Nalgonda: ఎమ్మెల్సీని అడ్డుకున్న భాజపా నాయకులు
రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఉద్యోగ నియామకాల ప్రక్రియను చేపట్టాలని డిమాండ్ చేస్తూ బీజేవైఎం భాజపా ఆధ్వర్యంలో భువనగిరి జడ్పీ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు.
భువనగిరి: రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఉద్యోగ నియామకాల ప్రక్రియను చేపట్టాలని డిమాండ్ చేస్తూ బీజేవైఎం భాజపా ఆధ్వర్యంలో భువనగిరి జడ్పీ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. జిల్లా పరిషత్ సమావేశంలో పాల్గొనేందుకు వచ్చిన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నను అడ్డుకున్నారు. జాబ్ క్యాలండర్ విడుదల చేయడంతో పాటు ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ చేయాలని నినాదాలు చేశారు. ఎమ్మెల్సీనీ అడ్డుకోవడంతో కొంత రసాభాస జరిగింది. పోలీసులు భాజపా నాయకులను అదుపులోకి తీసుకొని స్టేషన్కు తరలించారు. అనంతరం ఎమ్మెల్సీ మల్లన్నకు పార్టీ నాయకులు వినతిపత్రం సమర్పించారు. భాజపా నాయకులు నర్ల నర్సింగ్ రావు, రత్నపురం శ్రీశైలం, మాయ దశరథ, సంతోష్ తదితరులు ఆందోళనలో పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోలీసుల వేట.. దొరికింది దొంగల ముఠా
[ 06-07-2024]
హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారిపై ఇటీవల జరుగుతున్న దోపిడీలు, దొంగతనాలు తాజాగా పోలీసులకు చిక్కిన పార్థీ ముఠా పనేనా?, ఇంకా ఇందులో ఎవరైనా భాగస్వామ్యం ఉన్నారా?, పార్థీ సభ్యులు ఇంకా ఎక్కడెక్కడ నేరాలకు పాల్పడ్డారు.. అనే కోణంలో నల్గొండ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
వాగులో పడి రైతు మృతి
[ 06-07-2024]
వాగులో పడి ఓ రైతు మృతి చెందిన ఘటన పాలవరం తండాలో చోటు చేసుకుంది. గ్రామస్థుల కథనం ప్రకారం గ్రామానికి చెందిన ధరావత్ రాములు(75) గేదెలు మేపేందుకు గురువారం పాలేరు వాగు సమీపంలోకి వెళ్లాడు. -
కౌమారం.. కల్లోలం
[ 06-07-2024]
పిల్లలు పెరుగుతుంటే తల్లిదండ్రులకు చెప్పలేని ఆనందం. చూస్తుండగానే పెద్దయ్యారని మురుస్తుంది కన్నపేగు. బుడిబుడి అడుగులు దాటి ‘తప్ప’టడుగులు వేసే సమయం రానే వస్తుంది. -
మిగులు సీట్ల భర్తీకి కసరత్తు
[ 06-07-2024]
సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో మిగులు సీట్లను భర్తీ చేసేందుకు అర్హులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడానికి సంస్థ పరంగా అవకాశం కల్పించారు. -
వసతుల్లేని గృహాలు
[ 06-07-2024]
విద్యా సంవత్సరం ప్రారంభం అయింది.సెలవుల తర్వాత ఇంటిని వదిలి వసతిగృహాలకు వెళ్లాలంటే విద్యార్థులు ఇష్టపడరు. -
ఉద్యోగుల్లో బదిలీ సందడి
[ 06-07-2024]
రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల బదిలీలపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లాతో పాటు జోనల్, రాష్ట్ర స్థాయి ఉద్యోగుల బదిలీ ప్రక్రియను ఈ నెల 20 తేదీ లోగా ముగించాలని ప్రభుత్వం నిర్దేశించింది. -
22 టన్నుల పీడీఎస్ బియ్యం లారీ పట్టివేత
[ 06-07-2024]
ఏపీకి రేషన్ బియ్యం అక్రమంగా తరలిస్తున్న లారీ పట్టుబడ్డ ఘటన దామరచర్ల మండల పరిధిలోని వాడపల్లి పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. -
సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో.. సిబ్బంది కొరత
[ 06-07-2024]
సూర్యాపేట సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో సిబ్బంది కొరత వేధిస్తోంది. సకాలంలో రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తికాక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. -
ముందుకు సాగునా!
[ 06-07-2024]
వర్షాలు ఆశాజనకంగా కురవడం లేదు. ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు నమోదయ్యాయి. మెట్ట పంటలకు ప్రాణం పోస్తున్నాయే తప్ప చెరువు, కుంటలు నిండిన పరిస్థితి కనిపించడం లేదు. -
దాడిని నిరసిస్తూ భారాస ఆందోళన
[ 06-07-2024]
భారాస కార్యకర్తలపై యాదగిరిగుట్ట పోలీసులు విచక్షణ రహితంగా దాడి చేశారని ఆరోపిస్తూ, ఈ దాడికి నిరసనగా శుక్రవారం యాదగిరిగుట్టలో ఆ పార్టీ శ్రేణులు ఆందోళన చేపట్టారు. -
యాదాద్రి పుణ్యక్షేత్రం మహిమాన్వితం
[ 06-07-2024]
పంచనారసింహులతో స్వయంభూ క్షేత్రంగా విరాజిల్లుతున్న యాదాద్రి ఎంతో మహిమాన్వితమైందని మెదక్ జిల్లా రంగంపేట ఆశ్రమ పీఠాధిపతి మాధవానందస్వామి తన ప్రవచనం ద్వారా భక్తులకు తెలిపారు. -
సంప్రదాయ పర్వాలు.. అమ్మవారి సేవోత్సవం
[ 06-07-2024]
యాదాద్రి పుణ్యక్షేత్రంలో శుక్రవారం అమ్మవారి సంప్రదాయ కైంకర్యాలను ఆలయ ఆచారంగా కొనసాగించారు.