చేనేత కళాకారులకు అవార్డులు
తెలంగాణ హస్తకళలకు పుట్టినిల్లు. సింధు నాగరికత కాలం నుంచి కళలు వర్థిల్లినట్టు చారిత్రక ఆధారాలున్నాయి. రాజుల కాలంలో కళాకారులకు ఆదరణ లభించేది. వారి కళానైపుణ్యాన్ని ప్రోత్సహించేవారు.
జులై 10 వరకు దరఖాస్తులకు అవకాశం
చౌటుప్పల్, న్యూస్టుడే
చేనేత వస్త్రం (పాత చిత్రం)
తెలంగాణ హస్తకళలకు పుట్టినిల్లు. సింధు నాగరికత కాలం నుంచి కళలు వర్థిల్లినట్టు చారిత్రక ఆధారాలున్నాయి. రాజుల కాలంలో కళాకారులకు ఆదరణ లభించేది. వారి కళానైపుణ్యాన్ని ప్రోత్సహించేవారు. ఉపాధి కల్పించేవారు. అద్భుతమైన కళాకారులను గుర్తించి నజరానాలిచ్చేవారు. రాచకొండ రాజధానిగా పాలించిన రేచర్ల పద్మనాయకుల పాలనలోనూ రాజాస్థానంలో కళాకారులను ఆదరించారు. గోలకొండను ఏలిన రాజులూ కళలను ప్రోత్సహించారు. నైజాం పాలనలో యాదాద్రి భువనగిరి జిల్లాలోని చేనేత కళాకారులు మగ్గాలపై నేసే రుమాళ్లను వ్యాపారులు కొనుగోలు చేసి అరబ్ దేశాలకు ఎగుమతి చేసేవారు. ఆంగ్లేయుల పాలనలో ఇక్కడి భారతీయ వస్త్ర పరిశ్రమను దెబ్బతీసి విదేశీ వస్త్రాలను దిగుమతి చేయడంతో చేనేత కళాకారుల ఉపాధికి గండి పడింది. దేశ స్వాతంత్య్ర ఉద్యమంలో రాట్నం జాతీయ చిహ్నంగా మారింది. విదేశీ వస్త్రాలను బహిష్కరించి ఖద్దరు ధరించారు. స్వాతంత్య్రానంతరం ఉమ్మడి నల్గొండ జిల్లాలో చేనేత కళాకారులకు ప్రత్యేకంగా శిక్షణనిప్పించి ‘ఇక్కత్’ డిజైన్లతో వస్త్రాలు తయారు చేయించడంతో ఈ ప్రాంతానికి దేశవ్యాప్తంగా గుర్తింపు లభించింది. ఇక్కడి కళాకారులు తమ సృజనాత్మకతతో వినూత్న వస్త్రాలకు రూపకల్పన చేసి జాతీయ స్థాయిలో పురస్కారాలు సాధించి చేనేత కీర్తిని పెంచారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక చేనేత కళాకారులను గుర్తించి 2018లో ‘కొండా లక్ష్మణ్ బాపూజీ’ పేరిట రాష్ట్ర స్థాయి పురస్కారాలను ప్రవేశపెట్టారు. ఎంపికైన కళాకారులకు రాష్ట్ర ప్రభుత్వం ఈయేడు ఆగస్టు 7న జాతీయ చేనేత దినోత్సవంలో అయిదు విభాగాల్లో మగ్గం నేసే కళాకారులకు, డిజైనర్లకు 30 అవార్డులు ప్రదానం చేయనున్నారు. పురస్కార గ్రహీతలకు రూ.25వేల నగదు, శాలువా, జ్ఞాపిక, మెరిట్ సర్టిఫికెట్ అందజేసి సన్మానిస్తారు.
అర్హతలు
- చేనేత కళాకారులు 2023 డిసెంబరు 31 నాటికి 30 ఏళ్ల వయసు నిండాలి. చేనేత రంగంలో పదేళ్ల అనుభవం ఉండాలి.
- చేనేత డిజైనర్లు 25 ఏళ్ల వయసు నిండి ఉండాలి. చేనేత రంగంలో కనీసం అయిదేళ్ల అనుభవం ఉండాలి.
- అర్హతలున్నవారు తమ నైపుణ్యాన్ని చాటే నమూనాలను చేనేత, జౌళి శాఖ ఏడీకి జూలై పదో తేదీలోగా అందజేయాలి.
- పూర్తి వివరాలకు చేనేత, జౌళి శాఖ యాదాద్రి జిల్లా ఏడీ చరవాణి: 98493 91548, నల్గొండ ఏడీ చరవాణి: 99121 83164 లను సంప్రదించవచ్చు.
అయిదు విభాగాల్లో అవార్డులు
1. పొచంపల్లి ఇక్కత్
2. గద్వాల చీరలు
3. నారాయణపేట చీరలు
4. డర్రీలు
5. సాధారణ రకాలు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అమాత్య యోగం ఎవరికో..?
[ 01-07-2024]
లోక్సభ ఎన్నికలు ముగియడంతో అధికార కాంగ్రెస్ పార్టీ పదవుల పందేరంపై దృష్టి సారించింది. ఈనెల తొలి వారంలోనే పలు మంత్రి పదవులను భర్తీ చేస్తామనే సీఎం రేవంత్రెడ్డి వ్యాఖ్యలతో.. ఉమ్మడి జిల్లాలో ఎవరెవరికీ అమాత్యయోగం దక్కనుందనే చర్చ సాగుతోంది. -
నేటి నుంచి అమల్లోకి పోలీస్ కొత్త చట్టాలు
[ 01-07-2024]
దేశవ్యాప్తంగా సోమవారం నుంచి జిల్లాలో పోలీస్ నూతన చట్టాలు అమల్లోకి రానున్నాయి. -
స్పౌజ్ బదిలీల్లో అక్రమాలు
[ 01-07-2024]
ఉపాధ్యాయ బదిలీల్లో అక్రమాలు చోటు చేసుకున్నాయి. బదిలీలు పారదర్శకంగా చేపడుతున్నామని జిల్లా విద్యాశాఖ అధికారులు చెబుతున్నా తప్పులు బయటపడుతూనే ఉన్నాయి. -
పేదింటి వైద్యులు.. ఉచితంగా సేవలు
[ 01-07-2024]
కనీస వసతుల్లేని మారుమూల గ్రామాల్లో పుట్టి పెరిగినా.. తల్లిదండ్రుల, సోదరుల రెక్కల కష్టంతోనే వైద్య విద్యనభ్యసించి ప్రభుత్వ ఆసుపత్రుల్లో కొలువులు సాధించారు. అతి సామాన్యులకు ఉచితంగా వైద్య సేవలందిస్తున్నారు. -
కృషి ఫలించె.. పురస్కారాలు వరించె
[ 01-07-2024]
రసాయన ఎరువులు, పురుగు మందులకు దూరంగా.. సేంద్రియ పద్ధతిలో మొక్కలు పెంచుతూ.. అనేక రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్నారు.. భువనగిరికి చెందిన జిట్టా జ్యోతిరెడ్డి. -
గ్యాస్ లీక్.. ముగ్గురికి అస్వస్థత
[ 01-07-2024]
రసాయన పరిశ్రమలో గ్యాస్ లీకై ముగ్గురు కార్మికులు అస్వస్థతకు గురైన ఘటన పట్టణ కేంద్రంలోని నారాయణగిరిలోని సాయితేజ డ్రగ్స్ పరిశ్రమలో ఆదివారం చోటుచేసుకుంది. -
చరవాణితో.. జర భద్రం
[ 01-07-2024]
ఒకప్పుడు పుస్తకం హస్త భూషణం.. ఖరీదైన చేతి గడియారం దర్పానికి ప్రతీక.. ఇప్పుడు ఆ స్థానాన్ని చరవాణి ఆక్రమించింది. ఖరీదైన స్మార్ట్ఫోన్.. పేరున్న బ్రాండ్.. ఏ ఇద్దరు మాట్లాడుకున్నా ఇదే. -
నేటి నుంచి పన్నులపై వడ్డీంపు
[ 01-07-2024]
పురపాలికల్లో పన్నులను పూర్తిస్థాయిలో వసూలు చేసేందుకు అధికారులు కార్యాచరణ రూపొందించారు. 2024-25 సంవత్సరాన్ని రెండు విడతలుగా విభజించి పన్నులు వసూలు చేస్తున్నారు. -
మత్తు వదలరా..!
[ 01-07-2024]
కన్న తల్లిదండ్రులకు, పుట్టిన గడ్డకు పేరు ప్రతిష్ఠలు తీసుకురావాలనే ఉద్దేశంతో కొంత మంది యువకులు పోటీ ప్రపంచంలో నిత్యం శ్రమిస్తున్నారు. మరి కొంతమంది మత్తుకు బానిసై పక్కదారి పడుతున్నారు. -
చెప్పిందే ధర..!
[ 01-07-2024]
సూర్యాపేట కూరగాయల మార్కెట్లో వ్యాపారులు చెప్పిన ధరకే వినియోగదారులు కొనాల్సిన పరిస్థితి నెలకొంది. అధికారులు నిర్ణయించిన ధరకు విక్రయించకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. -
పక్కాగా పంటల నమోదు
[ 01-07-2024]
ఉమ్మడి జిల్లాలో వానాకాలం పంటల నమోదు ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది. క్షేత్రస్థాయిలో మండల వ్యవసాయ అధికారులు, సిబ్బంది నేరుగా పంట పొలాలకు వద్దకు వెళ్లి సాగు వివరాలను ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. -
సీఎంఆర్ బకాయిల వసూలుకు.. రంగం సిద్ధం
[ 01-07-2024]
సీఎంఆర్ బకాయిల వసూలుకు ఆర్ఆర్ యాక్టు (రెవెన్యూ రికవరీ చట్టం) అమలు చేసేందుకు అధికారులు సిద్ధం అవుతున్నారు. ఇప్పటి వరకు మిల్లర్లు కోర్టును ఆశ్రయించి అధికారులను ముప్పుతిప్పలు పెట్టవచ్చు అనుకున్నారు. -
శ్రీస్వామి నిలయంలో దైవారాధనలు
[ 01-07-2024]
యాదాద్రి పుణ్యక్షేత్రంలో ఆదివారం భక్తజనుల ఆర్జిత కైంకర్యాలతో ఆధ్యాత్మిక కోలాహలం నెలకొంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు దైవ దర్శనం కోసం బారులు తీరారు. -
మీ-సేవలో.. అక్రమాలకు చెక్
[ 01-07-2024]
వినియోగదారులకు సులభంగా.. వేగంగా సేవలు అందించాలనే ఉద్దేశంతో అప్పట్లో ప్రభుత్వం మీ-సేవ కేంద్రాల వ్యవస్థను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. గతంలో ప్రభుత్వ కార్యాలయాల్లో ఆయా ధ్రువపత్రాలు, ఇతర అవసరాలకు రైతులు, విద్యార్థులు రాతపూర్వక దరఖాస్తు చేసుకునే వారు.