ఉద్యోగాల పేరిట దర్జాగా మోసం
వివిధ స్వచ్ఛంద సంస్థలు, సంఘాల్లో కేంద్ర, రాష్ట్ర కమిటీల ప్రతినిధిగా పరిచయం చేసుకున్న ఓ మోసగాడు.. దర్జాగా అమాయకులను నట్టేట ముంచాడు. చివరకు మోసపోయామని గ్రహించిన ఇద్దరు బాధితులు పోలీసులను ఆశ్రయించడంతో అసలు విషయం బయటపడింది.
వివరాలు వెల్లడిస్తున్న అదనపు డీసీపీ మల్లారెడ్డి, ఏసీపీ మధు, వన్టౌన్ సీఐ లక్ష్మీబాబు, ఎస్ఐ నర్సింహారావు
సిద్దిపేట, న్యూస్టుడే: వివిధ స్వచ్ఛంద సంస్థలు, సంఘాల్లో కేంద్ర, రాష్ట్ర కమిటీల ప్రతినిధిగా పరిచయం చేసుకున్న ఓ మోసగాడు.. దర్జాగా అమాయకులను నట్టేట ముంచాడు. చివరకు మోసపోయామని గ్రహించిన ఇద్దరు బాధితులు పోలీసులను ఆశ్రయించడంతో అసలు విషయం బయటపడింది. సిద్దిపేట వన్టౌన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకోగా సంబంధిత వివరాలను అదనపు డీసీపీ మల్లారెడ్డి.. ఏసీపీ మధు, వన్టౌన్ సీఐ లక్ష్మీబాబు, ఎస్ఐ నర్సింహారావుతో కలిసి మంగళవారం వెల్లడించారు. సిద్దిపేట శంకర్నగర్కు చెందిన వరప్రసాద్, గాంధీనగర్కు చెందిన బక్కోళ్ల అశోక్ మిత్రులు. వీరి వయసు 40 ఏళ్లపైమాటే. అశోక్కు బావ వరుసయ్యే దుబ్బాక మండలం తిమ్మాపూర్కు చెందిన జోరవంతల సత్యనారాయణ (50) హైదరాబాద్లోని పాత అల్వాలలో నివసిస్తున్నాడు. సిద్దిపేటలోని సీతారాంనగర్ కాలనీలో ఓ ఉపాధ్యాయుడి ఇంట్లో 2022లో కార్యాలయం తెరిచాడు. ఎన్జీవో సంస్థలైన యాంటీ కరప్షన్ ఇంటెలిజెన్స్ కమిటీ, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ సహా తెలంగాణ రాష్ట్ర ప్రైవేటు ఉద్యోగుల సంఘంలో వివిధ హోదాల్లో పని చేస్తున్నట్లు ప్రచారం చేసుకున్నాడు. ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ అందరికి నమ్మబలికాడు.
సత్యనారాయణ నిందితుడు
సబార్డినేట్ ఉద్యోగాలంటూ..
వరప్రసాద్, అశోక్లు అతడిని కలవగా ప్రభుత్వ శాఖల్లో సబార్డినేట్ ఉద్యోగాలు రెండు నెలల్లో ఇప్పిస్తానని, రూ.6 లక్షలు ఖర్చవుతుందని చెప్పాడు. ఆరు నెలల కిందట వరప్రసాద్ రూ.4.15 లక్షలు, అశోక్ రూ.1.50 లక్షలు విడతల వారీగా ముట్టజెప్పారు. నెలలు గడుస్తుండటంతో ఏమైందని ఆరా తీయడంతో సత్యనారాయణ సమీకృత మార్కెట్ సమీపంలోకి కార్యాలయాన్ని మార్చాడు. అద్దె కోసం వరప్రసాద్ నుంచి మరో రూ.15 వేలు వసూలు చేశాడు. ప్రభుత్వం మారిందని, ఎంపీ ఎన్నికలు జరుగుతున్నాయని, తర్వాత ఉద్యోగం ఇప్పిస్తానని కాలం వెళ్లదీశాడు. ఓసారి అశోక్కు చెల్లని చెక్కు ఇచ్చాడు. బాధితులు సొమ్ము ఇచ్చేయాలని నిలదీయగా చంపేస్తానని బెదిరించాడు. చివరకు బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి అసలు గుట్టు విప్పారు. పని పాట లేకుండా తిరిగే సదరు నిందితుడు హోంగార్డు, ఓ టీవీ ఛానెల్ ప్రతినిధి, వివిధ సంస్థల్లో పని చేస్తున్నట్లు పొంతన లేని సమాధానం చెప్పగా పోలీసులు తమదైన శైలిలో విచారించారు. సులువుగా సొమ్ము సంపాదించేందుకు మోసాలకు ఒడిగట్టాడని, నకిలీ గుర్తింపుకార్డులు సృష్టించినట్లు గుర్తించారు. అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. మోసపోయిన జాబితాలో మరిందరు ఉండే అవకాశం ఉందని భావిస్తున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇతర బాధితులు వన్టౌన్ పోలీసులు ఠాణాలో ఫిర్యాదు చేయాలని సూచించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రజాప్రతినిధులు పట్టుబట్టాలి.. రైలు పట్టాలెక్కాలి
[ 06-07-2024]
తెలంగాణలో రైల్వే విస్తరణ తక్కువే. అందులోనూ ఉమ్మడి మెదక్, వికారాబాద్ జిల్లాల్లో రైలు సదుపాయం మరింత తక్కువ. కొంత మేర విస్తరించినా అక్కడా పలు సమస్యలు నెలకొన్నాయి. -
రూ.100 కోసం.. ఏటీఎం ధ్వంసం
[ 06-07-2024]
మద్యం మత్తులో రూ.100 కోసం ఓ వ్యక్తి ఏటీఎంను ధ్వంసం చేసిన సంఘటన రామాయంపేట పట్టణంలో చోటు చేసుకుంది. -
కరుణించని వరుణుడు
[ 06-07-2024]
వానాకాలం ఆరంభమై నెలరోజులు గడిచినా... జిల్లాలో ఇంకా లోటు వర్షాపాతమే నమోదవుతోంది. అడపాదడపా వర్షం పడడంతో కేవలం పత్తి మినహా మిగిలిన పంటల సాగు జరగడం లేదు. -
మహిళలకు మీసేవ కేంద్రాలు
[ 06-07-2024]
మహిళలు అన్ని రంగాల్లో ముందుకు సాగేందుకు ప్రోత్సహిస్తున్నారు. అతివల కోసం ఏర్పాటు చేసిన మహిళా సంఘాల ఆర్థికాభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే చాలా పథకాలను అమలు చేస్తున్నాయి. -
ఆర్ఆర్ఆర్ భూముల్లో అక్రమ తవ్వకాలు
[ 06-07-2024]
ఇటుక బట్టీ వ్యాపారుల అక్రమాలకు అడ్డూఅదుపు లేకుండా పోయింది. చెరువులు, కుంటలతో పాటు ప్రాంతీయ రింగ్ రోడ్డు(ఆర్ఆర్ఆర్)కు సేకరించే భూముల నుంచి సైతం మట్టిని జోరుగా తరలిస్తున్నారు. -
చిరుత సంచారం
[ 06-07-2024]
మండల పరిధి నాగపూర్ గేటు సమీపంలోని అటవీ ప్రాంతంలో ప్రయాణికులకు శుక్రవారం చిరుత కనిపించింది. -
బీమాతో భరోసా.. జీవితానికి రక్షణ
[ 06-07-2024]
స్వయం సహాయక సంఘం (ఎస్హెచ్జీ)లోని మహిళలకు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ బీమా అమలుకు ముందుకొచ్చింది. -
విద్యార్థులకు రోబోటిక్స్ పాఠాలు
[ 06-07-2024]
మారుతున్న సాంకేతికతను అందిపుచ్చుకునేందుకు విద్యాశాఖ కృషి చేస్తోంది. సోహమ్ అకాడమీ ఆఫ్ హ్యూమన్ ఎక్సలెన్స్ సంస్థ సహకారంతో జిల్లాలో ఎంపిక చేసిన పది పాఠశాలల్లో రోబోటిక్స్ పాఠాలను అమలు చేయనున్నారు. -
సమయపాలన.. అల్లంత దూరాన!
[ 06-07-2024]
జిల్లాలోని పురపాలికల్లో కొందరు ఉద్యోగులు, సిబ్బంది సమయపాలన పాటించడం లేదు. మున్సిపాలిటీల్లో ఉద్యోగుల సమయ పాలనపై శుక్రవారం ‘న్యూస్టుడే’ పరిశీలించింది. -
చదువులో మేటి.. అందింది ట్రిపుల్ ఐటీ
[ 06-07-2024]
ప్రతిభకు పేదరికం, కుటుంబంలోని కష్టాలు అడ్డురావని బాసర ట్రిపుల్ ఐటీలో సీటు సాధించిన పలువురు విద్యార్థులు నిరూపించారు. ఇంజినీరింగ్ చదివేందుకు బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకుంటున్నారు. -
రుణం తీర్చి మమ్మల్ని ఆదుకోండి..
[ 06-07-2024]
తల్లిదండ్రుల అకాల మరణంతో చిన్నారులిద్దరూ అనాథలయ్యారు. వృద్ధులైన తాత- నానమ్మల నీడన జీవనం సాగిస్తున్నారు. ధూల్మిట్ట మండల కేంద్రానికి చెందిన బాలలు తాడూరి శివప్రసాద్, శశిలది దయనీయ పరిస్థితి. -
బడిలో చెక్కపెట్టె.. చరవాణులకు చెక్ పెట్టె!
[ 06-07-2024]
తరగతి గదిలో బోధనా సమయంలో చరవాణి వాడకం వల్ల అంతరాయం కలగడమే కాకుండా విద్యార్థుల తల్లిదండ్రులకు ప్రభుత్వ పాఠశాలలపై నమ్మకం పోతోందని గమనించిన ఉపాధ్యాయులు స్ఫూర్తిమంతమైన నిర్ణయం తీసుకున్నారు. -
నేరుగా.. త్వరగా.. ప్రయాణం
[ 06-07-2024]
ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర మంత్రులను ఇటీవల దిల్లీ పర్యటనకు వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కలిసి కొన్ని మార్గాలను జాతీయ రహదారులుగా విస్తరించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. -
భర్త హత్య కేసులో భార్య సహా నలుగురి అరెస్టు
[ 06-07-2024]
గత నెలలో జగద్గిరిగుట్ట పరిధి వెంకటేశ్వరనగర్లో జరిగిన అనిల్కుమార్ హత్య కేసులో ఆయన భార్య సహా నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. -
క్షణికావేశం.. వేర్వేరుగా ముగ్గురి బలవన్మరణం
[ 06-07-2024]
క్షణికావేశంలో వేర్వేరు కారణాలతో సిద్దిపేట జిల్లాలో ముగ్గురు బలవన్మరణానికి పాల్పడ్డారు. ఏదైనా పని చేసుకోవాలని తల్లిదండ్రులు మందలించడంతో యువకుడు సిద్దిపేట జిల్లా రాయపోలు మండలం ఎల్కల్ గ్రామంలో ఆత్మహత్య చేసుకున్నాడు. -
ఆర్టీసీ బస్సు ఢీకొని ప్రధానోపాధ్యాయుడి దుర్మరణం
[ 06-07-2024]
రోజూ తోటి ఉపాధ్యాయులతో కలిసి కారులో వెళ్లే ప్రధానోపాధ్యాయుడు.. మిగిలిన వారు రాకపోవడంతో ద్విచక్రవాహనంపై విధులకు వెళ్తూ..