ఇసుకాసురుల ఇష్టారాజ్యం
ఇసుక కొరతను తీర్చేందుకు నార్కట్పల్లి మండలంలో ఇసుక డిపోల ఏర్పాటుపై అధికారులు కఠిన చర్యలు చేపట్టకపోవడంతో ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతోంది.
నార్కట్పల్లి గ్రామీణం న్యూస్టుడే: ఇసుక కొరతను తీర్చేందుకు నార్కట్పల్లి మండలంలో ఇసుక డిపోల ఏర్పాటుపై అధికారులు కఠిన చర్యలు చేపట్టకపోవడంతో ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. ఇసుకాసురులకు మూడు పువ్వులు ఆరు కాయలుగా కాసుల వర్షం కురిపిస్తోంది. నార్కట్పల్లి మండలంలోని అమ్మనబోలు శివారులోని నిత్యం మూసీ జలాలు పారుతూనే ఉంటాయి. కానీ.. పచ్చని పంటలు మాత్రం మచ్చుకైనా కనిపించవు. దీనంతటికీ కారణం అక్రమార్కులు మూసీ నుంచి ఇసుకను తరలించడమే. అనుమతులు లేకున్నా.. రోజు ఇక్కడి నుంచి వందల సంఖ్యలో వాహనాల్లో ఇసుకను తరలిస్తున్నారు. తమకేం సంబంధం లేదన్నట్లు అధికారులు పట్టించుకోవడం లేదు. దీంతో భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. ఇసుకను తరలించవద్దని గ్రామస్థులు పేర్కొంటున్నా.. కొందరు ప్రజాప్రతినిధులే ఇసుకను తరలిస్తూ జేబులు నింపుకొంటున్నారు. ఈ గ్రామంలో ప్రతి పది ఇళ్లకు ఒక ట్రాక్టర్ ఉంది అంటే ఇసుక ఎంత మోతాదులో తరలిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు.
ప్రమాదకరంగా మూసీ వాగు లోలెవల్ వంతెన..
మూసీ వాగు లోలెవల్ వంతెన నుంచి నీరు పారుతుంది. వంతెన కింద ఉన్న ఇసుకను నిత్యం ట్రాక్టర్లలో తరలించడం ద్వారా వంతెన అడుగు భాగం దెబ్బతింటుంది. ఇసుకాసురులు ఇష్టారాజ్యంగా ఇసుకను ఎక్కడపడితే అక్కడ తీస్తుండటంతో వంతెన కూలే ప్రమాదం ఉంది.
అందరూ భాగస్వాములే..
అక్రమంగా సాగుతున్న ఇసుక వ్యాపారంలో ఆ గ్రామంలోని కొంత మంది నాయకుల సహకారంతోనే రోజు రోజుకు ఇసుక మాఫియా పెరుగిపోతుంది. దీనికి తోడు పోలీసులు, రెవెన్యూ అధికారులు కూడా చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆయా శాఖాధికారులు, ప్రజాప్రతినిధులు నిజాయతీగా వ్యవహరిస్తే ఇసుక తరలింపును ఆపడం కష్టమైన పనేమి కాదు.
కఠిన చర్యలు తీసుకుంటాం
-వెంకటేశ్వర్రావు, తహసీల్దార్, నార్కట్పల్లి
అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుకను తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటున్నాం. గత కొద్ది రోజుల క్రితం పోలీసు శాఖ వారి సహకారంతో ఇసుక తరలిస్తున్న వారిని బైండోవర్ చేశాం. మూసీ వాగు నుంచి అక్రమంగా ఇసుకను తరలించకుండా నిఘా ఏర్పాటు చేసి చర్యలు తీసుకుంటాం.
కేసులు నమోదు చేస్తున్నాం..
-అంతిరెడ్డి, ఎస్సై, నార్కట్పల్లి
ఇసుక తరలిస్తున్నట్లు మా దృష్టికి వచ్చింది. ఘటన స్థలీకి వెళ్లి కేసులు నమోదు చేస్తున్నాం. త్వరలోనే అమ్మనబోలులో ఇద్దరు సిబ్బందిని నియమించి ఇసుక వ్యాపారం చేస్తున్న వారిపై కేసులు నమోదు చేస్తున్నాం.
ఇసుక తరలింపును అరికట్టాలి
-కొమ్ము గిరి, స్థానికుడు
మూసీ వాగు నుంచి ఇసుక మాఫియా ఆగడాలు రోజురోజుకు మితిమీరిపోతున్నాయి. కేవలం స్థానిక అవసరాలకు సరిపడా మాత్రమే ఇసుక నిల్వలే ఉండే వాగును ఇష్టానుసారంగా తవ్వేస్తున్నారు. పలు మార్లు అధికారులకు ఫిర్యాదు చేసిన ఫలితం లేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఇసుక తరలింపును నియంత్రించాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భాజపా నాయకుల ధర్నా
[ 29-06-2024]
మంచిర్యాల జిల్లాలోని చెన్నూరు ప్రభుత్వ సామాజిక ఆసుపత్రిలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని కోరుతూ భాజపా నాయకులు ఆసుపత్రి ముందు ధర్నా నిర్వహించారు. -
గనుల వేలాన్ని నిరసిస్తూ కలెక్టరేట్ ఎదుట ధర్నా
[ 29-06-2024]
ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటుపరం చేసే కేంద్ర ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ కలెక్టరేట్ ఎదుట సీఐటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. -
ప్రకృతి వైద్యంతోనే సంపూర్ణ ఆరోగ్యం
[ 29-06-2024]
సహజ సిద్ధంగా లభించే ఆహారం ద్వారానే సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని ప్రముఖ ప్రకృతి వైద్యుడు డాక్టర్ రామచంద్ర అన్నారు. -
పదవులన్నీ హస్తగతం
[ 29-06-2024]
అసెంబ్లీ ఎన్నికల్లో 12 సెగ్మెంట్లలో 11 స్థానాల్లో విజయం.. ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలోని రెండు స్థానాల్లోనూ గెలుపు. -
చరవాణితో..హాని..!
[ 29-06-2024]
జిల్లాలో కొందరు బాలికలు పోకిరీల మాయమాటలు నమ్మి..ప్రేమ పేరుతో గడప దాటుతున్నారు. నిజాన్ని గుర్తించే లోపు జరగాల్సిన నష్టం జరిగిపోతోంది. -
ప్రాదేశికంలోనూ.. ప్రత్యేక పాలనేనా..!
[ 29-06-2024]
జిల్లా పరిషత్, మండల పరిషత్, ప్రాదేశిక ఎన్నికలు ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. పదవీకాలం కొద్ది రోజులే ఉండటంతో ఇంతలో ఎన్నికలు జరిగే అవకాశాలు లేవు. -
ఉన్నత విద్యా వేదిక..!
[ 29-06-2024]
ఒకప్పుడు ఆరు కోర్సులతో ప్రారంభమైన విశ్వవిద్యాలయం అది. ఇప్పుడు 22 కోర్సులతో..రెండు వేల మంది విద్యార్థులతో కళకళలాడుతోంది. -
చేనేత కళాకారులకు అవార్డులు
[ 29-06-2024]
తెలంగాణ హస్తకళలకు పుట్టినిల్లు. సింధు నాగరికత కాలం నుంచి కళలు వర్థిల్లినట్టు చారిత్రక ఆధారాలున్నాయి. రాజుల కాలంలో కళాకారులకు ఆదరణ లభించేది. వారి కళానైపుణ్యాన్ని ప్రోత్సహించేవారు. -
గర్భిణి మృతికి కారకులైన ఏడుగురిపై కేసు నమోదు
[ 29-06-2024]
చివ్వెంల మండలం ఎంజీనగర్ తండాకు చెందిన ఏడు నెలల గర్భిణి సుహాసిని (26) మృతికి కారకులైన ఆమె భర్త హరిసింగ్తోపాటు మరో ఆరుగురిపై శుక్రవారం కేసు నమోదు చేసినట్లు సూర్యాపేట ఇన్స్పెక్టర్ రాజశేఖర్ తెలిపారు. -
విద్యుత్తు సమస్యలకు సర్వేతో చెక్
[ 29-06-2024]
జిల్లాలోని విద్యుత్తు సిబ్బంది 11కేవీ ఫీడర్ల సమగ్ర సర్వే చేపడుతున్నారు. సూర్యాపేట, హుజూర్నగర్ డివిజన్లో సోమవారం నుంచి ప్రారంభమైంది. -
గర్భంలోనే నిండునూరేళ్లు..!
[ 29-06-2024]
సూర్యాపేట జిల్లా భ్రూణ హత్యలకు అడ్డాగా మారింది. చివ్వెంల మండలం ఎంజీనగర్ తండాకు చెందిన ఏడు నెలల గర్భిణి సుహాసిని (26) మృతి ఘటన జిల్లాలో లింగనిర్ధారణ, గర్భవిచ్ఛిత్తి (అబార్షన్) ఎంత యథేచ్ఛగా సాగుతుందో తెలిపేందుకు నిదర్శనంగా నిలుస్తోంది. -
నూతన చట్టాల రద్దుకు డిమాండ్
[ 29-06-2024]
జులై నుంచి అమలయ్యే నూతన క్రిమినల్ చట్టాలను రద్దు చేయాలని ఆలిండియా లాయర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు మామిడి వెంకట్రెడ్డి, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు బబ్బూరి హరినాథ్ డిమాండ్ చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
వామ్మో.. ఇదేం మోసం.. ‘డేటింగ్ యాప్’ మాయలో సివిల్స్ అభ్యర్థి
-
మా బావ ప్రభాస్కు అభినందనలు: మోహన్బాబు ట్వీట్ వైరల్
-
హైదరాబాద్తో సమానంగా వరంగల్ అభివృద్ధి: సీఎం రేవంత్
-
‘ఈనాడు’ అంటే ప్రజలకు అంత నమ్మకం: పరుచూరి గోపాలకృష్ణ
-
దక్షిణాఫ్రికాతో ఏకైక టెస్టు.. రెండో రోజు ముగిసిన ఆట
-
జట్టు ఫామే కీలకం.. విరాట్ గురించి ఆందోళన అక్కర్లేదు: మంజ్రేకర్