గర్భంలోనే నిండునూరేళ్లు..!
సూర్యాపేట జిల్లా భ్రూణ హత్యలకు అడ్డాగా మారింది. చివ్వెంల మండలం ఎంజీనగర్ తండాకు చెందిన ఏడు నెలల గర్భిణి సుహాసిని (26) మృతి ఘటన జిల్లాలో లింగనిర్ధారణ, గర్భవిచ్ఛిత్తి (అబార్షన్) ఎంత యథేచ్ఛగా సాగుతుందో తెలిపేందుకు నిదర్శనంగా నిలుస్తోంది.
భ్రూణ హత్యలకు అడ్డాగా ఆసుపత్రులు..!
సూర్యాపేట నేరవిభాగం, న్యూస్టుడే: సూర్యాపేట జిల్లా భ్రూణ హత్యలకు అడ్డాగా మారింది. చివ్వెంల మండలం ఎంజీనగర్ తండాకు చెందిన ఏడు నెలల గర్భిణి సుహాసిని (26) మృతి ఘటన జిల్లాలో లింగనిర్ధారణ, గర్భవిచ్ఛిత్తి (అబార్షన్) ఎంత యథేచ్ఛగా సాగుతుందో తెలిపేందుకు నిదర్శనంగా నిలుస్తోంది. జిల్లాలో కొంత మంది వైద్య రంగంలో మాఫియాగా ఏర్పడి ధనార్జనే ధ్యేయంగా వ్యవహరిస్తున్నారు. ఇలాంటి ఘటనలు వెలుగు చూసినప్పుడు మాత్రమే సంబంధిత అధికారులు కొద్ది రోజులు హడావుడి చేయడం.. ఆ తర్వాత ‘చూసీ’చూడనట్లుగా వ్యవహరించడం పరిపాటిగా మారింది.
పట్టుబడినా.. అదే దందా..!
జిల్లా కేంద్రంలోని కొన్ని ఆసుపత్రులు భ్రూణ హత్యలకు ప్రసిద్ధి చెందాయి. ఇటీవల కోదాడ ప్రాంతంలోనూ లింగనిర్ధారణ పరీక్షలు చేపడుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొంత మంది గ్రామీణ వైద్యులు(ఆర్ఎంపీలు) మధ్యవర్తులుగా ఏర్పాటు చేసుకొని రూ.లక్షలు ఆర్జిస్తున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండానే చిన్న చిన్న క్లీనిక్లు ఏర్పాటు చేసుకొని గుట్టుచప్పుడు కాకుండా అబార్షన్లు చేస్తున్నారు. ప్రత్యక్షంగా పట్టుబడినా.. జరిమానాలు విధించినా.. కేసులు నమోదు చేసినా.. వెనుకకు తగ్గడం లేదు.
- ఏడాదిన్నర క్రితం సూర్యాపేటలోని ఓ వైద్యురాలు గర్భవిచ్చిత్తి చేస్తున్నట్లు గుర్తించిన అధికారులు ఆమెకు జరిమానా విధించి వదిలేశారు.
- ఏడాది క్రితం ఎంజీ రోడ్డులోని ఓ క్లీనిక్లో మహిళకు గర్భవిచ్ఛిత్తి చేస్తుండగా ప్రత్యక్షంగా పట్టుకొని కేసులు నమోదు చేశారు. ఆసుపత్రిని సీజ్ చేశారు.
- అదే తరహాలో రామలింగేశ్వర థియేటర్ రోడ్డులోనూ మరో ప్రైవేటు ఆసుపత్రిని సీజ్ చేశారు. ఆ ఆసుపత్రుల స్థానాల్లో కొత్త పేర్లతో దవాఖానాలు వెలుస్తున్నాయి.
- ఒకవైపు అవగాహన.. మరో వైపు ఉల్లంఘన
భ్రూణ హత్యలను నిలువరించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఇటీవల పీసీ-పీఎన్డీటీ (ప్రీ కన్సెప్షన్, ప్రీ నెటల్ డయాగ్నస్టిక్ టెక్నిక్స్) చట్టంపై ప్రజలకు అవగాహన కల్పించాలని సంకల్పించింది. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా వంద రోజుల కార్యక్రమం ప్రస్తుతం కొనసాగుతోంది. అందులో భాగంగా సూర్యాపేటలోనూ ఇటీవల జిల్లా కలెక్టరేట్లో అధికారులు వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం ఏర్పాటు చేసి గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. ఈ చట్టం ప్రకారం లింగ నిర్ధారణ నిర్వహించే స్కానింగ్ కేంద్రాల నిర్వహకులు, వైద్యులకు, కుటుంబ సభ్యులకు గరిష్ఠంగా ఏడేళ్ల జైలుశిక్ష, రూ.50 వేల జరిమానా విధించే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. ఈ చట్టాన్ని యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్న ఘటనలూ వెలుగు చూడటం గమనార్హం. అధికారులు కఠిన చర్యలు తప్పవని హెచ్చరించడానికే పరిమితమవుతున్నారన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఆచరణలో చేసి చూపితేనే వీటికి అడ్డుకట్ట పడే అవకాశాలు ఉన్నాయి.
డీఎంహెచ్వో వివరణ కోసం ‘న్యూస్టుడే’ ఫోన్లో ప్రయత్నించగా ఆయన అందుబాటులోకి రాలేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అమాత్య యోగం ఎవరికో..?
[ 01-07-2024]
లోక్సభ ఎన్నికలు ముగియడంతో అధికార కాంగ్రెస్ పార్టీ పదవుల పందేరంపై దృష్టి సారించింది. ఈనెల తొలి వారంలోనే పలు మంత్రి పదవులను భర్తీ చేస్తామనే సీఎం రేవంత్రెడ్డి వ్యాఖ్యలతో.. ఉమ్మడి జిల్లాలో ఎవరెవరికీ అమాత్యయోగం దక్కనుందనే చర్చ సాగుతోంది. -
నేటి నుంచి అమల్లోకి పోలీస్ కొత్త చట్టాలు
[ 01-07-2024]
దేశవ్యాప్తంగా సోమవారం నుంచి జిల్లాలో పోలీస్ నూతన చట్టాలు అమల్లోకి రానున్నాయి. -
స్పౌజ్ బదిలీల్లో అక్రమాలు
[ 01-07-2024]
ఉపాధ్యాయ బదిలీల్లో అక్రమాలు చోటు చేసుకున్నాయి. బదిలీలు పారదర్శకంగా చేపడుతున్నామని జిల్లా విద్యాశాఖ అధికారులు చెబుతున్నా తప్పులు బయటపడుతూనే ఉన్నాయి. -
పేదింటి వైద్యులు.. ఉచితంగా సేవలు
[ 01-07-2024]
కనీస వసతుల్లేని మారుమూల గ్రామాల్లో పుట్టి పెరిగినా.. తల్లిదండ్రుల, సోదరుల రెక్కల కష్టంతోనే వైద్య విద్యనభ్యసించి ప్రభుత్వ ఆసుపత్రుల్లో కొలువులు సాధించారు. అతి సామాన్యులకు ఉచితంగా వైద్య సేవలందిస్తున్నారు. -
కృషి ఫలించె.. పురస్కారాలు వరించె
[ 01-07-2024]
రసాయన ఎరువులు, పురుగు మందులకు దూరంగా.. సేంద్రియ పద్ధతిలో మొక్కలు పెంచుతూ.. అనేక రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్నారు.. భువనగిరికి చెందిన జిట్టా జ్యోతిరెడ్డి. -
గ్యాస్ లీక్.. ముగ్గురికి అస్వస్థత
[ 01-07-2024]
రసాయన పరిశ్రమలో గ్యాస్ లీకై ముగ్గురు కార్మికులు అస్వస్థతకు గురైన ఘటన పట్టణ కేంద్రంలోని నారాయణగిరిలోని సాయితేజ డ్రగ్స్ పరిశ్రమలో ఆదివారం చోటుచేసుకుంది. -
చరవాణితో.. జర భద్రం
[ 01-07-2024]
ఒకప్పుడు పుస్తకం హస్త భూషణం.. ఖరీదైన చేతి గడియారం దర్పానికి ప్రతీక.. ఇప్పుడు ఆ స్థానాన్ని చరవాణి ఆక్రమించింది. ఖరీదైన స్మార్ట్ఫోన్.. పేరున్న బ్రాండ్.. ఏ ఇద్దరు మాట్లాడుకున్నా ఇదే. -
నేటి నుంచి పన్నులపై వడ్డీంపు
[ 01-07-2024]
పురపాలికల్లో పన్నులను పూర్తిస్థాయిలో వసూలు చేసేందుకు అధికారులు కార్యాచరణ రూపొందించారు. 2024-25 సంవత్సరాన్ని రెండు విడతలుగా విభజించి పన్నులు వసూలు చేస్తున్నారు. -
మత్తు వదలరా..!
[ 01-07-2024]
కన్న తల్లిదండ్రులకు, పుట్టిన గడ్డకు పేరు ప్రతిష్ఠలు తీసుకురావాలనే ఉద్దేశంతో కొంత మంది యువకులు పోటీ ప్రపంచంలో నిత్యం శ్రమిస్తున్నారు. మరి కొంతమంది మత్తుకు బానిసై పక్కదారి పడుతున్నారు. -
చెప్పిందే ధర..!
[ 01-07-2024]
సూర్యాపేట కూరగాయల మార్కెట్లో వ్యాపారులు చెప్పిన ధరకే వినియోగదారులు కొనాల్సిన పరిస్థితి నెలకొంది. అధికారులు నిర్ణయించిన ధరకు విక్రయించకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. -
పక్కాగా పంటల నమోదు
[ 01-07-2024]
ఉమ్మడి జిల్లాలో వానాకాలం పంటల నమోదు ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది. క్షేత్రస్థాయిలో మండల వ్యవసాయ అధికారులు, సిబ్బంది నేరుగా పంట పొలాలకు వద్దకు వెళ్లి సాగు వివరాలను ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. -
సీఎంఆర్ బకాయిల వసూలుకు.. రంగం సిద్ధం
[ 01-07-2024]
సీఎంఆర్ బకాయిల వసూలుకు ఆర్ఆర్ యాక్టు (రెవెన్యూ రికవరీ చట్టం) అమలు చేసేందుకు అధికారులు సిద్ధం అవుతున్నారు. ఇప్పటి వరకు మిల్లర్లు కోర్టును ఆశ్రయించి అధికారులను ముప్పుతిప్పలు పెట్టవచ్చు అనుకున్నారు. -
శ్రీస్వామి నిలయంలో దైవారాధనలు
[ 01-07-2024]
యాదాద్రి పుణ్యక్షేత్రంలో ఆదివారం భక్తజనుల ఆర్జిత కైంకర్యాలతో ఆధ్యాత్మిక కోలాహలం నెలకొంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు దైవ దర్శనం కోసం బారులు తీరారు. -
మీ-సేవలో.. అక్రమాలకు చెక్
[ 01-07-2024]
వినియోగదారులకు సులభంగా.. వేగంగా సేవలు అందించాలనే ఉద్దేశంతో అప్పట్లో ప్రభుత్వం మీ-సేవ కేంద్రాల వ్యవస్థను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. గతంలో ప్రభుత్వ కార్యాలయాల్లో ఆయా ధ్రువపత్రాలు, ఇతర అవసరాలకు రైతులు, విద్యార్థులు రాతపూర్వక దరఖాస్తు చేసుకునే వారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఫ్లాట్గా ప్రారంభమైన స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 24,020
-
‘టాప్లో భారత్.. దక్షిణాఫ్రికా తడబాటు’: వరల్డ్ కప్ విజయంపై అంతర్జాతీయ మీడియా
-
‘మీ నుంచి మర్యాద, నిజాయతీ ఆశిస్తున్నాం’.. జైరాం రమేశ్ పోస్టుపై ఘాటుగా స్పందించిన లోకేశ్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
కృష్ణా జలాల్లో కొత్త ద్వీపం.. అందం అదరహో..!
-
ఎంపీ లాడ్స్ ఆన్లైన్లో!