శ్రీస్వామి నిలయంలో దైవారాధనలు
యాదాద్రి పుణ్యక్షేత్రంలో ఆదివారం భక్తజనుల ఆర్జిత కైంకర్యాలతో ఆధ్యాత్మిక కోలాహలం నెలకొంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు దైవ దర్శనం కోసం బారులు తీరారు.
శ్రీలక్ష్మీనరసింహ స్వామివారి నిత్య కల్యాణ పర్వం
యాదగిరిగుట్ట, న్యూస్టుడే: యాదాద్రి పుణ్యక్షేత్రంలో ఆదివారం భక్తజనుల ఆర్జిత కైంకర్యాలతో ఆధ్యాత్మిక కోలాహలం నెలకొంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు దైవ దర్శనం కోసం బారులు తీరారు. రద్దీ సాధారణంగా నెలకొంది. వేకువ జామున సుప్రభాతం చేపట్టిన పూజారులు మూలవరులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. హోమం, నిత్య కల్యాణం, స్వర్ణ పుష్ప ఆరాధన, అలంకార సేవోత్సవాలు ఆలయ ఆచారంగా కొనసాగించారు. గర్భాలయంలో కొలువై ఉన్న స్వయంభువులను స్మరిస్తూ, భక్తులు తమ భక్తిని చాటుకున్నారు. అనుబంధ ఆలయాలలో నిత్య పూజలు కొనసాగించారు. పాతగుట్ట ఆలయంలో శ్రీలక్ష్మీనరసింహస్వామిని కొలుస్తూ నిజాభిషేకం, తులసీ అర్చన, నిత్య కల్యాణం పాంచరాత్రాగమ శాస్త్రరీత్యా నిర్వహించారు. ఆలయ దేవుడి దర్శనం చేసుకున్న భక్తులు పలువురు కటుంబీకులతో వన భోజనాలు చేశారు.
యాదాద్రీశుడి సేవలో హైకోర్టు జడ్జి
యాదాద్రి పుణ్యక్షేత్రాన్ని రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ప్రియదర్శిని కుటుంబ సభ్యులతో కలిసి ఆదివారం సందర్శించారు. ప్రధాన ఆలయంలో కొలువై ఉన్న పంచనారసింహులను దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీస్సులు పొందారు. ఆలయ ఈవో భాస్కర్రావు న్యాయమూర్తికి స్వాగతం పలికి దేవుడి ప్రసాదం అందజేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆర్ఆర్ఆర్ భూసేకరణ వేగిరం
[ 03-07-2024]
రాజధాని హైదరాబాద్తో పాటూ పరిసర ప్రాంతాలకు సంబంధించి వచ్చే 30 ఏళ్ల అవసరాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రస్తుతమున్న బాహ్య వలయ రహదారి (ఓఆర్ఆర్)కి అవతల 30 కి.మీ. దూరంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్మించనున్న ప్రాంతీయ వలయ రహదారి (ఆర్ఆర్ఆర్) నిర్మాణ ప్రక్రియ ఉమ్మడి జిల్లాలో వడివడిగా సాగుతోంది. -
యాదాద్రిలో ఘనంగా లక్ష పుష్పార్చన
[ 03-07-2024]
ఏకాదశి పర్వదినం సందర్భంగా మంగళవారం యాదాద్రి పంచనారసింహుల పుణ్యక్షేత్రంలో విశేష ఆరాధనలు నిర్వహించారు. -
నేరస్థులను పట్టిస్తోంది నిఘా నేత్రం
[ 03-07-2024]
నేరాల నియంత్రణకు, నేరస్థులను పట్టుకునేందుకు, కోర్టులో శిక్ష పడేందుకు సీసీ కెమెరాలు ఎంతో ఉపయోగపడుతున్నాయని పోలీసులు చెబుతున్నారు. -
కొత్త న్యాయచట్టాలతో బాధితులకు ఊరట
[ 03-07-2024]
దేశవ్యాప్తంగా జులై ఒకటో తేదీ నుంచి అమల్లోకి వచ్చిన కొత్త న్యాయ చట్టాలు భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్), భారతీయ నాగరిక్ సురక్షా సంహిత (బీఎన్ఎస్ఎస్), భారతీయ సాక్ష్య అధినీయం (బీఎస్ఏ) ద్వారా బాధితులకు సత్వర న్యాయం జరుగుతుందని జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ వెల్లడించారు. -
అమ్మకు గుర్తుగా మొక్క..!
[ 03-07-2024]
కనకనలాడే ఎండకు శిరస్సు మాడినా.. మనకు తన నీడను అందించే చెట్టే అమ్మాజారెడు నీళ్లయిన తాను దాచుకోక... జగతికి సర్వస్వం అర్పించే మబ్బె అమ్మ ఆ అమ్మలనే మించిన మా అమ్మకు... రుణం తీర్చుకోలేను ఏ జన్మకూ.. కంటేనే అమ్మ అంటే ఎలా... కరుణించే ప్రతి దేవత అమ్మే కదా... కన్న అమ్మే కదా.. -
కస్తూర్బాల్లో కష్టాలు..
[ 03-07-2024]
చదువులు సాగిద్దామంటే సమస్యలు దండిగా ఉంటున్నాయి. పరిష్కరిద్దామంటే నిధుల కష్టం.. ఇవి కస్తూర్బాగాంధీ బాలికల గురుకుల విద్యాలయా(కేజీబీవీ)ల్లో ఎదురవుతున్న ఇబ్బందులు. -
సేంద్రియ సాగులో మేటి
[ 03-07-2024]
ఉన్నత చదువు చదివి.. రూ.వేలల్లో వేతనానికి ఏసీ గదుల్లో పని చేసే ఉద్యోగావకాశాలు ఉన్నా.. అవన్నీ వదిలేసి వ్యవసాయంపై మక్కువ.. భూమిపై ప్రేమతో సాగు రంగంలోకి అడుగు పెట్టారు మిర్యాలగూడ పట్టణానికి చెందిన సోమా పవన్కుమార్. -
నకిలీ ధ్రువపత్రాలతో.. నర్సుల కొలువులు..?
[ 03-07-2024]
వైద్యఆరోగ్యశాఖ పరిధిలో రెండు నెలల క్రితం ఒప్పంద, పొరుగు సేవల కింద స్టాఫ్నర్సులు(20) ఫార్మాసిస్టులు(2), ఆయూష్ ఫార్మాసిస్టు(4) కొలువుల ఎంపిక కోసం దరఖాస్తులు స్వీకరించారు. -
సత్వర న్యాయమే లక్ష్యం
[ 03-07-2024]
ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా సాంకేతిక పురోగతిని దృష్టిలో పెట్టుకుని భారత ప్రభుత్వం తీసుకొచ్చిన భారతీయ న్యాయ సంహిత అధినియం - 2023 కొత్త చట్టంతో భారత న్యాయవ్యవస్థలో పెను మార్పులు చోటు చేసుకోనున్నాయి.