అమ్మ లాలన.. మొక్క రక్షణ
అమ్మ.. నవమాసాలు మోస్తుంది. పురిటినొప్పులు భరిస్తూనే శిశువుకు జన్మనిస్తుంది. కంటికి రెప్పలా కాపాడుతుంది. ఏమి ఆశించక పెంచి పెద్ద చేస్తుంది. జీవితంలో తన కుమారుడి ఎదుగదలను చూసి.. ఆనందాన్ని పొందుతుంది.
న్యూస్టుడే, సిద్దిపేట, మెదక్ టౌన్, సంగారెడ్డి టౌన్, వికారాబాద్ మున్సిపాలిటీ
అమ్మ.. నవమాసాలు మోస్తుంది. పురిటినొప్పులు భరిస్తూనే శిశువుకు జన్మనిస్తుంది. కంటికి రెప్పలా కాపాడుతుంది. ఏమి ఆశించక పెంచి పెద్ద చేస్తుంది. జీవితంలో తన కుమారుడి ఎదుగదలను చూసి.. ఆనందాన్ని పొందుతుంది. తనువు చాలించే వరకు బాధలను దిగమింగుకొని పిల్లలపై ప్రేమ కురిపిస్తుంది. అమ్మ రుణం ఆ జన్మాంతం తీర్చుకోలేనిది.
వృక్షం.. పర్యావరణ హితాన్ని కాంక్షిస్తుంది. కొన్ని రోజులు కాపాడితే.. వెలకట్టలేని ప్రాణవాయువును ఇస్తుంది. ఎదిగిన కొద్దీ పండ్లు, పూలు.. వివిధ రూపాల్లో ఆహారాన్ని అందిస్తుంది. ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. వానలు కురవడంలోనూ కీలకమే. నేలకొరిగాక కూడా ఏదో ఒక రూపంలో ఉపయోగపడుతుంటాయి. వీటికి జీవ జాతులు రుణపడి ఉంటాయనడంలో సందేహం లేదు.
ఉమ్మడి మెదక్, వికారాబాద్ జిల్లాల్లో ఏటా హరితహారంలో భాగంగా మొక్కల పెంపకం ఉద్యమంగా సాగుతోంది. ఇప్పటికే పలువురు వివిధ రకాల సందర్భాల్లో వ్యక్తిగతంగా మొక్కలు నాటుతున్నారు. జన్మదిన వేడుకల్లో నాటేందుకు అత్యధికులు ఆసక్తి చూపుతున్నారు. వివిధ అభివృద్ధి, ప్రగతి కార్యక్రమాల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు మొక్క నాటడం ఓ ఆనవాయితీగా అమలు చేస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పచ్చదనంపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. చిన్నపాటి వనాలను హరితమయంగా తీర్చిదిద్దుతున్నారు. గ్రీన్ ఛాలెంజ్, వృక్షాబంధన్ కార్యాక్రమాల నిర్వహణ సహా వివిధ శుభాకార్యాల్లో మొక్కల పంపిణీ చేపడుతున్నారు. స్ఫూర్తిని రగిలించేలా.. రాజకీయ, సినీ, ఇతర రంగాల ప్రముఖులు సామాజిక మాధ్యమాల్లో సవాళ్లు విసురుతున్నారు. ఈ స్ఫూర్తిని అందరూ అందిపుచ్చుకోవాల్సిన ఆవశ్యకత ఉంది.
‘పర్యావరణం.. ఎల్లప్పుడూ మానవహితాన్ని కాంక్షిస్తుంది. వృక్షాలతో అందరికీ ఉపయోగమే. పర్యావరణ స్ఫూర్తిని చాటేలా అమ్మ పేరిట ఒక మొక్క నాటండి. ఇదో ఉద్యమంలా సాగాలి. తాను తన తల్లి స్మారకార్థం మొక్క నాటాను. భూమాతను రక్షించేందుకు సహాయపడాలి.’
నరేంద్రమోదీ, ప్రధానమంత్రి (ఆదివారం జరిగిన మన్కీ బాత్లో..)
నది ఎండటం చూసి..
అయోధ్యలో అమర్నాథ్ అన్నదాన సేవాసమితి బాధ్యులతో కలిసి మొక్క నాటుతున్న జ్ఞానేశ్వర్
నారాయణఖేడ్: సంగారెడ్డి జిల్లా నాగల్గిద్దా మండలం ముక్టాపూర్కు చెందిన యువకుడు పాలడుగు జ్ఞానేశ్వర్ పదేళ్లకిందట తీవ్ర వర్షాభావంతో స్వగ్రామం పక్కన ఉన్న మంజీరానది ఎండిపోవడం, పక్షులు మృత్యువాత పడటం చూసి చలించారు. అప్పట్లోనే మొక్కలు నాటాలని సంకల్పించుకున్నారు. పదేళ్లలో పలు ప్రాంతాల్లో 3 లక్షల వరకు మొక్కలు నాటడమే కాకుండా ప్రజలు, విద్యార్థులతో నాటించారు. పాదయాత్ర, సైకిల్యాత్రలతో పర్యావరణ ఆవశ్యకతను వివరించారు. అయోధ్యలో బాలరాముడి ఆలయం ప్రారంభోత్సవం సందర్భంగా పలు సంఘాల బాధ్యులతో కలిసి మొక్కలు నాటారు. ప్రస్తుతం లక్ష విత్తన బంతుల తయారీలో నిమగ్నమయ్యారు.
38 ఏళ్ల క్రితమే శ్రీకారం
జహీరాబాద్ అర్బన్, కోహీర్: అశోకుడు రోడ్లకు ఇరువైపులా మొక్కలు నాటించాడని చిన్నప్పుడు పుస్తకాల్లో చదువుకున్నాం. ఇదే స్పూర్తితో 38 ఏళ్ల క్రితమే మొక్కలు నాటే కార్యక్రమాన్ని మహాయజ్ఞంలా చేపట్టి ఆదర్శంగా నిలిచారు సంగారెడ్డి జిల్లా కోహీర్ మండలం గొడిగార్పల్లికి చెందిన మాజీ సర్పంచి విశ్వమోహన్. గొడిగార్పల్లి, బడంపేట, గొడిగార్పల్లితండా గ్రామాల్లో 3 వేలకు పైగా మొక్కలు నాటించగా.. ఇప్పుడు పచ్చదనం సంతరించుకుంది. రహదారుల పక్కడ వృక్షాలుగా ఎదిగి హరితశోభితంగా కనిపిస్తున్నాయి.
కళాశాలలో బొటానికల్ గార్డెన్
జహీరాబాద్ అర్బన్: తల్లి స్మారకార్థం అమ్మ పేరిట బొటానికల్ గార్డెన్ ఏర్పాటు చేసి వన మహోత్సవానికి తోడ్పాటు అందించారు సంగారెడ్డి బాలికల డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ అరుణాబాయి. 2014లో జహీరాబాద్ డిగ్రీ కళాశాలలో అధ్యాపకురాలిగా పని చేశారు. ఆ సమయంలో సొంతంగా తల్లి హమినిబాయి పేరిట బొటానికల్ గార్డెన్ను ఏర్పాటుచేయించారు. ఇప్పుడది ఆహ్లాదాన్ని పంచుతూనే విద్యార్థులకు ఉపయుక్తంగా మారింది.
బహుమతిగా అందిస్తూ..
జిన్నారం: విద్యార్థులు, తోటి ఉపాధ్యాయులు, ప్రజానాయకుల పుట్టినరోజు నాడు సాధారణంగా బహుమతులు అందిస్తుంటారు. కానీ జిన్నారం మండలం ఐడీఏ బొల్లారం పాఠశాలలో గణితం ఉపాధ్యాయుడిగా పని చేసి తాజాగా సింగూరుకు బదిలీ అయిన సత్యం పైసా మొక్కను బహుమతిగా అందిస్తుంటారు. పదేళ్లుగా ఇదే విధానంలో ముందుకు సాగుతుండటం విశేషం. మొక్క ఇచ్చి వదిలేయడమే కాకుండా వీలున్నప్పుడల్లా దాని సంరక్షణపై ఆరా తీస్తుంటారు. పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పిస్తున్నారు.
అడవిని సృష్టించి..
వర్గల్: వర్గల్ మండలం సింగాయపల్లిలో అడవిని సృష్టించారు. 2019లో 5 హెక్టార్లలో మియావాకి విధానంలో 50 వేల మొక్కలు నాటగా వాటిని సంరక్షించడంతో ఇప్పుడవన్నీ పెరిగి పచ్చదనం సంతరించుకున్నాయి. అప్పటి సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ చూపడంతో ఇప్పుడక్కడ పరిస్థితిలో మార్పు వచ్చింది. దీని చుట్టూ 5.2 కి.మీ. మేర కంచె వేసి రక్షణ కల్పించారు. వేసవిలోనూ గుంతలు తవ్వించి నీటి నిల్వకు ఢోకా లేకుండా చేశారు. అటవీ అధికారులు అన్ని చర్యలు తీసుకొని తడులు అందించి సంరక్షించారు.
మహిళల చేతుల్లో..
గుమ్మడిదల: అటవీ ప్రాంతంలో మొక్కలు నాటేందుకు కొత్త పద్ధతితో ముందుకు సాగారు. గుమ్మడిదల మండలం కొత్తపల్లిలో స్వయం సహాయక సంఘం సభ్యులు విత్తన బంతులు తయారుచేశారు. ఎరువుల మిశ్రమంతో కూడిన మట్టిలో పండ్లు తదితర విత్తనాలను చేర్పించారు. వాటిని మంబాపూర్ అడవిలో వెదజల్లారు. ప్రస్తుతం అవి ఏపుగా పెరిగాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రజాప్రతినిధులు పట్టుబట్టాలి.. రైలు పట్టాలెక్కాలి
[ 06-07-2024]
తెలంగాణలో రైల్వే విస్తరణ తక్కువే. అందులోనూ ఉమ్మడి మెదక్, వికారాబాద్ జిల్లాల్లో రైలు సదుపాయం మరింత తక్కువ. కొంత మేర విస్తరించినా అక్కడా పలు సమస్యలు నెలకొన్నాయి. -
రూ.100 కోసం.. ఏటీఎం ధ్వంసం
[ 06-07-2024]
మద్యం మత్తులో రూ.100 కోసం ఓ వ్యక్తి ఏటీఎంను ధ్వంసం చేసిన సంఘటన రామాయంపేట పట్టణంలో చోటు చేసుకుంది. -
కరుణించని వరుణుడు
[ 06-07-2024]
వానాకాలం ఆరంభమై నెలరోజులు గడిచినా... జిల్లాలో ఇంకా లోటు వర్షాపాతమే నమోదవుతోంది. అడపాదడపా వర్షం పడడంతో కేవలం పత్తి మినహా మిగిలిన పంటల సాగు జరగడం లేదు. -
మహిళలకు మీసేవ కేంద్రాలు
[ 06-07-2024]
మహిళలు అన్ని రంగాల్లో ముందుకు సాగేందుకు ప్రోత్సహిస్తున్నారు. అతివల కోసం ఏర్పాటు చేసిన మహిళా సంఘాల ఆర్థికాభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే చాలా పథకాలను అమలు చేస్తున్నాయి. -
ఆర్ఆర్ఆర్ భూముల్లో అక్రమ తవ్వకాలు
[ 06-07-2024]
ఇటుక బట్టీ వ్యాపారుల అక్రమాలకు అడ్డూఅదుపు లేకుండా పోయింది. చెరువులు, కుంటలతో పాటు ప్రాంతీయ రింగ్ రోడ్డు(ఆర్ఆర్ఆర్)కు సేకరించే భూముల నుంచి సైతం మట్టిని జోరుగా తరలిస్తున్నారు. -
చిరుత సంచారం
[ 06-07-2024]
మండల పరిధి నాగపూర్ గేటు సమీపంలోని అటవీ ప్రాంతంలో ప్రయాణికులకు శుక్రవారం చిరుత కనిపించింది. -
బీమాతో భరోసా.. జీవితానికి రక్షణ
[ 06-07-2024]
స్వయం సహాయక సంఘం (ఎస్హెచ్జీ)లోని మహిళలకు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ బీమా అమలుకు ముందుకొచ్చింది. -
విద్యార్థులకు రోబోటిక్స్ పాఠాలు
[ 06-07-2024]
మారుతున్న సాంకేతికతను అందిపుచ్చుకునేందుకు విద్యాశాఖ కృషి చేస్తోంది. సోహమ్ అకాడమీ ఆఫ్ హ్యూమన్ ఎక్సలెన్స్ సంస్థ సహకారంతో జిల్లాలో ఎంపిక చేసిన పది పాఠశాలల్లో రోబోటిక్స్ పాఠాలను అమలు చేయనున్నారు. -
సమయపాలన.. అల్లంత దూరాన!
[ 06-07-2024]
జిల్లాలోని పురపాలికల్లో కొందరు ఉద్యోగులు, సిబ్బంది సమయపాలన పాటించడం లేదు. మున్సిపాలిటీల్లో ఉద్యోగుల సమయ పాలనపై శుక్రవారం ‘న్యూస్టుడే’ పరిశీలించింది. -
చదువులో మేటి.. అందింది ట్రిపుల్ ఐటీ
[ 06-07-2024]
ప్రతిభకు పేదరికం, కుటుంబంలోని కష్టాలు అడ్డురావని బాసర ట్రిపుల్ ఐటీలో సీటు సాధించిన పలువురు విద్యార్థులు నిరూపించారు. ఇంజినీరింగ్ చదివేందుకు బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకుంటున్నారు. -
రుణం తీర్చి మమ్మల్ని ఆదుకోండి..
[ 06-07-2024]
తల్లిదండ్రుల అకాల మరణంతో చిన్నారులిద్దరూ అనాథలయ్యారు. వృద్ధులైన తాత- నానమ్మల నీడన జీవనం సాగిస్తున్నారు. ధూల్మిట్ట మండల కేంద్రానికి చెందిన బాలలు తాడూరి శివప్రసాద్, శశిలది దయనీయ పరిస్థితి. -
బడిలో చెక్కపెట్టె.. చరవాణులకు చెక్ పెట్టె!
[ 06-07-2024]
తరగతి గదిలో బోధనా సమయంలో చరవాణి వాడకం వల్ల అంతరాయం కలగడమే కాకుండా విద్యార్థుల తల్లిదండ్రులకు ప్రభుత్వ పాఠశాలలపై నమ్మకం పోతోందని గమనించిన ఉపాధ్యాయులు స్ఫూర్తిమంతమైన నిర్ణయం తీసుకున్నారు. -
నేరుగా.. త్వరగా.. ప్రయాణం
[ 06-07-2024]
ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర మంత్రులను ఇటీవల దిల్లీ పర్యటనకు వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కలిసి కొన్ని మార్గాలను జాతీయ రహదారులుగా విస్తరించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. -
భర్త హత్య కేసులో భార్య సహా నలుగురి అరెస్టు
[ 06-07-2024]
గత నెలలో జగద్గిరిగుట్ట పరిధి వెంకటేశ్వరనగర్లో జరిగిన అనిల్కుమార్ హత్య కేసులో ఆయన భార్య సహా నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. -
క్షణికావేశం.. వేర్వేరుగా ముగ్గురి బలవన్మరణం
[ 06-07-2024]
క్షణికావేశంలో వేర్వేరు కారణాలతో సిద్దిపేట జిల్లాలో ముగ్గురు బలవన్మరణానికి పాల్పడ్డారు. ఏదైనా పని చేసుకోవాలని తల్లిదండ్రులు మందలించడంతో యువకుడు సిద్దిపేట జిల్లా రాయపోలు మండలం ఎల్కల్ గ్రామంలో ఆత్మహత్య చేసుకున్నాడు. -
ఆర్టీసీ బస్సు ఢీకొని ప్రధానోపాధ్యాయుడి దుర్మరణం
[ 06-07-2024]
రోజూ తోటి ఉపాధ్యాయులతో కలిసి కారులో వెళ్లే ప్రధానోపాధ్యాయుడు.. మిగిలిన వారు రాకపోవడంతో ద్విచక్రవాహనంపై విధులకు వెళ్తూ..