పదవులన్నీ హస్తగతం
అసెంబ్లీ ఎన్నికల్లో 12 సెగ్మెంట్లలో 11 స్థానాల్లో విజయం.. ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలోని రెండు స్థానాల్లోనూ గెలుపు.
ఈనాడు, నల్గొండ
విజయ కేతనం చూపుతున్న కాంగ్రెస్ డైరెక్టర్లు
అసెంబ్లీ ఎన్నికల్లో 12 సెగ్మెంట్లలో 11 స్థానాల్లో విజయం.. ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలోని రెండు స్థానాల్లోనూ గెలుపు. కానీ కీలకమైన స్థానిక సంస్థల్లో భారాసకు చెందిన నేతలు ఎక్కువగా ఉండటంతో వారిని పార్టీలో చేర్చుకునే విధంగా కాంగ్రెస్ పార్టీ నేతలు పావులు కదుపుతున్నారు. ప్రధానంగా మంత్రులు ఉత్తమ్కుమార్రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి నేతృత్వంలో అసెంబ్లీ ఎన్నికల నాటి నుంచే ఉమ్మడి జిల్లాలోని చాలా మంది జడ్పీటీసీలు, ఎంపీపీలు, పీఏసీఎస్ ఛైర్మన్లు భారాస నుంచి కాంగ్రెస్లో చేరగా.. కొన్ని చోట్ల పార్టీ అధికారంలోకి వచ్చాక అవిశ్వాసం పెట్టి పదవీచ్యుతులను చేశారు. తాజాగా కీలకమైన డీసీసీబీ పీఠాన్ని సైతం కైవసం చేసుకోవడంతో ఉమ్మడి జిల్లాలోని ప్రధాన పదవులన్నీ కాంగ్రెస్ పార్టీ ఆధీనంలోనే ఉన్నట్లైంది. క్షేత్రస్థాయిలో పార్టీకి కీలకమైన సర్పంచి, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు ఒకట్రెండు నెలల్లో జరగనున్న నేపథ్యంలో ఈ పరిణామం పార్టీకి అనుకూలంగా మారుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. సర్పంచి పదవీకాలం ఈ ఏడాది ఫిబ్రవరిలో ముగియగా.. ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యుల పదవీకాలం జులై మొదటివారంలో ముగియనుంది.
స్థానిక ఎన్నికల్లో గెలుపునకు కాంగ్రెస్ పార్టీ రెండంచెల వ్యూహాలను అమలు చేస్తోంది. తొలుత ఇతర పార్టీలో బలమైన నేతలను పార్టీలో చేర్చుకోవడం, ప్రస్తుతం పదవీలో ఉన్న వారిని అవిశ్వాసం ద్వారా పదవీచ్యుతులను చేసేలా ప్రణాళికలు రచిస్తున్నారు. రానున్న ఎన్నికల్లో మూడు జిల్లాల్లోనూ వీలైనన్నీ ఎక్కువగా పురపాలికలతో పాటూ జడ్పీటీసీ, ఎంపీపీ స్థానాలను గెలుచుకోవాలని ఇప్పటికే పార్టీ ఉన్నతస్థాయి నుంచి ఆదేశాలు అందిన నేపథ్యంలో.. ఆ మేరకు క్షేత్రస్థాయి కార్యకర్తలను కార్యోన్ముఖులను చేస్తున్నారు. మరోవైపు పదేళ్లలో పూర్తి చేయలేక, ప్రస్తుతం పెండింగ్లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులతో పాటూ పలు అభివృద్ధి పనులకు భారీగా నిధులు వెచ్చించాలని స్థానిక ఎమ్మెల్యేలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. త్వరలోనే ప్రభుత్వ స్థాయిలో కీలక పదవులు, నామినేటెడ్ పోస్టులను సైతం భర్తీ చేస్తారనే సమాచారంతో క్షేత్రస్థాయిలో ఇతర పార్టీల నేతల నుంచి ఇబ్బందులు లేకుండా సీనియర్ నేతలు, ఆశావహులు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు.
అంతకంతకూ పడిపోతున్న భారాస బలం
పదేళ్ల పాటూ అధికారంలో ఉన్న భారాస బలం ఉమ్మడి జిల్లాలో అంతకంతకూ పడిపోతోంది. ఐదేళ్ల క్రితం జరిగిన సర్పంచి, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో అత్యధికం భారాసనే కైవసం చేసుకుంది. పురపాలిక ఎన్నికల్లోనూ ఉమ్మడి జిల్లాలోని 19 పురపాలికల్లో అన్నింట్లోనూ ఆ పార్టీకి చెందిన ఛైర్మన్లనే పార్టీ నాయకులు గెలపించుకున్నారు. మూడు జిల్లా పరిషత్లను సైతం కైవసం చేసుకుంది. ప్రస్తుతం పరిస్థితి తారుమారైంది. ఉమ్మడి జిల్లాలో కేవలం సూర్యాపేట, నకిరేకల్, పోచంపల్లి, చండూరులో మాత్రమే భారాసకు చెందిన వారు ఛైర్మన్లుగా ఉండగా..మిగతావన్నీ కాంగ్రెస్ ఆధీనంలో ఉన్నాయి. దీంతో రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లోనైనా పట్టు సంపాదించే విధంగా ఇప్పటినుంచే కసరత్తు చేయాల్సి ఉందని నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అమాత్య యోగం ఎవరికో..?
[ 01-07-2024]
లోక్సభ ఎన్నికలు ముగియడంతో అధికార కాంగ్రెస్ పార్టీ పదవుల పందేరంపై దృష్టి సారించింది. ఈనెల తొలి వారంలోనే పలు మంత్రి పదవులను భర్తీ చేస్తామనే సీఎం రేవంత్రెడ్డి వ్యాఖ్యలతో.. ఉమ్మడి జిల్లాలో ఎవరెవరికీ అమాత్యయోగం దక్కనుందనే చర్చ సాగుతోంది. -
నేటి నుంచి అమల్లోకి పోలీస్ కొత్త చట్టాలు
[ 01-07-2024]
దేశవ్యాప్తంగా సోమవారం నుంచి జిల్లాలో పోలీస్ నూతన చట్టాలు అమల్లోకి రానున్నాయి. -
స్పౌజ్ బదిలీల్లో అక్రమాలు
[ 01-07-2024]
ఉపాధ్యాయ బదిలీల్లో అక్రమాలు చోటు చేసుకున్నాయి. బదిలీలు పారదర్శకంగా చేపడుతున్నామని జిల్లా విద్యాశాఖ అధికారులు చెబుతున్నా తప్పులు బయటపడుతూనే ఉన్నాయి. -
పేదింటి వైద్యులు.. ఉచితంగా సేవలు
[ 01-07-2024]
కనీస వసతుల్లేని మారుమూల గ్రామాల్లో పుట్టి పెరిగినా.. తల్లిదండ్రుల, సోదరుల రెక్కల కష్టంతోనే వైద్య విద్యనభ్యసించి ప్రభుత్వ ఆసుపత్రుల్లో కొలువులు సాధించారు. అతి సామాన్యులకు ఉచితంగా వైద్య సేవలందిస్తున్నారు. -
కృషి ఫలించె.. పురస్కారాలు వరించె
[ 01-07-2024]
రసాయన ఎరువులు, పురుగు మందులకు దూరంగా.. సేంద్రియ పద్ధతిలో మొక్కలు పెంచుతూ.. అనేక రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్నారు.. భువనగిరికి చెందిన జిట్టా జ్యోతిరెడ్డి. -
గ్యాస్ లీక్.. ముగ్గురికి అస్వస్థత
[ 01-07-2024]
రసాయన పరిశ్రమలో గ్యాస్ లీకై ముగ్గురు కార్మికులు అస్వస్థతకు గురైన ఘటన పట్టణ కేంద్రంలోని నారాయణగిరిలోని సాయితేజ డ్రగ్స్ పరిశ్రమలో ఆదివారం చోటుచేసుకుంది. -
చరవాణితో.. జర భద్రం
[ 01-07-2024]
ఒకప్పుడు పుస్తకం హస్త భూషణం.. ఖరీదైన చేతి గడియారం దర్పానికి ప్రతీక.. ఇప్పుడు ఆ స్థానాన్ని చరవాణి ఆక్రమించింది. ఖరీదైన స్మార్ట్ఫోన్.. పేరున్న బ్రాండ్.. ఏ ఇద్దరు మాట్లాడుకున్నా ఇదే. -
నేటి నుంచి పన్నులపై వడ్డీంపు
[ 01-07-2024]
పురపాలికల్లో పన్నులను పూర్తిస్థాయిలో వసూలు చేసేందుకు అధికారులు కార్యాచరణ రూపొందించారు. 2024-25 సంవత్సరాన్ని రెండు విడతలుగా విభజించి పన్నులు వసూలు చేస్తున్నారు. -
మత్తు వదలరా..!
[ 01-07-2024]
కన్న తల్లిదండ్రులకు, పుట్టిన గడ్డకు పేరు ప్రతిష్ఠలు తీసుకురావాలనే ఉద్దేశంతో కొంత మంది యువకులు పోటీ ప్రపంచంలో నిత్యం శ్రమిస్తున్నారు. మరి కొంతమంది మత్తుకు బానిసై పక్కదారి పడుతున్నారు. -
చెప్పిందే ధర..!
[ 01-07-2024]
సూర్యాపేట కూరగాయల మార్కెట్లో వ్యాపారులు చెప్పిన ధరకే వినియోగదారులు కొనాల్సిన పరిస్థితి నెలకొంది. అధికారులు నిర్ణయించిన ధరకు విక్రయించకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. -
పక్కాగా పంటల నమోదు
[ 01-07-2024]
ఉమ్మడి జిల్లాలో వానాకాలం పంటల నమోదు ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది. క్షేత్రస్థాయిలో మండల వ్యవసాయ అధికారులు, సిబ్బంది నేరుగా పంట పొలాలకు వద్దకు వెళ్లి సాగు వివరాలను ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. -
సీఎంఆర్ బకాయిల వసూలుకు.. రంగం సిద్ధం
[ 01-07-2024]
సీఎంఆర్ బకాయిల వసూలుకు ఆర్ఆర్ యాక్టు (రెవెన్యూ రికవరీ చట్టం) అమలు చేసేందుకు అధికారులు సిద్ధం అవుతున్నారు. ఇప్పటి వరకు మిల్లర్లు కోర్టును ఆశ్రయించి అధికారులను ముప్పుతిప్పలు పెట్టవచ్చు అనుకున్నారు. -
శ్రీస్వామి నిలయంలో దైవారాధనలు
[ 01-07-2024]
యాదాద్రి పుణ్యక్షేత్రంలో ఆదివారం భక్తజనుల ఆర్జిత కైంకర్యాలతో ఆధ్యాత్మిక కోలాహలం నెలకొంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు దైవ దర్శనం కోసం బారులు తీరారు. -
మీ-సేవలో.. అక్రమాలకు చెక్
[ 01-07-2024]
వినియోగదారులకు సులభంగా.. వేగంగా సేవలు అందించాలనే ఉద్దేశంతో అప్పట్లో ప్రభుత్వం మీ-సేవ కేంద్రాల వ్యవస్థను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. గతంలో ప్రభుత్వ కార్యాలయాల్లో ఆయా ధ్రువపత్రాలు, ఇతర అవసరాలకు రైతులు, విద్యార్థులు రాతపూర్వక దరఖాస్తు చేసుకునే వారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
విజయవాడ హైవేపై ఎన్హెచ్ఏఐ టోల్ వసూళ్లు.. ఏడాది ముందే వైదొలిగిన జీఎమ్మార్
-
ప్రజల జీవితాల్లో వెలుగులు నింపడమే నిజమైన సంక్షేమం: సీఎం చంద్రబాబు
-
ధరణి లాగిన్.. డిప్యూటీ తహసీల్దార్లకు!
-
ఈ అయిదు ప్రశ్నలు వేసుకోకుండా ‘షేర్’ చేయొద్దు: ఐక్యరాజ్య సమితి
-
నేడు ఏపీ టెట్ నోటిఫికేషన్
-
మట్టిమిద్దె కూలి ఒకే కుటుంబంలో నలుగురి మృతి