విద్యుత్తు సమస్యలకు సర్వేతో చెక్
జిల్లాలోని విద్యుత్తు సిబ్బంది 11కేవీ ఫీడర్ల సమగ్ర సర్వే చేపడుతున్నారు. సూర్యాపేట, హుజూర్నగర్ డివిజన్లో సోమవారం నుంచి ప్రారంభమైంది.
పురపాలికలు, మండల కేంద్రాల్లో ఫీడర్ల పరిశీలన
సూర్యాపేటలోని ఫీడర్ల సర్వేకు ముందు సిబ్బందికి సూచనలు ఇస్తున్న ఎస్ఈ పాల్రాజ్
భానుపురి, తిరుమలగిరి, న్యూస్టుడే: జిల్లాలోని విద్యుత్తు సిబ్బంది 11కేవీ ఫీడర్ల సమగ్ర సర్వే చేపడుతున్నారు. సూర్యాపేట, హుజూర్నగర్ డివిజన్లో సోమవారం నుంచి ప్రారంభమైంది. జిల్లాలోని ఐదు పురపాలికలు, 23 మండల కేంద్రాల్లో వారం పాటు డీఈలు, ఏఈల ఆధ్వర్యంలో సిబ్బంది పర్యటించి సర్వే చేపట్టనున్నారు. వీరు ప్రతి వార్డులో తిరిగి విద్యుత్తు ఫీడర్లను పరిశీలిస్తారు. ఇందుకు విద్యుత్తు శాఖ ఉన్నతాధికారులు ప్రత్యేకంగా టీజీఏఐఎంఎస్ యాప్ రూపొందించారు. సిబ్బంది సర్వే చేసిన ప్రాంతాల్లో ఫీడర్లలో ఏమైనా సమస్యలుంటే ఈ యాప్లో నమోదు చేస్తారు.
యాప్లో నమోదు ఇలా..
సర్వే వివరాల నమోదుకు విద్యుత్తు పంపిణీ సంస్థ టీజీఏఐఎంఎస్ యాప్ రూపొందించింది. సిబ్బంది పురపాలికలు, మండల కేంద్రాల్లో ఫీడరు సమస్యను ఈ యాప్లో నమోదు చేస్తే గూగుల్ మ్యాప్ తరహాలో వివరాలు చూపుతుంది. సిబ్బంది బదిలీ అయినా.. సర్వే వివరాలను చూసుకోవచ్చు. విద్యుత్తు శాఖకు సంబంధించిన ఆస్తుల వివరాలనూ చూపుతుంది.
తప్పనున్న వదులు తీగల సమస్య
సూర్యాపేట, కోదాడ, హుజూర్నగర్, నేరేడుచర్ల, తిరుమలగిరి పురపాలికలతోపాటు 23 మండల కేంద్రాల్లో ఫీడర్ సర్వేతో వదులు తీగల(లూజూలైన్ల) సమస్య తప్పనుంది. తీగలు వదులుగా ఉంటే గాలిదుమారానికి పరస్పరం తాకి తెగిపోయే ప్రమాదం ఉంది. శిథిలావస్థకు చేరిన స్తంభాలు, నియంత్రికలనూ గుర్తించి వాటి స్థానంలో కొత్తవి ఏర్పాటు చేయనున్నారు. ఫీడర్లలో కరెంటు సరఫరా సమస్యలున్నా మరమ్మతు చేపడతారు.
వారం పాటు సర్వే
జిల్లాలోని పురపాలికలు, మండల కేంద్రాల్లో వారం పాటు సిబ్బంది ఫీడర్ల సర్వే చేయనున్నారు. ఇందులో లూజులైన్లు, ఫీడర్ల సమస్యలుంటే గుర్తించి మరమ్మతు చేపడతారు. వదులు తీగల కారణంగా విద్యుత్తు సరఫరాలో తలెత్తే ఆటంకాలన్నీ ఈ సర్వే ద్వారా తొలగిపోతాయి.
శ్రీనివాస్, డిస్కం డీఈ, సూర్యాపేట
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అమాత్య యోగం ఎవరికో..?
[ 01-07-2024]
లోక్సభ ఎన్నికలు ముగియడంతో అధికార కాంగ్రెస్ పార్టీ పదవుల పందేరంపై దృష్టి సారించింది. ఈనెల తొలి వారంలోనే పలు మంత్రి పదవులను భర్తీ చేస్తామనే సీఎం రేవంత్రెడ్డి వ్యాఖ్యలతో.. ఉమ్మడి జిల్లాలో ఎవరెవరికీ అమాత్యయోగం దక్కనుందనే చర్చ సాగుతోంది. -
నేటి నుంచి అమల్లోకి పోలీస్ కొత్త చట్టాలు
[ 01-07-2024]
దేశవ్యాప్తంగా సోమవారం నుంచి జిల్లాలో పోలీస్ నూతన చట్టాలు అమల్లోకి రానున్నాయి. -
స్పౌజ్ బదిలీల్లో అక్రమాలు
[ 01-07-2024]
ఉపాధ్యాయ బదిలీల్లో అక్రమాలు చోటు చేసుకున్నాయి. బదిలీలు పారదర్శకంగా చేపడుతున్నామని జిల్లా విద్యాశాఖ అధికారులు చెబుతున్నా తప్పులు బయటపడుతూనే ఉన్నాయి. -
పేదింటి వైద్యులు.. ఉచితంగా సేవలు
[ 01-07-2024]
కనీస వసతుల్లేని మారుమూల గ్రామాల్లో పుట్టి పెరిగినా.. తల్లిదండ్రుల, సోదరుల రెక్కల కష్టంతోనే వైద్య విద్యనభ్యసించి ప్రభుత్వ ఆసుపత్రుల్లో కొలువులు సాధించారు. అతి సామాన్యులకు ఉచితంగా వైద్య సేవలందిస్తున్నారు. -
కృషి ఫలించె.. పురస్కారాలు వరించె
[ 01-07-2024]
రసాయన ఎరువులు, పురుగు మందులకు దూరంగా.. సేంద్రియ పద్ధతిలో మొక్కలు పెంచుతూ.. అనేక రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్నారు.. భువనగిరికి చెందిన జిట్టా జ్యోతిరెడ్డి. -
గ్యాస్ లీక్.. ముగ్గురికి అస్వస్థత
[ 01-07-2024]
రసాయన పరిశ్రమలో గ్యాస్ లీకై ముగ్గురు కార్మికులు అస్వస్థతకు గురైన ఘటన పట్టణ కేంద్రంలోని నారాయణగిరిలోని సాయితేజ డ్రగ్స్ పరిశ్రమలో ఆదివారం చోటుచేసుకుంది. -
చరవాణితో.. జర భద్రం
[ 01-07-2024]
ఒకప్పుడు పుస్తకం హస్త భూషణం.. ఖరీదైన చేతి గడియారం దర్పానికి ప్రతీక.. ఇప్పుడు ఆ స్థానాన్ని చరవాణి ఆక్రమించింది. ఖరీదైన స్మార్ట్ఫోన్.. పేరున్న బ్రాండ్.. ఏ ఇద్దరు మాట్లాడుకున్నా ఇదే. -
నేటి నుంచి పన్నులపై వడ్డీంపు
[ 01-07-2024]
పురపాలికల్లో పన్నులను పూర్తిస్థాయిలో వసూలు చేసేందుకు అధికారులు కార్యాచరణ రూపొందించారు. 2024-25 సంవత్సరాన్ని రెండు విడతలుగా విభజించి పన్నులు వసూలు చేస్తున్నారు. -
మత్తు వదలరా..!
[ 01-07-2024]
కన్న తల్లిదండ్రులకు, పుట్టిన గడ్డకు పేరు ప్రతిష్ఠలు తీసుకురావాలనే ఉద్దేశంతో కొంత మంది యువకులు పోటీ ప్రపంచంలో నిత్యం శ్రమిస్తున్నారు. మరి కొంతమంది మత్తుకు బానిసై పక్కదారి పడుతున్నారు. -
చెప్పిందే ధర..!
[ 01-07-2024]
సూర్యాపేట కూరగాయల మార్కెట్లో వ్యాపారులు చెప్పిన ధరకే వినియోగదారులు కొనాల్సిన పరిస్థితి నెలకొంది. అధికారులు నిర్ణయించిన ధరకు విక్రయించకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. -
పక్కాగా పంటల నమోదు
[ 01-07-2024]
ఉమ్మడి జిల్లాలో వానాకాలం పంటల నమోదు ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది. క్షేత్రస్థాయిలో మండల వ్యవసాయ అధికారులు, సిబ్బంది నేరుగా పంట పొలాలకు వద్దకు వెళ్లి సాగు వివరాలను ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. -
సీఎంఆర్ బకాయిల వసూలుకు.. రంగం సిద్ధం
[ 01-07-2024]
సీఎంఆర్ బకాయిల వసూలుకు ఆర్ఆర్ యాక్టు (రెవెన్యూ రికవరీ చట్టం) అమలు చేసేందుకు అధికారులు సిద్ధం అవుతున్నారు. ఇప్పటి వరకు మిల్లర్లు కోర్టును ఆశ్రయించి అధికారులను ముప్పుతిప్పలు పెట్టవచ్చు అనుకున్నారు. -
శ్రీస్వామి నిలయంలో దైవారాధనలు
[ 01-07-2024]
యాదాద్రి పుణ్యక్షేత్రంలో ఆదివారం భక్తజనుల ఆర్జిత కైంకర్యాలతో ఆధ్యాత్మిక కోలాహలం నెలకొంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు దైవ దర్శనం కోసం బారులు తీరారు. -
మీ-సేవలో.. అక్రమాలకు చెక్
[ 01-07-2024]
వినియోగదారులకు సులభంగా.. వేగంగా సేవలు అందించాలనే ఉద్దేశంతో అప్పట్లో ప్రభుత్వం మీ-సేవ కేంద్రాల వ్యవస్థను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. గతంలో ప్రభుత్వ కార్యాలయాల్లో ఆయా ధ్రువపత్రాలు, ఇతర అవసరాలకు రైతులు, విద్యార్థులు రాతపూర్వక దరఖాస్తు చేసుకునే వారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
1995 నాటి సీఎంను చూస్తారు.. చంద్రబాబు, లోకేశ్ మధ్య ఆసక్తికర సంభాషణ
-
నాలుగు వరుసల రహదారి సాకారమయ్యేనా?
-
ఫ్లాట్గా ప్రారంభమైన స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 24,020
-
‘టాప్లో భారత్.. దక్షిణాఫ్రికా తడబాటు’: వరల్డ్ కప్ విజయంపై అంతర్జాతీయ మీడియా
-
‘మీ నుంచి మర్యాద, నిజాయతీ ఆశిస్తున్నాం’.. జైరాం రమేశ్ పోస్టుపై ఘాటుగా స్పందించిన లోకేశ్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM