భూముల విలువ పెంపునకు కసరత్తు
భూముల మార్కెట్ విలువ సవరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడంతో క్షేత్రస్థాయిలో సబ్రిజిస్ట్రార్లు, తహసీల్దార్లు అధ్యయనం ప్రారంభించారు. ప్రభుత్వానికి ఆదాయం రావడంతో పాటు ప్రజలకు ఇబ్బందులు లేకుండా ఈ పెంపు ఉండాలని సర్కారు పెద్దల ఆదేశించడంతో అధికారులు కసరత్తు చేస్తున్నారు.
క్షేత్రస్థాయిలో సబ్ రిజిస్ట్రార్లు, తహసీల్దార్ల అధ్యయనం
ఈనాడు, నల్గొండ
భూముల మార్కెట్ విలువ సవరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడంతో క్షేత్రస్థాయిలో సబ్రిజిస్ట్రార్లు, తహసీల్దార్లు అధ్యయనం ప్రారంభించారు. ప్రభుత్వానికి ఆదాయం రావడంతో పాటు ప్రజలకు ఇబ్బందులు లేకుండా ఈ పెంపు ఉండాలని సర్కారు పెద్దల ఆదేశించడంతో అధికారులు కసరత్తు చేస్తున్నారు. జిల్లా కేంద్రాలైన నల్గొండ, భువనగిరి, సూర్యాపేటల్లో వాస్తవ ధరలకు, మార్కెట్ వెలలకు భారీ వ్యత్యాసం ఉందని గుర్తించి వాటి అంతరాన్ని తగ్గించే విధంగా చర్యలు మొదలుపెట్టారు.
వారంలో ప్రభుత్వానికి నివేదిక
మండల స్థాయిలో భూముల విలువ పెంపుపై సబ్ రిజిస్ట్రార్లు, తహసీల్దార్లతో కూడిన సమన్వయ కమిటీ అధ్యయనం తుది దశకు చేరుకుంది. మండల, పురపాలిక, డివిజన్, జిల్లా కేంద్రాల స్థాయిలో డిమాండ్ ఉన్న సర్వే నెంబర్లేవీ, వాటిలో ప్రస్తుతం ఎంత విలువ ఉంది? బహిరంగ మార్కెట్తో పోలిస్తే ఎంత మేర పెంపునకు ఆస్కారం ఉంటుందనే వివరాలను రెవెన్యూ సిబ్బంది ద్వారా రిజిస్ట్రేషన్ అధికారులు సేకరిస్తున్నారు. ఈ నెలాఖరుకు కసరత్తు పూర్తి చేసి ఏ ప్రాంతంలో ఎంత పెంచాలో తెలుపుతూ ప్రాథమిక నివేదికను సిద్ధం చేయనున్నారు. ఈ నివేదికలన్నీ జిల్లా స్థాయిలో కలెక్టర్ ఛైర్మన్గా ఉన్న కమిటీకి చేరనున్నాయి. తర్వాత ప్రభుత్వం ప్రతిపాదిత నివేదికల ప్రకారం అభ్యంతరాలు స్వీకరించి సమస్యల పరిష్కారం అనంతరం ఆ ధరలను వాస్తవ రూపంలోకి తేనున్నారు. ఆగస్టు నెల ప్రారంభం నాటికి ఈ క్రతువును పూర్తి చేయనున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.
ఈ ధరల్లో హెచ్చుతగ్గుల వల్ల ప్రాజెక్టుల నిర్మాణ సమయంలోనూ నిర్వాసితులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. డిండి ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మిస్తున్న చర్లగూడెం, కిష్టరాయినిపల్లి రిజర్వాయర్లలో భూములు కోల్పోతున్న వారికి ప్రభుత్వం నుంచి గరిష్ఠంగా పరిహారం దక్కలేదు. భూసేకరణ చట్టం - 2013 ప్రకారం బహిరంగ మార్కెట్లో భూమి విలువకు అదనంగా నాలుగు రెట్లు పెంచి ప్రభుత్వం నిర్వాసితుడికి పరిహారం చెల్లిస్తుంది. ఆ ప్రాంతాల్లో బహిరంగ మార్కెట్కు, రిజిస్ట్రేషన్ విలువకు భారీ అంతరం ఉండటంతో చాలా మంది నిర్వాసితులకు న్యాయం దక్కలేదని అధికారులే అప్పట్లో అభిప్రాయపడ్డారు. ఈ హేతుబద్ధ పెంపు వల్ల ప్రాజెక్టు నిర్వాసితులకు సైతం గరిష్ఠ పరిహారం దక్కనుందని అధికార వర్గాలు వెల్లడించాయి.
డిమాండ్కు అనుగుణంగా నిర్ణయం
గత ప్రభుత్వం 2021, 2022లో వ్యవసాయ భూముల మార్కెట్ విలువ పెంపు సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా తక్కువ ధరలున్న చోట 50 శాతం, మధ్యస్థంగా ఉంటే 40, ఎక్కువ ఉంటే 30 శాతం వరకు ఒకే విధంగా పెంచారు. ఈ దఫా అలా కాకుండా డిమాండ్ ఉన్న ప్రాంతాల్లో మార్కెట్ విలువ ఎంత ఉంది? ప్రభుత్వ ధర ఎంత ఉందని తెలుసుకొని రెండింటి మధ్య వ్యత్యాసాన్ని గణనీయంగా తగ్గించే విధంగా హేతుబద్ధ ప్రక్రియకు అధికారులు కృషి చేస్తున్నారు. ఉదాహరణకు నల్గొండ పట్టణంలోని దేవరకొండ రహదారిలో, నకిరేకల్-సాగర్ జాతీయ రహదారి పక్కన ఉన్న ప్రాంతాల్లో గజం రూ.లక్ష వరకు బహిరంగ మార్కెట్లో పలుకుతుండగా.. సబ్ రిజిస్ట్రార్ మార్కెట్ విలువ మాత్రం రూ.10 వేల వరకు ఉంది. ఇక్కడ సుమారు రూ.20 వేల నుంచి రూ.30 వేల వరకు రిజిస్ట్రేషన్ విలువ పెంచుకునే వెసులుబాటు ఉందని అధికారులు గుర్తించారు.
హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారిని ఆనుకొని ఉన్న స్థలాల్లో గత ప్రభుత్వం మార్కెట్ ధర అన్ని ఒకే స్థాయిలో పెంచింది. ఇప్పుడు అలా కాకుండా పురపాలికలు, మండల కేంద్రాల్లో ఒక ధర, గ్రామాల్లో ఒక ధర పెంచాలని అధికారులు ప్రాథమికంగా నిర్ణయించారు. జిల్లా కేంద్రమైన భువనగిరిలో పట్టణం నడిబొడ్డున బాగా డిమాండ్ ఉన్న ప్రాంతాల్లో మార్కెట్ ధర, పురపాలిక చివరన, రహదారికి దూరంగా ఉన్న ప్రాంతాల్లో ధరలు పోల్చినప్పుడు ఒకే విధంగా ఉన్నాయని అధికారులు అంచనాకు వచ్చారు.
హేతుబద్ధంగా ఉండేలా..
- కోమటిరెడ్డి వేణుగోపాల్రెడ్డి, సబ్ రిజిస్ట్రార్, నల్గొండ
ప్రభుత్వ ఆదేశం మేరకు భూముల విలువ పెంపు హేతుబద్ధంగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నాం. డిమాండ్ ఉన్న ప్రాంతాల్లో బహిరంగ మార్కెట్లో ఎంత ఉంది? రిజిస్ట్రేషన్ ధర ఎంత ఉంది? అనే దానిపై అధ్యయనం చేస్తున్నాం. మరో వారం రోజుల్లో ఈ కసరత్తు కొలిక్కి వస్తుంది. ఈ నెలాఖరుకు నివేదిక సమర్పిస్తాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భాజపా నాయకుల ధర్నా
[ 29-06-2024]
మంచిర్యాల జిల్లాలోని చెన్నూరు ప్రభుత్వ సామాజిక ఆసుపత్రిలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని కోరుతూ భాజపా నాయకులు ఆసుపత్రి ముందు ధర్నా నిర్వహించారు. -
గనుల వేలాన్ని నిరసిస్తూ కలెక్టరేట్ ఎదుట ధర్నా
[ 29-06-2024]
ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటుపరం చేసే కేంద్ర ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ కలెక్టరేట్ ఎదుట సీఐటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. -
ప్రకృతి వైద్యంతోనే సంపూర్ణ ఆరోగ్యం
[ 29-06-2024]
సహజ సిద్ధంగా లభించే ఆహారం ద్వారానే సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని ప్రముఖ ప్రకృతి వైద్యుడు డాక్టర్ రామచంద్ర అన్నారు. -
పదవులన్నీ హస్తగతం
[ 29-06-2024]
అసెంబ్లీ ఎన్నికల్లో 12 సెగ్మెంట్లలో 11 స్థానాల్లో విజయం.. ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలోని రెండు స్థానాల్లోనూ గెలుపు. -
చరవాణితో..హాని..!
[ 29-06-2024]
జిల్లాలో కొందరు బాలికలు పోకిరీల మాయమాటలు నమ్మి..ప్రేమ పేరుతో గడప దాటుతున్నారు. నిజాన్ని గుర్తించే లోపు జరగాల్సిన నష్టం జరిగిపోతోంది. -
ప్రాదేశికంలోనూ.. ప్రత్యేక పాలనేనా..!
[ 29-06-2024]
జిల్లా పరిషత్, మండల పరిషత్, ప్రాదేశిక ఎన్నికలు ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. పదవీకాలం కొద్ది రోజులే ఉండటంతో ఇంతలో ఎన్నికలు జరిగే అవకాశాలు లేవు. -
ఉన్నత విద్యా వేదిక..!
[ 29-06-2024]
ఒకప్పుడు ఆరు కోర్సులతో ప్రారంభమైన విశ్వవిద్యాలయం అది. ఇప్పుడు 22 కోర్సులతో..రెండు వేల మంది విద్యార్థులతో కళకళలాడుతోంది. -
చేనేత కళాకారులకు అవార్డులు
[ 29-06-2024]
తెలంగాణ హస్తకళలకు పుట్టినిల్లు. సింధు నాగరికత కాలం నుంచి కళలు వర్థిల్లినట్టు చారిత్రక ఆధారాలున్నాయి. రాజుల కాలంలో కళాకారులకు ఆదరణ లభించేది. వారి కళానైపుణ్యాన్ని ప్రోత్సహించేవారు. -
గర్భిణి మృతికి కారకులైన ఏడుగురిపై కేసు నమోదు
[ 29-06-2024]
చివ్వెంల మండలం ఎంజీనగర్ తండాకు చెందిన ఏడు నెలల గర్భిణి సుహాసిని (26) మృతికి కారకులైన ఆమె భర్త హరిసింగ్తోపాటు మరో ఆరుగురిపై శుక్రవారం కేసు నమోదు చేసినట్లు సూర్యాపేట ఇన్స్పెక్టర్ రాజశేఖర్ తెలిపారు. -
విద్యుత్తు సమస్యలకు సర్వేతో చెక్
[ 29-06-2024]
జిల్లాలోని విద్యుత్తు సిబ్బంది 11కేవీ ఫీడర్ల సమగ్ర సర్వే చేపడుతున్నారు. సూర్యాపేట, హుజూర్నగర్ డివిజన్లో సోమవారం నుంచి ప్రారంభమైంది. -
గర్భంలోనే నిండునూరేళ్లు..!
[ 29-06-2024]
సూర్యాపేట జిల్లా భ్రూణ హత్యలకు అడ్డాగా మారింది. చివ్వెంల మండలం ఎంజీనగర్ తండాకు చెందిన ఏడు నెలల గర్భిణి సుహాసిని (26) మృతి ఘటన జిల్లాలో లింగనిర్ధారణ, గర్భవిచ్ఛిత్తి (అబార్షన్) ఎంత యథేచ్ఛగా సాగుతుందో తెలిపేందుకు నిదర్శనంగా నిలుస్తోంది. -
నూతన చట్టాల రద్దుకు డిమాండ్
[ 29-06-2024]
జులై నుంచి అమలయ్యే నూతన క్రిమినల్ చట్టాలను రద్దు చేయాలని ఆలిండియా లాయర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు మామిడి వెంకట్రెడ్డి, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు బబ్బూరి హరినాథ్ డిమాండ్ చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
దక్షిణాఫ్రికాతో ఏకైక టెస్టు.. రెండో రోజు ముగిసిన ఆట
-
జట్టు ఫామే కీలకం.. విరాట్ గురించి ఆందోళన అక్కర్లేదు: మంజ్రేకర్
-
‘దీనికి నెహ్రూను నిందించొద్దు ప్లీజ్’.. భాజపా పోస్ట్ వైరల్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
హరిహర వీరమల్లు.. పవన్ షూటింగ్ పార్ట్ ఎన్ని రోజులంటే?
-
మ్యాచ్ను ‘బ్రాడ్కాస్టింగ్’ గెలిపించదు కదా..: మైకెల్ వాన్కు గంగూలీ కౌంటర్