కస్తూర్బా బాలికలకు కష్టాలు!
బాలికల విద్య కోసం ఏర్పాటు చేసిన కస్తూర్బాగాంధీ పాఠశాలలు సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నాయి. బాలికల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయినులు లేరు. కొత్తగా మంజూరైన వాటికి భవనాలు లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
వేధిస్తున్న ఉపాధ్యాయినుల కొరత
కరవైన వసతులు
శివ్వంపేట మండలం గూడూరు కస్తూర్బాలోని తరగతి గదిలో బాలికలు
న్యూస్టుడే-మెదక్, చేగుంట, శివ్వంపేట, వెల్దుర్తి : బాలికల విద్య కోసం ఏర్పాటు చేసిన కస్తూర్బాగాంధీ పాఠశాలలు సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నాయి. బాలికల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయినులు లేరు. కొత్తగా మంజూరైన వాటికి భవనాలు లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. భవనాలు ఉన్నవాటిల్లోనూ పలు సమస్యలు వేధిస్తున్నా అధికారులు పట్టనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి.
జిల్లాలో 21 మండలాలకు గాను 15 మండలాల్లో కస్తూర్బాలు ఉన్నాయి. వీటితో పాటు నాలుగేళ్ల కిందట నిజాంపేట, హవేలిఘనపూర్, నార్సింగి, మాసాయిపేట మండలాలకు కొత్తవి మంజూరయ్యాయి. దీంతో వీటి సంఖ్య 19కు చేరుకుంది. 4,022 మంది విద్యార్థినులు ఉన్నారు.
ఇరుకు గదుల్లో ఇక్కట్లు..
కొత్తగా మంజూరైన మాసాయిపేట పాఠశాల వెల్దుర్తిలో, హవేలిఘనపూర్ది చిన్నశంకరంపేటలో, నిజాంపేటది రామాయంపేటలో, నార్సింగి పాఠశాల శివ్వంపేట మండలం గూడూరులో కొనసాగుతున్నాయి. ఆరో తరగతి నుంచి ప్రవేశాలు కల్పించడంతో మొదట్లో చేరిన విద్యార్థినులు ప్రస్తుతం తొమ్మిదో తరగతి చదువుతున్నారు. ప్రతి తరగతిలో 40 మందికి అవకాశం కల్పిస్తున్నారు. ఆయా పాఠశాలల్లో మరో పాఠశాలకు చెందిన విద్యార్థులు చేరడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కొత్తగా మంజూరైన వాటికి ఉపాధ్యాయినులు, సిబ్బందిని కేటాయించలేదు. దీంతో అదే బడుల్లో ఉన్నవారే పాఠాలు బోధిస్తున్నారు. ఒక తరగతి గదిలో రెండు పాఠశాలలకు సంబంధించి 80 మందికిపైగా ఉంటున్నారు. దీంతో చిన్న గదిలో ఎక్కువ మంది కూర్చోవడం వల్ల అవస్థలు పడుతున్నారు. పాఠాలు బోధించినా అర్థం కాని పరిస్థితి. ఇక పరీక్షల సమయంలో రెండు పాఠశాలల విద్యార్థుల జవాబుపత్రాలను దిద్దేందుకు ఉపాధ్యాయినులపై భారం పడుతోంది. ఇక వసతి విషయానికొస్తే తరగతి గదుల్లోనే నిద్రిస్తున్నారు. ఇవి ఏమాత్రం సరిపడక ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. శౌచాలయాలు, మూత్రశాలలు సరిపోవడం లేదు.
ఎట్టకేలకు అవకాశం...
నాలుగేళ్ల కిందట మంజూరైన పాఠశాలలను ఈ ఏడాది నుంచి అద్దె భవనాల్లో ఏర్పాటు చేయాలని ఆదేశాలు వచ్చాయి. బాలికల పాఠశాల కావడంతో వారి భద్రతను దృష్టిలో పెట్టుకోవాలి. ఇటీవల మాసాయిపేటలో ఓ అద్దె భవనాన్ని పరిశీలించారు. ఇక్కడా భద్రతాపరంగా అనుకూలంగా లేకపోవడంతో ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలోని పాత భవనంలో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇక్కడా కనీస సౌకర్యాలు కల్పించాకే వెల్దుర్తి నుంచి ఇక్కడికిమార్చనున్నారు. ఇక నార్సింగి పాఠశాలకు సంబంధించి ఈ విద్యాసంవత్సరంలో ఆరో తరగతిని చేగుంటలోని ఆదర్శ స్కూల్లో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. నిజాంపేట, హవేలిఘనపూర్లో భవనాలను ఎంపిక చేయాల్సి ఉంది.
వసతులున్న వాటినే ఎంపిక చేస్తాం
సుకన్య, జీసీడీవో
అద్దె భవనాల ఎంపిక కోసం ప్రయత్నాలు మొదలుపెట్టాం. అన్నీ వసతులు ఉన్న వాటినే పరిశీలిస్తున్నాం. సౌకర్యంగా లేదంటే పాతచోటనే కొనసాగిస్తాం. ప్రవేశాలు మాత్రం చేపడుతున్నాం. ప్రస్తుతం ఉన్న చోటే కాకుండా సొంత మండలంలో పాఠశాలను ఏర్పాటు చేస్తే ప్రభుత్వం బోధన సిబ్బందిని కేటాయించనుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఉపాధి కోర్సులకు ఆదరణ కరవు
[ 03-07-2024]
పారిశ్రామిక శిక్షణా నైపుణ్యం కలిగిన విద్యార్థులకు ఉద్యోగావకాశాలు తలుపుతడుతున్నాయి. తక్కువ సమయంలో కొలువులు సాధించి.. స్థిరపడాలనుకునే యువతకు పారిశ్రామిక శిక్షణ సంస్థ(ఐటీఐ) చక్కటి అవకాశం కల్పిస్తోంది. -
బీమా లేదు.. పరిహారం రాదు
[ 03-07-2024]
మెదక్ పురపాలికలో చెత్త తరలించే ట్రాక్టర్లు, స్వచ్ఛ ఆటో ట్రాలీలకు కనీసం బీమా చేయించడం లేదు. నిత్యం రహదారులపై తిరిగే వాహనాల వల్ల ఏదైనా ప్రమాదం జరిగితే బాధిత కుటుంబాలను ఎవరు ఆదుకుంటారని ప్రజలు నిలదీస్తున్నారు. -
అమ్మ లాలన.. మొక్క రక్షణ
[ 03-07-2024]
అమ్మ.. నవమాసాలు మోస్తుంది. పురిటినొప్పులు భరిస్తూనే శిశువుకు జన్మనిస్తుంది. కంటికి రెప్పలా కాపాడుతుంది. ఏమి ఆశించక పెంచి పెద్ద చేస్తుంది. జీవితంలో తన కుమారుడి ఎదుగదలను చూసి.. ఆనందాన్ని పొందుతుంది. -
ఆనందం అంతలోనే పెను విషాదం
[ 03-07-2024]
చిన్నప్పటి నుంచి కలిసి పెరిగారు.. ఏ ఆనందమైనా, విషాదమైన కలిసే పంచుకున్నారు.. ఒకరికి ఒకరు తోడుగా నిలిచారు. అందరూ కలిసి ఉత్సాహంగా పర్యటక ప్రాంతాలను చూసి వద్దామని బయలు దేరారు. -
చైతన్యం తీసుకొచ్చి.. భూసారం పరీక్షించి..
[ 03-07-2024]
భూసారంపై సరైన అవగాహన లేక ఎంతోమంది రైతులు పరీక్ష చేయించకుండానే పంటలు సాగు చేసి నష్టపోతున్నారు. అందుకే ప్రభుత్వాలు సైతం భూసార పరీక్షలకు ప్రాధాన్యం ఇస్తూ రైతులకు అవగాహన కల్పిస్తున్నాయి. -
ఉద్యోగాల పేరిట దర్జాగా మోసం
[ 03-07-2024]
వివిధ స్వచ్ఛంద సంస్థలు, సంఘాల్లో కేంద్ర, రాష్ట్ర కమిటీల ప్రతినిధిగా పరిచయం చేసుకున్న ఓ మోసగాడు.. దర్జాగా అమాయకులను నట్టేట ముంచాడు. చివరకు మోసపోయామని గ్రహించిన ఇద్దరు బాధితులు పోలీసులను ఆశ్రయించడంతో అసలు విషయం బయటపడింది. -
పక్కాగా పర్యవేక్షణ.. అతిసారం నియంత్రణ
[ 03-07-2024]
వర్షాకాలంలో సాధారణంగా సీజనల్ వ్యాధులు ప్రబలుతుంటాయి. ప్రభుత్వ యంత్రాంగమైనా, వ్యాపారస్థులైనా, కుటుంబ సభ్యులైనా ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా మొదటికే మోసం వస్తుంది. -
వన మహోత్సవానికి సిద్ధం
[ 03-07-2024]
జిల్లాలో పచ్చదనం పెంపే లక్ష్యంగా వన మహోత్సవాన్ని నిర్వహించేందుకు యంత్రాంగం సన్నద్ధమైంది. మరో వారం రోజుల్లో ఊరూరా కార్యక్రమాన్ని చేపట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే నర్సరీల్లో మొక్కలు పంపిణీకి సిద్ధమయ్యాయి. -
ఎస్జీటీ.. ఆశలు ఆవిరి!
[ 03-07-2024]
ఆరేళ్ల తరవాత ఉపాధ్యాయ బదిలీలయ్యాయి. పనిచేస్తున్న స్థానం నుంచి మరో బడికి వెళుతున్నామన్న ఆనందం ఎస్జీటీ ఉపాధ్యాయులకు ఒక్క రోజైనా లేకుండా పోయింది. రేషనలైజేషన్కు బదిలీల ప్రక్రియతో ముడిపెట్టారు. దీంతో బదిలీ అయిన వారి స్థానంలో కొత్తవారు రాకుంటే అక్కడే పనిచేయాల్సి ఉంటుంది. -
అడ్డంకుల అధిగమనం.. ఏదీ ప్రారంభోత్సవం?
[ 03-07-2024]
కొమురవెల్లి పోలీస్ స్టేషన్ కొత్త భవనాన్ని ప్రారంభించడానికి గ్రహణం పట్టినట్టుగా వాయిదా పడుతూనే ఉంది. పనులు మొదలు పెట్టినప్పటినుంచీ అడ్డంకులు ఎదురవుతున్నాయి. -
మల్గిలో దారుణం!
[ 03-07-2024]
అన్నదమ్ముల మధ్య తలెత్తిన ఆస్తి తగాదా హత్యకు దారితీసింది. ఇంట్లో సోదరుల వాటాను కొనుగోలు చేసినా... రిజిస్ట్రేషన్ చేయకపోవడంతో జరిగిన గొడవల్లో సొంత అన్నపై సోదరుడు కర్రలు, బండరాళ్లతో దాడి చేయడంతో తీవ్రంగా గాయపడి ఆసుపత్రికి తరలించేలోపే మృత్యువాత పడిన ఘటన సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం మల్గిలో మంగళవారం చోటుచేసుకుంది. -
ఆదాయం అందిస్తున్నా అద్దెల్లోనే..
[ 03-07-2024]
ఏటా కోట్ల రూపాయల ఆదాయం ఉన్న ప్రభుత్వ కార్యాలయాలకు సొంత భవనాలు లేక అద్దె భవనాల్లో అరకొర వసతుల మధ్య కునారిల్లుతున్నాయి. హుస్నాబాద్లో ఆబ్కారీ, సబ్రిజిస్ట్రార్ కార్యాలయాలు నలభై ఏళ్లుగా అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. -
గురువు కోసం గుండెలు కరిగేలా..
[ 03-07-2024]
కొందరు ఉపాధ్యాయులు ఎన్నో ఏళ్లుగా విద్యార్థులను సొంత బిడ్డల్లా చూసుకుంటూ విద్యాబుద్ధులు చెబుతుంటారు. ఇలాంటి వారు బదిలీపై వెళ్తుంటే చిన్నారులు కన్నీరు పెడుతుంటారు. -
పోలీస్ స్టేషన్లో మహిళ ఆత్మహత్యాయత్నం
[ 03-07-2024]
దాయాదుల మధ్య భూవివాదానికి సంబంధించి తనతోపాటు భర్త, కుమారులపై పోలీసులు కేసు నమోదు చేశారని మనస్తాపంతో ఓ మహిళ సిద్దిపేట జిల్లా దుబ్బాక పోలీస్ స్టేషన్లో మంగళవారం రాత్రి ఆత్మహత్యాయత్నం చేశారు. సిద్దిపేట జిల్లా ఆసుపత్రిలో ఆమెకు చికిత్స అందిస్తున్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మళ్లీ మనమే వస్తాం.. ఈసారి 15 ఏళ్లు ఉంటాం: కేసీఆర్
-
ఇప్పటికే దరఖాస్తు చేసుకుంటే.. మెగా డీఎస్సీకి ఫీజు మినహాయింపు: మంత్రి నారా లోకేశ్
-
మరోసారి కూలిన ఓడేడ్ వంతెన గడ్డర్లు
-
ఆ రోజు ఫోన్ చేసి నన్నాపింది రోహితే: ద్రవిడ్
-
ఎమ్మెల్యే కొలికపూడి అత్యుత్సాహం
-
తెదేపా కేంద్ర కార్యాలయంపై దాడి కేసు.. పోలీసుల అదుపులో నిందితులు