అంతర పంటల సాగుపై అవగాహన కల్పించాలి
పండ్ల తోటల్లో అంతర పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించాలని జిల్లా పాలనాధికారి హన్మంతు కె.జెండగే సూచించారు. మండల కేంద్రంలోని స్వరణ్పాల్సింగ్ వ్యవసాయ క్షేత్రాన్ని మంగళవారం ఆయన సందర్శించారు.
రాజపేటలో మామిడితోటలో అంతర పంటగా ఉన్న కూరగాయల సాగును పరిశీలిస్తున్న జిల్లా పాలనాధికారి హన్మంతు కె.జెండగే
రాజపేట, న్యూస్టుడే: పండ్ల తోటల్లో అంతర పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించాలని జిల్లా పాలనాధికారి హన్మంతు కె.జెండగే సూచించారు. మండల కేంద్రంలోని స్వరణ్పాల్సింగ్ వ్యవసాయ క్షేత్రాన్ని మంగళవారం ఆయన సందర్శించారు. మామిడితోటలో అంతర పంటలుగా మిరప, టమాట, సోర లాంటి కూరగాయల సాగును పరిశీలించారు. ముఖ్యంగా గో ఆధారిత సేంద్రియ సాగును చేపడుతున్న రైతు స్వరణ్పాల్ సింగ్ను అభినందించారు. సాగుకు పెట్టుబడి, విక్రయం, వచ్చిన లాభం వివరాలను రైతును అడిగి తెలుసుకున్నారు. సేంద్రియ పద్ధతిలో తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఫలసాయం పొందుతున్న స్వరణ్పాల్సింగ్ వ్యవసాయ క్షేత్రాన్ని ఔత్సాహిక రైతులు సందర్శించి స్ఫూర్తి పొందేలా ఏర్పాట్లు చేయాలని వ్యవసాయాధికారులను ఆదేశించారు. జిల్లా వ్యవసాయాధికారి అనురాధ, యాదగిరిగుట్ట ఏడీఏ పద్మావతి, వ్యవసాయాధికారి మాధవి, అజయ్పాల్సింగ్, ఎర్రోళ్ల బాబు పాల్గొన్నారు.
అర్థవంతమైన రైతుభరోసాను అందిస్తాం.. మంత్రి తుమ్మల
రైతుల ద్వారా సలహాలు, సూచనలు స్వీకరించి సీఎం రేవంత్రెడ్డి దృష్టికి తీసుకెళ్లి అర్థవంతమైన రైతుభరోసా, రుణమాఫీ పథకాలు అమలు చేపట్టనున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. మండల కేంద్రంలోని రైతువేదికల ద్వారా మంగళవారం దృశ్య శ్రవణ విధానం(రైతునేస్తం)తో రైతులతో నేరుగా మాట్లాడి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ హన్మంతు కె.జెండగే, జిల్లా వ్యవసాయాధికారి అనురాధలతో పాటు అధికారులు, రైతులు హాజరయ్యారు. రాష్ట్ర ప్లానింగ్ కమిషన్ ఛైర్మన్ చిన్నారెడ్డి, వ్యవసాయ కమిషన్ కోదండరెడ్డి, వ్యవసాయ శాఖ సెక్రెటరీ రఘునందన్రావు, శాస్త్రవేత్తలతో కలిసి రైతులతో ముఖాముఖీ కార్యక్రమం చేపట్టారు. సాగులో పత్తి విత్తనాలు నాటుకోవచ్చని, రానున్న రోజుల్లో వర్ష సూచనలున్నాయని శాస్త్రవేత్తలు సూచించారు. ముఖ్యంగా విత్తనశుద్ధి చేపడితే చీడపీడల నివారణ కొంతమేర తగ్గించే అవకాశం ఉంటుందన్నారు. రైతుభరోసా వర్తింపునకు ఐటీ లాంటి నిబంధనలు సవరించాలని, పదెకరాల వరకు పరిగణలోకి తీసుకుని, సాగు చేసేవారికే వర్తింపజేసేలా చర్యలు తీసుకుంటే బాగుంటుందని రైతులు సూచించారు. ఎంపీపీ బాలమణి, ఎంపీటీసీ సభ్యుడు రాజు, ఏడీఏ పద్మావతి, ఉద్యానవనశాఖ అధికారి సైదులు, వ్యవసాయాధికారి మాధవి, గౌటె లక్ష్మణ్, మేక వేంకటేశ్వర్రెడ్డి, ఏఈవోలు, రైతులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పదవులన్నీ హస్తగతం
[ 29-06-2024]
అసెంబ్లీ ఎన్నికల్లో 12 సెగ్మెంట్లలో 11 స్థానాల్లో విజయం.. ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలోని రెండు స్థానాల్లోనూ గెలుపు. -
చరవాణితో..హాని..!
[ 29-06-2024]
జిల్లాలో కొందరు బాలికలు పోకిరీల మాయమాటలు నమ్మి..ప్రేమ పేరుతో గడప దాటుతున్నారు. నిజాన్ని గుర్తించే లోపు జరగాల్సిన నష్టం జరిగిపోతోంది. -
ప్రాదేశికంలోనూ.. ప్రత్యేక పాలనేనా..!
[ 29-06-2024]
జిల్లా పరిషత్, మండల పరిషత్, ప్రాదేశిక ఎన్నికలు ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. పదవీకాలం కొద్ది రోజులే ఉండటంతో ఇంతలో ఎన్నికలు జరిగే అవకాశాలు లేవు. -
ఉన్నత విద్యా వేదిక..!
[ 29-06-2024]
ఒకప్పుడు ఆరు కోర్సులతో ప్రారంభమైన విశ్వవిద్యాలయం అది. ఇప్పుడు 22 కోర్సులతో..రెండు వేల మంది విద్యార్థులతో కళకళలాడుతోంది. -
చేనేత కళాకారులకు అవార్డులు
[ 29-06-2024]
తెలంగాణ హస్తకళలకు పుట్టినిల్లు. సింధు నాగరికత కాలం నుంచి కళలు వర్థిల్లినట్టు చారిత్రక ఆధారాలున్నాయి. రాజుల కాలంలో కళాకారులకు ఆదరణ లభించేది. వారి కళానైపుణ్యాన్ని ప్రోత్సహించేవారు. -
గర్భిణి మృతికి కారకులైన ఏడుగురిపై కేసు నమోదు
[ 29-06-2024]
చివ్వెంల మండలం ఎంజీనగర్ తండాకు చెందిన ఏడు నెలల గర్భిణి సుహాసిని (26) మృతికి కారకులైన ఆమె భర్త హరిసింగ్తోపాటు మరో ఆరుగురిపై శుక్రవారం కేసు నమోదు చేసినట్లు సూర్యాపేట ఇన్స్పెక్టర్ రాజశేఖర్ తెలిపారు. -
విద్యుత్తు సమస్యలకు సర్వేతో చెక్
[ 29-06-2024]
జిల్లాలోని విద్యుత్తు సిబ్బంది 11కేవీ ఫీడర్ల సమగ్ర సర్వే చేపడుతున్నారు. సూర్యాపేట, హుజూర్నగర్ డివిజన్లో సోమవారం నుంచి ప్రారంభమైంది. -
గర్భంలోనే నిండునూరేళ్లు..!
[ 29-06-2024]
సూర్యాపేట జిల్లా భ్రూణ హత్యలకు అడ్డాగా మారింది. చివ్వెంల మండలం ఎంజీనగర్ తండాకు చెందిన ఏడు నెలల గర్భిణి సుహాసిని (26) మృతి ఘటన జిల్లాలో లింగనిర్ధారణ, గర్భవిచ్ఛిత్తి (అబార్షన్) ఎంత యథేచ్ఛగా సాగుతుందో తెలిపేందుకు నిదర్శనంగా నిలుస్తోంది. -
నూతన చట్టాల రద్దుకు డిమాండ్
[ 29-06-2024]
జులై నుంచి అమలయ్యే నూతన క్రిమినల్ చట్టాలను రద్దు చేయాలని ఆలిండియా లాయర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు మామిడి వెంకట్రెడ్డి, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు బబ్బూరి హరినాథ్ డిమాండ్ చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
రసాయన పరిశ్రమలో పేలిన రియాక్టర్.. వాహనాలు దగ్ధం
-
‘కల్కి’ పార్ట్-2 రిలీజ్ ఎప్పుడంటే? ఆసక్తికర విషయాలు చెప్పిన అశ్వనీదత్
-
‘ఐవీఎఫ్తో కవలలకు జన్మనిచ్చా’: వ్యక్తిగత విషయం వెల్లడించిన ఈశా అంబానీ
-
పులివెందుల కౌన్సిలర్ల అసమ్మతి.. పార్టీలోనే ఉండాలని ఎంపీ అవినాశ్ సూచన
-
రోహిత్ శర్మ ఉత్సాహం ఏమాత్రం తగ్గలేదు: జస్ప్రీత్ బుమ్రా
-
కేంద్రానికి నీతీశ్ కుమార్ మెలిక.. ‘ప్రత్యేక హోదా’ ఇవ్వాలంటూ తీర్మానం