గురువు కోసం గుండెలు కరిగేలా..
కొందరు ఉపాధ్యాయులు ఎన్నో ఏళ్లుగా విద్యార్థులను సొంత బిడ్డల్లా చూసుకుంటూ విద్యాబుద్ధులు చెబుతుంటారు. ఇలాంటి వారు బదిలీపై వెళ్తుంటే చిన్నారులు కన్నీరు పెడుతుంటారు.
మాసాయిపేట: కొందరు ఉపాధ్యాయులు ఎన్నో ఏళ్లుగా విద్యార్థులను సొంత బిడ్డల్లా చూసుకుంటూ విద్యాబుద్ధులు చెబుతుంటారు. ఇలాంటి వారు బదిలీపై వెళ్తుంటే చిన్నారులు కన్నీరు పెడుతుంటారు. ఇలాంటి ఘటనే మెదక్ జిల్లా మాసాయిపేట మండలం చెట్లతిమ్మాయిపల్లి ప్రాథమీకోన్నత పాఠశాలలో మంగళవారం చోటు చేసుకుంది. ఈ పాఠశాలలో 11 ఏళ్ల పాటు పనిచేసిన ఉపాధ్యాయురాలు అరుణ సోమవారం బదిలీ అయ్యారు. మంగళవారం పాఠశాలకు రాగానే అరుణ చుట్టూ విద్యార్థినులు చేరి రోదించారు. రోదనలు విని గ్రామస్థులు వచ్చి వారూ కంటతడిపెట్టారు.
ఉపాధ్యాయుడిని ఊరేగించి
పన్నెండేళ్లుగా విద్యనందించిన ఉపాధ్యాయుడిని విద్యార్థులు మంగళవారం దు:ఖ సాగరంలో ఊరేగింపుగా వీడ్కోలు పలికారు. శివంపేటలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్న వెంకటేశం తూప్రాన్ మండలం నర్సంపల్లికి బదిలీ అయ్యారు. మంగళవారం రిలీవ్ కావడంతో పాఠశాలలో సమావేశం ఏర్పాటు చేసి వందలాది మంది విద్యార్థులు ఆయనను సన్మానించి బ్యాండ్ శబ్దాలతో ఊరేగింపుగా సాగనంపారు. వ్యాయామ ఉపాధ్యాయుడిగానూ సేవలందించి విద్యార్థులను క్రమశిక్షణగా ఉంచేవారని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు బాలచంద్రం అన్నారు.
న్యూస్టుడే, శివ్వంపేట
సార్ మీరు వెళ్లొద్దు
బదిలీపై వెళ్తున్న ఉపాధ్యాయుడిని అడ్డుకుంటున్న విద్యార్థులు
రాయపోల్, న్యూస్టుడే: మండలంలోని వడ్డేపల్లి ఉన్నత పాఠశాలలో ఆరేళ్లుగా విధులు నిర్వహించిన తెలుగు ఉపాధ్యాయుడు ఎన్.శ్రీనివాస్ అక్కన్నపేట మండలం మోత్కులపల్లి ప్రాథమికోన్నత పాఠశాలకు బదిలీ అయ్యారు. మంగళవారం పాఠశాల నుంచి రిలీవ్ అయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులు శ్రీనివాస్ చుట్టూ చేరి సారూ మీరు వెళ్లొద్దంటూ కంటతడి పెట్టుకున్నారు. విద్యార్థుల రోదనలతో ఉపాధ్యాయుడు సైతం భావోద్వేగానికి గురయ్యారు. విద్యార్థులకు మంచి విషయాలు బోధించడంతో పాటు, పాఠశాల అభివృద్ధికి ఆయన ఎంతో కృషి చేశారని గ్రామస్థులు కొనియాడారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రభుత్వ శాఖల్లో ఈ-పాలన
[ 05-07-2024]
పారదర్శకంగా సేవలు అందేలా.. త్వరితగతిన నిర్ణయాలు అమలు జరిగేలా.. ప్రభుత్వ శాఖల్లో ఈ-పాలన మొదలైంది. -
హెచ్ఎండీఏ మాస్టర్ప్లాన్తో నర్సాపూర్కు మహర్దశ
[ 05-07-2024]
హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) తన పరిధిలోని ప్రాంతాల్లో మాస్టర్ప్లాన్ అమలు చేయడం ద్వారా నర్సాపూర్ ప్రాంతానికి మహర్దశ చేకూరనుంది. -
ఖర్చు రూ.4 కోట్లు.. 10 నెలలకే తూట్లు!
[ 05-07-2024]
మెదక్-బొడ్మట్పల్లి ప్రధాన రహదారిపై మండల పరిధిలోని లక్ష్మీనగర్ నుంచి నార్సింగి వరకు 13 కి.మీ. దూరం సుమారు రూ.4 కోట్లతో పది నెలల క్రితం తారు రోడ్డు వేశారు. -
హత్తుకొనే బోధన.. విడిచి వెళ్లొద్దని రోదన
[ 05-07-2024]
మాసాయిపేట మండలం పులిగుట్టతండా ప్రాథమిక పాఠశాలలో రజిత అనే ఉపాధ్యాయురాలు 12 సంవత్సరాలుగా పనిచేశారు. -
చిన్నారుల మోమున చిరునవ్వు
[ 05-07-2024]
చిన్నారులే జాతి సంపద. ఉత్తమ పౌరులుగా ఎదిగేందుకు వారికి స్వేచ్ఛ ఉండాలి. బడీడు వయసులోనే పలకాబలపం పట్టించాలి. -
గాడితప్పుతున్న చెత్త సేకరణ
[ 05-07-2024]
జిల్లాలోని మున్సిపాలిటీల పరిధిలో చెత్త సేకరణ, యార్డుల నిర్వహణ అధ్వానంగా మారింది. తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించాలని ఆదేశాలు ఉన్నప్పటికీ నారాయణఖేడ్లో మినహా ఎక్కడా అమలు కావడం లేదు. -
అంతర్రాష్ట్ర గంజాయి ముఠా అరెస్టు
[ 05-07-2024]
హైదరాబాద్ నార్కోటిక్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్(హెచ్న్యూ) బృందం, హబీబ్నగర్, ఆసిఫ్నగర్, కంచన్బాగ్ పోలీసుల సహకారంతో వారం రోజులుగా జరిపిన దాడుల్లో రూ.61 లక్షల విలువ చేసే 155 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని హైదరాబాద్ టాస్క్ఫోర్స్(హెచ్న్యూ) డీసీపీ వై.వి.ఎస్.సుధీంద్ర వెల్లడించారు. -
వసతిగృహాలకు వెనుకంజ
[ 05-07-2024]
పదిహేనేళ్ల క్రితం పేద పిల్లల పాలిట దేవాలయాలుగా వెలుగొందిన వసతి గృహాలు రానురానూ ఆదరణ కోల్పోతున్నాయి. -
‘పునరావాసం’.. సమస్యలతో సావాసం
[ 05-07-2024]
గౌరవెల్లి ప్రాజెక్టు పునరావాస కాలనీ నిర్మాణంలో తీవ్ర నిర్లక్ష్యం జరుగుతోంది. -
ప్రభావం..స్ఫూర్తిదాయకం
[ 05-07-2024]
విద్యార్థులను ఆకట్టుకునేలా బోధించడం.. తల్లిదండ్రుల భాగస్వామ్యంతో పాఠశాల రూపురేఖలు మార్చడం.. వినూత్న కార్యక్రమాలు చేపడితేనే ఆ విద్యాలయాలు ప్రత్యేకంగా నిలుస్తాయి. -
నైపుణ్య శిక్షణ.. భవితకు రక్షణ
[ 05-07-2024]
నేటి పోటీ ప్రపంచంలో ఉద్యోగం సాధించాలన్నా, స్వయం ఉపాధి దిశగా అడుగేయాలన్నా నైపుణ్యం తప్పనిసరి. -
అడవి అభివృద్ధికి వల్లూరు చేయూత
[ 05-07-2024]
మానవ మనుగడకు వృక్షాలు అన్ని రకాలుగా దోహదపడతాయని అందరికీ తెలుసు. కొందరు మొక్కలను పెంచరు.. మరికొందరు చెట్లను నరికేస్తుంటారు. -
తాజా కూరగాయలు @ వంటిమామిడి
[ 05-07-2024]
నిత్యం మనం తీసుకునే ఆహారంలో కూరగాయలు కీలకం. స్వల్ప కాలంలో చేతికొచ్చే ఈ పంటలను రైతులెంతోమంది పండిస్తూ ఆదాయం ఆర్జిస్తున్నారు. -
కన్నతల్లిని కడతేర్చి.. సాధారణ మృతిగా చిత్రీకరించి..
[ 05-07-2024]
దైవదర్శనానికి వచ్చిన సందర్భంలో తల్లి అస్వస్థతకు గురి కాగా అసహనానికి గురైన కుమారుడు ఆమెను హత్య చేశాడు. -
తాళం వేసిన ఇంట్లో చోరీ
[ 05-07-2024]
తాళం వేసిన ఇంట్లో చోరీ జరిగిన సంఘటన మండల పరిధిలోని కుర్తివాడలో చోటుచేసుకుంది.
తాజా వార్తలు (Latest News)
-
శ్రీవారి ఆభరణాలపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి: భానుప్రకాశ్ రెడ్డి
-
ఎయిర్పోర్టులో గ్యాస్ లీక్.. 39 మందికి అస్వస్థత
-
యూకే ఎన్నికల్లో తెలుగు వ్యక్తుల ఓటమి
-
నేనిప్పుడే మొదలుపెట్టా.. రిటైర్మెంట్పై బుమ్రా స్పందన ఇదే..
-
‘అదానీ’పై హిండెన్బర్గ్ ఆరోపణల్లో చైనా హస్తం?.. మహేశ్ జెఠ్మలానీ సంచలన ఆరోపణలు!
-
కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్తో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ