మహిళా వ్యాపారులకు అందలం
అతివలు అన్ని రంగాల్లో రాణించేలా రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేపడుతోంది. అందులో భాగంగా వ్యాపారాల్లో స్థిరపడాలనే సదుద్దేశంతో 14 రకాల వ్యాపారాలను ఎంపిక చేసి అమలుకు కార్యాచరణ రూపొందించింది.
సూర్యాపేట కలెక్టరేట్, ఆత్మకూర్(ఎస్),న్యూస్టుడే: అతివలు అన్ని రంగాల్లో రాణించేలా రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేపడుతోంది. అందులో భాగంగా వ్యాపారాల్లో స్థిరపడాలనే సదుద్దేశంతో 14 రకాల వ్యాపారాలను ఎంపిక చేసి అమలుకు కార్యాచరణ రూపొందించింది. స్వయం సహాయ సంఘాల సభ్యులకు మండలాల వారీగా వ్యాపారాలు కేటాయించి, ఎంపిక చేసిన వారికి రుణాలు సైతం కల్పించే ఏర్పాట్లు చేసింది. ఈ అంశాలపై ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టర్లకు అవగాహన కల్పించారు. అనంతరం జిల్లా స్థాయిలో, మండల స్థాయిలో సైతం స్వయం సహాయక సంఘం అధ్యక్షురాళ్లకు అవగాహన కల్పిస్తున్నారు. ప్రస్తుతం ఏపీఎంలు యూనిట్ల ఎంపిక కార్యక్రమాన్ని చేపడుతున్నారు. ఈ ప్రక్రియ పూర్తయ్యాక అతివలు వ్యాపారాలను ప్రారంభించేలా అధికార యంత్రాంగం కసరత్తు చేపడుతుంది.
11,348 మంది సభ్యులకు లబ్ధి
జిల్లాలోని 23 మండలాల్లో 18,163 స్వయం సహాయ సంఘాలలో 1,81,258 మంది సభ్యులు ఉన్నారు. వీరికి ప్రభుత్వం అమలు చేస్తున్న మహిళా శక్తి కార్యక్రమంలో భాగంగా 14 రకాల వ్యాపారాలలో జిల్లా వ్యాప్తంగా 8,623 యూనిట్లు మంజూరు చేసింది. అందుకు కావాల్సిన రూ.86.78 కోట్ల నిధులు రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేయనుంది. కొన్ని వ్యాపారాలకు కేంద్ర ప్రభుత్వం 60 నుంచి 20 శాతం వరకు ఖర్చు చేయనుంది. మహిళా సంఘాలకు యూనిట్లు కేటాయిస్తే 11,348 మంది సభ్యులకు లబ్ధి చేకూరనుంది. ఇప్పటికే ఏకరూప దుస్తుల కుట్టడం ద్వారా జిల్లా వ్యాప్తంగా 34 యూనిట్లలో 712 మంది సభ్యులకు మేలు జరిగింది. వారు రూ.1.90 కోట్ల ఆదాయం పొందారు. దీని స్ఫూర్తితో మిగతా వ్యాపారాలను అమలు చేసేందుకు సన్నాహాలు చేపడుతున్నారు.
అత్యధికంగా మైక్రో యూనిట్లు
ఎంపిక చేసిన వ్యాపారాల్లో అత్యధికంగా 4,972 మైక్రో యూనిట్లు ఉన్నాయి. అందులో అంతే మందికి లబ్ధి చేకూరనుంది. ఆరు యూనిట్లను 23 మండలాల్లోనూ అమలు చేయనున్నారు. అందులో ప్రధానంగా దుస్తులు కుట్టుట, గేదెలు, పెరటి కోళ్లు, కోళ్ల ఫారం పంపిణీ, మీసేవ కేంద్రాల వ్యాపారాలను జిల్లాలోని ప్రతి మండలానికి కేటాయించారు. మరికొన్ని యూనిట్లను కేవలం కొన్నింట్లో ఒకటి చొప్పున మంజూరు చేయనున్నారు. అందులో సోలార్ యూనిట్ను అనంతగిరిలో, చేపల విక్రయ వాహనాన్ని చింతలపాలెం, మోతె, చివ్వెంల, పాలకవీడు మండలాల్లో ఒకదాన్ని ఎంపిక చేయనున్నారు. ఈవెంట్ మేనేజ్మెంట్ కింద హుజూర్నగర్ మండలానికి, ప్లాస్టిక్ వేస్టే మేనేజ్మెంట్ను చివ్వెంల, క్యాంటీన్లు కోదాడ, తిరుమలగిరి, హుజూర్నగర్, సూర్యాపేట, తుంగతుర్తి ప్రధాన ప్రాంతాల్లో ఏర్పాటు చేసేలా ప్రణాళిక రూపొందించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పుట్టినరోజు నాడే మృత్యుఒడికి..
[ 02-07-2024]
అప్పటి వరకు తమతోనే ఉన్న అమ్మ మృత్యువు ఒడిలోకి జారుకుందని ఆ పసి పిల్లలకేం తెలుసు... విగత జీవిగా పడి ఉన్న తల్లిని చూస్తూ పాలు తాగాలని.. గోరుముద్దలు తినాలని గుక్కపట్టి ఏడుస్తున్న దృశ్యం అక్కడున్న ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టించింది. -
ఆసుపత్రులు కిటకిట
[ 02-07-2024]
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలు, ముసురుతో అంటువ్యాధులు ప్రబలుతున్నాయి. -
విద్యుత్తు అధికారులు రైతులను వేధించొద్దు: మంత్రి కోమటిరెడ్డి
[ 02-07-2024]
విద్యుత్తు శాఖ అధికారులు, సిబ్బంది కొత్త ట్రాన్స్ఫార్మర్లు, లైన్ల మార్పిడి వంటి ప్రతి పనికి¨ రైతుల నుంచి డబ్బులు అడిగినట్లు తమ దృష్టికి వచ్చిందని వాటిని విరమించుకోకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. -
మెరుగైన విద్యుత్తు సరఫరాకు సర్వే
[ 02-07-2024]
పెరుగుతున్న పట్టణీకరణకు అనుగుణంగా వినియోగదారులకు మెరుగైన కరెంటు అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. -
యువతిపై అత్యాచారం.. దోషికి తుదిశ్వాస వరకు కారాగారం
[ 02-07-2024]
ప్రేమ పేరిట మాయ మాటలు చెప్పి ఓ యువతిని అపహరించి, అత్యాచారానికి పాల్పడిన నిందితుడికి న్యాయస్థానం ‘జీవిత కాలం శిక్ష’ (తుది శ్వాస వదిలే వరకు), రూ.21,000 జరిమానా విధించింది. -
నమ్మించి నట్టేట్లో ముంచి..!
[ 02-07-2024]
చిట్టీలు, వడ్డీల పేరిట ఓ వ్యక్తి పలువురిని నమ్మించి రూ.కోట్లు వసూలు చేసి ఉడాయించిన ఘటన హయత్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. -
శిథిల భవనాల్లో పల్లె పాలన
[ 02-07-2024]
పరిపాలన సౌలభ్యం కోసం సర్కారు కొత్తగా గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేసింది. వీటిలో కొన్నింటికి మాత్రమే భవన నిర్మాణానికి కొంత నిధులు మంజూరు చేసి పనులు మొదలుపెట్టారు. -
ఫీజులు నొక్కి.. ఇరుకు గదుల్లో కుక్కి
[ 02-07-2024]
జిల్లాలోని ప్రైవేటు జూనియర్ కళాశాలల్లో విచ్చలవిడిగా ఫీజులు వసూలు చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో తనిఖీ చేయాల్సిన ఇంటర్ విద్యాధికారులు పట్టించుకోకపోవటంతో యాజమాన్యాలు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాయి. -
బిందుసేద్యం విస్తరణకు అడుగులు
[ 02-07-2024]
సాగునీటి సమస్య.. మరోపక్క కూలీల కొరత వెరసి వ్యవసాయం అనుబంధ సాగుకు రైతులు నానా తంటాలు పడుతున్నారు. -
గర్భిణి మృతికి కారణమైన ఆరుగురి అరెస్టు
[ 02-07-2024]
చివ్వెంల మండలం ఎంజీనగర్ తండాకు చెందిన ఎనిమిది నెలల గర్భిణి సుహాసిని మృతి కేసులో ఆరుగురిని సోమవారం అరెస్టు చేసినట్లు ఎస్పీ సన్ప్రీత్ సింగ్ తెలిపారు. -
ఒత్తిడిని జయిద్దాం..హాయిగా జీవిద్దాం
[ 02-07-2024]
ఇటీవలి కాలంలో చిన్నా, పెద్ద తేడా లేకుండా అన్ని వయస్సుల వారిని వేధిస్తున్న ప్రధాన సమస్య ఒత్తిడి. -
ప్రతిభ చూపితే.. భవిత మీదే!
[ 02-07-2024]
మూస విధానంలో చదివితే విద్యార్థులకు ఆయా సబ్జెక్టుల్లో మార్కులు పెరగొచ్చు కానీ.. వారిలోని సృజనాత్మకత వెలుగులోకి రాదు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
జిగాన గన్స్.. రూ.25 లక్షల కాంట్రాక్ట్..: కారులోనే సల్మాన్ ఖాన్ హత్యకు కుట్ర
-
‘జేమ్స్ బాండ్’ తరహా సినిమాలతో పాటు ఇలాంటివీ తీస్తాను.. ఫ్యూచర్ ప్రాజెక్ట్స్పై శంకర్ కామెంట్స్
-
టీ20 వరల్డ్ కప్.. రోహిత్తో ఐకానిక్ ఫొటో.. ఎందుకో చెప్పిన కోహ్లీ
-
విమానంలో కుదుపులు.. ఓవర్హెడ్ బిన్లో ఇరుక్కుపోయిన ప్రయాణికుడు
-
రాహుల్ ప్రసంగంపై దుమారం.. కొన్ని వ్యాఖ్యలు తొలగింపు
-
ఎఫ్డీ కంటే అధిక వడ్డీ.. ఆర్బీఐ గ్యారెంటీతో వచ్చే ఈ బాండ్స్ గురించి తెలుసా?