మత్తు వదలరా..!
కన్న తల్లిదండ్రులకు, పుట్టిన గడ్డకు పేరు ప్రతిష్ఠలు తీసుకురావాలనే ఉద్దేశంతో కొంత మంది యువకులు పోటీ ప్రపంచంలో నిత్యం శ్రమిస్తున్నారు. మరి కొంతమంది మత్తుకు బానిసై పక్కదారి పడుతున్నారు.
కోదాడ, న్యూస్టుడే
కోదాడలో గంజాయి తాగుతూ, విక్రయిస్తున్న యువకులను అదుపులోకి తీసుకున్న పోలీసులు(పాత చిత్రం)
ఆరో తరగతి చదువుతున్న ఓ విద్యార్థి బడికి వెళ్లకుండా గంజాయి తాగుతూ, విక్రయిస్తున్నాడు. అతన్ని తల్లి విద్యుత్తు స్తంభానికి కట్టేసి కొట్టిన ఘటన అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైన సంగతి తెలిసిందే. మత్తుకు బానిసైన కుమారుడిని మార్చే క్రమంలో విసిగిపోయిన ఆ తల్లి బుద్ధి చెప్పేందుకు ఇలా చేసింది. ఈ ఒక్క ఘటన చాలు.. ఇప్పుడున్న యువత చదువును వదిలేసి మత్తుకు బానిసలు అవుతున్నారనడానికి.
కన్న తల్లిదండ్రులకు, పుట్టిన గడ్డకు పేరు ప్రతిష్ఠలు తీసుకురావాలనే ఉద్దేశంతో కొంత మంది యువకులు పోటీ ప్రపంచంలో నిత్యం శ్రమిస్తున్నారు. మరి కొంతమంది మత్తుకు బానిసై పక్కదారి పడుతున్నారు. ఈ మధ్య కాలంలో ఎక్కడ చూసినా గంజాయి, ఇతర మత్తు పదార్థాలకు బానిసై జీవితాన్ని బలి చేసుకుంటున్న వారిలో యువతే ఎక్కువగా ఉంటోంది. గంజాయి, ఇతర మత్తు పదార్థాలు తీసుకుంటూ, వాటిని విక్రయిస్తూ పోలీసులకు పట్టుబడిన ఘటనలు పరిశీలిస్తే ప్రతి కేసులో యువకులే అధిక సంఖ్యలో ఉంటున్నారు. తల్లిదండ్రుల పర్యవేక్షణ లేకపోవడం, చెడు ఆలోచనలు ఉన్న వారు స్నేహితులుగా తోడవ్వడంతో వారు దారి తప్పుతున్నారు.
ఇటీవలి ఘటనలు కొన్ని..
- ఈ ఏడాది జూన్ 15న ఒక్కరు, ఇద్దరు కాదు.. ఏకంగా 11 మంది యువకులు పట్టణ శివారుల్లో గుంపుగా ఏర్పడి గంజాయి తాగుతూ విక్రయిస్తున్నారు. నమ్మదగిన సమాచారంతో ఎక్సైజ్ పోలీసులు వారిని చాకచక్యంగా అదుపులోకి తీసుకొని విచారించగా వారి దగ్గర 4.50 కిలోల గంజాయి లభ్యమవడం విశేషం. వీరందరూ విద్య నేర్చుకునే వయసువారే కావడం గమనార్హం.
- జూన్ 28న కోదాడ పట్టణంలోని గుడిబండ రోడ్డులో ఇద్దరు యువకులు ద్విచక్ర వాహనం మీద యథేచ్ఛగా తిరుగుతూ గంజాయి తాగుతూ విక్రయిస్తున్నారు. ఎక్సైజ్ పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని విచారించగా వారి దగ్గర 900 గ్రాముల గంజాయి లభ్యమవ్వడంతో పోలీసులు రిమాండ్కు తరలించారు. వారి వయసు 25 ఏళ్ల లోపే ఉండటం గమనార్హం.
- ఈ ఏడాది ఫిబ్రవరి 20న ఏడుగురు యువకులు పట్టణ పరిసర ప్రాంతాల్లో ద్విచక్ర వాహనాల మీద గంజాయి విక్రయిస్తుండగా ఎక్సైజ్ పోలీసులు పట్టుకొని రిమాండ్కు తరలించారు. వారి దగ్గరి నుంచి సుమారు 700 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
బాధితులకు కౌన్సెలింగ్ ఇస్తున్నాం
శంకర్, ఎక్సైజ్ సీఐ, కోదాడ
గంజాయి తాగుతూ, విక్రయిస్తూ పట్టుబడిన యువతకు కౌన్సెలింగ్ ఇస్తున్నాం. చాలా మంది జులాయిగా తిరుగుతూ జల్సాలు చేయడానికి కావాల్సిన డబ్బుల కోసం గంజాయి విక్రయిస్తున్నారు. తల్లిదండ్రులు నిత్యం తమ పిల్లలపై పర్యవేక్షణ ఉంచాలి. పిల్లలు వినకపోతే నేరుగా మా దృష్టికి తీసుకొస్తే కౌన్సెలింగ్ ఇస్తాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆర్ఆర్ఆర్ భూసేకరణ వేగిరం
[ 03-07-2024]
రాజధాని హైదరాబాద్తో పాటూ పరిసర ప్రాంతాలకు సంబంధించి వచ్చే 30 ఏళ్ల అవసరాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రస్తుతమున్న బాహ్య వలయ రహదారి (ఓఆర్ఆర్)కి అవతల 30 కి.మీ. దూరంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్మించనున్న ప్రాంతీయ వలయ రహదారి (ఆర్ఆర్ఆర్) నిర్మాణ ప్రక్రియ ఉమ్మడి జిల్లాలో వడివడిగా సాగుతోంది. -
యాదాద్రిలో ఘనంగా లక్ష పుష్పార్చన
[ 03-07-2024]
ఏకాదశి పర్వదినం సందర్భంగా మంగళవారం యాదాద్రి పంచనారసింహుల పుణ్యక్షేత్రంలో విశేష ఆరాధనలు నిర్వహించారు. -
నేరస్థులను పట్టిస్తోంది నిఘా నేత్రం
[ 03-07-2024]
నేరాల నియంత్రణకు, నేరస్థులను పట్టుకునేందుకు, కోర్టులో శిక్ష పడేందుకు సీసీ కెమెరాలు ఎంతో ఉపయోగపడుతున్నాయని పోలీసులు చెబుతున్నారు. -
కొత్త న్యాయచట్టాలతో బాధితులకు ఊరట
[ 03-07-2024]
దేశవ్యాప్తంగా జులై ఒకటో తేదీ నుంచి అమల్లోకి వచ్చిన కొత్త న్యాయ చట్టాలు భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్), భారతీయ నాగరిక్ సురక్షా సంహిత (బీఎన్ఎస్ఎస్), భారతీయ సాక్ష్య అధినీయం (బీఎస్ఏ) ద్వారా బాధితులకు సత్వర న్యాయం జరుగుతుందని జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ వెల్లడించారు. -
అమ్మకు గుర్తుగా మొక్క..!
[ 03-07-2024]
కనకనలాడే ఎండకు శిరస్సు మాడినా.. మనకు తన నీడను అందించే చెట్టే అమ్మాజారెడు నీళ్లయిన తాను దాచుకోక... జగతికి సర్వస్వం అర్పించే మబ్బె అమ్మ ఆ అమ్మలనే మించిన మా అమ్మకు... రుణం తీర్చుకోలేను ఏ జన్మకూ.. కంటేనే అమ్మ అంటే ఎలా... కరుణించే ప్రతి దేవత అమ్మే కదా... కన్న అమ్మే కదా.. -
కస్తూర్బాల్లో కష్టాలు..
[ 03-07-2024]
చదువులు సాగిద్దామంటే సమస్యలు దండిగా ఉంటున్నాయి. పరిష్కరిద్దామంటే నిధుల కష్టం.. ఇవి కస్తూర్బాగాంధీ బాలికల గురుకుల విద్యాలయా(కేజీబీవీ)ల్లో ఎదురవుతున్న ఇబ్బందులు. -
సేంద్రియ సాగులో మేటి
[ 03-07-2024]
ఉన్నత చదువు చదివి.. రూ.వేలల్లో వేతనానికి ఏసీ గదుల్లో పని చేసే ఉద్యోగావకాశాలు ఉన్నా.. అవన్నీ వదిలేసి వ్యవసాయంపై మక్కువ.. భూమిపై ప్రేమతో సాగు రంగంలోకి అడుగు పెట్టారు మిర్యాలగూడ పట్టణానికి చెందిన సోమా పవన్కుమార్. -
నకిలీ ధ్రువపత్రాలతో.. నర్సుల కొలువులు..?
[ 03-07-2024]
వైద్యఆరోగ్యశాఖ పరిధిలో రెండు నెలల క్రితం ఒప్పంద, పొరుగు సేవల కింద స్టాఫ్నర్సులు(20) ఫార్మాసిస్టులు(2), ఆయూష్ ఫార్మాసిస్టు(4) కొలువుల ఎంపిక కోసం దరఖాస్తులు స్వీకరించారు. -
సత్వర న్యాయమే లక్ష్యం
[ 03-07-2024]
ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా సాంకేతిక పురోగతిని దృష్టిలో పెట్టుకుని భారత ప్రభుత్వం తీసుకొచ్చిన భారతీయ న్యాయ సంహిత అధినియం - 2023 కొత్త చట్టంతో భారత న్యాయవ్యవస్థలో పెను మార్పులు చోటు చేసుకోనున్నాయి.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
పవన్ కల్యాణ్ చరిత్ర సృష్టించారు: పరుచూరి గోపాలకృష్ణ
-
హాథ్రస్ తొక్కిసలాట ఘటన.. భోలే బాబా ఎక్కడ..?
-
అప్పుడు నాకు 11 ఏళ్లు.. భారత్ ఓటమితో రాత్రంతా నిద్ర పట్టలేదు: గంభీర్
-
స్క్రూడ్రైవర్తో మెడపై పొడిచి.. భర్తను చంపేసిన భార్య
-
పట్టిసీమను జగన్ ఒట్టిసీమ అన్నారు.. ఇప్పుడదే బంగారమైంది: మంత్రి నిమ్మల
-
బెంబేలెత్తించిన బెరిల్.. మొత్తం ద్వీపం ధ్వంసం!