితేజ డ్రగ్స్ పరిశ్రమలో ఆదివారం చోటుచేసుకుంది.
రసాయన పరిశ్రమలో గ్యాస్లీకైన ప్రదేశాన్ని పరిశీలిస్తున్న ఎస్సై భాస్కర్రెడ్డి
భూదాన్పోచంపల్లి, న్యూస్టుడే: రసాయన పరిశ్రమలో గ్యాస్ లీకై ముగ్గురు కార్మికులు అస్వస్థతకు గురైన ఘటన పట్టణ కేంద్రంలోని నారాయణగిరిలోని సాయితేజ డ్రగ్స్ పరిశ్రమలో ఆదివారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. పరిశ్రమలో రియాక్టర్ విభాగంలో పనిచేస్తున్న ముగ్గురు కార్మికులు మున్నాలాల్, పరమేశ్వర్, దేశారన్లు ఒక్కసారిగా అస్వస్థతకు గురికావడంతో వెంటనే 108కు సమాచారం అందించారు. వెంటనే 108 సిబ్బంది ప్రథమ చికిత్స అందించారు. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న ఎస్సై భాస్కర్రెడ్డి ఘటనా స్థలాన్ని సందర్శించి పరిశీలించారు.
పూడ్చిన మృతదేహానికి పరీక్ష
మిర్యాలగూడ పట్టణం, న్యూస్టుడే: ఖననం చేసిన మహిళ మృతదేహాన్ని నాలుగు రోజుల తర్వాత వెలికి తీసి పరీక్ష నిర్వహించిన ఘటన ఆదివారం మిర్యాలగూడ మండల పరిధిలో చోటు చేసుకుంది. గ్రామీణ ఎస్సై నరేష్ తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని అవంతిపురం గ్రామానికి చెందిన శివనేని అరుణ(43) ఏడాదిన్నర నుంచి యాద్గార్పల్లి శివారులోని ఎస్ఎమ్ఎస్9 ఆగ్రో ఆయిల్ సంస్థలో బస్తాలు కుట్టే పని చేస్తుంది. ఈ క్రమంలో మే 31న అస్వస్థతకు గురి కావడంతో మిర్యాలగూడ, నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ జూన్ 25న మృతి చెందారు. అనంతరం అరుణ మృతదేహానికి కుటుంబ సభ్యులు అంత్యక్రియలు పూర్తి చేశారు. అయితే మిల్లు యాజమాన్యం అరుణకు సకాలంలో చికిత్స అందించకపోవడంతో శ్వాస సంబంధిత సమస్యతో మృతి చెందిందని జూన్ 29న ఆమె కుమారుడు ప్రేమ్కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి.. దర్యాప్తులో భాగంగా తహసీల్దారు హరిబాబు సమక్షంలో పూడ్చిన మృతదేహాన్ని వెలికితీసి పరీక్ష నిర్వహించినట్లు ఎస్సై తెలిపారు.
అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి
విజయ మృతదేహం
నేలకొండపల్లి, న్యూస్టుడే: అనుమానాస్పద స్థితిలో ఓ వివాహిత మృతి చెందిన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన ప్రకారం.. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలంలోని సదాశివపురం గ్రామానికి చెందిన జిల్లపల్లి అవినాష్కు సూర్యాపేట జిల్లా మునగాల మండలం తాడ్వాయికి చెందిన విజయ(31)తో పదమూడేళ్ల కిత్రం వివాహమైంది. వీరికి ఓ కుమార్తె, కుమారుడు ఉన్నారు. కొంతకాలంగా దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆదివారం ఇంట్లో విజయ ఒక్కసారిగా కిందపడిపోయింది. ఆమెను హుటాహుటిన నేలకొండపల్లి సీహెచ్సీకి తీసుకురాగా పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. చూస్తుండగానే తనంతట తానే కుప్పకూలిందని భర్త, కుమార్తె వివరించారు. విషయం తెలుసుకున్న మృతురాలి తల్లిదండ్రులు కోట వెంకటయ్య, నర్సమ్మ, బంధువులు భారీగా నేలకొండపల్లికి చేరుకున్నారు. తమ కుమార్తె మృతికి భర్తే కారణమంటూ ఆందోళన చేశారు. మృతికి కారణాలు తెలపాలని ఠాణాలో ఇరువర్గాలు ఫిర్యాదు చేశాయి. ఠాణా ఎదుటే ఇరువర్గాలు బాహాబాహీకి దిగడంతో పోలీసులు చెదరగొట్టారు. మరణోత్తర పరీక్ష నిర్వహిస్తామని ఎస్సై నాగరాజు ఇరువర్గాలకు సర్దిచెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆర్ఆర్ఆర్ భూసేకరణ వేగిరం
[ 03-07-2024]
రాజధాని హైదరాబాద్తో పాటూ పరిసర ప్రాంతాలకు సంబంధించి వచ్చే 30 ఏళ్ల అవసరాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రస్తుతమున్న బాహ్య వలయ రహదారి (ఓఆర్ఆర్)కి అవతల 30 కి.మీ. దూరంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్మించనున్న ప్రాంతీయ వలయ రహదారి (ఆర్ఆర్ఆర్) నిర్మాణ ప్రక్రియ ఉమ్మడి జిల్లాలో వడివడిగా సాగుతోంది. -
యాదాద్రిలో ఘనంగా లక్ష పుష్పార్చన
[ 03-07-2024]
ఏకాదశి పర్వదినం సందర్భంగా మంగళవారం యాదాద్రి పంచనారసింహుల పుణ్యక్షేత్రంలో విశేష ఆరాధనలు నిర్వహించారు. -
నేరస్థులను పట్టిస్తోంది నిఘా నేత్రం
[ 03-07-2024]
నేరాల నియంత్రణకు, నేరస్థులను పట్టుకునేందుకు, కోర్టులో శిక్ష పడేందుకు సీసీ కెమెరాలు ఎంతో ఉపయోగపడుతున్నాయని పోలీసులు చెబుతున్నారు. -
కొత్త న్యాయచట్టాలతో బాధితులకు ఊరట
[ 03-07-2024]
దేశవ్యాప్తంగా జులై ఒకటో తేదీ నుంచి అమల్లోకి వచ్చిన కొత్త న్యాయ చట్టాలు భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్), భారతీయ నాగరిక్ సురక్షా సంహిత (బీఎన్ఎస్ఎస్), భారతీయ సాక్ష్య అధినీయం (బీఎస్ఏ) ద్వారా బాధితులకు సత్వర న్యాయం జరుగుతుందని జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ వెల్లడించారు. -
అమ్మకు గుర్తుగా మొక్క..!
[ 03-07-2024]
కనకనలాడే ఎండకు శిరస్సు మాడినా.. మనకు తన నీడను అందించే చెట్టే అమ్మాజారెడు నీళ్లయిన తాను దాచుకోక... జగతికి సర్వస్వం అర్పించే మబ్బె అమ్మ ఆ అమ్మలనే మించిన మా అమ్మకు... రుణం తీర్చుకోలేను ఏ జన్మకూ.. కంటేనే అమ్మ అంటే ఎలా... కరుణించే ప్రతి దేవత అమ్మే కదా... కన్న అమ్మే కదా.. -
కస్తూర్బాల్లో కష్టాలు..
[ 03-07-2024]
చదువులు సాగిద్దామంటే సమస్యలు దండిగా ఉంటున్నాయి. పరిష్కరిద్దామంటే నిధుల కష్టం.. ఇవి కస్తూర్బాగాంధీ బాలికల గురుకుల విద్యాలయా(కేజీబీవీ)ల్లో ఎదురవుతున్న ఇబ్బందులు. -
సేంద్రియ సాగులో మేటి
[ 03-07-2024]
ఉన్నత చదువు చదివి.. రూ.వేలల్లో వేతనానికి ఏసీ గదుల్లో పని చేసే ఉద్యోగావకాశాలు ఉన్నా.. అవన్నీ వదిలేసి వ్యవసాయంపై మక్కువ.. భూమిపై ప్రేమతో సాగు రంగంలోకి అడుగు పెట్టారు మిర్యాలగూడ పట్టణానికి చెందిన సోమా పవన్కుమార్. -
నకిలీ ధ్రువపత్రాలతో.. నర్సుల కొలువులు..?
[ 03-07-2024]
వైద్యఆరోగ్యశాఖ పరిధిలో రెండు నెలల క్రితం ఒప్పంద, పొరుగు సేవల కింద స్టాఫ్నర్సులు(20) ఫార్మాసిస్టులు(2), ఆయూష్ ఫార్మాసిస్టు(4) కొలువుల ఎంపిక కోసం దరఖాస్తులు స్వీకరించారు. -
సత్వర న్యాయమే లక్ష్యం
[ 03-07-2024]
ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా సాంకేతిక పురోగతిని దృష్టిలో పెట్టుకుని భారత ప్రభుత్వం తీసుకొచ్చిన భారతీయ న్యాయ సంహిత అధినియం - 2023 కొత్త చట్టంతో భారత న్యాయవ్యవస్థలో పెను మార్పులు చోటు చేసుకోనున్నాయి.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
స్క్రూడ్రైవర్తో మెడపై పొడిచి.. భర్తను చంపేసిన భార్య
-
పట్టిసీమను జగన్ ఒట్టిసీమ అన్నారు.. ఇప్పుడదే బంగారమైంది: మంత్రి నిమ్మల
-
బెంబేలెత్తించిన బెరిల్.. మొత్తం ద్వీపం ధ్వంసం!
-
రక్తంతో రాసిన కథ ‘మీర్జాపూర్’.. మూడో సీజన్ వస్తోంది!
-
అతిగా నిద్రపోయి.. భారత్తో మ్యాచ్కు దూరమై..
-
సెన్సెక్స్ @ 80,000.. రికార్డు గరిష్ఠానికి నిఫ్టీ