వ్యాపారంలో రాణించాలని
స్వయం సహాయక సంఘాల సభ్యులైన మహిళలకు ప్రభుత్వం ఇప్పటికే వివిధ కార్యక్రమాల ద్వారా చేయూతనిస్తోంది. తక్కువ వడ్డీతో రుణాలు అందిస్తూ వివిధ వ్యాపారాల్లో స్థిరపడేలా ప్రోత్సహిస్తోంది.
సూర్యాపేట: కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమానికి హాజరైన అధికారులు, మండల సమాఖ్య అధ్యక్షురాళ్లు
సూర్యాపేట కలెక్టరేట్, న్యూస్టుడే: స్వయం సహాయక సంఘాల సభ్యులైన మహిళలకు ప్రభుత్వం ఇప్పటికే వివిధ కార్యక్రమాల ద్వారా చేయూతనిస్తోంది. తక్కువ వడ్డీతో రుణాలు అందిస్తూ వివిధ వ్యాపారాల్లో స్థిరపడేలా ప్రోత్సహిస్తోంది. తాజాగా ‘మహిళా శక్తి’ పేరిట కొత్త కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ కార్యక్రమం ద్వారా అతివలకు వివిధ వ్యాపారాల్లో శిక్షణ అందించడమే కాకుండా అందుకు కావాల్సిన రుణాలు అందించేందుకు యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకుంటోంది. రుణ పంపిణీ లక్ష్య సాధనకు ప్రత్యేక కార్యాచరణ, ప్రణాళిక రూపొందించింది. ఈ మేరకు ఇప్పటికే ఆయా అంశాలపై అధికారులకు అవగాహన కల్పించింది.
27,271 యూనిట్లు కేటాయింపు
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా స్వయం సహాయక సంఘాలు 58,170 ఉండగా అందులో సభ్యులైన మగువలు ఆర్థికంగా స్థిరపడేలా చేయాలని ప్రభుత్వం నిశ్చయించుకుంది. అందులో భాగంగా వారికి 14 రకాల వ్యాపారాలపై శిక్షణ ఇవ్వడంతో పాటు 27,271 యూనిట్లు నెలకొల్పనుంది. అందుకు రూ.271 కోట్లు అవసరం అవుతాయని ప్రభుత్వం గుర్తించి ఆ నిధులు మంజూరు చేసేందుకు చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే ఈ కార్యక్రమానికి సంబంధించి డీపీఎం, ఏపీఎం, సీసీలు, మండల సమాఖ్య అధ్యక్షురాళ్లు, కార్యదర్శులకు అవగాహన కల్పించారు. మండలాలు, క్లస్టర్ల వారీగా సమావేశాలు నిర్వహించి, యూనిట్ల గురించి చెబుతున్నారు. శిక్షణ అనంతరం లబ్ధిదారుల ఎంపికలో అధికారులు కీలకంగా వ్యవహరించాలని జిల్లా ఉన్నతాధికారులు సూచించారు. యూనిట్ గ్రౌండింగ్కు సత్వర చర్యలు తీసుకుని బ్యాంకుల సమన్వయంతో ముందుకు సాగేలా ప్రణాళిక రూపొందించారు.
14 రకాల అంశాలపై శిక్షణ
మహిళా శక్తి కార్యక్రమంలో భాగంగా 14 రకాల వ్యాపారాలు ఎంపిక చేసి వాటిపై శిక్షణ ఇప్పించి అనంతరం వ్యాపారాలు నెలకొల్పేందుకు తక్కువ వడ్డీతో రుణాలు కూడా మంజూరు చేయనున్నారు. ఇప్పటికే తొలుత విద్యార్థులకు ఏకరూప దుస్తులు కుట్టే పనిని ప్రభుత్వం మహిళలకు అప్పగించింది. ఈ పని మెరుగైన ఫలితాలను ఇచ్చింది. మిగిలిన 13 రకాల అంశాలలో భాగంగా మైక్రో ఎంటర్ప్రైజెస్, కుట్టు కేంద్రాలు, పాడి పశువులు, పెరటికోళ్ల పెంపకం, సంచార మత్స్య విక్రయకేంద్రాలు(అవుట్లెట్లు), మిల్క్ ప్యాలెస్, మీ సేవా, ఈవెంట్ మేనేజ్మెంట్, మహిళా క్యాంటీన్లు, సౌర యూనిట్లు, ప్లాస్టిక్, ఆహారశుద్ధి, కస్టం హైరింగ్ యూనిట్ల ఏర్పాటుకు సన్నాహాలు చేపడుతోంది. దీనిపై ఇప్పటికే కార్యాచరణ రూపొందించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పదవులన్నీ హస్తగతం
[ 29-06-2024]
అసెంబ్లీ ఎన్నికల్లో 12 సెగ్మెంట్లలో 11 స్థానాల్లో విజయం.. ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలోని రెండు స్థానాల్లోనూ గెలుపు. -
చరవాణితో..హాని..!
[ 29-06-2024]
జిల్లాలో కొందరు బాలికలు పోకిరీల మాయమాటలు నమ్మి..ప్రేమ పేరుతో గడప దాటుతున్నారు. నిజాన్ని గుర్తించే లోపు జరగాల్సిన నష్టం జరిగిపోతోంది. -
ప్రాదేశికంలోనూ.. ప్రత్యేక పాలనేనా..!
[ 29-06-2024]
జిల్లా పరిషత్, మండల పరిషత్, ప్రాదేశిక ఎన్నికలు ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. పదవీకాలం కొద్ది రోజులే ఉండటంతో ఇంతలో ఎన్నికలు జరిగే అవకాశాలు లేవు. -
ఉన్నత విద్యా వేదిక..!
[ 29-06-2024]
ఒకప్పుడు ఆరు కోర్సులతో ప్రారంభమైన విశ్వవిద్యాలయం అది. ఇప్పుడు 22 కోర్సులతో..రెండు వేల మంది విద్యార్థులతో కళకళలాడుతోంది. -
చేనేత కళాకారులకు అవార్డులు
[ 29-06-2024]
తెలంగాణ హస్తకళలకు పుట్టినిల్లు. సింధు నాగరికత కాలం నుంచి కళలు వర్థిల్లినట్టు చారిత్రక ఆధారాలున్నాయి. రాజుల కాలంలో కళాకారులకు ఆదరణ లభించేది. వారి కళానైపుణ్యాన్ని ప్రోత్సహించేవారు. -
గర్భిణి మృతికి కారకులైన ఏడుగురిపై కేసు నమోదు
[ 29-06-2024]
చివ్వెంల మండలం ఎంజీనగర్ తండాకు చెందిన ఏడు నెలల గర్భిణి సుహాసిని (26) మృతికి కారకులైన ఆమె భర్త హరిసింగ్తోపాటు మరో ఆరుగురిపై శుక్రవారం కేసు నమోదు చేసినట్లు సూర్యాపేట ఇన్స్పెక్టర్ రాజశేఖర్ తెలిపారు. -
విద్యుత్తు సమస్యలకు సర్వేతో చెక్
[ 29-06-2024]
జిల్లాలోని విద్యుత్తు సిబ్బంది 11కేవీ ఫీడర్ల సమగ్ర సర్వే చేపడుతున్నారు. సూర్యాపేట, హుజూర్నగర్ డివిజన్లో సోమవారం నుంచి ప్రారంభమైంది. -
గర్భంలోనే నిండునూరేళ్లు..!
[ 29-06-2024]
సూర్యాపేట జిల్లా భ్రూణ హత్యలకు అడ్డాగా మారింది. చివ్వెంల మండలం ఎంజీనగర్ తండాకు చెందిన ఏడు నెలల గర్భిణి సుహాసిని (26) మృతి ఘటన జిల్లాలో లింగనిర్ధారణ, గర్భవిచ్ఛిత్తి (అబార్షన్) ఎంత యథేచ్ఛగా సాగుతుందో తెలిపేందుకు నిదర్శనంగా నిలుస్తోంది. -
నూతన చట్టాల రద్దుకు డిమాండ్
[ 29-06-2024]
జులై నుంచి అమలయ్యే నూతన క్రిమినల్ చట్టాలను రద్దు చేయాలని ఆలిండియా లాయర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు మామిడి వెంకట్రెడ్డి, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు బబ్బూరి హరినాథ్ డిమాండ్ చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
డీఎస్ మృతిపట్ల సీఎం రేవంత్రెడ్డి సంతాపం
-
వచ్చే వారంలో కొలిక్కి!.. మంత్రివర్గ విస్తరణపై కాంగ్రెస్ అధిష్ఠానం కసరత్తు
-
భార్యను నమ్మించి హతమార్చిన భర్త
-
ఊదమంటే.. బ్రీత్ ఎనలైజర్ లాక్కెళ్లాడు!
-
కాసుల మత్తులో ‘దందా’నతాన.. అనుచరుల బార్ల కోసం మద్యం దుకాణాల మార్పు