వన మహోత్సవానికి సిద్ధం
జిల్లాలో పచ్చదనం పెంపే లక్ష్యంగా వన మహోత్సవాన్ని నిర్వహించేందుకు యంత్రాంగం సన్నద్ధమైంది. మరో వారం రోజుల్లో ఊరూరా కార్యక్రమాన్ని చేపట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే నర్సరీల్లో మొక్కలు పంపిణీకి సిద్ధమయ్యాయి.
శాఖల వారీగా లక్ష్యం ఖరారు
న్యూస్టుడే, సంగారెడ్డి అర్బన్
మొక్కలు నాటడానికి గుంతలు తవ్వుతున్న ఉపాధి కూలీలు
జిల్లాలో పచ్చదనం పెంపే లక్ష్యంగా వన మహోత్సవాన్ని నిర్వహించేందుకు యంత్రాంగం సన్నద్ధమైంది. మరో వారం రోజుల్లో ఊరూరా కార్యక్రమాన్ని చేపట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే నర్సరీల్లో మొక్కలు పంపిణీకి సిద్ధమయ్యాయి. ఉపాధి హామీ పథకం కూలీలతో గుంతలు తవ్విస్తున్నారు. సీఎం రేవంత్రెడ్డి చేతుల మీదుగా అమీన్పూర్లో మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించేలా జిల్లా యంత్రాంగం కసరత్తు చేస్తోంది.
639 నర్సరీల్లో మొక్కలు
జిల్లాలో గ్రామీణ ఉపాధి హామీ పథకం ఆధ్వర్యంలో 639 నర్సరీలు ఏర్పాటు చేశారు. వీటిలో 38 లక్షల మొక్కలను సిద్ధం చేశారు. ఈ ఏడాది జిల్లా వ్యాప్తంగా 33 లక్షల మొక్కలు నాటాలని సంకల్పించారు. ఒక్కో గ్రామంలో 2700 మొక్కలు నాటాలని లక్ష్యాన్ని నిర్దేశించారు. ప్రభుత్వ ఖాళీ స్థలాలు, రహదారుల వెంట, ప్రాజెక్టులు, జల వనరులకు సమీపంలో, పొలాల గట్లపై నాటనున్నారు. ఆసుపత్రులు, పోలీసు స్టేషన్లు, అడవులు, పురపాలక స్థలాల్లోనూ నాటేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకోసం ఉపాధి హామీ కూలీలతో గుంతలు తవ్విస్తున్నారు. ఒక్కో మొక్క నాటడం, సంరక్షణకు రూ.34 చొప్పున జిల్లాలో మొత్తం రూ.3 కోట్ల వరకు వెచ్చిస్తున్నారు.
8 లక్షల గుంతలు తవ్వారు
జూన్ ఆరంభం నుంచి వర్షాలు కురుస్తుండటంతో మొక్కలు నాటడానికి ఉపాధి హామీ కూలీలతో గుంతలు తవ్విస్తున్నారు. ఇప్పటికే పల్లెలు, పట్టణాల్లో ఎనిమిది లక్షల గుంతలను సిద్ధం చేశారు. 20 రకాల మొక్కలు నాటడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. వీటిలో మర్రి, రావి, గన్నేరు, జామ, మామిడి, అల్లనేరడు, చింత తదితర రకాలున్నాయి.
అమీన్పూర్కు రానున్న ముఖ్యమంత్రి
వన మహోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పాల్గొనేలా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. అమీన్పూర్ మండలం బీరంగూడ-కిష్టారెడ్డిపేట శివారులో 18 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. అక్కడ పది ఎకరాల్లో 20 వేల మొక్కలు నాటే కార్యక్రమాన్ని సీఎం చేతుల మీదుగా ప్రారంభించాలని భావిస్తున్నారు. ఆ ప్రాంతాన్ని సంగారెడ్డిలోని కలెక్టరేట్ వెనుక ఉన్న ఆక్సిజన్ పార్కు తరహాలో మార్చాలని జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ కసరత్తు చేస్తోంది.
అన్ని వర్గాల సహకారంతో నాటనున్నాం
జిల్లాలో వన మహోత్సవంలో భాగంగా మొక్కలు నాటనున్నాం. వాటిని సంరక్షించేలా ఏర్పాట్లు చేస్తాం. అటవీ విస్తీర్ణం పెంచేందుకు ప్రతీ ఒక్కరు సహకరించాలి. అన్ని వర్గాల సహకారంతో జిల్లాలో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించేలా చర్యలు తీసుకుంటాం.
మణికుమార్, జిల్లా ప్లాంటేషన్ మేనేజర్.అడ్డంకుల
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రజాప్రతినిధులు పట్టుబట్టాలి.. రైలు పట్టాలెక్కాలి
[ 06-07-2024]
తెలంగాణలో రైల్వే విస్తరణ తక్కువే. అందులోనూ ఉమ్మడి మెదక్, వికారాబాద్ జిల్లాల్లో రైలు సదుపాయం మరింత తక్కువ. కొంత మేర విస్తరించినా అక్కడా పలు సమస్యలు నెలకొన్నాయి. -
రూ.100 కోసం.. ఏటీఎం ధ్వంసం
[ 06-07-2024]
మద్యం మత్తులో రూ.100 కోసం ఓ వ్యక్తి ఏటీఎంను ధ్వంసం చేసిన సంఘటన రామాయంపేట పట్టణంలో చోటు చేసుకుంది. -
కరుణించని వరుణుడు
[ 06-07-2024]
వానాకాలం ఆరంభమై నెలరోజులు గడిచినా... జిల్లాలో ఇంకా లోటు వర్షాపాతమే నమోదవుతోంది. అడపాదడపా వర్షం పడడంతో కేవలం పత్తి మినహా మిగిలిన పంటల సాగు జరగడం లేదు. -
మహిళలకు మీసేవ కేంద్రాలు
[ 06-07-2024]
మహిళలు అన్ని రంగాల్లో ముందుకు సాగేందుకు ప్రోత్సహిస్తున్నారు. అతివల కోసం ఏర్పాటు చేసిన మహిళా సంఘాల ఆర్థికాభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే చాలా పథకాలను అమలు చేస్తున్నాయి. -
ఆర్ఆర్ఆర్ భూముల్లో అక్రమ తవ్వకాలు
[ 06-07-2024]
ఇటుక బట్టీ వ్యాపారుల అక్రమాలకు అడ్డూఅదుపు లేకుండా పోయింది. చెరువులు, కుంటలతో పాటు ప్రాంతీయ రింగ్ రోడ్డు(ఆర్ఆర్ఆర్)కు సేకరించే భూముల నుంచి సైతం మట్టిని జోరుగా తరలిస్తున్నారు. -
చిరుత సంచారం
[ 06-07-2024]
మండల పరిధి నాగపూర్ గేటు సమీపంలోని అటవీ ప్రాంతంలో ప్రయాణికులకు శుక్రవారం చిరుత కనిపించింది. -
బీమాతో భరోసా.. జీవితానికి రక్షణ
[ 06-07-2024]
స్వయం సహాయక సంఘం (ఎస్హెచ్జీ)లోని మహిళలకు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ బీమా అమలుకు ముందుకొచ్చింది. -
విద్యార్థులకు రోబోటిక్స్ పాఠాలు
[ 06-07-2024]
మారుతున్న సాంకేతికతను అందిపుచ్చుకునేందుకు విద్యాశాఖ కృషి చేస్తోంది. సోహమ్ అకాడమీ ఆఫ్ హ్యూమన్ ఎక్సలెన్స్ సంస్థ సహకారంతో జిల్లాలో ఎంపిక చేసిన పది పాఠశాలల్లో రోబోటిక్స్ పాఠాలను అమలు చేయనున్నారు. -
సమయపాలన.. అల్లంత దూరాన!
[ 06-07-2024]
జిల్లాలోని పురపాలికల్లో కొందరు ఉద్యోగులు, సిబ్బంది సమయపాలన పాటించడం లేదు. మున్సిపాలిటీల్లో ఉద్యోగుల సమయ పాలనపై శుక్రవారం ‘న్యూస్టుడే’ పరిశీలించింది. -
చదువులో మేటి.. అందింది ట్రిపుల్ ఐటీ
[ 06-07-2024]
ప్రతిభకు పేదరికం, కుటుంబంలోని కష్టాలు అడ్డురావని బాసర ట్రిపుల్ ఐటీలో సీటు సాధించిన పలువురు విద్యార్థులు నిరూపించారు. ఇంజినీరింగ్ చదివేందుకు బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకుంటున్నారు. -
రుణం తీర్చి మమ్మల్ని ఆదుకోండి..
[ 06-07-2024]
తల్లిదండ్రుల అకాల మరణంతో చిన్నారులిద్దరూ అనాథలయ్యారు. వృద్ధులైన తాత- నానమ్మల నీడన జీవనం సాగిస్తున్నారు. ధూల్మిట్ట మండల కేంద్రానికి చెందిన బాలలు తాడూరి శివప్రసాద్, శశిలది దయనీయ పరిస్థితి. -
బడిలో చెక్కపెట్టె.. చరవాణులకు చెక్ పెట్టె!
[ 06-07-2024]
తరగతి గదిలో బోధనా సమయంలో చరవాణి వాడకం వల్ల అంతరాయం కలగడమే కాకుండా విద్యార్థుల తల్లిదండ్రులకు ప్రభుత్వ పాఠశాలలపై నమ్మకం పోతోందని గమనించిన ఉపాధ్యాయులు స్ఫూర్తిమంతమైన నిర్ణయం తీసుకున్నారు. -
నేరుగా.. త్వరగా.. ప్రయాణం
[ 06-07-2024]
ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర మంత్రులను ఇటీవల దిల్లీ పర్యటనకు వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కలిసి కొన్ని మార్గాలను జాతీయ రహదారులుగా విస్తరించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. -
భర్త హత్య కేసులో భార్య సహా నలుగురి అరెస్టు
[ 06-07-2024]
గత నెలలో జగద్గిరిగుట్ట పరిధి వెంకటేశ్వరనగర్లో జరిగిన అనిల్కుమార్ హత్య కేసులో ఆయన భార్య సహా నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. -
క్షణికావేశం.. వేర్వేరుగా ముగ్గురి బలవన్మరణం
[ 06-07-2024]
క్షణికావేశంలో వేర్వేరు కారణాలతో సిద్దిపేట జిల్లాలో ముగ్గురు బలవన్మరణానికి పాల్పడ్డారు. ఏదైనా పని చేసుకోవాలని తల్లిదండ్రులు మందలించడంతో యువకుడు సిద్దిపేట జిల్లా రాయపోలు మండలం ఎల్కల్ గ్రామంలో ఆత్మహత్య చేసుకున్నాడు. -
ఆర్టీసీ బస్సు ఢీకొని ప్రధానోపాధ్యాయుడి దుర్మరణం
[ 06-07-2024]
రోజూ తోటి ఉపాధ్యాయులతో కలిసి కారులో వెళ్లే ప్రధానోపాధ్యాయుడు.. మిగిలిన వారు రాకపోవడంతో ద్విచక్రవాహనంపై విధులకు వెళ్తూ..