బీమా లేదు.. పరిహారం రాదు
మెదక్ పురపాలికలో చెత్త తరలించే ట్రాక్టర్లు, స్వచ్ఛ ఆటో ట్రాలీలకు కనీసం బీమా చేయించడం లేదు. నిత్యం రహదారులపై తిరిగే వాహనాల వల్ల ఏదైనా ప్రమాదం జరిగితే బాధిత కుటుంబాలను ఎవరు ఆదుకుంటారని ప్రజలు నిలదీస్తున్నారు.
పారిశుద్ధ్య వాహనాల నిర్వహణపై పుర అధికార నిర్లక్ష్యం
ట్రాక్టర్లో చెత్తను తరలిస్తున్న సిబ్బంది
మెదక్ టౌన్, న్యూస్టుడే: మెదక్ పురపాలికలో చెత్త తరలించే ట్రాక్టర్లు, స్వచ్ఛ ఆటో ట్రాలీలకు కనీసం బీమా చేయించడం లేదు. నిత్యం రహదారులపై తిరిగే వాహనాల వల్ల ఏదైనా ప్రమాదం జరిగితే బాధిత కుటుంబాలను ఎవరు ఆదుకుంటారని ప్రజలు నిలదీస్తున్నారు. ఇతర వాహనాల విషయంలోనూ బీమా చేయించడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు.
అనుభవంలేని వారు: మెదక్ పురపాలిక పరిధిలో 32 వార్డుల్లో చెత్త సేకరణకు 17 స్వచ్ఛ ఆటో ట్రాలీలను, ట్రాక్టర్లును కేటాయించారు. మొదట్లో ఈ వాహనాలను నడిపే 17 మందిలో కేవలం ఆరుగురికి మాత్రమే లైసెన్స్లు ఉండేవి. వారికి సరైనా అనుభవం లేకపోవడంతో ఇష్టానుసారంగా వాహనాలను నడిపారు. వాస్తవానికి వారికి లైసెన్స్తో పాటు బ్యాడ్జీలు తప్పనిసరిగా ఉండాలి. గత ఏడాది ఒక వాహనం ప్రమాదానికి గురికావడంతో శానిటరీ అధికారి మహేశ్.. లైసెన్స్ ఉన్నవారినే విధుల్లోకి తీసుకుంటామని అనడంతో ఇటీవల తీసుకున్నారు. ఇంకా బ్యాడ్జీ నంబర్ లేని వారు చాలానే ఉన్నారు. కౌన్సిలర్లు కూడా చూసీచూడనట్లు వదిలేస్తున్నారు.
నిలువెత్తు సాక్ష్యం: గత శీతాకాలంలో కురిసిన మంచులో దారి కనిపించక ఆటో ప్రమాదానికి గురై పూర్తిగా ధ్వంసమైంది. ప్రస్తుతం ఆ ఆటో మరమ్మతుకు రూ.2,47,612 ఖర్చు అవుతుందని చూపారు. అదే బీమా చేయించి ఉంటే ఈ మొత్తం ఖర్చులో అన్ని వాహనాలకు బీమా ప్రీమియం పూర్తి అయ్యేది. గత 7 నెలల నుంచి ట్రాక్టర్ను అద్దెకు తీసుకోవడంతో అదనంగా రూ.2,14,800 ఖర్చు అయింది. ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహిస్తున్నారని ఇటీవల పుర అధికారులపై ఉపాధ్యక్షుడు మల్లికార్జున్ గౌడ్, కౌన్సిలర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో సైతం అన్ని వాహనాలకు బీమా చేయించాలని ఆదేశించినా.. ఎందుకు చేయించలేదని పుర అధ్యక్షుడు చంద్రపాల్ ప్రశ్నించారు. థర్డ్ పార్టీ బీమా వల్ల ఏం ప్రయోజనం ఉంటుందని అధికారులను నిలదీశారు. ఇప్పటికైనా పురపాలిక అధికారులు అలసత్వాన్ని వీడి క్షేత్ర స్థాయిలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.
ఇంజినీరింగ్ అధికారులకు రాశారు
- మహేశ్, శానిటరీ అధికారి
పాలకవర్గం సభ్యుల ఆదేశాల మేరకు పురపాలికలో ఉన్న 17 వాహనాలకు బీమా చేయించాలని కమిషనర్ దృష్టికి తీసుకెళ్లాను. వెంటనే స్పందించి ఇంజినీరింగ్ విభాగానికి లేఖ రాశారు. వారి నుంచి ఇంకా ఎలాంటి సమాచారం రాలేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రజాప్రతినిధులు పట్టుబట్టాలి.. రైలు పట్టాలెక్కాలి
[ 06-07-2024]
తెలంగాణలో రైల్వే విస్తరణ తక్కువే. అందులోనూ ఉమ్మడి మెదక్, వికారాబాద్ జిల్లాల్లో రైలు సదుపాయం మరింత తక్కువ. కొంత మేర విస్తరించినా అక్కడా పలు సమస్యలు నెలకొన్నాయి. -
రూ.100 కోసం.. ఏటీఎం ధ్వంసం
[ 06-07-2024]
మద్యం మత్తులో రూ.100 కోసం ఓ వ్యక్తి ఏటీఎంను ధ్వంసం చేసిన సంఘటన రామాయంపేట పట్టణంలో చోటు చేసుకుంది. -
కరుణించని వరుణుడు
[ 06-07-2024]
వానాకాలం ఆరంభమై నెలరోజులు గడిచినా... జిల్లాలో ఇంకా లోటు వర్షాపాతమే నమోదవుతోంది. అడపాదడపా వర్షం పడడంతో కేవలం పత్తి మినహా మిగిలిన పంటల సాగు జరగడం లేదు. -
మహిళలకు మీసేవ కేంద్రాలు
[ 06-07-2024]
మహిళలు అన్ని రంగాల్లో ముందుకు సాగేందుకు ప్రోత్సహిస్తున్నారు. అతివల కోసం ఏర్పాటు చేసిన మహిళా సంఘాల ఆర్థికాభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే చాలా పథకాలను అమలు చేస్తున్నాయి. -
ఆర్ఆర్ఆర్ భూముల్లో అక్రమ తవ్వకాలు
[ 06-07-2024]
ఇటుక బట్టీ వ్యాపారుల అక్రమాలకు అడ్డూఅదుపు లేకుండా పోయింది. చెరువులు, కుంటలతో పాటు ప్రాంతీయ రింగ్ రోడ్డు(ఆర్ఆర్ఆర్)కు సేకరించే భూముల నుంచి సైతం మట్టిని జోరుగా తరలిస్తున్నారు. -
చిరుత సంచారం
[ 06-07-2024]
మండల పరిధి నాగపూర్ గేటు సమీపంలోని అటవీ ప్రాంతంలో ప్రయాణికులకు శుక్రవారం చిరుత కనిపించింది. -
బీమాతో భరోసా.. జీవితానికి రక్షణ
[ 06-07-2024]
స్వయం సహాయక సంఘం (ఎస్హెచ్జీ)లోని మహిళలకు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ బీమా అమలుకు ముందుకొచ్చింది. -
విద్యార్థులకు రోబోటిక్స్ పాఠాలు
[ 06-07-2024]
మారుతున్న సాంకేతికతను అందిపుచ్చుకునేందుకు విద్యాశాఖ కృషి చేస్తోంది. సోహమ్ అకాడమీ ఆఫ్ హ్యూమన్ ఎక్సలెన్స్ సంస్థ సహకారంతో జిల్లాలో ఎంపిక చేసిన పది పాఠశాలల్లో రోబోటిక్స్ పాఠాలను అమలు చేయనున్నారు. -
సమయపాలన.. అల్లంత దూరాన!
[ 06-07-2024]
జిల్లాలోని పురపాలికల్లో కొందరు ఉద్యోగులు, సిబ్బంది సమయపాలన పాటించడం లేదు. మున్సిపాలిటీల్లో ఉద్యోగుల సమయ పాలనపై శుక్రవారం ‘న్యూస్టుడే’ పరిశీలించింది. -
చదువులో మేటి.. అందింది ట్రిపుల్ ఐటీ
[ 06-07-2024]
ప్రతిభకు పేదరికం, కుటుంబంలోని కష్టాలు అడ్డురావని బాసర ట్రిపుల్ ఐటీలో సీటు సాధించిన పలువురు విద్యార్థులు నిరూపించారు. ఇంజినీరింగ్ చదివేందుకు బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకుంటున్నారు. -
రుణం తీర్చి మమ్మల్ని ఆదుకోండి..
[ 06-07-2024]
తల్లిదండ్రుల అకాల మరణంతో చిన్నారులిద్దరూ అనాథలయ్యారు. వృద్ధులైన తాత- నానమ్మల నీడన జీవనం సాగిస్తున్నారు. ధూల్మిట్ట మండల కేంద్రానికి చెందిన బాలలు తాడూరి శివప్రసాద్, శశిలది దయనీయ పరిస్థితి. -
బడిలో చెక్కపెట్టె.. చరవాణులకు చెక్ పెట్టె!
[ 06-07-2024]
తరగతి గదిలో బోధనా సమయంలో చరవాణి వాడకం వల్ల అంతరాయం కలగడమే కాకుండా విద్యార్థుల తల్లిదండ్రులకు ప్రభుత్వ పాఠశాలలపై నమ్మకం పోతోందని గమనించిన ఉపాధ్యాయులు స్ఫూర్తిమంతమైన నిర్ణయం తీసుకున్నారు. -
నేరుగా.. త్వరగా.. ప్రయాణం
[ 06-07-2024]
ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర మంత్రులను ఇటీవల దిల్లీ పర్యటనకు వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కలిసి కొన్ని మార్గాలను జాతీయ రహదారులుగా విస్తరించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. -
భర్త హత్య కేసులో భార్య సహా నలుగురి అరెస్టు
[ 06-07-2024]
గత నెలలో జగద్గిరిగుట్ట పరిధి వెంకటేశ్వరనగర్లో జరిగిన అనిల్కుమార్ హత్య కేసులో ఆయన భార్య సహా నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. -
క్షణికావేశం.. వేర్వేరుగా ముగ్గురి బలవన్మరణం
[ 06-07-2024]
క్షణికావేశంలో వేర్వేరు కారణాలతో సిద్దిపేట జిల్లాలో ముగ్గురు బలవన్మరణానికి పాల్పడ్డారు. ఏదైనా పని చేసుకోవాలని తల్లిదండ్రులు మందలించడంతో యువకుడు సిద్దిపేట జిల్లా రాయపోలు మండలం ఎల్కల్ గ్రామంలో ఆత్మహత్య చేసుకున్నాడు. -
ఆర్టీసీ బస్సు ఢీకొని ప్రధానోపాధ్యాయుడి దుర్మరణం
[ 06-07-2024]
రోజూ తోటి ఉపాధ్యాయులతో కలిసి కారులో వెళ్లే ప్రధానోపాధ్యాయుడు.. మిగిలిన వారు రాకపోవడంతో ద్విచక్రవాహనంపై విధులకు వెళ్తూ..