నూతన చట్టాల రద్దుకు డిమాండ్
జులై నుంచి అమలయ్యే నూతన క్రిమినల్ చట్టాలను రద్దు చేయాలని ఆలిండియా లాయర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు మామిడి వెంకట్రెడ్డి, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు బబ్బూరి హరినాథ్ డిమాండ్ చేశారు.
భువనగిరి: బార్ అసోసియేషన్ ఎదుట నిరసన వ్యక్తం చేస్తున్న న్యాయవాదులు
భువనగిరి గంజ్, న్యూస్టుడే: జులై నుంచి అమలయ్యే నూతన క్రిమినల్ చట్టాలను రద్దు చేయాలని ఆలిండియా లాయర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు మామిడి వెంకట్రెడ్డి, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు బబ్బూరి హరినాథ్ డిమాండ్ చేశారు. నూతన చట్టాల అమలును వ్యతిరేకిస్తూ శుక్రవారం బార్ అసోసియేషన్ ఎదుట నిరసన వ్యక్తం చేశారు. గత చట్టాలను మార్చి మూడు చట్టాలను అమలు చేయడంతో ప్రజలు ఇబ్బందులు పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. చట్టాల అమలు అందరికి అనుకూలంగా ఉండాలే తప్ప ఇబ్బందులు పెట్టే విధంగా ఉండొద్దన్నారు. కార్యక్రమంలో న్యాయవాదులు గోద వెంకటేశ్వర్లు, కేశవరెడ్డి, కుమార్, నిసంగి విద్యాసాగర్, రమేష్ పాల్గొన్నారు.
రామన్నపేట, న్యూస్టుడే: కొత్త క్రిమినల్ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం రామన్నపేటలో న్యాయవాదులు జూనియర్ సివిల్ కోర్టు ఎదుట నిరసన వ్యక్తం చేశారు. అనంతరం బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మజీద్, ఐలు జిల్లా అధ్యక్షుడు మామిడి వెంకట్రెడ్డి మాట్లాడుతూ.. కొత్త క్రిమినల్ చట్టాలు న్యాయ వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పాల్వంచ జగతయ్య, లింగయ్య, మొగిలయ్య, యాదయ్య, దినేశ్కుమార్, శ్రవణ్కుమార్, సత్తయ్య పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అమాత్య యోగం ఎవరికో..?
[ 01-07-2024]
లోక్సభ ఎన్నికలు ముగియడంతో అధికార కాంగ్రెస్ పార్టీ పదవుల పందేరంపై దృష్టి సారించింది. ఈనెల తొలి వారంలోనే పలు మంత్రి పదవులను భర్తీ చేస్తామనే సీఎం రేవంత్రెడ్డి వ్యాఖ్యలతో.. ఉమ్మడి జిల్లాలో ఎవరెవరికీ అమాత్యయోగం దక్కనుందనే చర్చ సాగుతోంది. -
నేటి నుంచి అమల్లోకి పోలీస్ కొత్త చట్టాలు
[ 01-07-2024]
దేశవ్యాప్తంగా సోమవారం నుంచి జిల్లాలో పోలీస్ నూతన చట్టాలు అమల్లోకి రానున్నాయి. -
స్పౌజ్ బదిలీల్లో అక్రమాలు
[ 01-07-2024]
ఉపాధ్యాయ బదిలీల్లో అక్రమాలు చోటు చేసుకున్నాయి. బదిలీలు పారదర్శకంగా చేపడుతున్నామని జిల్లా విద్యాశాఖ అధికారులు చెబుతున్నా తప్పులు బయటపడుతూనే ఉన్నాయి. -
పేదింటి వైద్యులు.. ఉచితంగా సేవలు
[ 01-07-2024]
కనీస వసతుల్లేని మారుమూల గ్రామాల్లో పుట్టి పెరిగినా.. తల్లిదండ్రుల, సోదరుల రెక్కల కష్టంతోనే వైద్య విద్యనభ్యసించి ప్రభుత్వ ఆసుపత్రుల్లో కొలువులు సాధించారు. అతి సామాన్యులకు ఉచితంగా వైద్య సేవలందిస్తున్నారు. -
కృషి ఫలించె.. పురస్కారాలు వరించె
[ 01-07-2024]
రసాయన ఎరువులు, పురుగు మందులకు దూరంగా.. సేంద్రియ పద్ధతిలో మొక్కలు పెంచుతూ.. అనేక రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్నారు.. భువనగిరికి చెందిన జిట్టా జ్యోతిరెడ్డి. -
గ్యాస్ లీక్.. ముగ్గురికి అస్వస్థత
[ 01-07-2024]
రసాయన పరిశ్రమలో గ్యాస్ లీకై ముగ్గురు కార్మికులు అస్వస్థతకు గురైన ఘటన పట్టణ కేంద్రంలోని నారాయణగిరిలోని సాయితేజ డ్రగ్స్ పరిశ్రమలో ఆదివారం చోటుచేసుకుంది. -
చరవాణితో.. జర భద్రం
[ 01-07-2024]
ఒకప్పుడు పుస్తకం హస్త భూషణం.. ఖరీదైన చేతి గడియారం దర్పానికి ప్రతీక.. ఇప్పుడు ఆ స్థానాన్ని చరవాణి ఆక్రమించింది. ఖరీదైన స్మార్ట్ఫోన్.. పేరున్న బ్రాండ్.. ఏ ఇద్దరు మాట్లాడుకున్నా ఇదే. -
నేటి నుంచి పన్నులపై వడ్డీంపు
[ 01-07-2024]
పురపాలికల్లో పన్నులను పూర్తిస్థాయిలో వసూలు చేసేందుకు అధికారులు కార్యాచరణ రూపొందించారు. 2024-25 సంవత్సరాన్ని రెండు విడతలుగా విభజించి పన్నులు వసూలు చేస్తున్నారు. -
మత్తు వదలరా..!
[ 01-07-2024]
కన్న తల్లిదండ్రులకు, పుట్టిన గడ్డకు పేరు ప్రతిష్ఠలు తీసుకురావాలనే ఉద్దేశంతో కొంత మంది యువకులు పోటీ ప్రపంచంలో నిత్యం శ్రమిస్తున్నారు. మరి కొంతమంది మత్తుకు బానిసై పక్కదారి పడుతున్నారు. -
చెప్పిందే ధర..!
[ 01-07-2024]
సూర్యాపేట కూరగాయల మార్కెట్లో వ్యాపారులు చెప్పిన ధరకే వినియోగదారులు కొనాల్సిన పరిస్థితి నెలకొంది. అధికారులు నిర్ణయించిన ధరకు విక్రయించకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. -
పక్కాగా పంటల నమోదు
[ 01-07-2024]
ఉమ్మడి జిల్లాలో వానాకాలం పంటల నమోదు ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది. క్షేత్రస్థాయిలో మండల వ్యవసాయ అధికారులు, సిబ్బంది నేరుగా పంట పొలాలకు వద్దకు వెళ్లి సాగు వివరాలను ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. -
సీఎంఆర్ బకాయిల వసూలుకు.. రంగం సిద్ధం
[ 01-07-2024]
సీఎంఆర్ బకాయిల వసూలుకు ఆర్ఆర్ యాక్టు (రెవెన్యూ రికవరీ చట్టం) అమలు చేసేందుకు అధికారులు సిద్ధం అవుతున్నారు. ఇప్పటి వరకు మిల్లర్లు కోర్టును ఆశ్రయించి అధికారులను ముప్పుతిప్పలు పెట్టవచ్చు అనుకున్నారు. -
శ్రీస్వామి నిలయంలో దైవారాధనలు
[ 01-07-2024]
యాదాద్రి పుణ్యక్షేత్రంలో ఆదివారం భక్తజనుల ఆర్జిత కైంకర్యాలతో ఆధ్యాత్మిక కోలాహలం నెలకొంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు దైవ దర్శనం కోసం బారులు తీరారు. -
మీ-సేవలో.. అక్రమాలకు చెక్
[ 01-07-2024]
వినియోగదారులకు సులభంగా.. వేగంగా సేవలు అందించాలనే ఉద్దేశంతో అప్పట్లో ప్రభుత్వం మీ-సేవ కేంద్రాల వ్యవస్థను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. గతంలో ప్రభుత్వ కార్యాలయాల్లో ఆయా ధ్రువపత్రాలు, ఇతర అవసరాలకు రైతులు, విద్యార్థులు రాతపూర్వక దరఖాస్తు చేసుకునే వారు.