ఉన్నత విద్యా వేదిక..!
ఒకప్పుడు ఆరు కోర్సులతో ప్రారంభమైన విశ్వవిద్యాలయం అది. ఇప్పుడు 22 కోర్సులతో..రెండు వేల మంది విద్యార్థులతో కళకళలాడుతోంది.
మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయంలో ప్రవేశాలకు వేళాయె
నల్గొండ టౌన్, న్యూస్టుడే
ఎంజీయూలో సైన్స్ ల్యాబ్లో ప్రయోగాలు చేస్తున్న విద్యార్థులు
ఒకప్పుడు ఆరు కోర్సులతో ప్రారంభమైన విశ్వవిద్యాలయం అది. ఇప్పుడు 22 కోర్సులతో..రెండు వేల మంది విద్యార్థులతో కళకళలాడుతోంది. భిన్న బోధన పద్ధతులు, మెరుగైన వసతులతో పేద, మధ్య తరగతి విద్యార్థులకు దిక్చూచిలా..వారి ఉజ్వల భవితకు పునాదిలా మారింది. అదే నల్గొండ జిల్లా కేంద్రం సమీపంలోని మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం. 2007లో 247 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటైన ఈ వర్సిటీలో ప్రస్తుతం సైన్స్ కళాశాల, ఆర్ట్స్ కళాశాల, కామర్స్ కళాశాలలు కొనసాగుతున్నాయి. సుమారు 1200 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం ఇన్ఛార్జి వీసీగా ఐఏఎస్ అధికారి నవీన్ మిత్తల్, రిజిస్ట్రార్గా ప్రొఫెసర్ అల్వాల రవి వ్యవహరిస్తున్నారు. మూడు స్నాతకోత్సవాలు పూర్తి చేసుకొని..ప్రస్తుతం న్యాక్ బీప్లస్ గ్రేడ్తో కొనసాగుతున్న వర్సిటీ 2024-25 విద్యా సంవత్సరం ప్రవేశాలకు ఆహ్వానం పలుకుతోంది.
బీటెక్, ఎంబీఏ, ఎంసీఏ కోర్సులు సైతం
ఎంజీయూలో అదనంగా బీటెక్, ఎంబీఏ, ఎంబీఏ టీటీఎం, ఎంసీఏ కోర్సులు సైతం అందుబాటులో ఉన్నాయి. బీటెక్లో ఈసీఈ 60, ఈఈఈ 60, సీఎస్ఈలో 120, ఎంబీఏలో 60, ఎంబీఏ టీటీఎంలో 60, ఎంసీఏలో 60 సీట్లు ఉన్నాయి.
సీపీగెట్, ఎఫ్సెట్, ఐసెట్ ద్వారా ప్రవేశాలు
ఎంజీయూలో ఆయా కోర్సుల్లో ప్రవేశాలు పొందాలనుకునే విద్యార్థులు సీపీగెట్, ఎఫ్సెట్, ఐసెట్ ప్రవేశ పరీక్షలు రాయాలి. ఫలితాల అనంతరం జరిగే కౌన్సెలింగ్లో వర్సిటీని ఎంచుకుంటే అందులో ప్రతిభను బట్టి వర్సిటీలోని కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఈ ప్రక్రియ త్వరలోనే ప్రారంభం కానుంది.
వర్సిటీలో అందుబాటులో సకల సౌకర్యాలు
వర్సిటీలో విశాలమైన గ్రంథాలయం, సౌకర్యవంతమైన బాలుర, బాలికల హాస్టల్స్, ఆర్ట్స్ కళాశాలకు, సైన్స్ కళాశాలకు, ఇంజినీరింగ్ కళాశాలలకు ప్రత్యేకమైన భవనాలు, ఆధునాతన ప్రయోగశాలలు, సెమినార్ హాల్, స్పోర్ట్స్ కాంప్లెక్స్, ఎన్ఎస్ఎస్ విభాగాలు, పరీక్షల విభాగానికి ప్రత్యేకమైన భవనం, ఆయా క్రీడల మైదానాలు, శుద్ధజలం, క్యాంటీన్, చక్కటి అంతర్గత రహదారులు, స్టాప్, వీసీ క్వార్టర్స్, ప్లేస్మెంట్ సెల్, ర్యాంగింగ్ సెల్, ఐలాండ్ పార్కు, పరిపాలన భవనంలో లిప్ట్ సౌకర్యం ఇలా ఎన్నో సదుపాయాలు ఉన్నాయి.
వర్సిటీలో మెరుగైన విద్య
నిరుపేద, మధ్యతరగతి విద్యార్థులు ఉన్నత విద్యా పూర్తిచేసేందుకు మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం చక్కటి వేదిక. ఇక్కడ విద్యార్థులకు కావాల్సిన సకల సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. వర్సిటీలో ఆయా కోర్సులు పూర్తిచేసే విద్యార్థులు ఆయా శాఖల్లో ప్రభుత్వ కొలువులతో పాటు వివిధ సంస్థల్లో స్థిరపడుతున్నారు. మెరుగైన విద్యనందిస్తున్న ఈ వర్సిటీలో చదివేందుకు విద్యార్థులు ఆసక్తి చూపాలి.
మారం వెంకటరమణారెడ్డి, ఎంజీయూ యూసీసీ,బీఎం ప్రిన్సిపల్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అమాత్య యోగం ఎవరికో..?
[ 01-07-2024]
లోక్సభ ఎన్నికలు ముగియడంతో అధికార కాంగ్రెస్ పార్టీ పదవుల పందేరంపై దృష్టి సారించింది. ఈనెల తొలి వారంలోనే పలు మంత్రి పదవులను భర్తీ చేస్తామనే సీఎం రేవంత్రెడ్డి వ్యాఖ్యలతో.. ఉమ్మడి జిల్లాలో ఎవరెవరికీ అమాత్యయోగం దక్కనుందనే చర్చ సాగుతోంది. -
నేటి నుంచి అమల్లోకి పోలీస్ కొత్త చట్టాలు
[ 01-07-2024]
దేశవ్యాప్తంగా సోమవారం నుంచి జిల్లాలో పోలీస్ నూతన చట్టాలు అమల్లోకి రానున్నాయి. -
స్పౌజ్ బదిలీల్లో అక్రమాలు
[ 01-07-2024]
ఉపాధ్యాయ బదిలీల్లో అక్రమాలు చోటు చేసుకున్నాయి. బదిలీలు పారదర్శకంగా చేపడుతున్నామని జిల్లా విద్యాశాఖ అధికారులు చెబుతున్నా తప్పులు బయటపడుతూనే ఉన్నాయి. -
పేదింటి వైద్యులు.. ఉచితంగా సేవలు
[ 01-07-2024]
కనీస వసతుల్లేని మారుమూల గ్రామాల్లో పుట్టి పెరిగినా.. తల్లిదండ్రుల, సోదరుల రెక్కల కష్టంతోనే వైద్య విద్యనభ్యసించి ప్రభుత్వ ఆసుపత్రుల్లో కొలువులు సాధించారు. అతి సామాన్యులకు ఉచితంగా వైద్య సేవలందిస్తున్నారు. -
కృషి ఫలించె.. పురస్కారాలు వరించె
[ 01-07-2024]
రసాయన ఎరువులు, పురుగు మందులకు దూరంగా.. సేంద్రియ పద్ధతిలో మొక్కలు పెంచుతూ.. అనేక రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్నారు.. భువనగిరికి చెందిన జిట్టా జ్యోతిరెడ్డి. -
గ్యాస్ లీక్.. ముగ్గురికి అస్వస్థత
[ 01-07-2024]
రసాయన పరిశ్రమలో గ్యాస్ లీకై ముగ్గురు కార్మికులు అస్వస్థతకు గురైన ఘటన పట్టణ కేంద్రంలోని నారాయణగిరిలోని సాయితేజ డ్రగ్స్ పరిశ్రమలో ఆదివారం చోటుచేసుకుంది. -
చరవాణితో.. జర భద్రం
[ 01-07-2024]
ఒకప్పుడు పుస్తకం హస్త భూషణం.. ఖరీదైన చేతి గడియారం దర్పానికి ప్రతీక.. ఇప్పుడు ఆ స్థానాన్ని చరవాణి ఆక్రమించింది. ఖరీదైన స్మార్ట్ఫోన్.. పేరున్న బ్రాండ్.. ఏ ఇద్దరు మాట్లాడుకున్నా ఇదే. -
నేటి నుంచి పన్నులపై వడ్డీంపు
[ 01-07-2024]
పురపాలికల్లో పన్నులను పూర్తిస్థాయిలో వసూలు చేసేందుకు అధికారులు కార్యాచరణ రూపొందించారు. 2024-25 సంవత్సరాన్ని రెండు విడతలుగా విభజించి పన్నులు వసూలు చేస్తున్నారు. -
మత్తు వదలరా..!
[ 01-07-2024]
కన్న తల్లిదండ్రులకు, పుట్టిన గడ్డకు పేరు ప్రతిష్ఠలు తీసుకురావాలనే ఉద్దేశంతో కొంత మంది యువకులు పోటీ ప్రపంచంలో నిత్యం శ్రమిస్తున్నారు. మరి కొంతమంది మత్తుకు బానిసై పక్కదారి పడుతున్నారు. -
చెప్పిందే ధర..!
[ 01-07-2024]
సూర్యాపేట కూరగాయల మార్కెట్లో వ్యాపారులు చెప్పిన ధరకే వినియోగదారులు కొనాల్సిన పరిస్థితి నెలకొంది. అధికారులు నిర్ణయించిన ధరకు విక్రయించకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. -
పక్కాగా పంటల నమోదు
[ 01-07-2024]
ఉమ్మడి జిల్లాలో వానాకాలం పంటల నమోదు ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది. క్షేత్రస్థాయిలో మండల వ్యవసాయ అధికారులు, సిబ్బంది నేరుగా పంట పొలాలకు వద్దకు వెళ్లి సాగు వివరాలను ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. -
సీఎంఆర్ బకాయిల వసూలుకు.. రంగం సిద్ధం
[ 01-07-2024]
సీఎంఆర్ బకాయిల వసూలుకు ఆర్ఆర్ యాక్టు (రెవెన్యూ రికవరీ చట్టం) అమలు చేసేందుకు అధికారులు సిద్ధం అవుతున్నారు. ఇప్పటి వరకు మిల్లర్లు కోర్టును ఆశ్రయించి అధికారులను ముప్పుతిప్పలు పెట్టవచ్చు అనుకున్నారు. -
శ్రీస్వామి నిలయంలో దైవారాధనలు
[ 01-07-2024]
యాదాద్రి పుణ్యక్షేత్రంలో ఆదివారం భక్తజనుల ఆర్జిత కైంకర్యాలతో ఆధ్యాత్మిక కోలాహలం నెలకొంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు దైవ దర్శనం కోసం బారులు తీరారు. -
మీ-సేవలో.. అక్రమాలకు చెక్
[ 01-07-2024]
వినియోగదారులకు సులభంగా.. వేగంగా సేవలు అందించాలనే ఉద్దేశంతో అప్పట్లో ప్రభుత్వం మీ-సేవ కేంద్రాల వ్యవస్థను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. గతంలో ప్రభుత్వ కార్యాలయాల్లో ఆయా ధ్రువపత్రాలు, ఇతర అవసరాలకు రైతులు, విద్యార్థులు రాతపూర్వక దరఖాస్తు చేసుకునే వారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
కృష్ణా జలాల్లో కొత్త ద్వీపం.. అందం అదరహో..!
-
ఎంపీ లాడ్స్ ఆన్లైన్లో!
-
ఆస్తి తగాదాలు.. తల్లీబిడ్డలను గదిలో బంధించి గోడ కట్టేశారు!
-
చదువుతూ సాగిపోదాం.. బస్సులో!
-
విజయవాడ హైవేపై ఎన్హెచ్ఏఐ టోల్ వసూళ్లు.. ఏడాది ముందే వైదొలిగిన జీఎమ్మార్
-
ప్రజల జీవితాల్లో వెలుగులు నింపడమే నిజమైన సంక్షేమం: సీఎం చంద్రబాబు