మీ-సేవలో.. అక్రమాలకు చెక్
వినియోగదారులకు సులభంగా.. వేగంగా సేవలు అందించాలనే ఉద్దేశంతో అప్పట్లో ప్రభుత్వం మీ-సేవ కేంద్రాల వ్యవస్థను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. గతంలో ప్రభుత్వ కార్యాలయాల్లో ఆయా ధ్రువపత్రాలు, ఇతర అవసరాలకు రైతులు, విద్యార్థులు రాతపూర్వక దరఖాస్తు చేసుకునే వారు.
నేటి నుంచి నగదు రహిత చెల్లింపులు
రఘునాథపురం: మీ-సేవ కేంద్రంలో దరఖాస్తు ప్రక్రియలో నిర్వాహకుడు
రాజపేట, భువనగిరి, న్యూస్టుడే: వినియోగదారులకు సులభంగా.. వేగంగా సేవలు అందించాలనే ఉద్దేశంతో అప్పట్లో ప్రభుత్వం మీ-సేవ కేంద్రాల వ్యవస్థను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. గతంలో ప్రభుత్వ కార్యాలయాల్లో ఆయా ధ్రువపత్రాలు, ఇతర అవసరాలకు రైతులు, విద్యార్థులు రాతపూర్వక దరఖాస్తు చేసుకునే వారు. ఇప్పుడంతా ఆ సేవలన్నీ మీ-సేవ కేంద్రాల్లోనే కొనసాగుతున్నాయి. రెవెన్యూ శాఖకు సంబంధించిన సేవలు ఎక్కువగా ఉండటం గమనార్హం. ఇందులో ఆయా సేవలకు సంబంధిత రుసుంలను ప్రభుత్వం నిర్దేశించింది. ఆ రుసుం వివరాలను వినియోగదారులు కనిపించేలా కేంద్రాల్లో బోర్డులు ప్రదర్శించాలి. యాదాద్రి భువనగిరి జిల్లాలో ప్రభుత్వ, టీఆర్ఎన్, టీజీటీఎస్ కలిపి మొత్తంగా 76 మీ సేవ కేంద్రాలున్నాయి. కొందరు నిర్వాహకులు నిర్దేశించిన రుసుంతో పాటు అదనపు వసూళ్లకు పాల్పడుతున్నారనే ఆరోపణలు గత కొంత కాలంగా ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఈ అక్రమాలకు అడ్డుకట్ట వేయాలన్న సంకల్పంతో ప్రభుత్వం నగదు రహిత చెల్లింపుల విధానానికి శ్రీకారం చుట్టింది.
కర్షకులకు తీరనున్న ఇక్కట్లు..
మీ సేవ కేంద్రాల్లో రుసుం చార్టుల్లో ఉన్న మొత్తానికి, వసూలు చేస్తున్న దానికి పొంతన ఉండటం లేదనే వాదనలున్నాయి. అదనపు వసూళ్లపై ప్రశ్నిస్తే జిల్లాలో అక్కడక్కడ నిర్వాహకులు దురుసుగా వ్యవహరిస్తున్నారని రైతులు వాపోతున్నారు. ఇదే విషయమై ఉన్నతాధికారులకు ఫిర్యాదులందినా, తరచూ అధికారులు తనిఖీలు చేపట్టినా వ్యవహారంలో మార్పు కనిపించడం లేదనేది వాస్తవం. ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో అదనపు వసూళ్లకు అడ్డుకట్ట పడే అవకాశం ఉండనుంది. చెల్లింపులు నగదు రహితం కావడంతో ఎంత వసూలు చేశారన్నది ఉన్నతాధికారులకు ఇట్టే తెలిసిపోతుంది. అదనంగా తీసుకునే వారిపై తక్షణ చర్యలు తీసుకునేందుకు ఆస్కారం ఉంటుందని అధికార వర్గాలు చెబుతున్నాయి.
క్యూఆర్ కోడ్ స్కానర్ ద్వారా..
మీ-సేవ కేంద్రాల్లో రెవెన్యూ పరమైన సేవలన్నింటికీ నగదు రహిత చెల్లింపులను తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈనెల 1 నుంచి ఈ నూతన విధానం పూర్తిస్థాయిలో అమల్లోకి రానుంది. ఇప్పటికే ప్రభుత్వం నిర్వహిస్తున్న కేంద్రాల్లో ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నారు. ఇది సత్ఫలితాలనిస్తుండటంతో ఇక మీదట ప్రైవేటు కేంద్రాల్లోనూ క్యూఆర్ కోడ్ స్కానర్ ద్వారా రుసుం వసూలు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. స్కానర్లు ఏర్పాటు చేసుకోవాలనే విషయం సంబంధిత మీ-సేవ కేంద్రాల నిర్వాహకులకు తెలిపినట్లు అధికారులు చెబుతున్నారు.
అన్నింటా అమలుకు ఆదేశాలిచ్చాం
ఎన్.సాయికుమార్, జిల్లా ఈ-డిస్ట్రిక్ట్ మేనేజర్
నగదు రహిత చెల్లింపుల విధానం పక్కాగా అమలు చేసేందుకు మీ సేవ కేంద్రాల నిర్వాహకులకు ఆదేశాలు జారీ చేశాం. రెవెన్యూ సేవలేవీ ఉన్నా క్యూఆర్ కోడ్ స్కాన్ విధానంలోనే రుసుం చెల్లించాలి. నిబంధనలు ఉల్లంఘించే ఎక్కువగా తీసుకునే వారిపై చర్యలు ఉంటాయి. ఈ విధానం సోమవారం నుంచి అమల్లోకి రానుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆర్ఆర్ఆర్ భూసేకరణ వేగిరం
[ 03-07-2024]
రాజధాని హైదరాబాద్తో పాటూ పరిసర ప్రాంతాలకు సంబంధించి వచ్చే 30 ఏళ్ల అవసరాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రస్తుతమున్న బాహ్య వలయ రహదారి (ఓఆర్ఆర్)కి అవతల 30 కి.మీ. దూరంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్మించనున్న ప్రాంతీయ వలయ రహదారి (ఆర్ఆర్ఆర్) నిర్మాణ ప్రక్రియ ఉమ్మడి జిల్లాలో వడివడిగా సాగుతోంది. -
యాదాద్రిలో ఘనంగా లక్ష పుష్పార్చన
[ 03-07-2024]
ఏకాదశి పర్వదినం సందర్భంగా మంగళవారం యాదాద్రి పంచనారసింహుల పుణ్యక్షేత్రంలో విశేష ఆరాధనలు నిర్వహించారు. -
నేరస్థులను పట్టిస్తోంది నిఘా నేత్రం
[ 03-07-2024]
నేరాల నియంత్రణకు, నేరస్థులను పట్టుకునేందుకు, కోర్టులో శిక్ష పడేందుకు సీసీ కెమెరాలు ఎంతో ఉపయోగపడుతున్నాయని పోలీసులు చెబుతున్నారు. -
కొత్త న్యాయచట్టాలతో బాధితులకు ఊరట
[ 03-07-2024]
దేశవ్యాప్తంగా జులై ఒకటో తేదీ నుంచి అమల్లోకి వచ్చిన కొత్త న్యాయ చట్టాలు భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్), భారతీయ నాగరిక్ సురక్షా సంహిత (బీఎన్ఎస్ఎస్), భారతీయ సాక్ష్య అధినీయం (బీఎస్ఏ) ద్వారా బాధితులకు సత్వర న్యాయం జరుగుతుందని జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ వెల్లడించారు. -
అమ్మకు గుర్తుగా మొక్క..!
[ 03-07-2024]
కనకనలాడే ఎండకు శిరస్సు మాడినా.. మనకు తన నీడను అందించే చెట్టే అమ్మాజారెడు నీళ్లయిన తాను దాచుకోక... జగతికి సర్వస్వం అర్పించే మబ్బె అమ్మ ఆ అమ్మలనే మించిన మా అమ్మకు... రుణం తీర్చుకోలేను ఏ జన్మకూ.. కంటేనే అమ్మ అంటే ఎలా... కరుణించే ప్రతి దేవత అమ్మే కదా... కన్న అమ్మే కదా.. -
కస్తూర్బాల్లో కష్టాలు..
[ 03-07-2024]
చదువులు సాగిద్దామంటే సమస్యలు దండిగా ఉంటున్నాయి. పరిష్కరిద్దామంటే నిధుల కష్టం.. ఇవి కస్తూర్బాగాంధీ బాలికల గురుకుల విద్యాలయా(కేజీబీవీ)ల్లో ఎదురవుతున్న ఇబ్బందులు. -
సేంద్రియ సాగులో మేటి
[ 03-07-2024]
ఉన్నత చదువు చదివి.. రూ.వేలల్లో వేతనానికి ఏసీ గదుల్లో పని చేసే ఉద్యోగావకాశాలు ఉన్నా.. అవన్నీ వదిలేసి వ్యవసాయంపై మక్కువ.. భూమిపై ప్రేమతో సాగు రంగంలోకి అడుగు పెట్టారు మిర్యాలగూడ పట్టణానికి చెందిన సోమా పవన్కుమార్. -
నకిలీ ధ్రువపత్రాలతో.. నర్సుల కొలువులు..?
[ 03-07-2024]
వైద్యఆరోగ్యశాఖ పరిధిలో రెండు నెలల క్రితం ఒప్పంద, పొరుగు సేవల కింద స్టాఫ్నర్సులు(20) ఫార్మాసిస్టులు(2), ఆయూష్ ఫార్మాసిస్టు(4) కొలువుల ఎంపిక కోసం దరఖాస్తులు స్వీకరించారు. -
సత్వర న్యాయమే లక్ష్యం
[ 03-07-2024]
ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా సాంకేతిక పురోగతిని దృష్టిలో పెట్టుకుని భారత ప్రభుత్వం తీసుకొచ్చిన భారతీయ న్యాయ సంహిత అధినియం - 2023 కొత్త చట్టంతో భారత న్యాయవ్యవస్థలో పెను మార్పులు చోటు చేసుకోనున్నాయి.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
కోహ్లీతోపాటు నాకూ టికెట్ బుక్ చేయండి: ధోనీ సమాధానంపై పాక్ మాజీ షాక్
-
ఈ ఏడాది ప్రయోగాత్మక చిత్రాలు.. ఏ సినిమా ఏ ఓటీటీలో?
-
ఎంక్యూర్ ఫార్మా, బన్సల్ వైర్ ఐపీఓలు ప్రారంభం.. ₹2,700 కోట్ల సమీకరణ
-
బైడెన్ డిమెన్షియాను దాచిపెట్టారు..కమలా హ్యారిస్ ఆయన స్థానాన్ని భర్తీ చేయొచ్చు..!
-
పవన్ కల్యాణ్ చరిత్ర సృష్టించారు: పరుచూరి గోపాలకృష్ణ
-
హాథ్రస్ తొక్కిసలాట ఘటన.. భోలే బాబా ఎక్కడ..?