చరవాణితో..హాని..!
జిల్లాలో కొందరు బాలికలు పోకిరీల మాయమాటలు నమ్మి..ప్రేమ పేరుతో గడప దాటుతున్నారు. నిజాన్ని గుర్తించే లోపు జరగాల్సిన నష్టం జరిగిపోతోంది.
కౌన్సెలింగ్ కేంద్రాలకు రెండేళ్లలో 194 ఫిర్యాదులు
నార్కట్పల్లి మండలంలోని ఓ గ్రామానికి చెందిన ఇంటర్ చదువుతున్న 16 ఏళ్ల బాలిక.. అదే ప్రాంతానికి చెందిన ఓ ఆటో డ్రైవర్ (22)తో ప్రేమలో పడింది. గ్రహించిన తల్లిదండ్రుల ఫిర్యాదుతో భరోసా కేంద్రం నుంచి బాల సదన్కు తరలించారు. తీసుకున్న కౌన్సెలింగ్ ద్వారా బాలిక తిరిగి తల్లిదండ్రుల చెంతకు చేరింది.
జిల్లా కేంద్రానికి చెందిన ఓ చిన్నారి హైదరాబాద్లోని ఓ కార్పొరేట్ పాఠశాలలో 9వ తరగతి చదువుతోంది. చరవాణి ద్వారా అదే ప్రాంతానికి చెందిన ఓ యువకుడు పరిచయం కావడంతో తప్పుదారి పట్టింది. సఖీ కేంద్రం ద్వారా కౌన్సెలింగ్ ఇవ్వడంతో బాలికలో మార్పు వచ్చి తిరిగి పాఠశాలకు వెళ్తోంది.
నల్గొండ అర్బన్, న్యూస్టుడే: జిల్లాలో కొందరు బాలికలు పోకిరీల మాయమాటలు నమ్మి..ప్రేమ పేరుతో గడప దాటుతున్నారు. నిజాన్ని గుర్తించే లోపు జరగాల్సిన నష్టం జరిగిపోతోంది. భరోసా, సఖీ కేంద్రాలతో పాటు బాలసదన్ వంటి కేంద్రాలు స్పందించి కొంత మందికి మరో జీవితాన్ని ఇస్తున్నా.. మరి కొందరు ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. ఉమ్మడి కుటుంబాలు మాయం కావడం, ఇంట్లో నానమ్మ, అమ్మమ్మ వంటి పెద్దలు లేకపోవడం, చరవాణి వినియోగాలు పెరగడం.. కారణం ఏదైనా ఇటీవలి కాలంలో కొంతమంది బాలికలు అదుపు తప్పుతున్నారు.వివిధ కౌన్సెలింగ్ కేంద్రాల్లో గడిచిన రెండేళ్లలో 194 మంది కౌన్సెలింగ్ పొందారు. ఇవి కాకుండా స్థానిక పోలీస్స్టేషన్లు, పెద్దల సమక్షంలో రాజీలు కుదుర్చుకునే వారి సంఖ్య కూడా పెద్ద మొత్తంలోనే ఉంటుంది. నిర్భయ, పోక్సో లాంటి చట్టాలు వస్తున్నా.. మాయగాళ్లలో మార్పు రావడం లేదు.
ఆ వయసులో జాగ్రత్తలు అవసరం
డా.శివరామకృష్ణ, మానసిక వైద్యుడు, నల్గొండ
చిన్న వయసులో కలిగేది ప్రేమ కాదు ఆకర్షణ మాత్రమే. పాఠశాల వయసులోనే ప్రేమ అంటూ ఇబ్బందులు పడే కొంత మంది బాలికలు తల్లిదండ్రులతో కలిసి తమ వద్దకు కూడా వస్తున్నారు. రాత్రి, పగలు అనే తేడా లేకుండా ఎక్కువ మంది బాలికలు చరవాణులు వినియోగిస్తున్నారు. దీంతో కొంత మంది బాలికలు అశ్లీలం వైపు మొగ్గుచూపి పక్కదారి పడుతున్నారు. పదేళ్ల వయసు నుంచి పిల్లల ప్రవర్తనను తల్లిదండ్రులు జాగ్రత్తగా గమనించాలి. చదువుతో పాటు క్రీడల వైపు వారి దృష్టిని మళ్లించాలి. విద్యా సంస్థల్లోనూ ఖాళీ సమయంలో ఉపాధ్యాయులు అవగాహన కల్పించాలి.
కౌన్సెలింగ్ ఇస్తున్నాం
సక్కుబాయి, పీడీ ఐసీడీఎస్, నల్గొండ
సఖీ, భరోసా, బాలసదన్ కేంద్రాలకు ఏటా 80 నుంచి 100 మంది వరకు బాలికలపై వేధింపులు, ప్రేమ విఫలం వంటి ఫిర్యాదులు వస్తున్నాయి. కేంద్రానికి వచ్చే బాలికలకు కౌన్సెలింగ్ ఇస్తున్నాం. 18 ఏళ్లలోపు వారికి బాల సదన్లో వసతి కల్పిస్తున్నాం. దీంతో కొంత మందిలో మార్పు వచ్చి తల్లిదండ్రుల వద్దకు చేరుతున్నారు. 181 టోల్ ఫ్రీ నెంబర్కు వచ్చే ఫిర్యాదులకు ప్రత్యేక వాహనంలో వారి వద్దకు వెళ్తున్నాం. అవసరమైతే కేంద్రానికి తీసుకొచ్చి వైద్య పరీక్షలు, న్యాయ సలహాలు ఇస్తున్నాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అమాత్య యోగం ఎవరికో..?
[ 01-07-2024]
లోక్సభ ఎన్నికలు ముగియడంతో అధికార కాంగ్రెస్ పార్టీ పదవుల పందేరంపై దృష్టి సారించింది. ఈనెల తొలి వారంలోనే పలు మంత్రి పదవులను భర్తీ చేస్తామనే సీఎం రేవంత్రెడ్డి వ్యాఖ్యలతో.. ఉమ్మడి జిల్లాలో ఎవరెవరికీ అమాత్యయోగం దక్కనుందనే చర్చ సాగుతోంది. -
నేటి నుంచి అమల్లోకి పోలీస్ కొత్త చట్టాలు
[ 01-07-2024]
దేశవ్యాప్తంగా సోమవారం నుంచి జిల్లాలో పోలీస్ నూతన చట్టాలు అమల్లోకి రానున్నాయి. -
స్పౌజ్ బదిలీల్లో అక్రమాలు
[ 01-07-2024]
ఉపాధ్యాయ బదిలీల్లో అక్రమాలు చోటు చేసుకున్నాయి. బదిలీలు పారదర్శకంగా చేపడుతున్నామని జిల్లా విద్యాశాఖ అధికారులు చెబుతున్నా తప్పులు బయటపడుతూనే ఉన్నాయి. -
పేదింటి వైద్యులు.. ఉచితంగా సేవలు
[ 01-07-2024]
కనీస వసతుల్లేని మారుమూల గ్రామాల్లో పుట్టి పెరిగినా.. తల్లిదండ్రుల, సోదరుల రెక్కల కష్టంతోనే వైద్య విద్యనభ్యసించి ప్రభుత్వ ఆసుపత్రుల్లో కొలువులు సాధించారు. అతి సామాన్యులకు ఉచితంగా వైద్య సేవలందిస్తున్నారు. -
కృషి ఫలించె.. పురస్కారాలు వరించె
[ 01-07-2024]
రసాయన ఎరువులు, పురుగు మందులకు దూరంగా.. సేంద్రియ పద్ధతిలో మొక్కలు పెంచుతూ.. అనేక రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్నారు.. భువనగిరికి చెందిన జిట్టా జ్యోతిరెడ్డి. -
గ్యాస్ లీక్.. ముగ్గురికి అస్వస్థత
[ 01-07-2024]
రసాయన పరిశ్రమలో గ్యాస్ లీకై ముగ్గురు కార్మికులు అస్వస్థతకు గురైన ఘటన పట్టణ కేంద్రంలోని నారాయణగిరిలోని సాయితేజ డ్రగ్స్ పరిశ్రమలో ఆదివారం చోటుచేసుకుంది. -
చరవాణితో.. జర భద్రం
[ 01-07-2024]
ఒకప్పుడు పుస్తకం హస్త భూషణం.. ఖరీదైన చేతి గడియారం దర్పానికి ప్రతీక.. ఇప్పుడు ఆ స్థానాన్ని చరవాణి ఆక్రమించింది. ఖరీదైన స్మార్ట్ఫోన్.. పేరున్న బ్రాండ్.. ఏ ఇద్దరు మాట్లాడుకున్నా ఇదే. -
నేటి నుంచి పన్నులపై వడ్డీంపు
[ 01-07-2024]
పురపాలికల్లో పన్నులను పూర్తిస్థాయిలో వసూలు చేసేందుకు అధికారులు కార్యాచరణ రూపొందించారు. 2024-25 సంవత్సరాన్ని రెండు విడతలుగా విభజించి పన్నులు వసూలు చేస్తున్నారు. -
మత్తు వదలరా..!
[ 01-07-2024]
కన్న తల్లిదండ్రులకు, పుట్టిన గడ్డకు పేరు ప్రతిష్ఠలు తీసుకురావాలనే ఉద్దేశంతో కొంత మంది యువకులు పోటీ ప్రపంచంలో నిత్యం శ్రమిస్తున్నారు. మరి కొంతమంది మత్తుకు బానిసై పక్కదారి పడుతున్నారు. -
చెప్పిందే ధర..!
[ 01-07-2024]
సూర్యాపేట కూరగాయల మార్కెట్లో వ్యాపారులు చెప్పిన ధరకే వినియోగదారులు కొనాల్సిన పరిస్థితి నెలకొంది. అధికారులు నిర్ణయించిన ధరకు విక్రయించకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. -
పక్కాగా పంటల నమోదు
[ 01-07-2024]
ఉమ్మడి జిల్లాలో వానాకాలం పంటల నమోదు ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది. క్షేత్రస్థాయిలో మండల వ్యవసాయ అధికారులు, సిబ్బంది నేరుగా పంట పొలాలకు వద్దకు వెళ్లి సాగు వివరాలను ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. -
సీఎంఆర్ బకాయిల వసూలుకు.. రంగం సిద్ధం
[ 01-07-2024]
సీఎంఆర్ బకాయిల వసూలుకు ఆర్ఆర్ యాక్టు (రెవెన్యూ రికవరీ చట్టం) అమలు చేసేందుకు అధికారులు సిద్ధం అవుతున్నారు. ఇప్పటి వరకు మిల్లర్లు కోర్టును ఆశ్రయించి అధికారులను ముప్పుతిప్పలు పెట్టవచ్చు అనుకున్నారు. -
శ్రీస్వామి నిలయంలో దైవారాధనలు
[ 01-07-2024]
యాదాద్రి పుణ్యక్షేత్రంలో ఆదివారం భక్తజనుల ఆర్జిత కైంకర్యాలతో ఆధ్యాత్మిక కోలాహలం నెలకొంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు దైవ దర్శనం కోసం బారులు తీరారు. -
మీ-సేవలో.. అక్రమాలకు చెక్
[ 01-07-2024]
వినియోగదారులకు సులభంగా.. వేగంగా సేవలు అందించాలనే ఉద్దేశంతో అప్పట్లో ప్రభుత్వం మీ-సేవ కేంద్రాల వ్యవస్థను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. గతంలో ప్రభుత్వ కార్యాలయాల్లో ఆయా ధ్రువపత్రాలు, ఇతర అవసరాలకు రైతులు, విద్యార్థులు రాతపూర్వక దరఖాస్తు చేసుకునే వారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
‘కల్కి’లాంటి సినిమాలు చాలా అరుదు.. ఆడియన్స్కు థ్యాంక్స్ చెప్పిన నాగ్ అశ్విన్
-
నీట్ రీ-టెస్ట్ ఫలితాలు విడుదల.. మారిన ర్యాంకుల జాబితా
-
కేసీఆర్కు హైకోర్టులో చుక్కెదురు
-
దిగొచ్చిన వాణిజ్య సిలిండర్ ధర.. రూ.32 తగ్గింపు
-
మొరాయించిన శ్రీశైలం దేవస్థానం వెబ్సైట్.. నిలిచిన ఆన్లైన్ టికెట్ల జారీ
-
రో.. ఈ వీడ్కోలు బాధగా ఉంది: రితికా సజ్దే ఎమోషనల్ పోస్ట్