ఎస్జీటీ.. ఆశలు ఆవిరి!
ఆరేళ్ల తరవాత ఉపాధ్యాయ బదిలీలయ్యాయి. పనిచేస్తున్న స్థానం నుంచి మరో బడికి వెళుతున్నామన్న ఆనందం ఎస్జీటీ ఉపాధ్యాయులకు ఒక్క రోజైనా లేకుండా పోయింది. రేషనలైజేషన్కు బదిలీల ప్రక్రియతో ముడిపెట్టారు. దీంతో బదిలీ అయిన వారి స్థానంలో కొత్తవారు రాకుంటే అక్కడే పనిచేయాల్సి ఉంటుంది.
బదిలీ అయినా రిలీవ్ చేయని వైనం
న్యూస్టుడే, సంగారెడ్డి మున్సిపాలిటీ
డీఈవో కార్యాలయంలో ఉపాధ్యాయులు
ఆరేళ్ల తరవాత ఉపాధ్యాయ బదిలీలయ్యాయి. పనిచేస్తున్న స్థానం నుంచి మరో బడికి వెళుతున్నామన్న ఆనందం ఎస్జీటీ ఉపాధ్యాయులకు ఒక్క రోజైనా లేకుండా పోయింది. రేషనలైజేషన్కు బదిలీల ప్రక్రియతో ముడిపెట్టారు. దీంతో బదిలీ అయిన వారి స్థానంలో కొత్తవారు రాకుంటే అక్కడే పనిచేయాల్సి ఉంటుంది.
300 మంది పాత చోటే..
జిల్లాలో జూన్ 30న ప్రాథమిక పాఠశాలల్లో పనిచేసే 1,433 మంది ఎస్జీటీ ఉపాధ్యాయులకు బదిలీ ఉత్తర్వులిచ్చారు. జులై 1న వీరు కొత్త పాఠశాలల్లో చేరాలి. 2021లో విడుదలైన రేషనలైజేషన్ జీవో 25 ప్రకారం ప్రాథమిక పాఠశాలల్లో 10లోపు విద్యార్థులుంటే ఒకరు, 20లోపు అయిదే ఇద్దరు, 30 దాటితే ముగ్గురు ఉపాధ్యాయులు పనిచేయాలి. విద్యార్థులుండి ఉపాధ్యాయులు బదిలీల్లో రాకుంటే పాత వారిని రిలీవ్ చేయవద్దని ఆదేశాలిచ్చారు. దీంతో జిల్లాలో దాదాపు 300 మందిని విద్యాశాఖ వారి బడుల నుంచి రిలీవ్ చేయలేదు. ఈ పరిస్థితి జిల్లాలోని కంగ్టి, కల్హేర్, నాగల్గిద్ద, సిర్గాపూర్, నారాయణఖేడ్, మనూరు, న్యాల్కల్, రాయికోడ్, హత్నూర, వట్పల్లి మండలాల్లో ఎక్కువగా ఉంది. ఉపాధ్యాయులు ఎక్కువుంటే సీనియర్ను తప్పనిసరిగా బదిలీ కోసం విడుదల చేయాలని ఉత్తర్వుల్లో సూచించారు. రేషనలైజేషన్ సంఖ్యకు సరిపడా ఉపాధ్యాయులుంటే బదిలీ అయిన వారిని రిలీవ్ చేయాలి. ఉపాధ్యాయులు తక్కువుంటే చేయవద్దు. డీఎస్సీ నిర్వహించి కొత్త వారు వచ్చే వరకు పాత స్థానాల్లోనే పనిచేయాల్సి ఉంటుంది.
ఒకే గ్రామం పేర్లతో ఇబ్బంది..
జిల్లాలో చాలా చోట్ల గ్రామం పేరు ఒకటే ఉండడంతో ఉపాధ్యాయులు ఇబ్బందులు పడుతున్నారు. పుల్కల్, రాయికోడ్ మండలాల్లో కోడూరు గ్రామం ఉంది. ఎస్జీటీ ఉపాధ్యాయులు అంతర్జాలంలో పాఠశాలను ఎంచుకునే సమయంలో 20 వరకు చూపుతుంది. పుల్కల్ మండలం కోడూరు ఎంచుకుంటే రాయికోడ్ మండలంలోని గ్రామానికి బదిలీ ఉత్తర్వు వచ్చింది. సంగారెడ్డి నుంచి పుల్కల్ మండలంలోని కోడూరు 20 కి.మీ. ఉంటే, రాయికోడ్ మండలంలోని కోడూరు 75 కి.మీ. దూరంలో ఉంది. జహీరాబాద్ నుంచి మిర్జాపూర్(బి) 15 కి.మీ., మిర్జాపూర్(ఎన్) 30 కి.మీ. దూరం ఉంది.
నిబంధనలకు లోబడే బదిలీలు
వెంకటేశ్వర్లు, జిల్లా విద్యాధికారి
జిల్లాలో నిబంధనలకు లోబడే ఎస్జీటీ ఉపాధ్యాయుల బదిలీలయ్యాయి. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా బదిలీపై వస్తేనే ఇక్కడి ఉపాధ్యాయులకు వేరే పాఠశాలకు రిలీవ్ చేస్తారు. బదిలీ సమయంలో పాఠశాలల పేర్లను జాగ్రత్తగా ఎంచుకోవాలి. బదిలీ ఉత్తర్వు అందుకున్న వారు తప్పనిసరిగా విధుల్లో చేరాల్సిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రజాప్రతినిధులు పట్టుబట్టాలి.. రైలు పట్టాలెక్కాలి
[ 06-07-2024]
తెలంగాణలో రైల్వే విస్తరణ తక్కువే. అందులోనూ ఉమ్మడి మెదక్, వికారాబాద్ జిల్లాల్లో రైలు సదుపాయం మరింత తక్కువ. కొంత మేర విస్తరించినా అక్కడా పలు సమస్యలు నెలకొన్నాయి. -
రూ.100 కోసం.. ఏటీఎం ధ్వంసం
[ 06-07-2024]
మద్యం మత్తులో రూ.100 కోసం ఓ వ్యక్తి ఏటీఎంను ధ్వంసం చేసిన సంఘటన రామాయంపేట పట్టణంలో చోటు చేసుకుంది. -
కరుణించని వరుణుడు
[ 06-07-2024]
వానాకాలం ఆరంభమై నెలరోజులు గడిచినా... జిల్లాలో ఇంకా లోటు వర్షాపాతమే నమోదవుతోంది. అడపాదడపా వర్షం పడడంతో కేవలం పత్తి మినహా మిగిలిన పంటల సాగు జరగడం లేదు. -
మహిళలకు మీసేవ కేంద్రాలు
[ 06-07-2024]
మహిళలు అన్ని రంగాల్లో ముందుకు సాగేందుకు ప్రోత్సహిస్తున్నారు. అతివల కోసం ఏర్పాటు చేసిన మహిళా సంఘాల ఆర్థికాభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే చాలా పథకాలను అమలు చేస్తున్నాయి. -
ఆర్ఆర్ఆర్ భూముల్లో అక్రమ తవ్వకాలు
[ 06-07-2024]
ఇటుక బట్టీ వ్యాపారుల అక్రమాలకు అడ్డూఅదుపు లేకుండా పోయింది. చెరువులు, కుంటలతో పాటు ప్రాంతీయ రింగ్ రోడ్డు(ఆర్ఆర్ఆర్)కు సేకరించే భూముల నుంచి సైతం మట్టిని జోరుగా తరలిస్తున్నారు. -
చిరుత సంచారం
[ 06-07-2024]
మండల పరిధి నాగపూర్ గేటు సమీపంలోని అటవీ ప్రాంతంలో ప్రయాణికులకు శుక్రవారం చిరుత కనిపించింది. -
బీమాతో భరోసా.. జీవితానికి రక్షణ
[ 06-07-2024]
స్వయం సహాయక సంఘం (ఎస్హెచ్జీ)లోని మహిళలకు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ బీమా అమలుకు ముందుకొచ్చింది. -
విద్యార్థులకు రోబోటిక్స్ పాఠాలు
[ 06-07-2024]
మారుతున్న సాంకేతికతను అందిపుచ్చుకునేందుకు విద్యాశాఖ కృషి చేస్తోంది. సోహమ్ అకాడమీ ఆఫ్ హ్యూమన్ ఎక్సలెన్స్ సంస్థ సహకారంతో జిల్లాలో ఎంపిక చేసిన పది పాఠశాలల్లో రోబోటిక్స్ పాఠాలను అమలు చేయనున్నారు. -
సమయపాలన.. అల్లంత దూరాన!
[ 06-07-2024]
జిల్లాలోని పురపాలికల్లో కొందరు ఉద్యోగులు, సిబ్బంది సమయపాలన పాటించడం లేదు. మున్సిపాలిటీల్లో ఉద్యోగుల సమయ పాలనపై శుక్రవారం ‘న్యూస్టుడే’ పరిశీలించింది. -
చదువులో మేటి.. అందింది ట్రిపుల్ ఐటీ
[ 06-07-2024]
ప్రతిభకు పేదరికం, కుటుంబంలోని కష్టాలు అడ్డురావని బాసర ట్రిపుల్ ఐటీలో సీటు సాధించిన పలువురు విద్యార్థులు నిరూపించారు. ఇంజినీరింగ్ చదివేందుకు బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకుంటున్నారు. -
రుణం తీర్చి మమ్మల్ని ఆదుకోండి..
[ 06-07-2024]
తల్లిదండ్రుల అకాల మరణంతో చిన్నారులిద్దరూ అనాథలయ్యారు. వృద్ధులైన తాత- నానమ్మల నీడన జీవనం సాగిస్తున్నారు. ధూల్మిట్ట మండల కేంద్రానికి చెందిన బాలలు తాడూరి శివప్రసాద్, శశిలది దయనీయ పరిస్థితి. -
బడిలో చెక్కపెట్టె.. చరవాణులకు చెక్ పెట్టె!
[ 06-07-2024]
తరగతి గదిలో బోధనా సమయంలో చరవాణి వాడకం వల్ల అంతరాయం కలగడమే కాకుండా విద్యార్థుల తల్లిదండ్రులకు ప్రభుత్వ పాఠశాలలపై నమ్మకం పోతోందని గమనించిన ఉపాధ్యాయులు స్ఫూర్తిమంతమైన నిర్ణయం తీసుకున్నారు. -
నేరుగా.. త్వరగా.. ప్రయాణం
[ 06-07-2024]
ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర మంత్రులను ఇటీవల దిల్లీ పర్యటనకు వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కలిసి కొన్ని మార్గాలను జాతీయ రహదారులుగా విస్తరించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. -
భర్త హత్య కేసులో భార్య సహా నలుగురి అరెస్టు
[ 06-07-2024]
గత నెలలో జగద్గిరిగుట్ట పరిధి వెంకటేశ్వరనగర్లో జరిగిన అనిల్కుమార్ హత్య కేసులో ఆయన భార్య సహా నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. -
క్షణికావేశం.. వేర్వేరుగా ముగ్గురి బలవన్మరణం
[ 06-07-2024]
క్షణికావేశంలో వేర్వేరు కారణాలతో సిద్దిపేట జిల్లాలో ముగ్గురు బలవన్మరణానికి పాల్పడ్డారు. ఏదైనా పని చేసుకోవాలని తల్లిదండ్రులు మందలించడంతో యువకుడు సిద్దిపేట జిల్లా రాయపోలు మండలం ఎల్కల్ గ్రామంలో ఆత్మహత్య చేసుకున్నాడు. -
ఆర్టీసీ బస్సు ఢీకొని ప్రధానోపాధ్యాయుడి దుర్మరణం
[ 06-07-2024]
రోజూ తోటి ఉపాధ్యాయులతో కలిసి కారులో వెళ్లే ప్రధానోపాధ్యాయుడు.. మిగిలిన వారు రాకపోవడంతో ద్విచక్రవాహనంపై విధులకు వెళ్తూ..