చరవాణితో.. జర భద్రం
ఒకప్పుడు పుస్తకం హస్త భూషణం.. ఖరీదైన చేతి గడియారం దర్పానికి ప్రతీక.. ఇప్పుడు ఆ స్థానాన్ని చరవాణి ఆక్రమించింది. ఖరీదైన స్మార్ట్ఫోన్.. పేరున్న బ్రాండ్.. ఏ ఇద్దరు మాట్లాడుకున్నా ఇదే.
ఇటీవల నల్గొండ జిల్లా పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ప్రజాప్రతినిధులు వెల్లడించే ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాల్సిన అధికారులు చరవాణిలో నిమగ్నమయ్యారు. సాక్షాత్తు మంత్రులు, ఎమ్మెల్యేల సమక్షంలో జరిగిన జిల్లా సమావేశంలో అధికారుల నిర్లక్ష్య వైఖరి తీవ్ర విమర్శలకు దారి తీసింది. మునుగోడు మండలం కొరటికల్లో చరవాణిలో ఎక్కువ సమయం గడుపుతున్న కుమారుడిని తండ్రి మందలించడంతో శుక్రవారం ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు.
నాంపల్లి, న్యూస్టుడే: ఒకప్పుడు పుస్తకం హస్త భూషణం.. ఖరీదైన చేతి గడియారం దర్పానికి ప్రతీక.. ఇప్పుడు ఆ స్థానాన్ని చరవాణి ఆక్రమించింది. ఖరీదైన స్మార్ట్ఫోన్.. పేరున్న బ్రాండ్.. ఏ ఇద్దరు మాట్లాడుకున్నా ఇదే. ప్రస్తుతం ప్రతి ఒక్కరికీ చరవాణి తప్పనిసరిగా మారింది. మంచి, చెడులు సమ్మిళితమై ఉన్న ఈ యంత్రాన్ని మనం దేనికి ఉపయోగిస్తే అలా తయారవుతాం అంటున్నారు నిపుణులు. కొందరు ఏకంగా రెండు, మూడు చరవాణులు వాడేస్తున్నారని, ఇది వ్యసనంగా మారుతోందని హెచ్చరిస్తున్నారు. ఇటీవల ప్రతి ఒక్కరూ నిద్ర లేవగానే చరవాణి చూడటంతో దినచర్య ప్రారంభిస్తున్నారు. రాత్రి 11-12 గంటల వరకు ఇదే నేస్తం. బస్సుల్లో, రైళ్లలో ప్రయాణించేటప్పుడు నిరంతరాయంగా చరవాణితోనే గడుపుతున్నారు.
నిద్రలేమి సమస్య..
రోజువారి విధులు, పాఠశాల, కళాశాల.. ఇతర ప్రాంతాల్లో ఎవరిని చూసినా రోజంతా చరవాణితో కనిపిస్తున్నారు. గతంలో సమాచార సేకరణ, సంభాషణకు ఉన్న చరవాణి నేడు సామాజిక మాధ్యమాల్లో గడిపేందుకు మొగ్గు చూపేలా చేస్తోంది. వాట్సాప్, ఇన్స్టాగ్రాం, ఫేస్బుక్, ఎక్స్ (ట్విట్టర్)లను ఎక్కువగా వినియోగిస్తున్నారు. వాటిలో వీడియోలు, చిత్రాలు పోస్టు చేసి, ఎంతమంది వీక్షించారు, కామెంట్లు పెట్టారు, లైకులు కొట్టారు అంటూ తరచూ చూస్తున్నారు. నిద్రలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు.
మానసిక ఒత్తిడి..
అంతర్జాలం, చరవాణి నిద్రను దూరం చేస్తున్నాయని ఇటలీ, అమెరికాకు చెందిన విశ్వవిద్యాలయాలు సంయుక్తంగా ప్రకటించాయి. రాత్రంతా చరవాణిపై శ్రద్ధ పెట్టి ఉదయాన్నే లేవాల్సి రావడంతో రోజంతా చురుకుదనం లోపిస్తుందని, ఇది ఇలాగే కొనసాగితే సమస్యలు తప్పవని స్పష్టం చేసింది. మనిషికి కనీసం 8 గంటల నిద్ర అవసరమని తెలియజేసింది.
ఇబ్బందులు ఇలా..
- మితిమీరిన చరవాణి వినియోగం నిద్రలేమిని తెచ్చి పెడుతుంది.
- రేడియేషన్ కారణంగా కంటి, మెదడుకు సంబంధించిన సమస్యలు వస్తాయి.
- జ్ఞాపకశక్తి లోపించడంతో పాటు కుంగుబాటుకు గురవుతారు.
- కళ్లపై ఎక్కువ భారం పడి ఒత్తిడికి గురవుతారు.
- రెటినా దెబ్బతిని శుక్లాల సమస్య ఏర్పడుతుంది.
- దీర్ఘకాలంలో క్యాన్సర్కు దారి తీస్తుంది.
జిల్లాలోని 100 మందిని చరవాణి వినియోగం గురించి ప్రశ్నించగా..
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆర్ఆర్ఆర్ భూసేకరణ వేగిరం
[ 03-07-2024]
రాజధాని హైదరాబాద్తో పాటూ పరిసర ప్రాంతాలకు సంబంధించి వచ్చే 30 ఏళ్ల అవసరాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రస్తుతమున్న బాహ్య వలయ రహదారి (ఓఆర్ఆర్)కి అవతల 30 కి.మీ. దూరంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్మించనున్న ప్రాంతీయ వలయ రహదారి (ఆర్ఆర్ఆర్) నిర్మాణ ప్రక్రియ ఉమ్మడి జిల్లాలో వడివడిగా సాగుతోంది. -
యాదాద్రిలో ఘనంగా లక్ష పుష్పార్చన
[ 03-07-2024]
ఏకాదశి పర్వదినం సందర్భంగా మంగళవారం యాదాద్రి పంచనారసింహుల పుణ్యక్షేత్రంలో విశేష ఆరాధనలు నిర్వహించారు. -
నేరస్థులను పట్టిస్తోంది నిఘా నేత్రం
[ 03-07-2024]
నేరాల నియంత్రణకు, నేరస్థులను పట్టుకునేందుకు, కోర్టులో శిక్ష పడేందుకు సీసీ కెమెరాలు ఎంతో ఉపయోగపడుతున్నాయని పోలీసులు చెబుతున్నారు. -
కొత్త న్యాయచట్టాలతో బాధితులకు ఊరట
[ 03-07-2024]
దేశవ్యాప్తంగా జులై ఒకటో తేదీ నుంచి అమల్లోకి వచ్చిన కొత్త న్యాయ చట్టాలు భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్), భారతీయ నాగరిక్ సురక్షా సంహిత (బీఎన్ఎస్ఎస్), భారతీయ సాక్ష్య అధినీయం (బీఎస్ఏ) ద్వారా బాధితులకు సత్వర న్యాయం జరుగుతుందని జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ వెల్లడించారు. -
అమ్మకు గుర్తుగా మొక్క..!
[ 03-07-2024]
కనకనలాడే ఎండకు శిరస్సు మాడినా.. మనకు తన నీడను అందించే చెట్టే అమ్మాజారెడు నీళ్లయిన తాను దాచుకోక... జగతికి సర్వస్వం అర్పించే మబ్బె అమ్మ ఆ అమ్మలనే మించిన మా అమ్మకు... రుణం తీర్చుకోలేను ఏ జన్మకూ.. కంటేనే అమ్మ అంటే ఎలా... కరుణించే ప్రతి దేవత అమ్మే కదా... కన్న అమ్మే కదా.. -
కస్తూర్బాల్లో కష్టాలు..
[ 03-07-2024]
చదువులు సాగిద్దామంటే సమస్యలు దండిగా ఉంటున్నాయి. పరిష్కరిద్దామంటే నిధుల కష్టం.. ఇవి కస్తూర్బాగాంధీ బాలికల గురుకుల విద్యాలయా(కేజీబీవీ)ల్లో ఎదురవుతున్న ఇబ్బందులు. -
సేంద్రియ సాగులో మేటి
[ 03-07-2024]
ఉన్నత చదువు చదివి.. రూ.వేలల్లో వేతనానికి ఏసీ గదుల్లో పని చేసే ఉద్యోగావకాశాలు ఉన్నా.. అవన్నీ వదిలేసి వ్యవసాయంపై మక్కువ.. భూమిపై ప్రేమతో సాగు రంగంలోకి అడుగు పెట్టారు మిర్యాలగూడ పట్టణానికి చెందిన సోమా పవన్కుమార్. -
నకిలీ ధ్రువపత్రాలతో.. నర్సుల కొలువులు..?
[ 03-07-2024]
వైద్యఆరోగ్యశాఖ పరిధిలో రెండు నెలల క్రితం ఒప్పంద, పొరుగు సేవల కింద స్టాఫ్నర్సులు(20) ఫార్మాసిస్టులు(2), ఆయూష్ ఫార్మాసిస్టు(4) కొలువుల ఎంపిక కోసం దరఖాస్తులు స్వీకరించారు. -
సత్వర న్యాయమే లక్ష్యం
[ 03-07-2024]
ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా సాంకేతిక పురోగతిని దృష్టిలో పెట్టుకుని భారత ప్రభుత్వం తీసుకొచ్చిన భారతీయ న్యాయ సంహిత అధినియం - 2023 కొత్త చట్టంతో భారత న్యాయవ్యవస్థలో పెను మార్పులు చోటు చేసుకోనున్నాయి.