ఉపాధి కోర్సులకు ఆదరణ కరవు
పారిశ్రామిక శిక్షణా నైపుణ్యం కలిగిన విద్యార్థులకు ఉద్యోగావకాశాలు తలుపుతడుతున్నాయి. తక్కువ సమయంలో కొలువులు సాధించి.. స్థిరపడాలనుకునే యువతకు పారిశ్రామిక శిక్షణ సంస్థ(ఐటీఐ) చక్కటి అవకాశం కల్పిస్తోంది.
ఐటీఐలో ప్రవేశాలు అంతంత మాత్రమే
మెదక్ ఐటీఐ
మెదక్ అర్బన్, న్యూస్టుడే: పారిశ్రామిక శిక్షణా నైపుణ్యం కలిగిన విద్యార్థులకు ఉద్యోగావకాశాలు తలుపుతడుతున్నాయి. తక్కువ సమయంలో కొలువులు సాధించి.. స్థిరపడాలనుకునే యువతకు పారిశ్రామిక శిక్షణ సంస్థ(ఐటీఐ) చక్కటి అవకాశం కల్పిస్తోంది. ఐటీఐల్లో డ్యూయల్ సిస్టమ్ ఆన్ జాబ్ ట్రైనింగ్(ఓజేటీ)ను అందుబాటులోకి తీసుకొచ్చారు. విద్యార్థులు తరగతులకు హాజరవుతూనే పరిశ్రమల్లో ప్రయోగాత్మక శిక్షణకు వెళ్లి సంపాదించుకోవచ్చు. పనిచేసే క్రమంలో వచ్చే సందేహాలను అధ్యాపకులు నివృత్తి చేస్తారు. ఇన్ని అవకాశాలు ఉన్నప్పటికీ ఐటీఐ కోర్సులపై అంతగా ఆసక్తి చూపకపోవడం గమనార్హం.
136 సీట్లకు 36 భర్తీ: జిల్లా పరిధిలో మెదక్లోనే ఏకైక ప్రభుత్వ ఐటీఐ ఉండగా, ప్రైవేటులో 9 ఉన్నాయి. ఐటీఐలో ప్రథమ సంవత్సరానికి 136 సీట్లు కేటాయించారు. మే 16 నుంచి జూన్ 14వ తేదీ వరకు తొలి విడత ప్రవేశాల్లో 36 సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. ప్రైవేటు సంస్థల్లో సగం కూడా నిండలేదు. రెండో విడత ప్రవేశాలను త్వరలో నిర్వహించనున్నారు. పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు https://iti.telangana.gov.in వెబ్సైట్లో ధ్రువపత్రాలతో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. మెరిట్ ప్రాతిపదికన సీట్లు కేటాయిస్తారు. బాలికలకు 33శాతం రిజర్వేషన్ వర్తిస్తుంది.
మరో విడతపైనే ఆశలు..: 136 సీట్ల కోసం ఆన్లైన్లో నమోదు చేసుకున్న వారిలో మెరిట్ ఆధారంగా 120 మందికి సీట్లు కేటాయించగా.. కేవలం 36 మంది ప్రవేశాలు పొందారు. దీంతో సీట్లు ఖాళీగా ఉంటున్నాయి. రెండో విడత ప్రవేశాలపైనే కళాశాలల యాజమాన్యాలు ఆశలు పెట్టుకున్నాయి.
ఇవీ కారణాలు.. : గతంలో ఐటీఐ పరీక్షలు రాత పద్ధతిలో జరిగేవి. మూడేళ్లుగా ఆన్లైన్లో నిర్వహిస్తున్నారు. ఈ కోర్సుల్లో చేరుతున్న వారిలో అత్యధికులు ప్రభుత్వ పాఠశాలల నుంచి వచ్చిన వారే కావడంతో కంప్యూటర్ పరిజ్ఞానం తక్కువగా ఉండటం, పరీక్షలు ఆంగ్లంలోనే రాయాల్సి రావడంతో ఉత్తీర్ణత శాతం తగ్గుతోంది. మరోవైపు ఐటీఐ చదివితే పరిశ్రమల్లో పని చేయాల్సి ఉంటుంది. అదే ఇంటర్ చదివి సాఫ్ట్వేర్ కోర్సులు పూర్తి చేస్తే ఎక్కువ వేతనాలు పొందవచ్చనే ఉద్దేశంతో అటువైపు మొగ్గు చూపుతున్నారు. పరిశ్రమల్లో శిక్షణకు ఇంకా పాత యంత్రాలు వినియోగిస్తుండటంతో నైపుణ్యాలు పెంచుకోలేని పరిస్థితి.
నైపుణ్యాభివృద్ధి కేంద్రాలుగా : ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థలు ఇకపై నైపుణ్యాభివృద్ధి కేంద్రాలుగా మారనున్నాయి. ఆధునిక సాంకేతిక కోర్సులను ప్రవేశపెట్టనున్నారు. ఇందుకోసం తెలంగాణ ప్రభుత్వం టాటా టెక్నాలజీస్ లిమిటెడ్(టీటీఎల్)తో ఒప్పందం కుదుర్చుకుంది. యువతకు ఉపాధి మార్గాలు పెంచేలా ఆధునిక కోర్సుల్లో శిక్షణ ఇవ్వనున్నారు. నూతన భవనాలు నిర్మించి మౌలిక వసతులు కల్పించి, ఉపకరణాలు సమకూర్చి నూతన కోర్సులు నేర్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
వేల సంఖ్యలో ఉద్యోగాలు
- పి.చంద్రశేఖర్రావు, ఐటీఐ ప్రిన్సిపల్, మెదక్
సత్వర ఉపాధికి ఐటీఐ ఎంతో దోహదపడుతుంది. కేంద్రంలో అప్రెంటిస్ మేళాలు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఏటా వేల సంఖ్యలో ఉద్యోగాలు కల్పించడానికి దోహదం చేస్తాయి. ఆసక్తి ఉన్న వారు రెండో విడతలో దరఖాస్తు చేసుకోవాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రజాప్రతినిధులు పట్టుబట్టాలి.. రైలు పట్టాలెక్కాలి
[ 06-07-2024]
తెలంగాణలో రైల్వే విస్తరణ తక్కువే. అందులోనూ ఉమ్మడి మెదక్, వికారాబాద్ జిల్లాల్లో రైలు సదుపాయం మరింత తక్కువ. కొంత మేర విస్తరించినా అక్కడా పలు సమస్యలు నెలకొన్నాయి. -
రూ.100 కోసం.. ఏటీఎం ధ్వంసం
[ 06-07-2024]
మద్యం మత్తులో రూ.100 కోసం ఓ వ్యక్తి ఏటీఎంను ధ్వంసం చేసిన సంఘటన రామాయంపేట పట్టణంలో చోటు చేసుకుంది. -
కరుణించని వరుణుడు
[ 06-07-2024]
వానాకాలం ఆరంభమై నెలరోజులు గడిచినా... జిల్లాలో ఇంకా లోటు వర్షాపాతమే నమోదవుతోంది. అడపాదడపా వర్షం పడడంతో కేవలం పత్తి మినహా మిగిలిన పంటల సాగు జరగడం లేదు. -
మహిళలకు మీసేవ కేంద్రాలు
[ 06-07-2024]
మహిళలు అన్ని రంగాల్లో ముందుకు సాగేందుకు ప్రోత్సహిస్తున్నారు. అతివల కోసం ఏర్పాటు చేసిన మహిళా సంఘాల ఆర్థికాభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే చాలా పథకాలను అమలు చేస్తున్నాయి. -
ఆర్ఆర్ఆర్ భూముల్లో అక్రమ తవ్వకాలు
[ 06-07-2024]
ఇటుక బట్టీ వ్యాపారుల అక్రమాలకు అడ్డూఅదుపు లేకుండా పోయింది. చెరువులు, కుంటలతో పాటు ప్రాంతీయ రింగ్ రోడ్డు(ఆర్ఆర్ఆర్)కు సేకరించే భూముల నుంచి సైతం మట్టిని జోరుగా తరలిస్తున్నారు. -
చిరుత సంచారం
[ 06-07-2024]
మండల పరిధి నాగపూర్ గేటు సమీపంలోని అటవీ ప్రాంతంలో ప్రయాణికులకు శుక్రవారం చిరుత కనిపించింది. -
బీమాతో భరోసా.. జీవితానికి రక్షణ
[ 06-07-2024]
స్వయం సహాయక సంఘం (ఎస్హెచ్జీ)లోని మహిళలకు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ బీమా అమలుకు ముందుకొచ్చింది. -
విద్యార్థులకు రోబోటిక్స్ పాఠాలు
[ 06-07-2024]
మారుతున్న సాంకేతికతను అందిపుచ్చుకునేందుకు విద్యాశాఖ కృషి చేస్తోంది. సోహమ్ అకాడమీ ఆఫ్ హ్యూమన్ ఎక్సలెన్స్ సంస్థ సహకారంతో జిల్లాలో ఎంపిక చేసిన పది పాఠశాలల్లో రోబోటిక్స్ పాఠాలను అమలు చేయనున్నారు. -
సమయపాలన.. అల్లంత దూరాన!
[ 06-07-2024]
జిల్లాలోని పురపాలికల్లో కొందరు ఉద్యోగులు, సిబ్బంది సమయపాలన పాటించడం లేదు. మున్సిపాలిటీల్లో ఉద్యోగుల సమయ పాలనపై శుక్రవారం ‘న్యూస్టుడే’ పరిశీలించింది. -
చదువులో మేటి.. అందింది ట్రిపుల్ ఐటీ
[ 06-07-2024]
ప్రతిభకు పేదరికం, కుటుంబంలోని కష్టాలు అడ్డురావని బాసర ట్రిపుల్ ఐటీలో సీటు సాధించిన పలువురు విద్యార్థులు నిరూపించారు. ఇంజినీరింగ్ చదివేందుకు బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకుంటున్నారు. -
రుణం తీర్చి మమ్మల్ని ఆదుకోండి..
[ 06-07-2024]
తల్లిదండ్రుల అకాల మరణంతో చిన్నారులిద్దరూ అనాథలయ్యారు. వృద్ధులైన తాత- నానమ్మల నీడన జీవనం సాగిస్తున్నారు. ధూల్మిట్ట మండల కేంద్రానికి చెందిన బాలలు తాడూరి శివప్రసాద్, శశిలది దయనీయ పరిస్థితి. -
బడిలో చెక్కపెట్టె.. చరవాణులకు చెక్ పెట్టె!
[ 06-07-2024]
తరగతి గదిలో బోధనా సమయంలో చరవాణి వాడకం వల్ల అంతరాయం కలగడమే కాకుండా విద్యార్థుల తల్లిదండ్రులకు ప్రభుత్వ పాఠశాలలపై నమ్మకం పోతోందని గమనించిన ఉపాధ్యాయులు స్ఫూర్తిమంతమైన నిర్ణయం తీసుకున్నారు. -
నేరుగా.. త్వరగా.. ప్రయాణం
[ 06-07-2024]
ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర మంత్రులను ఇటీవల దిల్లీ పర్యటనకు వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కలిసి కొన్ని మార్గాలను జాతీయ రహదారులుగా విస్తరించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. -
భర్త హత్య కేసులో భార్య సహా నలుగురి అరెస్టు
[ 06-07-2024]
గత నెలలో జగద్గిరిగుట్ట పరిధి వెంకటేశ్వరనగర్లో జరిగిన అనిల్కుమార్ హత్య కేసులో ఆయన భార్య సహా నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. -
క్షణికావేశం.. వేర్వేరుగా ముగ్గురి బలవన్మరణం
[ 06-07-2024]
క్షణికావేశంలో వేర్వేరు కారణాలతో సిద్దిపేట జిల్లాలో ముగ్గురు బలవన్మరణానికి పాల్పడ్డారు. ఏదైనా పని చేసుకోవాలని తల్లిదండ్రులు మందలించడంతో యువకుడు సిద్దిపేట జిల్లా రాయపోలు మండలం ఎల్కల్ గ్రామంలో ఆత్మహత్య చేసుకున్నాడు. -
ఆర్టీసీ బస్సు ఢీకొని ప్రధానోపాధ్యాయుడి దుర్మరణం
[ 06-07-2024]
రోజూ తోటి ఉపాధ్యాయులతో కలిసి కారులో వెళ్లే ప్రధానోపాధ్యాయుడు.. మిగిలిన వారు రాకపోవడంతో ద్విచక్రవాహనంపై విధులకు వెళ్తూ..