logo

మెరుగైన వైద్య సేవలందించాలి

ఎయిమ్స్‌లో మెరుగైన వైద్య సేవలందించడమే లక్ష్యంగా పనిచేయాలని భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి ఆసుపత్రి వైద్యులకు, సిబ్బందికి సూచించారు.

Published : 30 Jun 2024 02:43 IST

బీబీనగర్‌ ఎయిమ్స్‌ను సందర్శించిన ఎంపీ చామల, ఎమ్మెల్యే కుంభం

ఆసుపత్రిలో వైద్యులు, అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్న ఎంపీ, ఎమ్మెల్యే   

బీబీనగర్, న్యూస్‌టుడే: ఎయిమ్స్‌లో మెరుగైన వైద్య సేవలందించడమే లక్ష్యంగా పనిచేయాలని భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి ఆసుపత్రి వైద్యులకు, సిబ్బందికి సూచించారు. శనివారం బీబీనగర్‌ ఎయిమ్స్‌ను కలెక్టర్‌ హన్మంత్‌ కె జెండగే, స్థానిక నాయకులతో కలిసి సందర్శించారు. ఆసుపత్రిలోని ఆయా విభాగాలను తిరిగి పరిశీలించారు. ఓపీ బ్లాక్‌లో రోగులను కలిసి అందుతున్న వైద్య సేవల వివరాలు నేరుగా అడిగి తెలుసుకున్నారు. బ్లడ్‌ బ్యాంక్, ప్రయోగశాలల పనితీరును ఓపీ విభాగంలో ఏర్పాటు చేసిన భవన నమూనాలను చూపించి ఆసుపత్రి భవన నిర్మాణాలు, పురోగతిని డైరెక్టర్‌ వికాస్‌ భాటియా వారికి వివరించారు. అనంతరం ఆసుపత్రిలో వైద్యులు, అధికారులతో సమీక్ష నిర్వహించారు. పారదర్శకంగా ఔట్‌సోర్సింగ్‌ నియామకాలు చేపట్టాలని సూచించారు. నిధుల విడుదల, వినియోగంపై సంబంధిత విభాగం అధికారులతో కలిసి ప్రత్యేక రివ్యూ నిర్వహించారు. కార్యక్రమంలో ఆసుపత్రి మెడికల్‌ పర్యవేక్షకుడు డాక్టర్‌ అభిషేక్‌ అరోరా, డిప్యూటీ డైరెక్టర్‌ బీపీన్‌ వర్గీస్, జడ్పీటీసీ సభ్యురాలు గోలి ప్రణీత, జిల్లా నాయకుడు పోట్టోల్ల శ్యామ్‌గౌడ్, ఎంపీటీసీ సభ్యులు నరేందర్‌రెడ్డి, భార్గవ్, వైద్యులు శ్యామల అయ్యార్, సంగీత సంపత్, మహేశ్వర్‌రెడ్డి, నాయకులు పెంటయ్యగౌడ్, ప్రభాకర్‌ పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు