విద్యుత్తు సమస్యలకు పరిష్కారం!
విద్యుత్తు సరఫరాలో ఎక్కడైనా అంతరాయం ఏర్పడితే వెంటనే పునరుద్ధరించే వ్యవస్థను ఆ శాఖ అధికారులు రూపొందిస్తున్నారు. ఇందుకు సంబంధించి ఆ శాఖ అధికారులు, సిబ్బందికి నిపుణులు శిక్షణ ఇవ్వగా ప్రస్తుతం వారందరూ క్షేత్ర స్థాయిలో సంబంధిత యాప్లో నిక్షిప్తం చేసే పనుల్లో నిమగ్నమయ్యారు.
ఫీడర్ యాప్లో వివరాల నమోదు
మెదక్లో 70 శాతం సర్వే పూర్తి
సర్వే వివరాలు నమోదు పరిశీలిస్తున్న ఎస్ఈ జానకిరాములు
మెదక్ టౌన్, న్యూస్టుడే: విద్యుత్తు సరఫరాలో ఎక్కడైనా అంతరాయం ఏర్పడితే వెంటనే పునరుద్ధరించే వ్యవస్థను ఆ శాఖ అధికారులు రూపొందిస్తున్నారు. ఇందుకు సంబంధించి ఆ శాఖ అధికారులు, సిబ్బందికి నిపుణులు శిక్షణ ఇవ్వగా ప్రస్తుతం వారందరూ క్షేత్ర స్థాయిలో సంబంధిత యాప్లో నిక్షిప్తం చేసే పనుల్లో నిమగ్నమయ్యారు. తెలంగాణ సదరన్ పవర్ డ్రిస్టిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్(ఎస్పీసీఎల్) జియోగ్రాఫికల్ సమాచార వ్యవస్థను నూతనంగా తీసుకొచ్చింది. దీనికి సంబంధించిన ఫీడర్ యాప్లో అన్ని వివరాలు నమోదు చేస్తున్నారు. దీంతో వెంటనే సరిచేయడానికి ఆస్కారం ఉంటుంది.
పక్కాగా సమాచారం...
జిల్లా కేంద్రమైన మెదక్ పట్టణంలో ప్రథమంగా ఈ సర్వేను జూన్ 24 నుంచి ప్రారంభించారు. టౌన్లో మొత్తం 10 ఫీడర్లు ఉండగా వాటి పరిధిలో ఉన్న స్తంభాలు, నియంత్రికలు, తీగల సైజు, స్తంభాల మధ్య దూరం, విద్యుత్తు లైన్లను తాకుతున్న కొమ్మల ప్రదేశాల వివరాలు.. ఇలా ఒక్కో ఫీడర్పై ఎన్ని నియంత్రికలు, వాటి సామర్థ్యం, తదితర వివరాలు సేకరిస్తున్నారు. విద్యుత్తు కనెక్షన్లు, ఇన్సులేటర్లు, నియంత్రికలపై ఓవర్లోడ్, కండక్టర్ల వివరాలను జియోగ్రాఫికల్ సమాచార వ్యవస్థలో అక్షాంశాలు, రేఖాంశాల ద్వారా సిబ్బంది గమనించి యాప్లో నమోదు చేస్తున్నారు. విద్యుత్తు సరఫరాలో అంతరాయం కలిగితే ఆ ప్రాంతం వివరాలపై సిబ్బందికి సందేశం వస్తుంది. వెంటనే వారు అవసరమైన సామగ్రితో యాప్ సూచించిన ప్రాంతానికి చేరుకొని మరమ్మతులు చేపట్టి విద్యుత్తు పునరుద్ధరిస్తారు.
యాప్తో సులభంగా గుర్తింపు
సరఫరాలో అంతరాయం ఏర్పడటానికి అనేక కారణాలు ఉంటాయి. తీగలు కిలోమీటర్ల మేర విస్తరించి ఉంటాయి. గాలికి చెట్ల కొమ్మలు తగిలినా, పక్షులు వాలినా, పిడుగు పడినా కూడా అంతరాయం కలుగుతుంది. కొన్నిసార్లు సాంకేతిక సమస్యలతోనూ ఇబ్బందులు ఏర్పడుతాయి. ఈ సమయంలో వినియోగదారులు అసౌకర్యానికి గురవుతారు. సమస్య ఎక్కడుందో అధికారులు, సిబ్బంది గుర్తించి మరమ్మతులు చేపట్టి పునరుద్ధరించేందుకు ఒక్కోసారి చాలా సమయం పడుతుంది. యాప్ ద్వారా జియోగ్రాఫికల్ సమాచార వ్యవస్థతో సమస్య ఏర్పడిన చోటును సులభంగా గుర్తించి త్వరితగతిన పరిష్కరించేందుకు ఉపయోగపడుతుంది. ఇందులో భాగంగానే ఫీడర్ యాప్లో సిబ్బంది క్షేత్రస్థాయి సమాచారాన్ని నమోదు చేస్తున్నారు.
70 శాతం నమోదు పూర్తి
రాంబాబు, విద్యుత్తు డీటీఈ మెదక్
జిల్లాలో మొదటిసారి మెదక్లో సర్వేను చేస్తున్నాం. మూడు బృందాలు క్షేత్ర స్థాయిలో పర్యటించి సేకరించిన వివరాలను యాప్లో నమోదు చేస్తున్నాం. ఇప్పటి వరకు 70 శాతం సర్వే పూర్తయింది. ఈ యాప్ అందుబాటులోకి వస్తే విద్యుత్తు సమస్యలకు త్వరగా పరిష్కారం లభిస్తుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఉపాధి కోర్సులకు ఆదరణ కరవు
[ 03-07-2024]
పారిశ్రామిక శిక్షణా నైపుణ్యం కలిగిన విద్యార్థులకు ఉద్యోగావకాశాలు తలుపుతడుతున్నాయి. తక్కువ సమయంలో కొలువులు సాధించి.. స్థిరపడాలనుకునే యువతకు పారిశ్రామిక శిక్షణ సంస్థ(ఐటీఐ) చక్కటి అవకాశం కల్పిస్తోంది. -
బీమా లేదు.. పరిహారం రాదు
[ 03-07-2024]
మెదక్ పురపాలికలో చెత్త తరలించే ట్రాక్టర్లు, స్వచ్ఛ ఆటో ట్రాలీలకు కనీసం బీమా చేయించడం లేదు. నిత్యం రహదారులపై తిరిగే వాహనాల వల్ల ఏదైనా ప్రమాదం జరిగితే బాధిత కుటుంబాలను ఎవరు ఆదుకుంటారని ప్రజలు నిలదీస్తున్నారు. -
అమ్మ లాలన.. మొక్క రక్షణ
[ 03-07-2024]
అమ్మ.. నవమాసాలు మోస్తుంది. పురిటినొప్పులు భరిస్తూనే శిశువుకు జన్మనిస్తుంది. కంటికి రెప్పలా కాపాడుతుంది. ఏమి ఆశించక పెంచి పెద్ద చేస్తుంది. జీవితంలో తన కుమారుడి ఎదుగదలను చూసి.. ఆనందాన్ని పొందుతుంది. -
ఆనందం అంతలోనే పెను విషాదం
[ 03-07-2024]
చిన్నప్పటి నుంచి కలిసి పెరిగారు.. ఏ ఆనందమైనా, విషాదమైన కలిసే పంచుకున్నారు.. ఒకరికి ఒకరు తోడుగా నిలిచారు. అందరూ కలిసి ఉత్సాహంగా పర్యటక ప్రాంతాలను చూసి వద్దామని బయలు దేరారు. -
చైతన్యం తీసుకొచ్చి.. భూసారం పరీక్షించి..
[ 03-07-2024]
భూసారంపై సరైన అవగాహన లేక ఎంతోమంది రైతులు పరీక్ష చేయించకుండానే పంటలు సాగు చేసి నష్టపోతున్నారు. అందుకే ప్రభుత్వాలు సైతం భూసార పరీక్షలకు ప్రాధాన్యం ఇస్తూ రైతులకు అవగాహన కల్పిస్తున్నాయి. -
ఉద్యోగాల పేరిట దర్జాగా మోసం
[ 03-07-2024]
వివిధ స్వచ్ఛంద సంస్థలు, సంఘాల్లో కేంద్ర, రాష్ట్ర కమిటీల ప్రతినిధిగా పరిచయం చేసుకున్న ఓ మోసగాడు.. దర్జాగా అమాయకులను నట్టేట ముంచాడు. చివరకు మోసపోయామని గ్రహించిన ఇద్దరు బాధితులు పోలీసులను ఆశ్రయించడంతో అసలు విషయం బయటపడింది. -
పక్కాగా పర్యవేక్షణ.. అతిసారం నియంత్రణ
[ 03-07-2024]
వర్షాకాలంలో సాధారణంగా సీజనల్ వ్యాధులు ప్రబలుతుంటాయి. ప్రభుత్వ యంత్రాంగమైనా, వ్యాపారస్థులైనా, కుటుంబ సభ్యులైనా ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా మొదటికే మోసం వస్తుంది. -
వన మహోత్సవానికి సిద్ధం
[ 03-07-2024]
జిల్లాలో పచ్చదనం పెంపే లక్ష్యంగా వన మహోత్సవాన్ని నిర్వహించేందుకు యంత్రాంగం సన్నద్ధమైంది. మరో వారం రోజుల్లో ఊరూరా కార్యక్రమాన్ని చేపట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే నర్సరీల్లో మొక్కలు పంపిణీకి సిద్ధమయ్యాయి. -
ఎస్జీటీ.. ఆశలు ఆవిరి!
[ 03-07-2024]
ఆరేళ్ల తరవాత ఉపాధ్యాయ బదిలీలయ్యాయి. పనిచేస్తున్న స్థానం నుంచి మరో బడికి వెళుతున్నామన్న ఆనందం ఎస్జీటీ ఉపాధ్యాయులకు ఒక్క రోజైనా లేకుండా పోయింది. రేషనలైజేషన్కు బదిలీల ప్రక్రియతో ముడిపెట్టారు. దీంతో బదిలీ అయిన వారి స్థానంలో కొత్తవారు రాకుంటే అక్కడే పనిచేయాల్సి ఉంటుంది. -
అడ్డంకుల అధిగమనం.. ఏదీ ప్రారంభోత్సవం?
[ 03-07-2024]
కొమురవెల్లి పోలీస్ స్టేషన్ కొత్త భవనాన్ని ప్రారంభించడానికి గ్రహణం పట్టినట్టుగా వాయిదా పడుతూనే ఉంది. పనులు మొదలు పెట్టినప్పటినుంచీ అడ్డంకులు ఎదురవుతున్నాయి. -
మల్గిలో దారుణం!
[ 03-07-2024]
అన్నదమ్ముల మధ్య తలెత్తిన ఆస్తి తగాదా హత్యకు దారితీసింది. ఇంట్లో సోదరుల వాటాను కొనుగోలు చేసినా... రిజిస్ట్రేషన్ చేయకపోవడంతో జరిగిన గొడవల్లో సొంత అన్నపై సోదరుడు కర్రలు, బండరాళ్లతో దాడి చేయడంతో తీవ్రంగా గాయపడి ఆసుపత్రికి తరలించేలోపే మృత్యువాత పడిన ఘటన సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం మల్గిలో మంగళవారం చోటుచేసుకుంది. -
ఆదాయం అందిస్తున్నా అద్దెల్లోనే..
[ 03-07-2024]
ఏటా కోట్ల రూపాయల ఆదాయం ఉన్న ప్రభుత్వ కార్యాలయాలకు సొంత భవనాలు లేక అద్దె భవనాల్లో అరకొర వసతుల మధ్య కునారిల్లుతున్నాయి. హుస్నాబాద్లో ఆబ్కారీ, సబ్రిజిస్ట్రార్ కార్యాలయాలు నలభై ఏళ్లుగా అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. -
గురువు కోసం గుండెలు కరిగేలా..
[ 03-07-2024]
కొందరు ఉపాధ్యాయులు ఎన్నో ఏళ్లుగా విద్యార్థులను సొంత బిడ్డల్లా చూసుకుంటూ విద్యాబుద్ధులు చెబుతుంటారు. ఇలాంటి వారు బదిలీపై వెళ్తుంటే చిన్నారులు కన్నీరు పెడుతుంటారు. -
పోలీస్ స్టేషన్లో మహిళ ఆత్మహత్యాయత్నం
[ 03-07-2024]
దాయాదుల మధ్య భూవివాదానికి సంబంధించి తనతోపాటు భర్త, కుమారులపై పోలీసులు కేసు నమోదు చేశారని మనస్తాపంతో ఓ మహిళ సిద్దిపేట జిల్లా దుబ్బాక పోలీస్ స్టేషన్లో మంగళవారం రాత్రి ఆత్మహత్యాయత్నం చేశారు. సిద్దిపేట జిల్లా ఆసుపత్రిలో ఆమెకు చికిత్స అందిస్తున్నారు.