logo

Nalgonda: సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి

కళాకారులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని బుధవారం యాదాద్రి భువనగిరి కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన ధర్నా చేపట్టారు.

Published : 03 Jul 2024 19:27 IST

భువనగిరి: కళాకారులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని బుధవారం యాదాద్రి భువనగిరి కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన ధర్నా చేపట్టారు. ప్రజానాట్యమండలి జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్క వెంకటేశం ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. జిల్లాలో వందల సంఖ్యలో గ్రామీణ కళాకారులు ఉన్నారని వారి సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి చేయాలన్నారు. జిల్లా అధికారి నాగేశ్వరరావుకు డిమాండ్లతో కూడిన మెమోరాండం అందజేశారు.  కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు పిట్టల శంకర్, కళాకారులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని