ఆదాయం అందిస్తున్నా అద్దెల్లోనే..
ఏటా కోట్ల రూపాయల ఆదాయం ఉన్న ప్రభుత్వ కార్యాలయాలకు సొంత భవనాలు లేక అద్దె భవనాల్లో అరకొర వసతుల మధ్య కునారిల్లుతున్నాయి. హుస్నాబాద్లో ఆబ్కారీ, సబ్రిజిస్ట్రార్ కార్యాలయాలు నలభై ఏళ్లుగా అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి.
హుస్నాబాద్లో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం
న్యూస్టుడే, హుస్నాబాద్: ఏటా కోట్ల రూపాయల ఆదాయం ఉన్న ప్రభుత్వ కార్యాలయాలకు సొంత భవనాలు లేక అద్దె భవనాల్లో అరకొర వసతుల మధ్య కునారిల్లుతున్నాయి. హుస్నాబాద్లో ఆబ్కారీ, సబ్రిజిస్ట్రార్ కార్యాలయాలు నలభై ఏళ్లుగా అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. శాశ్వత ప్రభుత్వ భవనాల నిర్మాణాలు చేపట్టడానికి ప్రత్యేక చొరవ కరవైంది. సిబ్బందికి, ప్రజలకు సౌకర్యం లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. హుస్నాబాద్లో ఇటీవల రూ.17 కోట్లతో నిర్మించి ఏడాది క్రితం ప్రారంభించిన సమీకృత కార్యాలయాల సముదాయంలో ఈ కార్యాలయాలకు స్థానం దక్కలేదు. హుస్నాబాద్, కోహెడ, అక్కన్నపేట మండలాలకు సంబంధించి హుస్నాబాద్లో ఉన్న సబ్ రిజిష్ట్రారు కార్యాలయం స్థానిక బాలాజీ నగర్లో అద్దె భవనంలో నిర్వహిస్తున్నారు. కార్యాలయం ఉన్న వీధిలో కనీసం ఒక వాహనమైనా పార్కింగ్ చేసుకోవడానికి అవకాశం లేదు. రిజిస్ట్రేషన్ల ద్వారా ఏటా రూ.7 కోట్లకు పైగా ఆదాయం లభిస్తుంది. పురపాలక సంఘానికి దాదాపు రూ.3 కోట్ల వ్యయంతో నూతన భవనం నిర్మించారు. త్వరలోనే ప్రారంభించనున్నారు. ప్రస్తుతం ఉన్న పుర కార్యాలయ భవనంలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఏర్పాటు చేస్తే సౌకర్యంగా ఉంటుందని భావిస్తున్నారు.
ఆబ్కారీతో రూ.180 కోట్లు..: ఎక్సైజ్ ప్రోహిబిషన్ శాఖకు హుస్నాబాద్ సర్కిల్ ద్వారా ఏటా రూ.180 కోట్ల ఆదాయం లభిస్తోంది. హుస్నాబాద్, అక్కన్నపేట, కోహెడ, బెజ్జంకి, నంగునూరు మండలాలకు కేంద్రం ఇక్కడ స్టేషన్ పని చేస్తుంది. నలభై ఏళ్లలో ఐదో అద్దె భవనంలోకి మారింది. స్థానిక రామవరం రోడ్లో కొనసాగుతోంది. 2018లో స్థలం కేటాయించి నిధులు మంజూరు చేశారు. అనువైన స్థలం కాదని నిర్మాణం అంశం పక్కన పెట్టేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రజాప్రతినిధులు పట్టుబట్టాలి.. రైలు పట్టాలెక్కాలి
[ 06-07-2024]
తెలంగాణలో రైల్వే విస్తరణ తక్కువే. అందులోనూ ఉమ్మడి మెదక్, వికారాబాద్ జిల్లాల్లో రైలు సదుపాయం మరింత తక్కువ. కొంత మేర విస్తరించినా అక్కడా పలు సమస్యలు నెలకొన్నాయి. -
రూ.100 కోసం.. ఏటీఎం ధ్వంసం
[ 06-07-2024]
మద్యం మత్తులో రూ.100 కోసం ఓ వ్యక్తి ఏటీఎంను ధ్వంసం చేసిన సంఘటన రామాయంపేట పట్టణంలో చోటు చేసుకుంది. -
కరుణించని వరుణుడు
[ 06-07-2024]
వానాకాలం ఆరంభమై నెలరోజులు గడిచినా... జిల్లాలో ఇంకా లోటు వర్షాపాతమే నమోదవుతోంది. అడపాదడపా వర్షం పడడంతో కేవలం పత్తి మినహా మిగిలిన పంటల సాగు జరగడం లేదు. -
మహిళలకు మీసేవ కేంద్రాలు
[ 06-07-2024]
మహిళలు అన్ని రంగాల్లో ముందుకు సాగేందుకు ప్రోత్సహిస్తున్నారు. అతివల కోసం ఏర్పాటు చేసిన మహిళా సంఘాల ఆర్థికాభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే చాలా పథకాలను అమలు చేస్తున్నాయి. -
ఆర్ఆర్ఆర్ భూముల్లో అక్రమ తవ్వకాలు
[ 06-07-2024]
ఇటుక బట్టీ వ్యాపారుల అక్రమాలకు అడ్డూఅదుపు లేకుండా పోయింది. చెరువులు, కుంటలతో పాటు ప్రాంతీయ రింగ్ రోడ్డు(ఆర్ఆర్ఆర్)కు సేకరించే భూముల నుంచి సైతం మట్టిని జోరుగా తరలిస్తున్నారు. -
చిరుత సంచారం
[ 06-07-2024]
మండల పరిధి నాగపూర్ గేటు సమీపంలోని అటవీ ప్రాంతంలో ప్రయాణికులకు శుక్రవారం చిరుత కనిపించింది. -
బీమాతో భరోసా.. జీవితానికి రక్షణ
[ 06-07-2024]
స్వయం సహాయక సంఘం (ఎస్హెచ్జీ)లోని మహిళలకు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ బీమా అమలుకు ముందుకొచ్చింది. -
విద్యార్థులకు రోబోటిక్స్ పాఠాలు
[ 06-07-2024]
మారుతున్న సాంకేతికతను అందిపుచ్చుకునేందుకు విద్యాశాఖ కృషి చేస్తోంది. సోహమ్ అకాడమీ ఆఫ్ హ్యూమన్ ఎక్సలెన్స్ సంస్థ సహకారంతో జిల్లాలో ఎంపిక చేసిన పది పాఠశాలల్లో రోబోటిక్స్ పాఠాలను అమలు చేయనున్నారు. -
సమయపాలన.. అల్లంత దూరాన!
[ 06-07-2024]
జిల్లాలోని పురపాలికల్లో కొందరు ఉద్యోగులు, సిబ్బంది సమయపాలన పాటించడం లేదు. మున్సిపాలిటీల్లో ఉద్యోగుల సమయ పాలనపై శుక్రవారం ‘న్యూస్టుడే’ పరిశీలించింది. -
చదువులో మేటి.. అందింది ట్రిపుల్ ఐటీ
[ 06-07-2024]
ప్రతిభకు పేదరికం, కుటుంబంలోని కష్టాలు అడ్డురావని బాసర ట్రిపుల్ ఐటీలో సీటు సాధించిన పలువురు విద్యార్థులు నిరూపించారు. ఇంజినీరింగ్ చదివేందుకు బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకుంటున్నారు. -
రుణం తీర్చి మమ్మల్ని ఆదుకోండి..
[ 06-07-2024]
తల్లిదండ్రుల అకాల మరణంతో చిన్నారులిద్దరూ అనాథలయ్యారు. వృద్ధులైన తాత- నానమ్మల నీడన జీవనం సాగిస్తున్నారు. ధూల్మిట్ట మండల కేంద్రానికి చెందిన బాలలు తాడూరి శివప్రసాద్, శశిలది దయనీయ పరిస్థితి. -
బడిలో చెక్కపెట్టె.. చరవాణులకు చెక్ పెట్టె!
[ 06-07-2024]
తరగతి గదిలో బోధనా సమయంలో చరవాణి వాడకం వల్ల అంతరాయం కలగడమే కాకుండా విద్యార్థుల తల్లిదండ్రులకు ప్రభుత్వ పాఠశాలలపై నమ్మకం పోతోందని గమనించిన ఉపాధ్యాయులు స్ఫూర్తిమంతమైన నిర్ణయం తీసుకున్నారు. -
నేరుగా.. త్వరగా.. ప్రయాణం
[ 06-07-2024]
ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర మంత్రులను ఇటీవల దిల్లీ పర్యటనకు వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కలిసి కొన్ని మార్గాలను జాతీయ రహదారులుగా విస్తరించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. -
భర్త హత్య కేసులో భార్య సహా నలుగురి అరెస్టు
[ 06-07-2024]
గత నెలలో జగద్గిరిగుట్ట పరిధి వెంకటేశ్వరనగర్లో జరిగిన అనిల్కుమార్ హత్య కేసులో ఆయన భార్య సహా నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. -
క్షణికావేశం.. వేర్వేరుగా ముగ్గురి బలవన్మరణం
[ 06-07-2024]
క్షణికావేశంలో వేర్వేరు కారణాలతో సిద్దిపేట జిల్లాలో ముగ్గురు బలవన్మరణానికి పాల్పడ్డారు. ఏదైనా పని చేసుకోవాలని తల్లిదండ్రులు మందలించడంతో యువకుడు సిద్దిపేట జిల్లా రాయపోలు మండలం ఎల్కల్ గ్రామంలో ఆత్మహత్య చేసుకున్నాడు. -
ఆర్టీసీ బస్సు ఢీకొని ప్రధానోపాధ్యాయుడి దుర్మరణం
[ 06-07-2024]
రోజూ తోటి ఉపాధ్యాయులతో కలిసి కారులో వెళ్లే ప్రధానోపాధ్యాయుడు.. మిగిలిన వారు రాకపోవడంతో ద్విచక్రవాహనంపై విధులకు వెళ్తూ..