పదోన్నతులు దారి తప్పాయా..
ఉపాధ్యాయుల పదోన్నతుల్లో అక్రమాలు జరిగాయన్న వాదన వినిపిస్తోంది. పలువురు అడ్డదారుల్లో, నకిలీ ధ్రువపత్రాలతో పదోన్నతులు పొందారని, పూర్తిస్థాయిలో పరిశీలించాల్సిన అధికారులు చూసీచూడనట్లు వ్యవహరించారన్న ఆరోపణలున్నాయి.
పలుచోట్ల ఉపాధ్యాయ సంఘాల ఆందోళన
చింతపల్లి మండలం కొర్రమాన్సింగ్ తండాలో ఎస్జీటీ ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహించిన శివరంగాచారి ఈ ఏడాది ఫిబ్రవరిలో రహదారి ప్రమాదంలో మరణించారు. తాజాగా అధికారులు విడుదల చేసిన పదోన్నతుల జాబితాలో ఆయన ఎస్జీటీ నుంచి స్కూల్ అసిస్టెంట్ (ఎస్ఏ - గణితం)గా పదోన్నతి పొంది డిండి మండలం గోనబోయినపల్లి జిల్లా పరిషత్ పాఠశాలకు బదిలీ అయినట్లు అధికారులు ఆదేశాలు జారీ చేశారు. మండలంలోని ఎస్జీటీ ఉపాధ్యాయులకు సంబంధించి సీనియార్టీ జాబితాను తయారుచేసి.. అభ్యంతరాలుంటే తెలపాలని ఒకటికి రెండు సార్లు జాబితాను వెల్లడించారు. పలుమార్లు ఆ జాబితాను మార్చి తుది జాబితాను తయారు చేశారు. ఇన్ని జరిగినా నాలుగు నెలల క్రితం మరణించిన ఉపాధ్యాయుడిని గుర్తించకపోవడం గమనార్హం. అధికారులు మాత్రం సీనియార్టీ జాబితాలో మరణించిన ఉపాధ్యాయుడి పేరును తీసేసినా సాంకేతిక తప్పిదంతో పదోన్నతుల జాబితాలో పేరు వచ్చిందని చెబుతున్నారు.
ఈనాడు, నల్గొండ - న్యూస్టుడే, నల్గొండ విద్యావిభాగం :ఉపాధ్యాయుల పదోన్నతుల్లో అక్రమాలు జరిగాయన్న వాదన వినిపిస్తోంది. పలువురు అడ్డదారుల్లో, నకిలీ ధ్రువపత్రాలతో పదోన్నతులు పొందారని, పూర్తిస్థాయిలో పరిశీలించాల్సిన అధికారులు చూసీచూడనట్లు వ్యవహరించారన్న ఆరోపణలున్నాయి. భాషా పండితులు, వ్యాయామ ఉపాధ్యాయుల్లో ఈ అక్రమాలు ఎక్కువగా ఉన్నాయని సంబంధిత వర్గాల ద్వారా తెలిసింది.
- వ్యాయామ విద్య ఉపాధ్యాయుల్లో చాలా మంది మహారాష్ట్రలోని పలు కళాశాలల నుంచి ధ్రవీకరణ పత్రాలతో పదోన్నతులకు దరఖాస్తు చేశారు. కొంత మంది నకిలీ పత్రాలతోనే దరఖాస్తు చేసినట్లు సంబంధిత ఉపాధ్యాయులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా వారు పట్టించుకోలేదని ఆరోపిస్తున్నారు. నిబంధనల ప్రకారం బ్యాచ్లర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ (బీపీఈడీ) కోర్సు చేయాలంటే జిల్లా విద్యాశాఖ ఉన్నతాధికారి అనుమతితో కనీసం 180 రోజుల వరకు పాఠశాలలకు సెలవు పెట్టాల్సి ఉంటుంది. మహారాష్ట్ర లాంటి ఇతర రాష్ట్రాల్లో ఇలాంటి నిబంధనలు లేకపోవడంతో చాలా మంది అక్కడి ధ్రువపత్రాలు సమర్పించి పదోన్నతులకు దరఖాస్తులు చేసినట్లు ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందాయి.
- మరికొందరు బీపీఈడీ కోర్సు పూర్తి చేశాక.. అండర్ గ్రాడ్యూయేట్ డిప్లొమా ( యూజీడీ) కోర్సు పూర్తి చేశామని ధ్రువపతాలు సమర్పించారు. బీపీఈడీ పూర్తి చేసిన తర్వాత దానికన్న తక్కువ కోర్సు అయిన యూజీడీని ఎలా పూర్తి చేస్తారని పలు ఉపాధ్యాయ సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. ధ్రువపత్రాలను సరిగా పరిశీలిస్తే ఏవి అసలువో..ఏవి నకిలీవో తెలుస్తాయని పలువురు ఉపాధ్యాయులు వాదిస్తున్నారు. మరోవైపు ఎస్జీటీ నుంచి ఎస్ఏగా పక్షం రోజుల నుంచి పదోన్నతులు పొందిన వారు శనివారం ఉద్యోగ విరమణ చేశారు. ఇలా ఒక్క నల్గొండ జిల్లాలోనే సుమారు 25 మందికిపైగా ఉన్నారు.
పారదర్శకంగానే పదోన్నతులు, బదిలీలు
ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీల క్రతువులో ఎక్కడా ఎలాంటి అక్రమాలు జరగలేదు. ప్రక్రియంతా పారదర్శకంగా జరిగింది. ఫిర్యాదులొచ్చిన ఉపాధ్యాయులపై సమగ్రంగా పరిశీలించి అవన్నీ సరైనవి అని ధ్రువీకరించుకున్నాకే వారికి బదిలీలు ఇచ్చాం. ఎవరికైనా అనుమానాలుంటే మాకు నేరుగా ఫిర్యాదు చేయొచ్చు.
బొల్లారం భిక్షపతి, జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈవో), నల్గొండ
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పుట్టినరోజు నాడే మృత్యుఒడికి..
[ 02-07-2024]
అప్పటి వరకు తమతోనే ఉన్న అమ్మ మృత్యువు ఒడిలోకి జారుకుందని ఆ పసి పిల్లలకేం తెలుసు... విగత జీవిగా పడి ఉన్న తల్లిని చూస్తూ పాలు తాగాలని.. గోరుముద్దలు తినాలని గుక్కపట్టి ఏడుస్తున్న దృశ్యం అక్కడున్న ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టించింది. -
ఆసుపత్రులు కిటకిట
[ 02-07-2024]
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలు, ముసురుతో అంటువ్యాధులు ప్రబలుతున్నాయి. -
విద్యుత్తు అధికారులు రైతులను వేధించొద్దు: మంత్రి కోమటిరెడ్డి
[ 02-07-2024]
విద్యుత్తు శాఖ అధికారులు, సిబ్బంది కొత్త ట్రాన్స్ఫార్మర్లు, లైన్ల మార్పిడి వంటి ప్రతి పనికి¨ రైతుల నుంచి డబ్బులు అడిగినట్లు తమ దృష్టికి వచ్చిందని వాటిని విరమించుకోకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. -
మెరుగైన విద్యుత్తు సరఫరాకు సర్వే
[ 02-07-2024]
పెరుగుతున్న పట్టణీకరణకు అనుగుణంగా వినియోగదారులకు మెరుగైన కరెంటు అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. -
యువతిపై అత్యాచారం.. దోషికి తుదిశ్వాస వరకు కారాగారం
[ 02-07-2024]
ప్రేమ పేరిట మాయ మాటలు చెప్పి ఓ యువతిని అపహరించి, అత్యాచారానికి పాల్పడిన నిందితుడికి న్యాయస్థానం ‘జీవిత కాలం శిక్ష’ (తుది శ్వాస వదిలే వరకు), రూ.21,000 జరిమానా విధించింది. -
నమ్మించి నట్టేట్లో ముంచి..!
[ 02-07-2024]
చిట్టీలు, వడ్డీల పేరిట ఓ వ్యక్తి పలువురిని నమ్మించి రూ.కోట్లు వసూలు చేసి ఉడాయించిన ఘటన హయత్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. -
శిథిల భవనాల్లో పల్లె పాలన
[ 02-07-2024]
పరిపాలన సౌలభ్యం కోసం సర్కారు కొత్తగా గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేసింది. వీటిలో కొన్నింటికి మాత్రమే భవన నిర్మాణానికి కొంత నిధులు మంజూరు చేసి పనులు మొదలుపెట్టారు. -
ఫీజులు నొక్కి.. ఇరుకు గదుల్లో కుక్కి
[ 02-07-2024]
జిల్లాలోని ప్రైవేటు జూనియర్ కళాశాలల్లో విచ్చలవిడిగా ఫీజులు వసూలు చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో తనిఖీ చేయాల్సిన ఇంటర్ విద్యాధికారులు పట్టించుకోకపోవటంతో యాజమాన్యాలు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాయి. -
బిందుసేద్యం విస్తరణకు అడుగులు
[ 02-07-2024]
సాగునీటి సమస్య.. మరోపక్క కూలీల కొరత వెరసి వ్యవసాయం అనుబంధ సాగుకు రైతులు నానా తంటాలు పడుతున్నారు. -
గర్భిణి మృతికి కారణమైన ఆరుగురి అరెస్టు
[ 02-07-2024]
చివ్వెంల మండలం ఎంజీనగర్ తండాకు చెందిన ఎనిమిది నెలల గర్భిణి సుహాసిని మృతి కేసులో ఆరుగురిని సోమవారం అరెస్టు చేసినట్లు ఎస్పీ సన్ప్రీత్ సింగ్ తెలిపారు. -
ఒత్తిడిని జయిద్దాం..హాయిగా జీవిద్దాం
[ 02-07-2024]
ఇటీవలి కాలంలో చిన్నా, పెద్ద తేడా లేకుండా అన్ని వయస్సుల వారిని వేధిస్తున్న ప్రధాన సమస్య ఒత్తిడి. -
ప్రతిభ చూపితే.. భవిత మీదే!
[ 02-07-2024]
మూస విధానంలో చదివితే విద్యార్థులకు ఆయా సబ్జెక్టుల్లో మార్కులు పెరగొచ్చు కానీ.. వారిలోని సృజనాత్మకత వెలుగులోకి రాదు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
అదానీ హిండెన్బర్గ్ వివాదంలో కొత్త మలుపు.. కోటక్ బ్యాంకుతో ముడి!
-
జిగాన గన్స్.. రూ.25 లక్షల కాంట్రాక్ట్..: కారులోనే సల్మాన్ ఖాన్ హత్యకు కుట్ర
-
‘జేమ్స్ బాండ్’ తరహా సినిమాలతో పాటు ఇలాంటివీ తీస్తాను.. ఫ్యూచర్ ప్రాజెక్ట్స్పై శంకర్ కామెంట్స్
-
టీ20 వరల్డ్ కప్.. రోహిత్తో ఐకానిక్ ఫొటో.. ఎందుకో చెప్పిన కోహ్లీ
-
విమానంలో కుదుపులు.. ఓవర్హెడ్ బిన్లో ఇరుక్కుపోయిన ప్రయాణికుడు
-
రాహుల్ ప్రసంగంపై దుమారం.. కొన్ని వ్యాఖ్యలు తొలగింపు