చైతన్యం తీసుకొచ్చి.. భూసారం పరీక్షించి..
భూసారంపై సరైన అవగాహన లేక ఎంతోమంది రైతులు పరీక్ష చేయించకుండానే పంటలు సాగు చేసి నష్టపోతున్నారు. అందుకే ప్రభుత్వాలు సైతం భూసార పరీక్షలకు ప్రాధాన్యం ఇస్తూ రైతులకు అవగాహన కల్పిస్తున్నాయి.
జహీరాబాద్ కేవీకేకు జోనల్ స్థాయిలో మూడో స్థానం
న్యూస్టుడే, జహీరాబాద్
మట్టి సేకరణపై అవగాహన కల్పిస్తూ..
భూసారంపై సరైన అవగాహన లేక ఎంతోమంది రైతులు పరీక్ష చేయించకుండానే పంటలు సాగు చేసి నష్టపోతున్నారు. అందుకే ప్రభుత్వాలు సైతం భూసార పరీక్షలకు ప్రాధాన్యం ఇస్తూ రైతులకు అవగాహన కల్పిస్తున్నాయి. ఇదే క్రమంలో జహీరాబాద్లోని డీడీఎస్-కేవీకే ఆధ్వర్యంలో రైతుల్లో భూసార పరీక్షలపై అవగాహన కల్పిస్తూ చైతన్యం తీసుకొచ్చేందుకు కృషి చేస్తోంది. మూడేళ్లుగా ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాన్ని అధిగమించి మట్టి పరీక్షలు చేపట్టడంతో 2023-24వ సంవత్సరానికి సంబంధించి నాలుగు రాష్ట్రాలతో కూడిన జోనల్ స్థాయిలో మూడో స్థానాన్ని దక్కించుకోవడం గమనార్హం.
రెండు దశబ్ద్దాలుగా..
దుక్కి దున్నడం నుంచి పంట కోతకు వచ్చే వరకు రైతులకు అవసరమైన తోడ్పాలు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం రెండున్నర దశబ్దాల క్రితం కృషి విజ్ఞాన కేంద్రాలను (కేవీకే) నెలకొల్పింది. జహీరాబాద్లో దక్కన్ డెవలప్మెంట్ సొసైటీ సహకారంతో కేవీకేను ఏర్పాటుచేయగా.. కర్షకులకు అండగా నిలుస్తోంది. సేంద్రియ సాగు, కుటీర పరిశ్రమలు, సస్యరక్షణ, ఉద్యాన పంటల సాగుతో పాటు భూసార పరీక్షలకూ విభాగాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. ప్రతి కేవీకేకు ప్రభుత్వం ఏటా నిర్వహించాల్సిన పరీక్షలపై లక్ష్యాన్ని నిర్దేశిస్తుంది.
2,518 పరీక్షలు..
కేవీకే పరిధిలోని గ్రామాల్లో శాస్త్రవేత్తలు, అధికారులు పర్యటించి రైతుల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు కృషి చేశారు. జనవరి నుంచి మే చివరి వరకు పరీక్షించడానికి అనువు. నాలుగు నెలల్లో 1,300 మంది రైతుల పొలల నుంచి మట్టి సేకరించి పరీక్షించాల్సి ఉంటుంది. ఈ లక్ష్యాన్ని అధిగమించి 2,518 పరీక్షలు చేయడం గమనార్హం. ఆయా ఫలితాలను సకాలంలో వెల్లడించి ఏ పంటలు వేయాలి, ఏ మేర ఎరువులు వాడాలి తదితర అంశాలను వివరించారు. జహీరాబాద్, చుట్టుపక్కల ప్రాంతాల్లో ఆమ్లం సమస్య ఎక్కువగా ఉందని గుర్తించి నివారణ చర్యలు తెలిపారు. కేంద్రానికి తీసుకొచ్చిన నమూనాలను సైతం పరీక్షించి ఫలితాలను తెలియజేశారు.
ఫలితాలను విశ్లేషించి..
ల్యాబ్లో నమూనాను పరీక్షిస్తున్న నిపుణుడు
జాతీయ వ్యవసాయ పరిశోధన సంస్థ ఆధ్వర్యంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పాండిచ్చేరి రాష్ట్రాలతో ఓ జోనల్ను ఏర్పాటుచేశారు. ప్రతి ఏటా దీని స్థాయిలో సమావేశం నిర్వహించి ప్రగతిని నివేదిస్తుంటారు. ఈ సారి తాజాగా రాజమండ్రిలోని జాతీయ పోగాకు పరిశోధనా సంస్థ కేంద్రంలో ప్రత్యేక సమావేశం జరిగింది. ఇందులో నాలుగు రాష్ట్రాల్లోని 72 కేవీకేల పరిధిలో చేపట్టిన అన్ని కార్యక్రమాలను పరిశీలించి భూసార పరీక్షల్లో జహీరాబాద్ కేంద్రానికి మూడో బహుమతి ప్రకటించడం గమనార్హం. ఈ విషయమై భూసార పరీక్షల నిపుణుడు స్వామియాదవ్ మాట్లాడుతూ.. గ్రామాల్లో పర్యటించి రైతులకు అవగాహన కల్పించామని, పంటల సాగు తదితర వాటిని వివరించామని తద్వారా అవార్డు సాధ్యమైందని చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రజాప్రతినిధులు పట్టుబట్టాలి.. రైలు పట్టాలెక్కాలి
[ 06-07-2024]
తెలంగాణలో రైల్వే విస్తరణ తక్కువే. అందులోనూ ఉమ్మడి మెదక్, వికారాబాద్ జిల్లాల్లో రైలు సదుపాయం మరింత తక్కువ. కొంత మేర విస్తరించినా అక్కడా పలు సమస్యలు నెలకొన్నాయి. -
రూ.100 కోసం.. ఏటీఎం ధ్వంసం
[ 06-07-2024]
మద్యం మత్తులో రూ.100 కోసం ఓ వ్యక్తి ఏటీఎంను ధ్వంసం చేసిన సంఘటన రామాయంపేట పట్టణంలో చోటు చేసుకుంది. -
కరుణించని వరుణుడు
[ 06-07-2024]
వానాకాలం ఆరంభమై నెలరోజులు గడిచినా... జిల్లాలో ఇంకా లోటు వర్షాపాతమే నమోదవుతోంది. అడపాదడపా వర్షం పడడంతో కేవలం పత్తి మినహా మిగిలిన పంటల సాగు జరగడం లేదు. -
మహిళలకు మీసేవ కేంద్రాలు
[ 06-07-2024]
మహిళలు అన్ని రంగాల్లో ముందుకు సాగేందుకు ప్రోత్సహిస్తున్నారు. అతివల కోసం ఏర్పాటు చేసిన మహిళా సంఘాల ఆర్థికాభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే చాలా పథకాలను అమలు చేస్తున్నాయి. -
ఆర్ఆర్ఆర్ భూముల్లో అక్రమ తవ్వకాలు
[ 06-07-2024]
ఇటుక బట్టీ వ్యాపారుల అక్రమాలకు అడ్డూఅదుపు లేకుండా పోయింది. చెరువులు, కుంటలతో పాటు ప్రాంతీయ రింగ్ రోడ్డు(ఆర్ఆర్ఆర్)కు సేకరించే భూముల నుంచి సైతం మట్టిని జోరుగా తరలిస్తున్నారు. -
చిరుత సంచారం
[ 06-07-2024]
మండల పరిధి నాగపూర్ గేటు సమీపంలోని అటవీ ప్రాంతంలో ప్రయాణికులకు శుక్రవారం చిరుత కనిపించింది. -
బీమాతో భరోసా.. జీవితానికి రక్షణ
[ 06-07-2024]
స్వయం సహాయక సంఘం (ఎస్హెచ్జీ)లోని మహిళలకు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ బీమా అమలుకు ముందుకొచ్చింది. -
విద్యార్థులకు రోబోటిక్స్ పాఠాలు
[ 06-07-2024]
మారుతున్న సాంకేతికతను అందిపుచ్చుకునేందుకు విద్యాశాఖ కృషి చేస్తోంది. సోహమ్ అకాడమీ ఆఫ్ హ్యూమన్ ఎక్సలెన్స్ సంస్థ సహకారంతో జిల్లాలో ఎంపిక చేసిన పది పాఠశాలల్లో రోబోటిక్స్ పాఠాలను అమలు చేయనున్నారు. -
సమయపాలన.. అల్లంత దూరాన!
[ 06-07-2024]
జిల్లాలోని పురపాలికల్లో కొందరు ఉద్యోగులు, సిబ్బంది సమయపాలన పాటించడం లేదు. మున్సిపాలిటీల్లో ఉద్యోగుల సమయ పాలనపై శుక్రవారం ‘న్యూస్టుడే’ పరిశీలించింది. -
చదువులో మేటి.. అందింది ట్రిపుల్ ఐటీ
[ 06-07-2024]
ప్రతిభకు పేదరికం, కుటుంబంలోని కష్టాలు అడ్డురావని బాసర ట్రిపుల్ ఐటీలో సీటు సాధించిన పలువురు విద్యార్థులు నిరూపించారు. ఇంజినీరింగ్ చదివేందుకు బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకుంటున్నారు. -
రుణం తీర్చి మమ్మల్ని ఆదుకోండి..
[ 06-07-2024]
తల్లిదండ్రుల అకాల మరణంతో చిన్నారులిద్దరూ అనాథలయ్యారు. వృద్ధులైన తాత- నానమ్మల నీడన జీవనం సాగిస్తున్నారు. ధూల్మిట్ట మండల కేంద్రానికి చెందిన బాలలు తాడూరి శివప్రసాద్, శశిలది దయనీయ పరిస్థితి. -
బడిలో చెక్కపెట్టె.. చరవాణులకు చెక్ పెట్టె!
[ 06-07-2024]
తరగతి గదిలో బోధనా సమయంలో చరవాణి వాడకం వల్ల అంతరాయం కలగడమే కాకుండా విద్యార్థుల తల్లిదండ్రులకు ప్రభుత్వ పాఠశాలలపై నమ్మకం పోతోందని గమనించిన ఉపాధ్యాయులు స్ఫూర్తిమంతమైన నిర్ణయం తీసుకున్నారు. -
నేరుగా.. త్వరగా.. ప్రయాణం
[ 06-07-2024]
ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర మంత్రులను ఇటీవల దిల్లీ పర్యటనకు వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కలిసి కొన్ని మార్గాలను జాతీయ రహదారులుగా విస్తరించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. -
భర్త హత్య కేసులో భార్య సహా నలుగురి అరెస్టు
[ 06-07-2024]
గత నెలలో జగద్గిరిగుట్ట పరిధి వెంకటేశ్వరనగర్లో జరిగిన అనిల్కుమార్ హత్య కేసులో ఆయన భార్య సహా నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. -
క్షణికావేశం.. వేర్వేరుగా ముగ్గురి బలవన్మరణం
[ 06-07-2024]
క్షణికావేశంలో వేర్వేరు కారణాలతో సిద్దిపేట జిల్లాలో ముగ్గురు బలవన్మరణానికి పాల్పడ్డారు. ఏదైనా పని చేసుకోవాలని తల్లిదండ్రులు మందలించడంతో యువకుడు సిద్దిపేట జిల్లా రాయపోలు మండలం ఎల్కల్ గ్రామంలో ఆత్మహత్య చేసుకున్నాడు. -
ఆర్టీసీ బస్సు ఢీకొని ప్రధానోపాధ్యాయుడి దుర్మరణం
[ 06-07-2024]
రోజూ తోటి ఉపాధ్యాయులతో కలిసి కారులో వెళ్లే ప్రధానోపాధ్యాయుడు.. మిగిలిన వారు రాకపోవడంతో ద్విచక్రవాహనంపై విధులకు వెళ్తూ..
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
సమంతకు క్షమాపణలు చెప్పిన డాక్టర్.. కానీ..
-
సికింద్రాబాద్‑గోవా బైవీక్లీ ఎక్స్ప్రెస్ రైలు.. ప్రధానికి ధన్యవాదాలు తెలిపిన కిషన్రెడ్డి
-
నటుడు రాజ్ తరుణ్ వ్యవహారంలో మరో ట్విస్ట్
-
అస్సాం అతలాకుతలం.. ఉప్పొంగుతున్న నదులు
-
జియో నుంచి కొత్తగా 5జీ డేటా బూస్టర్ ప్లాన్స్
-
పంజాబ్ నేషనల్ బ్యాంక్కు ఆర్బీఐ జరిమానా