నేటి నుంచి పన్నులపై వడ్డీంపు
పురపాలికల్లో పన్నులను పూర్తిస్థాయిలో వసూలు చేసేందుకు అధికారులు కార్యాచరణ రూపొందించారు. 2024-25 సంవత్సరాన్ని రెండు విడతలుగా విభజించి పన్నులు వసూలు చేస్తున్నారు.
సూర్యాపేటలో పన్నుదారులకు డిమాండ్ నోటీసులు అందజేస్తున్న పుర అధికారులు
సూర్యాపేట పురపాలిక, న్యూస్టుడే: పురపాలికల్లో పన్నులను పూర్తిస్థాయిలో వసూలు చేసేందుకు అధికారులు కార్యాచరణ రూపొందించారు. 2024-25 సంవత్సరాన్ని రెండు విడతలుగా విభజించి పన్నులు వసూలు చేస్తున్నారు. మొదటి అర్ధ సంవత్సరం జూన్ 30తో ముగిసింది. ఇప్పటి వరకు పన్నులు చెల్లించిన వారికి ఎటువంటి వడ్డీ పడలేదు. ఇన్నాళ్లు చెల్లించని వారికి ఇప్పటికే పుర అధికారులు డిమాండ్ నోటీసులు పంపించారు.
2 శాతం వడ్డీ భారం
రెండో అర్ధ సంవత్సరం సోమవారం నుంచి ప్రారంభమైంది. ఈ మధ్యకాలంలో పన్నులు చెల్లించేవారికి 2 శాతం వడ్డీ భారం పడనుంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని 19 పురపాలికల్లో ఈ నెల 1 నుంచి డిసెంబరు 31 వరకు పన్నుదారులు 2 శాతం వడ్డీతో పన్నులు చెల్లించాల్సి ఉంటుంది. ఇంటి నంబరు, అసెస్మెంటు నంబర్ ఆధారంగా పుర కార్యాలయాల్లోని బిల్ కలెక్టర్ల వద్ద లేదంటే ఆన్లైన్లో చెల్లించవచ్చు. వడ్డీ విధింపుతో పురపాలికలకు ఆదాయం సమకూరటంతోపాటు పన్నుదారులకు భారంగా మారనుంది.
పురపాలికల అభివృద్ధికి సహకరించాలి
శ్రీనివాస్, పుర కమిషనర్, సూర్యాపేట
జూన్ 30తో మొదటి అర్ధ వార్షిక సంవత్సరం ముగిసింది. ఈ నెల 1 నుంచి డిసెంబరు 31 వరకు 2 శాతం వడ్డీ పడుతుంది. గృహ యజమానులు స్పందించి తమ పన్నులు చెల్లించి అభివృద్ధికి సహకరించాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆర్ఆర్ఆర్ భూసేకరణ వేగిరం
[ 03-07-2024]
రాజధాని హైదరాబాద్తో పాటూ పరిసర ప్రాంతాలకు సంబంధించి వచ్చే 30 ఏళ్ల అవసరాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రస్తుతమున్న బాహ్య వలయ రహదారి (ఓఆర్ఆర్)కి అవతల 30 కి.మీ. దూరంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్మించనున్న ప్రాంతీయ వలయ రహదారి (ఆర్ఆర్ఆర్) నిర్మాణ ప్రక్రియ ఉమ్మడి జిల్లాలో వడివడిగా సాగుతోంది. -
యాదాద్రిలో ఘనంగా లక్ష పుష్పార్చన
[ 03-07-2024]
ఏకాదశి పర్వదినం సందర్భంగా మంగళవారం యాదాద్రి పంచనారసింహుల పుణ్యక్షేత్రంలో విశేష ఆరాధనలు నిర్వహించారు. -
నేరస్థులను పట్టిస్తోంది నిఘా నేత్రం
[ 03-07-2024]
నేరాల నియంత్రణకు, నేరస్థులను పట్టుకునేందుకు, కోర్టులో శిక్ష పడేందుకు సీసీ కెమెరాలు ఎంతో ఉపయోగపడుతున్నాయని పోలీసులు చెబుతున్నారు. -
కొత్త న్యాయచట్టాలతో బాధితులకు ఊరట
[ 03-07-2024]
దేశవ్యాప్తంగా జులై ఒకటో తేదీ నుంచి అమల్లోకి వచ్చిన కొత్త న్యాయ చట్టాలు భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్), భారతీయ నాగరిక్ సురక్షా సంహిత (బీఎన్ఎస్ఎస్), భారతీయ సాక్ష్య అధినీయం (బీఎస్ఏ) ద్వారా బాధితులకు సత్వర న్యాయం జరుగుతుందని జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ వెల్లడించారు. -
అమ్మకు గుర్తుగా మొక్క..!
[ 03-07-2024]
కనకనలాడే ఎండకు శిరస్సు మాడినా.. మనకు తన నీడను అందించే చెట్టే అమ్మాజారెడు నీళ్లయిన తాను దాచుకోక... జగతికి సర్వస్వం అర్పించే మబ్బె అమ్మ ఆ అమ్మలనే మించిన మా అమ్మకు... రుణం తీర్చుకోలేను ఏ జన్మకూ.. కంటేనే అమ్మ అంటే ఎలా... కరుణించే ప్రతి దేవత అమ్మే కదా... కన్న అమ్మే కదా.. -
కస్తూర్బాల్లో కష్టాలు..
[ 03-07-2024]
చదువులు సాగిద్దామంటే సమస్యలు దండిగా ఉంటున్నాయి. పరిష్కరిద్దామంటే నిధుల కష్టం.. ఇవి కస్తూర్బాగాంధీ బాలికల గురుకుల విద్యాలయా(కేజీబీవీ)ల్లో ఎదురవుతున్న ఇబ్బందులు. -
సేంద్రియ సాగులో మేటి
[ 03-07-2024]
ఉన్నత చదువు చదివి.. రూ.వేలల్లో వేతనానికి ఏసీ గదుల్లో పని చేసే ఉద్యోగావకాశాలు ఉన్నా.. అవన్నీ వదిలేసి వ్యవసాయంపై మక్కువ.. భూమిపై ప్రేమతో సాగు రంగంలోకి అడుగు పెట్టారు మిర్యాలగూడ పట్టణానికి చెందిన సోమా పవన్కుమార్. -
నకిలీ ధ్రువపత్రాలతో.. నర్సుల కొలువులు..?
[ 03-07-2024]
వైద్యఆరోగ్యశాఖ పరిధిలో రెండు నెలల క్రితం ఒప్పంద, పొరుగు సేవల కింద స్టాఫ్నర్సులు(20) ఫార్మాసిస్టులు(2), ఆయూష్ ఫార్మాసిస్టు(4) కొలువుల ఎంపిక కోసం దరఖాస్తులు స్వీకరించారు. -
సత్వర న్యాయమే లక్ష్యం
[ 03-07-2024]
ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా సాంకేతిక పురోగతిని దృష్టిలో పెట్టుకుని భారత ప్రభుత్వం తీసుకొచ్చిన భారతీయ న్యాయ సంహిత అధినియం - 2023 కొత్త చట్టంతో భారత న్యాయవ్యవస్థలో పెను మార్పులు చోటు చేసుకోనున్నాయి.
తాజా వార్తలు (Latest News)
-
రోహిత్-విరాట్ నిర్ణయంతో షాక్ అయ్యా.. వారిని భర్తీ చేయడం సవాలే: స్టార్ పేసర్
-
జగన్ కేసులు రోజు వారీ విచారణకు హైకోర్టు ఆదేశం
-
మణిపుర్పై రాజకీయాలు ఆపండి: విపక్షాలపై మోదీ ధ్వజం
-
మంత్రి రామ్ప్రసాద్ రెడ్డి చొరవ.. ఆందోళన విరమించిన అద్దె బస్సుల యజమానులు
-
ఏపీలో ఈనెల 8 నుంచి ఉచిత ఇసుక విధానం
-
మళ్లీ అదే మాట అంటూ అవమానిస్తున్నారు.. మోదీపై ప్రతిపక్షాల ధ్వజం