ABVP: ఏబీవీపీ ఆధ్వర్యంలో ధర్నా
అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ యాదాద్రి భువనగిరి జిల్లా శాఖ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టర్ కలెక్టరేట్ కార్యాలయాన్ని ముట్టడించారు.
భువనగిరి: అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ యాదాద్రి భువనగిరి జిల్లా శాఖ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టర్ కలెక్టరేట్ కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ సందర్భంగా ఏబీవీపీ నల్గొండ విభాగ్ కన్వీనర్ సుర్వి మణికంఠ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం వచ్చి పది సంవత్సరాలు పూర్తి కావస్తున్న నేటికీ విద్యారంగంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించలేకపోతున్నారని విమర్శించారు. పేద విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటుంటే ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు, టీచర్లు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బంది గురవుతున్నారు. ఏబీవీపీ నల్గొండ ఎస్ఎఫ్డీ విభాగ్ కన్వీనర్ సామల సాయికుమార్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సాయిరాం, స్టేట్ వర్కింగ్ కమిటీ మెంబర్ జూపల్లి, శివకుమార్ విజయ్, పవన సిద్దు, వంశీ, యశ్వంత్, మని, సాయి, తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నిరుద్యోగులను వంచించిన సర్కార్: గొంగిడి సునీత
[ 02-07-2024]
అబద్ధాల హామీలతో అధికారంలోకి వచ్చిన రేవంత్ సర్కార్ ఎంతోకాలం మనుగడ సాధించలేదని మాజీ ఎమ్మెల్యే భారాస నాయకురాలు గొంగిడి సునీత మహేందర్ రెడ్డి అన్నారు. -
సేవలు శాశ్వతం: కలెక్టర్
[ 02-07-2024]
ప్రజాప్రతినిధుల కాల పరిమితి ఐదేళ్లయినప్పటికీ వారు అందించే సేవలు చిరస్థాయిగా నిలిచిపోతాయని కలెక్టర్ హనుమంతు కే జండగే అన్నారు. -
ఎమ్మెల్సీని అడ్డుకున్న భాజపా నాయకులు
[ 02-07-2024]
రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఉద్యోగ నియామకాల ప్రక్రియను చేపట్టాలని డిమాండ్ చేస్తూ బీజేవైఎం భాజపా ఆధ్వర్యంలో భువనగిరి జడ్పీ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. -
పుట్టినరోజు నాడే మృత్యుఒడికి..
[ 02-07-2024]
అప్పటి వరకు తమతోనే ఉన్న అమ్మ మృత్యువు ఒడిలోకి జారుకుందని ఆ పసి పిల్లలకేం తెలుసు... విగత జీవిగా పడి ఉన్న తల్లిని చూస్తూ పాలు తాగాలని.. గోరుముద్దలు తినాలని గుక్కపట్టి ఏడుస్తున్న దృశ్యం అక్కడున్న ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టించింది. -
ఆసుపత్రులు కిటకిట
[ 02-07-2024]
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలు, ముసురుతో అంటువ్యాధులు ప్రబలుతున్నాయి. -
విద్యుత్తు అధికారులు రైతులను వేధించొద్దు: మంత్రి కోమటిరెడ్డి
[ 02-07-2024]
విద్యుత్తు శాఖ అధికారులు, సిబ్బంది కొత్త ట్రాన్స్ఫార్మర్లు, లైన్ల మార్పిడి వంటి ప్రతి పనికి¨ రైతుల నుంచి డబ్బులు అడిగినట్లు తమ దృష్టికి వచ్చిందని వాటిని విరమించుకోకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. -
మెరుగైన విద్యుత్తు సరఫరాకు సర్వే
[ 02-07-2024]
పెరుగుతున్న పట్టణీకరణకు అనుగుణంగా వినియోగదారులకు మెరుగైన కరెంటు అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. -
యువతిపై అత్యాచారం.. దోషికి తుదిశ్వాస వరకు కారాగారం
[ 02-07-2024]
ప్రేమ పేరిట మాయ మాటలు చెప్పి ఓ యువతిని అపహరించి, అత్యాచారానికి పాల్పడిన నిందితుడికి న్యాయస్థానం ‘జీవిత కాలం శిక్ష’ (తుది శ్వాస వదిలే వరకు), రూ.21,000 జరిమానా విధించింది. -
నమ్మించి నట్టేట్లో ముంచి..!
[ 02-07-2024]
చిట్టీలు, వడ్డీల పేరిట ఓ వ్యక్తి పలువురిని నమ్మించి రూ.కోట్లు వసూలు చేసి ఉడాయించిన ఘటన హయత్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. -
శిథిల భవనాల్లో పల్లె పాలన
[ 02-07-2024]
పరిపాలన సౌలభ్యం కోసం సర్కారు కొత్తగా గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేసింది. వీటిలో కొన్నింటికి మాత్రమే భవన నిర్మాణానికి కొంత నిధులు మంజూరు చేసి పనులు మొదలుపెట్టారు. -
ఫీజులు నొక్కి.. ఇరుకు గదుల్లో కుక్కి
[ 02-07-2024]
జిల్లాలోని ప్రైవేటు జూనియర్ కళాశాలల్లో విచ్చలవిడిగా ఫీజులు వసూలు చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో తనిఖీ చేయాల్సిన ఇంటర్ విద్యాధికారులు పట్టించుకోకపోవటంతో యాజమాన్యాలు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాయి. -
బిందుసేద్యం విస్తరణకు అడుగులు
[ 02-07-2024]
సాగునీటి సమస్య.. మరోపక్క కూలీల కొరత వెరసి వ్యవసాయం అనుబంధ సాగుకు రైతులు నానా తంటాలు పడుతున్నారు. -
గర్భిణి మృతికి కారణమైన ఆరుగురి అరెస్టు
[ 02-07-2024]
చివ్వెంల మండలం ఎంజీనగర్ తండాకు చెందిన ఎనిమిది నెలల గర్భిణి సుహాసిని మృతి కేసులో ఆరుగురిని సోమవారం అరెస్టు చేసినట్లు ఎస్పీ సన్ప్రీత్ సింగ్ తెలిపారు. -
ఒత్తిడిని జయిద్దాం..హాయిగా జీవిద్దాం
[ 02-07-2024]
ఇటీవలి కాలంలో చిన్నా, పెద్ద తేడా లేకుండా అన్ని వయస్సుల వారిని వేధిస్తున్న ప్రధాన సమస్య ఒత్తిడి. -
ప్రతిభ చూపితే.. భవిత మీదే!
[ 02-07-2024]
మూస విధానంలో చదివితే విద్యార్థులకు ఆయా సబ్జెక్టుల్లో మార్కులు పెరగొచ్చు కానీ.. వారిలోని సృజనాత్మకత వెలుగులోకి రాదు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
జస్టిస్ ఎల్.నరసింహారెడ్డి కమిషన్ గడువు పెంపు?
-
రాహుల్ పిల్ల చేష్టలు మానుకోవాలి: ప్రధాని మోదీ
-
ఆధ్యాత్మిక కార్యక్రమంలో తొక్కిసలాట.. 116కి చేరిన మృతుల సంఖ్య
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
పుణె శివారులో ఘోర ప్రమాదం.. తెలంగాణకు చెందిన ఐదుగురి దుర్మరణం
-
కాంటాక్టుల్లో పాస్వర్డులు.. ఇతరులతో షేరింగ్లు.. ఇదీ మన గోప్యత తీరు!