నకిలీ బంగారం పెట్టి రూ.53.89 లక్షల రుణం
నకిలీ బంగారు ఆభరణాలు బ్యాంక్లో కుదువబెట్టి రూ.53.89 లక్షల రుణం తీసుకున్న ఏడుగురు నిందితులను, సహకరించిన గోల్డ్ అప్రయిజర్ను పోలీసులు మంగళవారం అరెస్టు చేసి కోర్టుకు రిమాండ్ చేశారు.
హుజూర్నగర్లో అరెస్టు చేసిన నిందితులతో సీఐ చరమంద రాజు, సిబ్బంది
హుజూర్నగర్ గ్రామీణం, న్యూస్టుడే: నకిలీ బంగారు ఆభరణాలు బ్యాంక్లో కుదువబెట్టి రూ.53.89 లక్షల రుణం తీసుకున్న ఏడుగురు నిందితులను, సహకరించిన గోల్డ్ అప్రయిజర్ను పోలీసులు మంగళవారం అరెస్టు చేసి కోర్టుకు రిమాండ్ చేశారు. సీఐ చరమంద రాజు తెలిపిన వివరాల ప్రకారం.. నేరేడుచర్ల మండలం వైకుంఠపురం గ్రామానికి చెందిన కేశవరపు రాజేష్ బంగారు ఆభరణాలు తయారు చేయడం నేర్చుకొని మిర్యాలగూడలో రాజేష్ గోల్డ్ వర్క్స్ పేరుతో దుకాణాన్ని పెట్టాడు. దుకాణంతో నష్టం రావడంతో చేసిన అప్పులు తీర్చేందుకు ఆంధ్రప్రదేశ్లోని తెనాలి, నెల్లూరులో నకిలీ బంగారు ఆభరణాలు తయారు చేయించి, ఎవరికి అనుమానం రాకుండా ఆయా ఆభరణాలపై హాల్ మార్కు కేడీఎం 916 ముద్ర వేయించాడు. గరిడేపల్లి మండలం రాయినిగూడెం గ్రామంలోని బ్యాంక్ ఆఫ్ బరోడాలో పని చేస్తున్న గోల్డ్ అప్రయిజర్ జిల్లేపల్లి నరేందర్తో గల పాత పరిచయాలతో..ఒప్పందం చేసుకున్నారు.నకిలీ ఆభరణాలు బంగారమని ధ్రువీకరిస్తానని నరేందర్ ఒప్పుకోవడంతో కొంత బంగారాన్ని రాజేష్ తన పేరుతో, మరి కొంత భార్య వర్షిత పేరుతో రుణాలు తీసుకున్నాడు. రాజేష్ బంధువులైన చింతకుంట్లకు చెందిన కొమెరపూడి వెంకటాచారి, వైకుంఠపురం గ్రామానికి చెందిన కణితి సాయిరాం, మాడ్గులపల్లి మండలం ధర్మాపురం గ్రామానికి చెందిన మిత్రులు అర్రగొర్ల పరశురాములు, మిర్యాలగూడెంకు చెందిన దోనేటి ముఖేష్, సూర్యాపేట శ్రీనగర్ కాలనీకి చెందిన మోత్కూరి సూర్యతో నకిలీ బంగారాన్ని తాకట్టు పెట్టి గత నెల 2వ తేదీ నుంచి దఫాల వారీగా ఒక్కొక్కరిని తీసుకెళ్లి మొత్తం రూ.53,89,000 రుణాలు తీసుకున్నాడు. బ్యాంక్ అధికారులు బ్యాంక్లో జరిగే ఆడిట్ కోసం.. వేరే శాఖలో పనిచేస్తున్న గోల్డ్ అప్రయిజర్తో తనిఖీలు చేయిస్తుండగా విషయం బయట పడింది. దీంతో బ్యాంక్ మేనేజర్ మేడబోయిన శ్రీకాంత్ ఆ బ్యాంక్ ఉన్నతాధికారులకు తెలియజేసి వారి సలహా మేరకు గరిడేపల్లి పోలీస్ స్టేషన్లో ఈనెల 21న ఫిర్యాదు చేశారు. కేసు విషయంలో దర్యాప్తు చేస్తుండగా నమ్మదగిన సమాచారం రావడంతో ఏ-1గా ఉన్న కేశవరపు రాజేష్ స్వగ్రామం వైకుంఠపురంలో మంగళవారం అందరిని అరెస్టు చేశామన్నారు. వీరందరినీ హుజూర్నగర్ న్యాయస్థానంలో హాజరు పరిచామన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భాజపా నాయకుల ధర్నా
[ 29-06-2024]
మంచిర్యాల జిల్లాలోని చెన్నూరు ప్రభుత్వ సామాజిక ఆసుపత్రిలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని కోరుతూ భాజపా నాయకులు ఆసుపత్రి ముందు ధర్నా నిర్వహించారు. -
గనుల వేలాన్ని నిరసిస్తూ కలెక్టరేట్ ఎదుట ధర్నా
[ 29-06-2024]
ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటుపరం చేసే కేంద్ర ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ కలెక్టరేట్ ఎదుట సీఐటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. -
ప్రకృతి వైద్యంతోనే సంపూర్ణ ఆరోగ్యం
[ 29-06-2024]
సహజ సిద్ధంగా లభించే ఆహారం ద్వారానే సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని ప్రముఖ ప్రకృతి వైద్యుడు డాక్టర్ రామచంద్ర అన్నారు. -
పదవులన్నీ హస్తగతం
[ 29-06-2024]
అసెంబ్లీ ఎన్నికల్లో 12 సెగ్మెంట్లలో 11 స్థానాల్లో విజయం.. ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలోని రెండు స్థానాల్లోనూ గెలుపు. -
చరవాణితో..హాని..!
[ 29-06-2024]
జిల్లాలో కొందరు బాలికలు పోకిరీల మాయమాటలు నమ్మి..ప్రేమ పేరుతో గడప దాటుతున్నారు. నిజాన్ని గుర్తించే లోపు జరగాల్సిన నష్టం జరిగిపోతోంది. -
ప్రాదేశికంలోనూ.. ప్రత్యేక పాలనేనా..!
[ 29-06-2024]
జిల్లా పరిషత్, మండల పరిషత్, ప్రాదేశిక ఎన్నికలు ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. పదవీకాలం కొద్ది రోజులే ఉండటంతో ఇంతలో ఎన్నికలు జరిగే అవకాశాలు లేవు. -
ఉన్నత విద్యా వేదిక..!
[ 29-06-2024]
ఒకప్పుడు ఆరు కోర్సులతో ప్రారంభమైన విశ్వవిద్యాలయం అది. ఇప్పుడు 22 కోర్సులతో..రెండు వేల మంది విద్యార్థులతో కళకళలాడుతోంది. -
చేనేత కళాకారులకు అవార్డులు
[ 29-06-2024]
తెలంగాణ హస్తకళలకు పుట్టినిల్లు. సింధు నాగరికత కాలం నుంచి కళలు వర్థిల్లినట్టు చారిత్రక ఆధారాలున్నాయి. రాజుల కాలంలో కళాకారులకు ఆదరణ లభించేది. వారి కళానైపుణ్యాన్ని ప్రోత్సహించేవారు. -
గర్భిణి మృతికి కారకులైన ఏడుగురిపై కేసు నమోదు
[ 29-06-2024]
చివ్వెంల మండలం ఎంజీనగర్ తండాకు చెందిన ఏడు నెలల గర్భిణి సుహాసిని (26) మృతికి కారకులైన ఆమె భర్త హరిసింగ్తోపాటు మరో ఆరుగురిపై శుక్రవారం కేసు నమోదు చేసినట్లు సూర్యాపేట ఇన్స్పెక్టర్ రాజశేఖర్ తెలిపారు. -
విద్యుత్తు సమస్యలకు సర్వేతో చెక్
[ 29-06-2024]
జిల్లాలోని విద్యుత్తు సిబ్బంది 11కేవీ ఫీడర్ల సమగ్ర సర్వే చేపడుతున్నారు. సూర్యాపేట, హుజూర్నగర్ డివిజన్లో సోమవారం నుంచి ప్రారంభమైంది. -
గర్భంలోనే నిండునూరేళ్లు..!
[ 29-06-2024]
సూర్యాపేట జిల్లా భ్రూణ హత్యలకు అడ్డాగా మారింది. చివ్వెంల మండలం ఎంజీనగర్ తండాకు చెందిన ఏడు నెలల గర్భిణి సుహాసిని (26) మృతి ఘటన జిల్లాలో లింగనిర్ధారణ, గర్భవిచ్ఛిత్తి (అబార్షన్) ఎంత యథేచ్ఛగా సాగుతుందో తెలిపేందుకు నిదర్శనంగా నిలుస్తోంది. -
నూతన చట్టాల రద్దుకు డిమాండ్
[ 29-06-2024]
జులై నుంచి అమలయ్యే నూతన క్రిమినల్ చట్టాలను రద్దు చేయాలని ఆలిండియా లాయర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు మామిడి వెంకట్రెడ్డి, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు బబ్బూరి హరినాథ్ డిమాండ్ చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
హరిహర వీరమల్లు.. పవన్ షూటింగ్ పార్ట్ ఎన్ని రోజులంటే?
-
మ్యాచ్ను ‘బ్రాడ్కాస్టింగ్’ గెలిపించదు కదా..: మైకెల్ వాన్కు గంగూలీ కౌంటర్
-
జియో vs ఎయిర్టెల్ vs వొడాఫోన్ ఐడియా.. పాపులర్ ప్లాన్ల లేటెస్ట్ ధరలు ఇవే..
-
ఏఐ వాయిస్తో లేడీ మాయ.. మహిళ నుంచి రూ.6 లక్షలు దోపిడీ
-
ఎస్సీ గురుకుల పాఠశాలల్లో ప్రవేశాలకు మరోసారి అవకాశం