పక్కాగా పర్యవేక్షణ.. అతిసారం నియంత్రణ
వర్షాకాలంలో సాధారణంగా సీజనల్ వ్యాధులు ప్రబలుతుంటాయి. ప్రభుత్వ యంత్రాంగమైనా, వ్యాపారస్థులైనా, కుటుంబ సభ్యులైనా ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా మొదటికే మోసం వస్తుంది.
రెండు నెలల కార్యాచరణ
మద్దూరు మండలం లద్నూరులో ఓఆర్ఎస్ పొట్లాల పంపిణీ (పాతచిత్రం)
న్యూస్టుడే, సిద్దిపేట: వర్షాకాలంలో సాధారణంగా సీజనల్ వ్యాధులు ప్రబలుతుంటాయి. ప్రభుత్వ యంత్రాంగమైనా, వ్యాపారస్థులైనా, కుటుంబ సభ్యులైనా ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా మొదటికే మోసం వస్తుంది. ఈ నేపథ్యంలో వివిధ శాఖలు సంయుక్తంగా ప్రజలకు అవగాహన కల్పించేందుకు చర్యలు చేపట్టాయి. ప్రత్యేక డ్రైవ్ నిర్వహించనున్నారు. ముఖ్యంగా అతిసారం (డయేరియా) అడ్డుకట్ట వేయడమే లక్ష్యంగా వైద్యారోగ్య శాఖ దృష్టి సారించింది. పంచాయతీ, గ్రామీణాభివృద్ధి, ఐసీడీఎస్, విద్య, ఆర్డబ్ల్యూఎస్, స్థానిక సంస్థలు సమన్వయంగా ముందడుగు వేయనున్నాయి. కలుషిత నీరు, ఆహారం తీసుకుంటే అతిసారం సోకుతుంది. తద్వారా నీళ్ల విరేచనాలు జరుగుతాయి. రోజుకు ఐదారుసార్లకు మించి నీళ్ల విరేచనాలు, వాంతులు, వికారం, కడుపునొప్పి లాంటి సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. శరీరం నిస్సత్తవుగా మారుతుంది. చిన్నారులకు ఇది ప్రమాదకరంగా మారుతుంది. రాబోయే రెండు నెలలు సంబంధిత శాఖలు సమన్వయంగా ముందడుగు వేయనున్నాయి. క్షేత్రస్థాయిలో పక్కాగా అమలు చేయడం ద్వారా అడ్డుకట్ట వేయడం సాధ్యమవనుంది.
ఆరు నెలల్లో 3,643 కేసులు
ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు 3,634 డయేరియా కేసులు నమోదయ్యాయి. వర్షాకాలంలో ముందు జాగ్రత్తలతో వ్యాధికి అడ్డుకట్ట వేయొచ్చు. ఈ తరుణంలో ‘స్టాప్ డయేరియా’ కార్యక్రమాన్ని ఆగస్టు చివరి వరకు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆశాలు, ఏఎన్ఎంలు, ఇతర వైద్యారోగ్య, పారిశుద్ధ్య, తాగునీటి విభాగం సిబ్బంది కీలక పాత్ర పోషించనున్నారు. గ్రామాల్లో పారిశుద్ధ్యం మెరుగుపర్చన్నారు. శుద్ధి చేసిన నీరు సక్రమంగా సరఫరా చేసేలా పర్యవేక్షణ చేయనున్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. తల్లులు, బాలింతలు, బాలలకు శుభ్రతపై వివరించనున్నారు. పాఠశాల స్థాయిలో అవగాహన కార్యక్రమాలు చేపట్టనున్నారు. ఓఆర్ఎస్ పొట్లాలు, జింకు మాత్రలు పంపిణీ చేయనున్నారు.
పకడ్బందీగా చేపడితేనే..
గ్రామాల్లో ప్రత్యేకాధికారుల పాలన, నిధుల లేమి సమస్యలతో పారిశుద్ధ్యం లోపిస్తోంది. పకడ్బందీగా చేపడితేనే అడ్డుకట్ట పడనుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ సందర్భంగా జిల్లా వైద్యాధికారి పుట్ల శ్రీనివాస్ ‘న్యూస్టుడే’తో మాట్లాడుతూ.. ‘ఇప్పటికే వైద్యాధికారులు, ఆరోగ్య సిబ్బందిని అప్రమత్తం చేశాం. క్షేత్రస్థాయిలో వివిధ శాఖల సమన్వయంతో డయేరియా అడ్డుకట్ట వేసేందుకు చర్యలు కొనసాగుతున్నాయి. ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.’ అని తెలిపారు.
జాగ్రత్తలు ఇలా..
- వేడి పదార్థాలు, తాజా ఆహారం తీసుకోవాలి.
- ఇంట్లో శుభ్రత పాటించాలి. పరిసరాల పరిశుభ్రత అవశ్యం.
- బయటి చిరుతిళ్లు తినొద్దు.
- పరిస్థితులకు అనుగుణంగా కాచి వడబోసిన నీటిని తాగాలి. ః ఆహారంపై ఈగలు, దోమలు వాలకుండా చూసుకోవాలి.
- ఆరు నెలల్లోపు చిన్నారులకు తల్లి పాలు మాత్రమే పట్టించాలి.
- రోటా వైరస్ వ్యాక్సిన్తో ప్రమాదకర అతిసార వ్యాధిని నివారించవచ్చు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రజాప్రతినిధులు పట్టుబట్టాలి.. రైలు పట్టాలెక్కాలి
[ 06-07-2024]
తెలంగాణలో రైల్వే విస్తరణ తక్కువే. అందులోనూ ఉమ్మడి మెదక్, వికారాబాద్ జిల్లాల్లో రైలు సదుపాయం మరింత తక్కువ. కొంత మేర విస్తరించినా అక్కడా పలు సమస్యలు నెలకొన్నాయి. -
రూ.100 కోసం.. ఏటీఎం ధ్వంసం
[ 06-07-2024]
మద్యం మత్తులో రూ.100 కోసం ఓ వ్యక్తి ఏటీఎంను ధ్వంసం చేసిన సంఘటన రామాయంపేట పట్టణంలో చోటు చేసుకుంది. -
కరుణించని వరుణుడు
[ 06-07-2024]
వానాకాలం ఆరంభమై నెలరోజులు గడిచినా... జిల్లాలో ఇంకా లోటు వర్షాపాతమే నమోదవుతోంది. అడపాదడపా వర్షం పడడంతో కేవలం పత్తి మినహా మిగిలిన పంటల సాగు జరగడం లేదు. -
మహిళలకు మీసేవ కేంద్రాలు
[ 06-07-2024]
మహిళలు అన్ని రంగాల్లో ముందుకు సాగేందుకు ప్రోత్సహిస్తున్నారు. అతివల కోసం ఏర్పాటు చేసిన మహిళా సంఘాల ఆర్థికాభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే చాలా పథకాలను అమలు చేస్తున్నాయి. -
ఆర్ఆర్ఆర్ భూముల్లో అక్రమ తవ్వకాలు
[ 06-07-2024]
ఇటుక బట్టీ వ్యాపారుల అక్రమాలకు అడ్డూఅదుపు లేకుండా పోయింది. చెరువులు, కుంటలతో పాటు ప్రాంతీయ రింగ్ రోడ్డు(ఆర్ఆర్ఆర్)కు సేకరించే భూముల నుంచి సైతం మట్టిని జోరుగా తరలిస్తున్నారు. -
చిరుత సంచారం
[ 06-07-2024]
మండల పరిధి నాగపూర్ గేటు సమీపంలోని అటవీ ప్రాంతంలో ప్రయాణికులకు శుక్రవారం చిరుత కనిపించింది. -
బీమాతో భరోసా.. జీవితానికి రక్షణ
[ 06-07-2024]
స్వయం సహాయక సంఘం (ఎస్హెచ్జీ)లోని మహిళలకు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ బీమా అమలుకు ముందుకొచ్చింది. -
విద్యార్థులకు రోబోటిక్స్ పాఠాలు
[ 06-07-2024]
మారుతున్న సాంకేతికతను అందిపుచ్చుకునేందుకు విద్యాశాఖ కృషి చేస్తోంది. సోహమ్ అకాడమీ ఆఫ్ హ్యూమన్ ఎక్సలెన్స్ సంస్థ సహకారంతో జిల్లాలో ఎంపిక చేసిన పది పాఠశాలల్లో రోబోటిక్స్ పాఠాలను అమలు చేయనున్నారు. -
సమయపాలన.. అల్లంత దూరాన!
[ 06-07-2024]
జిల్లాలోని పురపాలికల్లో కొందరు ఉద్యోగులు, సిబ్బంది సమయపాలన పాటించడం లేదు. మున్సిపాలిటీల్లో ఉద్యోగుల సమయ పాలనపై శుక్రవారం ‘న్యూస్టుడే’ పరిశీలించింది. -
చదువులో మేటి.. అందింది ట్రిపుల్ ఐటీ
[ 06-07-2024]
ప్రతిభకు పేదరికం, కుటుంబంలోని కష్టాలు అడ్డురావని బాసర ట్రిపుల్ ఐటీలో సీటు సాధించిన పలువురు విద్యార్థులు నిరూపించారు. ఇంజినీరింగ్ చదివేందుకు బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకుంటున్నారు. -
రుణం తీర్చి మమ్మల్ని ఆదుకోండి..
[ 06-07-2024]
తల్లిదండ్రుల అకాల మరణంతో చిన్నారులిద్దరూ అనాథలయ్యారు. వృద్ధులైన తాత- నానమ్మల నీడన జీవనం సాగిస్తున్నారు. ధూల్మిట్ట మండల కేంద్రానికి చెందిన బాలలు తాడూరి శివప్రసాద్, శశిలది దయనీయ పరిస్థితి. -
బడిలో చెక్కపెట్టె.. చరవాణులకు చెక్ పెట్టె!
[ 06-07-2024]
తరగతి గదిలో బోధనా సమయంలో చరవాణి వాడకం వల్ల అంతరాయం కలగడమే కాకుండా విద్యార్థుల తల్లిదండ్రులకు ప్రభుత్వ పాఠశాలలపై నమ్మకం పోతోందని గమనించిన ఉపాధ్యాయులు స్ఫూర్తిమంతమైన నిర్ణయం తీసుకున్నారు. -
నేరుగా.. త్వరగా.. ప్రయాణం
[ 06-07-2024]
ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర మంత్రులను ఇటీవల దిల్లీ పర్యటనకు వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కలిసి కొన్ని మార్గాలను జాతీయ రహదారులుగా విస్తరించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. -
భర్త హత్య కేసులో భార్య సహా నలుగురి అరెస్టు
[ 06-07-2024]
గత నెలలో జగద్గిరిగుట్ట పరిధి వెంకటేశ్వరనగర్లో జరిగిన అనిల్కుమార్ హత్య కేసులో ఆయన భార్య సహా నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. -
క్షణికావేశం.. వేర్వేరుగా ముగ్గురి బలవన్మరణం
[ 06-07-2024]
క్షణికావేశంలో వేర్వేరు కారణాలతో సిద్దిపేట జిల్లాలో ముగ్గురు బలవన్మరణానికి పాల్పడ్డారు. ఏదైనా పని చేసుకోవాలని తల్లిదండ్రులు మందలించడంతో యువకుడు సిద్దిపేట జిల్లా రాయపోలు మండలం ఎల్కల్ గ్రామంలో ఆత్మహత్య చేసుకున్నాడు. -
ఆర్టీసీ బస్సు ఢీకొని ప్రధానోపాధ్యాయుడి దుర్మరణం
[ 06-07-2024]
రోజూ తోటి ఉపాధ్యాయులతో కలిసి కారులో వెళ్లే ప్రధానోపాధ్యాయుడు.. మిగిలిన వారు రాకపోవడంతో ద్విచక్రవాహనంపై విధులకు వెళ్తూ..