సీఎంఆర్ బకాయిల వసూలుకు.. రంగం సిద్ధం
సీఎంఆర్ బకాయిల వసూలుకు ఆర్ఆర్ యాక్టు (రెవెన్యూ రికవరీ చట్టం) అమలు చేసేందుకు అధికారులు సిద్ధం అవుతున్నారు. ఇప్పటి వరకు మిల్లర్లు కోర్టును ఆశ్రయించి అధికారులను ముప్పుతిప్పలు పెట్టవచ్చు అనుకున్నారు.
హుజూర్నగర్, న్యూస్టుడే
హుజూర్నగర్లో కల్లాల వద్ద ఉన్న ధాన్యం (పాత చిత్రం)
సీఎంఆర్ బకాయిల వసూలుకు ఆర్ఆర్ యాక్టు (రెవెన్యూ రికవరీ చట్టం) అమలు చేసేందుకు అధికారులు సిద్ధం అవుతున్నారు. ఇప్పటి వరకు మిల్లర్లు కోర్టును ఆశ్రయించి అధికారులను ముప్పుతిప్పలు పెట్టవచ్చు అనుకున్నారు. కానీ, జూన్ 26న హైకోర్టు చేసిన వ్యాఖ్యలతో మిల్లర్లు ఖంగుతిన్నారు.
ఆర్ఆర్ యాక్టుకు సన్నద్ధం
సీఎంఆర్ బకాయి బియ్యం వసూలు చేసేందుకు అధికారులు అన్ని ప్రయత్నాలు చేశారు. చివరకు బకాయిపడిన మిల్లర్లకు ధాన్యం కేటాయింపులు లేకుండా చేశారు. అలాంటి మిల్లర్లు రాష్ట్ర వ్యాప్తంగా 60 మంది ఉండగా, ఒక్క సూర్యాపేట జిల్లాలోనే 16 మంది ఉన్నారు. వీరందరినీ డీఫాల్టర్లుగా ప్రకటించారు. కోర్టుకు వెళ్తే తమకు బియ్యం చెల్లింపుపై వాయిదా దొరుకుతుందని వారు అధికారులను బెదిరిస్తూ వచ్చారు. దీంతో వారు కోర్టుకు పోకుండా బుజ్జగించే ధోరణిలో వసూలు చేసుకోవాలనే అధికారులు అనుకున్నారు. అయినా మిల్లర్లు వినే పరిస్థితి లేకపోవడంతో కొన్ని మిల్లులపై దాడులు చేసి, బాధ్యులను అరెస్ట్ చేశారు. ఒక్క సూర్యాపేటలోనే రూ.64 కోట్ల విలువైన బియ్యం పెట్టాల్సి ఉండటంతో అధికారులు దూకుడుగా వ్యవహరించారు. కోదాడ, సూర్యాపేటలోని కొందరు మిల్లర్లు కోర్టును ఆశ్రయించడంతో వారికి అక్కడ చుక్కెదురైంది. తీసుకున్న ధాన్యానికి బియ్యం వెంటనే ఇవ్వాలని, లేకుంటే ఏసీబీని రంగంలోకి దించుతామని, ఆర్ఆర్ యాక్టునూ అమలు చేస్తారని కోర్టు వ్యాఖ్యానించడంతో పౌరసరఫరాల అధికారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మిల్లర్లకు ఇది మింగుడు పడకుండా ఉంది. 2019-20, 2020-21, 2021-22 వానాకాలం, యాసంగి, 2022-23 వానాకాలం సీజన్ల బకాయిల వసూలుకు మిల్లర్లపై కఠినంగా వ్యవహరించడంతో పాటు జప్తులు, అవసరమైతే క్రిమినల్ కేసులైనా నమోదు చేసే అవకాశాలు ఉన్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆర్ఆర్ఆర్ భూసేకరణ వేగిరం
[ 03-07-2024]
రాజధాని హైదరాబాద్తో పాటూ పరిసర ప్రాంతాలకు సంబంధించి వచ్చే 30 ఏళ్ల అవసరాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రస్తుతమున్న బాహ్య వలయ రహదారి (ఓఆర్ఆర్)కి అవతల 30 కి.మీ. దూరంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్మించనున్న ప్రాంతీయ వలయ రహదారి (ఆర్ఆర్ఆర్) నిర్మాణ ప్రక్రియ ఉమ్మడి జిల్లాలో వడివడిగా సాగుతోంది. -
యాదాద్రిలో ఘనంగా లక్ష పుష్పార్చన
[ 03-07-2024]
ఏకాదశి పర్వదినం సందర్భంగా మంగళవారం యాదాద్రి పంచనారసింహుల పుణ్యక్షేత్రంలో విశేష ఆరాధనలు నిర్వహించారు. -
నేరస్థులను పట్టిస్తోంది నిఘా నేత్రం
[ 03-07-2024]
నేరాల నియంత్రణకు, నేరస్థులను పట్టుకునేందుకు, కోర్టులో శిక్ష పడేందుకు సీసీ కెమెరాలు ఎంతో ఉపయోగపడుతున్నాయని పోలీసులు చెబుతున్నారు. -
కొత్త న్యాయచట్టాలతో బాధితులకు ఊరట
[ 03-07-2024]
దేశవ్యాప్తంగా జులై ఒకటో తేదీ నుంచి అమల్లోకి వచ్చిన కొత్త న్యాయ చట్టాలు భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్), భారతీయ నాగరిక్ సురక్షా సంహిత (బీఎన్ఎస్ఎస్), భారతీయ సాక్ష్య అధినీయం (బీఎస్ఏ) ద్వారా బాధితులకు సత్వర న్యాయం జరుగుతుందని జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ వెల్లడించారు. -
అమ్మకు గుర్తుగా మొక్క..!
[ 03-07-2024]
కనకనలాడే ఎండకు శిరస్సు మాడినా.. మనకు తన నీడను అందించే చెట్టే అమ్మాజారెడు నీళ్లయిన తాను దాచుకోక... జగతికి సర్వస్వం అర్పించే మబ్బె అమ్మ ఆ అమ్మలనే మించిన మా అమ్మకు... రుణం తీర్చుకోలేను ఏ జన్మకూ.. కంటేనే అమ్మ అంటే ఎలా... కరుణించే ప్రతి దేవత అమ్మే కదా... కన్న అమ్మే కదా.. -
కస్తూర్బాల్లో కష్టాలు..
[ 03-07-2024]
చదువులు సాగిద్దామంటే సమస్యలు దండిగా ఉంటున్నాయి. పరిష్కరిద్దామంటే నిధుల కష్టం.. ఇవి కస్తూర్బాగాంధీ బాలికల గురుకుల విద్యాలయా(కేజీబీవీ)ల్లో ఎదురవుతున్న ఇబ్బందులు. -
సేంద్రియ సాగులో మేటి
[ 03-07-2024]
ఉన్నత చదువు చదివి.. రూ.వేలల్లో వేతనానికి ఏసీ గదుల్లో పని చేసే ఉద్యోగావకాశాలు ఉన్నా.. అవన్నీ వదిలేసి వ్యవసాయంపై మక్కువ.. భూమిపై ప్రేమతో సాగు రంగంలోకి అడుగు పెట్టారు మిర్యాలగూడ పట్టణానికి చెందిన సోమా పవన్కుమార్. -
నకిలీ ధ్రువపత్రాలతో.. నర్సుల కొలువులు..?
[ 03-07-2024]
వైద్యఆరోగ్యశాఖ పరిధిలో రెండు నెలల క్రితం ఒప్పంద, పొరుగు సేవల కింద స్టాఫ్నర్సులు(20) ఫార్మాసిస్టులు(2), ఆయూష్ ఫార్మాసిస్టు(4) కొలువుల ఎంపిక కోసం దరఖాస్తులు స్వీకరించారు. -
సత్వర న్యాయమే లక్ష్యం
[ 03-07-2024]
ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా సాంకేతిక పురోగతిని దృష్టిలో పెట్టుకుని భారత ప్రభుత్వం తీసుకొచ్చిన భారతీయ న్యాయ సంహిత అధినియం - 2023 కొత్త చట్టంతో భారత న్యాయవ్యవస్థలో పెను మార్పులు చోటు చేసుకోనున్నాయి.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఉప్పాడ తీరాన్ని పరిశీలించిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
-
తెదేపా కేంద్ర కార్యాలయంపై దాడి కేసు.. పోలీసుల అదుపులో ఐదుగురు వైకాపా కార్యకర్తలు
-
అది తప్పుడు ప్రచారం.. దాన్ని నమ్మవద్దు: తితిదే
-
దేశీయ సోషల్ మీడియా ‘కూ’ యాప్ మూత!
-
రాజ్యసభలో మోదీ ప్రసంగం.. విపక్షాలు వాకౌట్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM