logo

ABVP: ఏబీవీపీ ఆధ్వర్యంలో ధర్నా

అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ యాదాద్రి భువనగిరి జిల్లా శాఖ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టర్ కలెక్టరేట్ కార్యాలయాన్ని ముట్టడించారు.

Published : 01 Jul 2024 17:13 IST

భువనగిరి: అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ యాదాద్రి భువనగిరి జిల్లా శాఖ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టర్ కలెక్టరేట్ కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ సందర్భంగా ఏబీవీపీ నల్గొండ విభాగ్ కన్వీనర్ సుర్వి మణికంఠ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం వచ్చి పది సంవత్సరాలు పూర్తి కావస్తున్న నేటికీ విద్యారంగంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించలేకపోతున్నారని విమర్శించారు.    పేద విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటుంటే ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు, టీచర్లు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బంది గురవుతున్నారు. ఏబీవీపీ నల్గొండ ఎస్‌ఎఫ్‌డీ విభాగ్ కన్వీనర్ సామల సాయికుమార్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సాయిరాం, స్టేట్ వర్కింగ్ కమిటీ మెంబర్ జూపల్లి, శివకుమార్ విజయ్, పవన సిద్దు, వంశీ, యశ్వంత్, మని, సాయి, తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని