రూ.లక్షల్లో జీతం.. ప్రైవేటు బాగోతం
ఆ వైద్యుడి నెల జీతం రూ.2 లక్షలకు పైగానే.. నల్గొండ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి (జీజీహెచ్)లో విధులు. నిత్యం హైదరాబాద్ నుంచి జీజీహెచ్కు వస్తారు. ఆసుపత్రికి వచ్చేసరికే ఉదయం 11 గంటలు దాటుతుంది.
నల్గొండ జీజీహెచ్లో కొంత మంది వైద్యుల తీరు
నల్గొండ ప్రభుత్వ వైద్య కళాశాల
ఆ వైద్యుడి నెల జీతం రూ.2 లక్షలకు పైగానే.. నల్గొండ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి (జీజీహెచ్)లో విధులు. నిత్యం హైదరాబాద్ నుంచి జీజీహెచ్కు వస్తారు. ఆసుపత్రికి వచ్చేసరికే ఉదయం 11 గంటలు దాటుతుంది. రెండు గంటలు ఓపీ విధుల్లో ఉంటారో లేదో మధ్యాహ్న భోజన సమయానికి స్థానికంగా ప్రైవేటులో ఓపీ చూసే ఆసుపత్రికి వెళ్లిపోతారు. తిరిగి సాయంత్రం వస్తారా అంటే.. అదీ లేదు. పనితీరు మార్చుకోకుంటే ఛార్జ్మెమో ఇస్తామని ఇటీవల నిర్వహించిన సమీక్షలో ఉన్నతాధికారి ఆయన్ను హెచ్చరించడం గమనార్హం.
నల్గొండ జిల్లాలోని ఓ ఏరియా ఆసుపత్రిలో విధులు నిర్వహించే వైద్యురాలి నెల వేతనం రూ.3 లక్షల పైమాటే. నిత్యం నల్గొండ నుంచి సదరు ఏరియా ఆసుపత్రికి వెళ్లి విధులు నిర్వహించాలి. అయితే ఎలాంటి సమాచారం లేకుండానే సెలవులు తీసుకోవడం, నెలలో పక్షం రోజులు మాత్రమే ఆమె విధులకు హాజరవుతుండటంతో.. ఇటీవలే ఉన్నతాధికారి ఛార్జ్మెమో ఇస్తామని హెచ్చరించడంతో.. తనను సదరు ఉన్నతాధికారి వేధిస్తున్నారని ప్రభుత్వంలో కీలకంగా ఉన్న ప్రజాప్రతినిధికి ఫిర్యాదు చేశారు.
ఈనాడు, నల్గొండ - న్యూస్టుడే, నల్గొండ వైద్యవిభాగం : ‘ఆసుపత్రిలో వైద్య పరికరాలు లేవు. సరైన మందులు లేకపోవడంతో రోగులు ఇబ్బందులు పడుతున్నా.. ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదంటూ వైద్యులు ఆందోళన చేయడం ఇప్పటివరకు చూసుంటాం. కానీ కలెక్టరు ఆదేశాల మేరకు కొంత మంది ప్రత్యేకాధికారులు నిత్యం ఆసుపత్రి పరిశీలనకు వస్తున్నారంటూ ఆందోళన చేయడం బహుశా నల్గొండ జీజీహెచ్లోనే చూస్తున్నా’మంటూ హాలియా నుంచి జీజీహెచ్కు ఓపీకి వచ్చిన రామస్వామి గురువారం జరిగిన ఆందోళనపై అభిప్రాయపడటం ప్రస్తుతం ఇక్కడ నెలకొన్న పరిస్థితికి అద్దం పడుతోంది. నల్గొండ జిల్లా కేంద్రంలోని జీజీహెచ్లో జరిగిన ఘటన వైద్యులు వర్సెస్ జిల్లా యంత్రాంగంగా మారింది. కొంత మంది వైద్యుల పనితీరు వల్లే ఈ పరిస్థితి తలెత్తిందన్న వాదన వినిపిస్తోంది. పలుమార్లు హెచ్చరించినా సీనియర్ వైద్యులతో పాటూ ఏళ్లుగా ఇక్కడే పనిచేస్తున్న వారి పనితీరు మారడం లేదని..వారిని విధులు సరిగ్గా నిర్వర్తించమని ఆదేశిస్తే కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారంటూ ప్రజాప్రతినిధులకు ఫిర్యాదు చేస్తున్నారని ఉన్నతాధికారులు అభిప్రాయపడుతున్నారు.
ప్రైవేటు ఓపీకే మొగ్గు
జీజీహెచ్లో ప్రస్తుతం 220కి పైగా వైద్య పోస్టులకు ప్రభుత్వం అనుమతించగా..స్పెషలిస్టు వైద్యులతో పాటూ కొన్ని సైంటిస్టు పోస్టులు మాత్రమే ఖాళీగా ఉన్నాయి. అత్యధికులు విధుల నిమిత్తం హైదరాబాద్ నుంచే రాకపోకలు సాగిస్తున్నారు. స్థానికంగా ఉన్న కొంత మంది వైద్యులు సైతం వారి ప్రైవేటు క్లినిక్లలో ఓపీలు చూడటానికే ప్రయత్నిస్తున్నారన్న విమర్శలున్నాయి. కొంత మంది వైద్యుల వల్ల చాలా మంది వైద్యులకు చెడ్డపేరు వస్తుందన్న అభిప్రాయమూ అంతర్గతంగా వ్యక్తమవుతోంది. చాలా మంది వైద్యులు ఉదయం ఆసుపత్రికి వచ్చి బయోమెట్రిక్ వేసి తిరిగి ప్రైవేటు ఓపీలకు వెళ్లిపోతున్నారు. ఇటీవల కలెక్టర్ తొలిసారి జీజీహెచ్ను సందర్శించిన సమయంలోనూ చాలా మంది వైద్యులు విధుల్లో లేకపోగా..ఆసుపత్రిలో పారిశుద్ధ్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆసుపత్రిని నిత్యం పర్యవేక్షించే ఉన్నతాధికారులకు వైద్యులపై పట్టులేకపోవడం, ఉన్నతాధికారులు చేసే అక్రమాలకు కొంత మంది వైద్యులు సహకరిస్తుండటంతో అంతిమంగా రోగులు ఇబ్బందులు పడుతున్నారు. దీనిని సమూలంగా ప్రక్షాళన చేయాలని నిర్ణయానికొచ్చిన కలెక్టర్ నారాయణరెడ్డి.. ఆసుపత్రిలో జిల్లా స్థాయి అధికారులతో పరిశీలన చేయాలని ఆదేశించడం ఆందోళనకు కారణమైంది.
మెరుగైన వైద్య సేవలకే పరిశీలన
ఆసుపత్రిలో మెరుగైన వైద్య సేవలకే కలెక్టరు ప్రత్యేకాధికారులను పరిశీలనకు పంపుతున్నారు. తమకంటే తక్కువ క్యాడర్ అధికారులు ఆసుపత్రిని ఎలా పరిశీలన చేస్తారని కొంత మంది వైద్యులు అభ్యంతరం చెబుతున్నారు. కేవలం కలెక్టరు, అదనపు కలెక్టర్లకు మాత్రమే ఆసుపత్రి పరిశీలన అధికారాలున్నాయని వారి వాదన. ఆసుపత్రి నిర్వహణకు సూపరింటెండెంట్ ఉన్నారని..ఇంకా ప్రత్యేకంగా నిత్యం పరిశీలన ఎందుకని ప్రశ్నిస్తున్నారు. వారి వాదనలన్నింటినీ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం.
డాక్టర్ నిత్యానందం, జీజీహెచ్ సూపరింటెండెంట్, నల్గొండ
నియంత్రణకు అధికారం ఇవ్వలేదు
జీజీహెచ్లో పనిచేసే వైద్యులను నియంత్రించాలని మేం ఎవరికి అధికారం ఇవ్వలేదు. కేవలం ఆసుపత్రిలో మౌలిక వసతులు, రోగులకు అందుతున్న వైద్య సేవలు, భోజనం నాణ్యత తదితర అంశాలను నిత్యం పరిశీలించి నివేదిక ఇవ్వాలని మాత్రమే సూచించాం. ప్రభుత్వ ఆసుపత్రి ద్వారా ప్రజలకు మేలైన వైద్యం అందించాలన్నదే అధికార యంత్రాంగం తపన.
సి.నారాయణరెడ్డి, కలెక్టరు, నల్గొండ
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రవేశాలు లేక.. కళాశాలలు వెలవెల
[ 30-06-2024]
ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ప్రవేశాల గడువు ముగిసినప్పటికీ లక్ష్యం మేరకు విద్యార్థులు చేరలేదు. జిల్లా వ్యాప్తంగా 11 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉన్నాయి. -
కొత్త చట్టాలపై అవగాహన అవసరం
[ 30-06-2024]
న్యాయవాదులు చట్టాలపై అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉందని జాతీయ న్యాయవాదుల యూనియన్(ఐలు) రాష్ట్ర అధ్యక్షుడు కొల్లి సత్యనారాయణ అన్నారు. -
మహిళా వ్యాపారులకు అందలం
[ 30-06-2024]
అతివలు అన్ని రంగాల్లో రాణించేలా రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేపడుతోంది. అందులో భాగంగా వ్యాపారాల్లో స్థిరపడాలనే సదుద్దేశంతో 14 రకాల వ్యాపారాలను ఎంపిక చేసి అమలుకు కార్యాచరణ రూపొందించింది. -
పల్లీ రైతు దిగాలు
[ 30-06-2024]
సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ యార్డులో వేరుసెనగకు గిట్టుబాటు ధర దక్కటం లేదు. సాగు సమయంలో ధర ఉండగా.. పంట చేతికొచ్చాక తగ్గడంతో అన్నదాతలు నష్టాలను చవిచూస్తున్నారు. -
ధరణి పెండింగ్ సమస్యలు పరిష్కరిస్తాం: కలెక్టర్
[ 30-06-2024]
ధరణి పెండింగ్ సమస్యలు సత్వరమే పరిష్కరిస్తామని కలెక్టర్ సి.నారాయణరెడ్డి రెవెన్యూశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, సీసీఎల్ఏ ఇన్ఛార్జి నవీన్ మిట్టల్కు తెలిపారు. -
పదోన్నతులు దారి తప్పాయా..
[ 30-06-2024]
ఉపాధ్యాయుల పదోన్నతుల్లో అక్రమాలు జరిగాయన్న వాదన వినిపిస్తోంది. పలువురు అడ్డదారుల్లో, నకిలీ ధ్రువపత్రాలతో పదోన్నతులు పొందారని, పూర్తిస్థాయిలో పరిశీలించాల్సిన అధికారులు చూసీచూడనట్లు వ్యవహరించారన్న ఆరోపణలున్నాయి. -
అలుపెరగని శిక్షకుడు తూము హన్మంతరావు
[ 30-06-2024]
వేతనం కోసం నిర్ణీత సమయం వరకే పని చేయకుండా సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు విధులు నిర్వర్తించి.. పిల్లల్లో దాగిఉన్న ప్రతిభను గుర్తించి.. -
భ్రూణ హత్యపై విచారణ.. ఆసుపత్రుల సీజ్
[ 30-06-2024]
భ్రూణ హత్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని డీఎంహెచ్వో కోటాచలం హెచ్చరించారు. లింగ నిర్ధారణ పరీక్షలు చేసిన వారి ఆసుపత్రులను, ల్యాబ్లను సీజ్ చేస్తామన్నారు. -
మెరుగైన వైద్య సేవలందించాలి
[ 30-06-2024]
ఎయిమ్స్లో మెరుగైన వైద్య సేవలందించడమే లక్ష్యంగా పనిచేయాలని భువనగిరి ఎంపీ చామల కిరణ్కుమార్రెడ్డి, ఎమ్మెల్యే కుంభం అనిల్కుమార్రెడ్డి ఆసుపత్రి వైద్యులకు, సిబ్బందికి సూచించారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
జీహెచ్ఎంసీలో కంటోన్మెంట్ విలీనం.. సీఎం రేవంత్ చొరవతో అంగీకరించిన కేంద్రం
-
1-8 తరగతులకు ఉమ్మడి పరీక్ష విధానం రద్దు
-
అరకొర భరణంతో భార్యాబిడ్డలు ఎలా బతుకుతారు?
-
పోలవరానికి అంతర్జాతీయ నిపుణులు!
-
నా హార్ట్రేట్ పెరిగిపోయింది.. బర్త్డే గిఫ్ట్ ఇచ్చినందుకు థాంక్స్: ఎంఎస్ ధోనీ
-
విజయవాడ విమానాశ్రయంలో కార్గో సేవలు పునఃప్రారంభం