అలుపెరగని శిక్షకుడు తూము హన్మంతరావు
వేతనం కోసం నిర్ణీత సమయం వరకే పని చేయకుండా సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు విధులు నిర్వర్తించి.. పిల్లల్లో దాగిఉన్న ప్రతిభను గుర్తించి..
గుండ్లసింగారంలో హన్మంతరావు దంపతులను సన్మానించి జ్ఞాపిక అందజేస్తున్న నూతనకల్ జిల్లా పరిషత్ ఉపాధ్యాయ బృందం
నూతనకల్, న్యూస్టుడే: వేతనం కోసం నిర్ణీత సమయం వరకే పని చేయకుండా సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు విధులు నిర్వర్తించి.. పిల్లల్లో దాగిఉన్న ప్రతిభను గుర్తించి.. శిక్షణతో మెరుగులద్ది ఉన్నత స్థాయికి చేర్చిన మహోన్నత వ్యక్తి వ్యాయామ ఉపాధ్యాయుడు తూము హన్మంతరావు అని పూర్వ విద్యార్థులు, విశ్రాంత ఉద్యోగులు పేర్కొన్నారు. ఆయన అలుపెరగని శిక్షకుడని, వచ్చే వేతనంలో మూడు వంతు విద్యార్థుల ఉన్నతి కోసం ఖర్చు చేసిన గొప్ప వ్యక్తిత్వం ఆయనదని కొనియాడారు. సూర్యాపేట జిల్లా నూతనకల్ జడ్పీ ఉన్నత పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయుడు తూము హన్మంతరావు శనివారం ఉద్యోగ విరమణ చేశారు. ఈ సందర్భంగా ఆయన సన్మాన మహోత్సవాన్ని మండలంలోని గుండ్లసింగారం ఐఎల్ఆర్ ఫంక్షన్హాల్లో సాయంత్రం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పోలీస్ శాఖలో డీఎస్పీ, సీఐ, ఎస్సై, పోలీస్ కానిస్టేబుల్స్గా, వ్యాయామ ఉపాధ్యాయులుగా, మున్సిపల్ కమిషనర్, రైల్వే శాఖ, ప్రజాప్రతినిధులు, ఇలా వివిధ హోదాలో స్థిరపడిన పూర్వ విద్యార్థులు 200 మంది వరకు తరలివచ్చారు. తమ ఉన్నతికి పాటుపడిన ఉపాధ్యాయుడు హన్మంతరావు, పుష్పలత దంపతులను పూలమాలలు, శాలువాతో సన్మానించి జ్ఞాపికలు అందజేసి తమ అనుబంధాన్ని పంచుకున్నారు. హోటళ్లలో, వ్యవసాయ కూలీలుగా పనులు చేసుకుంటున్న తమను పట్టు పట్టి పాఠశాల మైదానానికి తీసుకెళ్లి తమలో దాగి ఉన్న క్రీడా ప్రతిభను గుర్తించి వెలికితీసి ఉన్నత స్థితికి చేర్చారని గుర్తుచేశారు. సమాజంలో తమకంటూ ఒక స్థానం కల్పించిన గురువుగా ఆయన చరిత్రలో నిలిచిపోతారని అభిప్రాయపడ్డారు. అంతకు ముందు పాఠశాల నుంచి ఫంక్షన్హాల్ వరకు ఉపాధ్యాయుడు ఉన్న వాహనాన్ని పూర్వ విద్యార్థులు తాడుతో లాగుతూ తీసుకొచ్చారు. కార్యక్రమంలో మండల విద్యాధికారి రాములునాయక్, ఎంపీపీ బూరెడ్డి కళావతి, ఎంపీటీసీ సభ్యురాలు పన్నాల రమ, పీఏసీఎస్ ఛైర్పర్సన్ నాగం జయసుధ, జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత మధుసూదన్రావు, పూర్వ విద్యార్థులు, మున్సిపల్ కమిషనర్ సాబెర్హాలీ, డిప్యూటీ రిజిస్ట్రార్ పద్మజ, రైల్వే సీనియర్ ఇంజినీర్ ఫరీద, రైల్వే అధికారి శ్రీనివాస్, పోలీస్శాఖ అధికారులు నాగమల్లు, వాసుదేవ్, రాజు, శ్రీనునాయక్, భువనగిరి పట్టణ సీనియర్ క్రీడాకారులు, నూతనకల్ మండల సీనియర్, జూనియర్ క్రీడాకారులు, తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పుట్టినరోజు నాడే మృత్యుఒడికి..
[ 02-07-2024]
అప్పటి వరకు తమతోనే ఉన్న అమ్మ మృత్యువు ఒడిలోకి జారుకుందని ఆ పసి పిల్లలకేం తెలుసు... విగత జీవిగా పడి ఉన్న తల్లిని చూస్తూ పాలు తాగాలని.. గోరుముద్దలు తినాలని గుక్కపట్టి ఏడుస్తున్న దృశ్యం అక్కడున్న ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టించింది. -
ఆసుపత్రులు కిటకిట
[ 02-07-2024]
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలు, ముసురుతో అంటువ్యాధులు ప్రబలుతున్నాయి. -
విద్యుత్తు అధికారులు రైతులను వేధించొద్దు: మంత్రి కోమటిరెడ్డి
[ 02-07-2024]
విద్యుత్తు శాఖ అధికారులు, సిబ్బంది కొత్త ట్రాన్స్ఫార్మర్లు, లైన్ల మార్పిడి వంటి ప్రతి పనికి¨ రైతుల నుంచి డబ్బులు అడిగినట్లు తమ దృష్టికి వచ్చిందని వాటిని విరమించుకోకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. -
మెరుగైన విద్యుత్తు సరఫరాకు సర్వే
[ 02-07-2024]
పెరుగుతున్న పట్టణీకరణకు అనుగుణంగా వినియోగదారులకు మెరుగైన కరెంటు అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. -
యువతిపై అత్యాచారం.. దోషికి తుదిశ్వాస వరకు కారాగారం
[ 02-07-2024]
ప్రేమ పేరిట మాయ మాటలు చెప్పి ఓ యువతిని అపహరించి, అత్యాచారానికి పాల్పడిన నిందితుడికి న్యాయస్థానం ‘జీవిత కాలం శిక్ష’ (తుది శ్వాస వదిలే వరకు), రూ.21,000 జరిమానా విధించింది. -
నమ్మించి నట్టేట్లో ముంచి..!
[ 02-07-2024]
చిట్టీలు, వడ్డీల పేరిట ఓ వ్యక్తి పలువురిని నమ్మించి రూ.కోట్లు వసూలు చేసి ఉడాయించిన ఘటన హయత్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. -
శిథిల భవనాల్లో పల్లె పాలన
[ 02-07-2024]
పరిపాలన సౌలభ్యం కోసం సర్కారు కొత్తగా గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేసింది. వీటిలో కొన్నింటికి మాత్రమే భవన నిర్మాణానికి కొంత నిధులు మంజూరు చేసి పనులు మొదలుపెట్టారు. -
ఫీజులు నొక్కి.. ఇరుకు గదుల్లో కుక్కి
[ 02-07-2024]
జిల్లాలోని ప్రైవేటు జూనియర్ కళాశాలల్లో విచ్చలవిడిగా ఫీజులు వసూలు చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో తనిఖీ చేయాల్సిన ఇంటర్ విద్యాధికారులు పట్టించుకోకపోవటంతో యాజమాన్యాలు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాయి. -
బిందుసేద్యం విస్తరణకు అడుగులు
[ 02-07-2024]
సాగునీటి సమస్య.. మరోపక్క కూలీల కొరత వెరసి వ్యవసాయం అనుబంధ సాగుకు రైతులు నానా తంటాలు పడుతున్నారు. -
గర్భిణి మృతికి కారణమైన ఆరుగురి అరెస్టు
[ 02-07-2024]
చివ్వెంల మండలం ఎంజీనగర్ తండాకు చెందిన ఎనిమిది నెలల గర్భిణి సుహాసిని మృతి కేసులో ఆరుగురిని సోమవారం అరెస్టు చేసినట్లు ఎస్పీ సన్ప్రీత్ సింగ్ తెలిపారు. -
ఒత్తిడిని జయిద్దాం..హాయిగా జీవిద్దాం
[ 02-07-2024]
ఇటీవలి కాలంలో చిన్నా, పెద్ద తేడా లేకుండా అన్ని వయస్సుల వారిని వేధిస్తున్న ప్రధాన సమస్య ఒత్తిడి. -
ప్రతిభ చూపితే.. భవిత మీదే!
[ 02-07-2024]
మూస విధానంలో చదివితే విద్యార్థులకు ఆయా సబ్జెక్టుల్లో మార్కులు పెరగొచ్చు కానీ.. వారిలోని సృజనాత్మకత వెలుగులోకి రాదు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
‘జేమ్స్ బాండ్’ తరహా సినిమాలతో పాటు ఇలాంటివీ తీస్తాను.. ఫ్యూచర్ ప్రాజెక్ట్స్పై శంకర్ కామెంట్స్
-
టీ20 వరల్డ్ కప్.. రోహిత్తో ఐకానిక్ ఫొటో.. ఎందుకో చెప్పిన కోహ్లీ
-
విమానంలో కుదుపులు.. ఓవర్హెడ్ బిన్లో ఇరుక్కుపోయిన ప్రయాణికుడు
-
రాహుల్ ప్రసంగంపై దుమారం.. కొన్ని వ్యాఖ్యలు తొలగింపు
-
ఎఫ్డీ కంటే అధిక వడ్డీ.. ఆర్బీఐ గ్యారెంటీతో వచ్చే ఈ బాండ్స్ గురించి తెలుసా?
-
స్కూల్ బస్సును ఢీకొట్టిన లారీ.. 15 మంది విద్యార్థులకు గాయాలు