తనిఖీ చేస్తా.. అలసత్వం వహిస్తే కఠినంగా వ్యవహరిస్తా: కలెక్టర్
ప్రభుత్వ ఆస్పత్రిలో సాధారణ ప్రసవాల సంఖ్య పెంచడంతో పాటు, రోగులకు మెరుగైన వైద్యం అందించాలని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ వైద్య అధికారులను ఆదేశించారు.
కోదాడ ప్రభుత్వ ఆస్పత్రిలో రోగులతో మాట్లాడుతున్న కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్
కోదాడ, న్యూస్టుడే: ప్రభుత్వ ఆస్పత్రిలో సాధారణ ప్రసవాల సంఖ్య పెంచడంతో పాటు, రోగులకు మెరుగైన వైద్యం అందించాలని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ వైద్య అధికారులను ఆదేశించారు. పట్టణంలోని సామాజిక వైద్యశాలను మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేసి మాట్లాడారు. జనరల్ వార్డు రూమ్, ఎక్స్రే, ప్రయోగశాలను, ఫార్మసీ కేంద్రాన్ని పరిశీలించారు. నిత్యం ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చే ఓపీ సంఖ్యను రికార్డుల్లో తనిఖీ చేశారు. డయాలసిస్ యూనిట్ను పరిశీలించి రోజుకు ఎంత మంది వస్తున్నారు, వారికి అందుతున్న సౌకర్యాలపై ఆరా తీశారు. ప్రసూతి వార్డుల్లో పర్యటించి మహిళలను ఆస్పత్రిలో అందుతున్న వైద్యంపై స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రిలో వైద్యుల కొరత ఉందని ఆస్పత్రి సూపరింటెండెంట్ తెలపగా త్వరలోనే వైద్య సిబ్బందిని పూర్తి స్థాయిలో ఏర్పాటు చేస్తామన్నారు. వంద పడకల ఆస్పత్రి నిర్మాణ పనులు త్వరలోనే ప్రారంభిస్తామన్నారు.
షాదీఖానా, ఈద్గా స్థలాల పరిశీలన: పట్టణంలో నిర్మించే ఈద్గా కోసం రూ.2 కోట్లు, షాదీఖానాకు రూ.3 కోట్లు మంజూరు కావడంతో వీటిని నిర్మించేందుకు సాలార్జంగ్పేటలోని పలు స్థలాలను కలెక్టర్ పరిశీలించారు. త్వరలోనే స్థలాన్ని ఎంపిక చేసి నిర్మాణాలు చేపడతామని తెలిపారు.
ఉపాధ్యాయులపై అసహనం: స్థానిక ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలకు వెళ్లిన ఆయన, అక్కడ ఉపాధ్యాయులు లేకపోవడంతో అసహనం వ్యక్తం చేశారు. విద్యార్థుల చేరికలో ఎందుకు వెనుకబడ్డారని, విద్యార్థులు ఎక్కువ మంది చేరేలా క్షేత్రస్థాయిలో పని చేయాలన్నారు. ఆకస్మిక తనిఖీలు చేస్తానని, విధుల్లో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తప్పవని విద్య, వైద్య సిబ్బందిని హెచ్చరించారు. కార్యక్రమంలో పుర ఛైర్పర్సన్ సామినేని ప్రమీల, ఆస్పత్రి సూపరింటెండెంట్ దశరథ, ఆర్డీవో సూర్యనారాయణ, ఎంఈవో షరీఫ్, పుర వైస్ ఛైర్మన్ కోటేశ్వరరావు, తహసీల్దార్ సాయగౌడ్ పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పదవులన్నీ హస్తగతం
[ 29-06-2024]
అసెంబ్లీ ఎన్నికల్లో 12 సెగ్మెంట్లలో 11 స్థానాల్లో విజయం.. ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలోని రెండు స్థానాల్లోనూ గెలుపు. -
చరవాణితో..హాని..!
[ 29-06-2024]
జిల్లాలో కొందరు బాలికలు పోకిరీల మాయమాటలు నమ్మి..ప్రేమ పేరుతో గడప దాటుతున్నారు. నిజాన్ని గుర్తించే లోపు జరగాల్సిన నష్టం జరిగిపోతోంది. -
ప్రాదేశికంలోనూ.. ప్రత్యేక పాలనేనా..!
[ 29-06-2024]
జిల్లా పరిషత్, మండల పరిషత్, ప్రాదేశిక ఎన్నికలు ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. పదవీకాలం కొద్ది రోజులే ఉండటంతో ఇంతలో ఎన్నికలు జరిగే అవకాశాలు లేవు. -
ఉన్నత విద్యా వేదిక..!
[ 29-06-2024]
ఒకప్పుడు ఆరు కోర్సులతో ప్రారంభమైన విశ్వవిద్యాలయం అది. ఇప్పుడు 22 కోర్సులతో..రెండు వేల మంది విద్యార్థులతో కళకళలాడుతోంది. -
చేనేత కళాకారులకు అవార్డులు
[ 29-06-2024]
తెలంగాణ హస్తకళలకు పుట్టినిల్లు. సింధు నాగరికత కాలం నుంచి కళలు వర్థిల్లినట్టు చారిత్రక ఆధారాలున్నాయి. రాజుల కాలంలో కళాకారులకు ఆదరణ లభించేది. వారి కళానైపుణ్యాన్ని ప్రోత్సహించేవారు. -
గర్భిణి మృతికి కారకులైన ఏడుగురిపై కేసు నమోదు
[ 29-06-2024]
చివ్వెంల మండలం ఎంజీనగర్ తండాకు చెందిన ఏడు నెలల గర్భిణి సుహాసిని (26) మృతికి కారకులైన ఆమె భర్త హరిసింగ్తోపాటు మరో ఆరుగురిపై శుక్రవారం కేసు నమోదు చేసినట్లు సూర్యాపేట ఇన్స్పెక్టర్ రాజశేఖర్ తెలిపారు. -
విద్యుత్తు సమస్యలకు సర్వేతో చెక్
[ 29-06-2024]
జిల్లాలోని విద్యుత్తు సిబ్బంది 11కేవీ ఫీడర్ల సమగ్ర సర్వే చేపడుతున్నారు. సూర్యాపేట, హుజూర్నగర్ డివిజన్లో సోమవారం నుంచి ప్రారంభమైంది. -
గర్భంలోనే నిండునూరేళ్లు..!
[ 29-06-2024]
సూర్యాపేట జిల్లా భ్రూణ హత్యలకు అడ్డాగా మారింది. చివ్వెంల మండలం ఎంజీనగర్ తండాకు చెందిన ఏడు నెలల గర్భిణి సుహాసిని (26) మృతి ఘటన జిల్లాలో లింగనిర్ధారణ, గర్భవిచ్ఛిత్తి (అబార్షన్) ఎంత యథేచ్ఛగా సాగుతుందో తెలిపేందుకు నిదర్శనంగా నిలుస్తోంది. -
నూతన చట్టాల రద్దుకు డిమాండ్
[ 29-06-2024]
జులై నుంచి అమలయ్యే నూతన క్రిమినల్ చట్టాలను రద్దు చేయాలని ఆలిండియా లాయర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు మామిడి వెంకట్రెడ్డి, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు బబ్బూరి హరినాథ్ డిమాండ్ చేశారు.