మెరుగైన వైద్య సేవలందించాలి
ఎయిమ్స్లో మెరుగైన వైద్య సేవలందించడమే లక్ష్యంగా పనిచేయాలని భువనగిరి ఎంపీ చామల కిరణ్కుమార్రెడ్డి, ఎమ్మెల్యే కుంభం అనిల్కుమార్రెడ్డి ఆసుపత్రి వైద్యులకు, సిబ్బందికి సూచించారు.
బీబీనగర్ ఎయిమ్స్ను సందర్శించిన ఎంపీ చామల, ఎమ్మెల్యే కుంభం
ఆసుపత్రిలో వైద్యులు, అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్న ఎంపీ, ఎమ్మెల్యే
బీబీనగర్, న్యూస్టుడే: ఎయిమ్స్లో మెరుగైన వైద్య సేవలందించడమే లక్ష్యంగా పనిచేయాలని భువనగిరి ఎంపీ చామల కిరణ్కుమార్రెడ్డి, ఎమ్మెల్యే కుంభం అనిల్కుమార్రెడ్డి ఆసుపత్రి వైద్యులకు, సిబ్బందికి సూచించారు. శనివారం బీబీనగర్ ఎయిమ్స్ను కలెక్టర్ హన్మంత్ కె జెండగే, స్థానిక నాయకులతో కలిసి సందర్శించారు. ఆసుపత్రిలోని ఆయా విభాగాలను తిరిగి పరిశీలించారు. ఓపీ బ్లాక్లో రోగులను కలిసి అందుతున్న వైద్య సేవల వివరాలు నేరుగా అడిగి తెలుసుకున్నారు. బ్లడ్ బ్యాంక్, ప్రయోగశాలల పనితీరును ఓపీ విభాగంలో ఏర్పాటు చేసిన భవన నమూనాలను చూపించి ఆసుపత్రి భవన నిర్మాణాలు, పురోగతిని డైరెక్టర్ వికాస్ భాటియా వారికి వివరించారు. అనంతరం ఆసుపత్రిలో వైద్యులు, అధికారులతో సమీక్ష నిర్వహించారు. పారదర్శకంగా ఔట్సోర్సింగ్ నియామకాలు చేపట్టాలని సూచించారు. నిధుల విడుదల, వినియోగంపై సంబంధిత విభాగం అధికారులతో కలిసి ప్రత్యేక రివ్యూ నిర్వహించారు. కార్యక్రమంలో ఆసుపత్రి మెడికల్ పర్యవేక్షకుడు డాక్టర్ అభిషేక్ అరోరా, డిప్యూటీ డైరెక్టర్ బీపీన్ వర్గీస్, జడ్పీటీసీ సభ్యురాలు గోలి ప్రణీత, జిల్లా నాయకుడు పోట్టోల్ల శ్యామ్గౌడ్, ఎంపీటీసీ సభ్యులు నరేందర్రెడ్డి, భార్గవ్, వైద్యులు శ్యామల అయ్యార్, సంగీత సంపత్, మహేశ్వర్రెడ్డి, నాయకులు పెంటయ్యగౌడ్, ప్రభాకర్ పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పుట్టినరోజు నాడే మృత్యుఒడికి..
[ 02-07-2024]
అప్పటి వరకు తమతోనే ఉన్న అమ్మ మృత్యువు ఒడిలోకి జారుకుందని ఆ పసి పిల్లలకేం తెలుసు... విగత జీవిగా పడి ఉన్న తల్లిని చూస్తూ పాలు తాగాలని.. గోరుముద్దలు తినాలని గుక్కపట్టి ఏడుస్తున్న దృశ్యం అక్కడున్న ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టించింది. -
ఆసుపత్రులు కిటకిట
[ 02-07-2024]
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలు, ముసురుతో అంటువ్యాధులు ప్రబలుతున్నాయి. -
విద్యుత్తు అధికారులు రైతులను వేధించొద్దు: మంత్రి కోమటిరెడ్డి
[ 02-07-2024]
విద్యుత్తు శాఖ అధికారులు, సిబ్బంది కొత్త ట్రాన్స్ఫార్మర్లు, లైన్ల మార్పిడి వంటి ప్రతి పనికి¨ రైతుల నుంచి డబ్బులు అడిగినట్లు తమ దృష్టికి వచ్చిందని వాటిని విరమించుకోకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. -
మెరుగైన విద్యుత్తు సరఫరాకు సర్వే
[ 02-07-2024]
పెరుగుతున్న పట్టణీకరణకు అనుగుణంగా వినియోగదారులకు మెరుగైన కరెంటు అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. -
యువతిపై అత్యాచారం.. దోషికి తుదిశ్వాస వరకు కారాగారం
[ 02-07-2024]
ప్రేమ పేరిట మాయ మాటలు చెప్పి ఓ యువతిని అపహరించి, అత్యాచారానికి పాల్పడిన నిందితుడికి న్యాయస్థానం ‘జీవిత కాలం శిక్ష’ (తుది శ్వాస వదిలే వరకు), రూ.21,000 జరిమానా విధించింది. -
నమ్మించి నట్టేట్లో ముంచి..!
[ 02-07-2024]
చిట్టీలు, వడ్డీల పేరిట ఓ వ్యక్తి పలువురిని నమ్మించి రూ.కోట్లు వసూలు చేసి ఉడాయించిన ఘటన హయత్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. -
శిథిల భవనాల్లో పల్లె పాలన
[ 02-07-2024]
పరిపాలన సౌలభ్యం కోసం సర్కారు కొత్తగా గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేసింది. వీటిలో కొన్నింటికి మాత్రమే భవన నిర్మాణానికి కొంత నిధులు మంజూరు చేసి పనులు మొదలుపెట్టారు. -
ఫీజులు నొక్కి.. ఇరుకు గదుల్లో కుక్కి
[ 02-07-2024]
జిల్లాలోని ప్రైవేటు జూనియర్ కళాశాలల్లో విచ్చలవిడిగా ఫీజులు వసూలు చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో తనిఖీ చేయాల్సిన ఇంటర్ విద్యాధికారులు పట్టించుకోకపోవటంతో యాజమాన్యాలు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాయి. -
బిందుసేద్యం విస్తరణకు అడుగులు
[ 02-07-2024]
సాగునీటి సమస్య.. మరోపక్క కూలీల కొరత వెరసి వ్యవసాయం అనుబంధ సాగుకు రైతులు నానా తంటాలు పడుతున్నారు. -
గర్భిణి మృతికి కారణమైన ఆరుగురి అరెస్టు
[ 02-07-2024]
చివ్వెంల మండలం ఎంజీనగర్ తండాకు చెందిన ఎనిమిది నెలల గర్భిణి సుహాసిని మృతి కేసులో ఆరుగురిని సోమవారం అరెస్టు చేసినట్లు ఎస్పీ సన్ప్రీత్ సింగ్ తెలిపారు. -
ఒత్తిడిని జయిద్దాం..హాయిగా జీవిద్దాం
[ 02-07-2024]
ఇటీవలి కాలంలో చిన్నా, పెద్ద తేడా లేకుండా అన్ని వయస్సుల వారిని వేధిస్తున్న ప్రధాన సమస్య ఒత్తిడి. -
ప్రతిభ చూపితే.. భవిత మీదే!
[ 02-07-2024]
మూస విధానంలో చదివితే విద్యార్థులకు ఆయా సబ్జెక్టుల్లో మార్కులు పెరగొచ్చు కానీ.. వారిలోని సృజనాత్మకత వెలుగులోకి రాదు.
తాజా వార్తలు (Latest News)
-
ఆ ఒక్కటీ కొట్టండి.. కోహ్లీకి ఓ బాధ్యత అప్పగించిన ద్రవిడ్
-
‘మై క్వీన్’ విష కౌగిలి.. అడుగడుగునా బాధితులే..
-
తెలంగాణలో వేగంగా మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ల విస్తరణ: మంత్రి శ్రీధర్బాబు
-
ఆమ్రపాలి పగ్గాలు చేపట్టినా.. నిమ్మకు నీరెత్తినట్లే జీహెచ్ఎంసీ అధికారులు!
-
యాప్ ద్వారా పరిచయమై యువతిపై అత్యాచారం.. ఎస్సార్నగర్లో ఘటన
-
విధులు మరిచి ఈల వేసి గోల చేసి.. మందుబాబులతో ఏఎస్సై నిర్వాకం