వైద్య నారాయణులు.. సేవల్లో ప్రథములు
అంకితభావంతో సేవలు అందిస్తూ.. ఆత్మీయ పలకరింపుతో భరోసా ఇచ్చే వైద్యులను కనిపించే దైవంగా రోగులు భావిస్తారు. వెంటనే స్పందించే తీరు కొన్ని సందర్భాల్లో ప్రాణాపాయ స్థితి నుంచి గట్టెక్కిస్తుంది.
అంకితభావంతో సేవలు అందిస్తూ.. ఆత్మీయ పలకరింపుతో భరోసా ఇచ్చే వైద్యులను కనిపించే దైవంగా రోగులు భావిస్తారు. వెంటనే స్పందించే తీరు కొన్ని సందర్భాల్లో ప్రాణాపాయ స్థితి నుంచి గట్టెక్కిస్తుంది. మరికొందరు వృత్తిపరమైన సేవతో పాటు సామాజికంగా ఇతరులకు సహకారం అందిస్తుంటారు. తోచినంత సాయం చేస్తూ.. ఆరోగ్య పాఠాలు చెప్పేవారు అనేకం. ఎంతో మంది వైద్యులు ప్రజల మన్ననలు పొంది వృత్తికి వన్నె తెస్తున్నవారు ఉమ్మడి మెదక్, వికారాబాద్ జిల్లాల్లో కొందరు ఉన్నారు. నేడు జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా ‘న్యూస్టుడే’ ప్రత్యేక కథనం..
శతశాతం.. పురస్కార పథం
న్యూస్టుడే, సిద్దిపేట: సిద్దిపేటలోని నాసర్పురా యూపీహెచ్సీ వైద్యాధికారి డా.జి.శ్రీకాంత్.. ఐదేళ్లుగా సేవలు కొనసాగిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం అందించే కాయకల్ప పురస్కారాన్ని మూడేళ్లు వరుసగా అందుకోవడం విశేషం. రోజులో ఇక్కడ 100 మందికి ఓపీ సేవలు అందుతున్నాయి. రోగ నిర్ధారణ పరీక్షల్లో ప్రతిసారి ప్రత్యేకతను చాటుతోంది. 16 ఏళ్ల లోపు బాలలకు టీకాలను పంపిణీ చేస్తున్నారు. లక్ష్యంలో వంద శాతాన్ని అధిగమిస్తున్న ఆసుపత్రిగా గుర్తించారు. నెలలో దాదాపు 350 మంది గర్భిణులకు పరీక్షలు చేస్తున్నారు. మందులు పంపిణీ చేస్తున్నారు. మొత్తం 30 మంది ఆరోగ్య సిబ్బంది పని చేస్తున్నారు. ఉదయం 9 నుంచి 4 గంటల వరకు ఈ ఆసుపత్రి తెరిచి ఉంటోంది. గతంలో గర్భిణులకు పరీక్షల నిమిత్తం అంగన్వాడీ కేంద్రాలకు వైద్య సిబ్బంది నేరుగా వెళ్లే వారు. ఏటా వివిధ రకాల సేవలతో ప్రత్యేకతను చాటుతున్నారు.
శ్రీకాంత్, సిద్దిపేట నాసర్పురా వైద్యాధికారి
తితిదేకు రూ.కోటి స్థలం
న్యూస్టుడే, చేగుంట: ప్రైవేటు వైద్యులందరూ వ్యాపారదృక్పథంతో ఉండరు. కొందరు సమాజ సేవలో తరిస్తారు. మెదక్ జిల్లా నార్సింగికి చెందిన డాక్టర్ టీవీపీ చారి.. తిరుమల తిరుపతి దేవస్ధానం (తితిదే) కల్యాణ మండపానికి జాతీయ రహదారి పక్కనే ఉన్న రూ.కోటి విలువైన ఎకరం స్థలాన్ని కొన్నేళ్ల క్రితం దానం చేశారు. గ్రామస్థుల కోరిక మేరకు ఆ స్థలాన్ని తితిదేకు రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చారు. ఆయన అంతవిలువైన స్థలం ఇచ్చినా నేటికీ కల్యాణ మండపం నిర్మించలేదు. ఆయన లయన్స్ క్లబ్లో జిల్లా గవర్నర్ స్థాయిలో సేవలు అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన కుమారులు కూడా వైద్యులే. నార్సింగి గ్రామాభివృద్ధికి తమవంతు సహకారం అందిస్తున్నారు.
క్లిష్టమైన ప్రసవాలకు భరోసా
సంగారెడ్డి అర్బన్, న్యూస్టుడే: గర్భిణులు కొందరికి ప్రసవ సమయంలో క్లిష్ట పరిస్థితులు ఎదురవుతాయి. కొందరు డాక్టర్లు హైదరాబాద్కు సిఫారసు చేయడం చూస్తుంటాం. ప్రసవమైనా, గర్భాశయాల సమస్యలైనా సంగారెడ్డి ప్రభుత్వాసుపత్రిలోని వైద్యురాలు ఎం.నాగలక్ష్మి మాత్రం వారికి పూర్తి భరోసా ఇచ్చి నైపుణ్యంగా చికిత్స చేసి మహిళలకు సాంత్వన కలిగిస్తూ గుర్తింపు పొందారు. జిల్లాలో ఎక్కడైనా నాగలక్ష్మి మేడమ్ హస్తవాసిపై మహిళలకు అపారమైన భరోసా ఉంటోంది. ముఖ్యంగా ఆమె మాట్లాడగానే సగం బాధ తగ్గినట్టుంటుందని ఆస్పత్రికి వచ్చేవారు చెబుతుంటారు. 1999లో సివిల్ అసిస్టెంట్ సర్జన్గా నాగలక్ష్మి నియమితులయ్యారు. హైదరాబాద్, వరంగల్లో పనిచేశారు.2022లో సంగారెడ్డికి వచ్చారు. ఆమె ప్రస్తుతం ఫ్రొఫెసర్ హోదాలో విధులు నిర్వర్తిస్తున్నారు. గర్భిణులకు నెలల ముందు నుంచే జాగ్రత్తలు పాటించేలా చూడటం ఈమె ప్రత్యేకత.సాధారణ ప్రసవం విజయవంతమయ్యేలా చేస్తారు.
కుటుంబమంతా ఒకటే వృత్తి
వికారాబాద్ కలెక్టరేట్: వికారాబాద్ జిల్లా డాక్టర్ రవీందర్యాదవ్.. వైద్య రంగంలోనే ఉన్న అమ్మానాన్నల ప్రోత్సాహంతో అదే వృత్తిని చేపట్టారు. కొడంగల్కు చెందిన ఆయన తండ్రి దస్తప్ప.. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి తాండూరులో ఫార్మసిస్టుగా పదవీ విరమణ పొందారు. తల్లి జయలక్ష్మి ఆర్ఏంపీ. రవీందర్ రెండేళ్లక్రితం జిల్లా ఉప వైద్యాధికారిగా బాధ్యతలను స్వీకరించారు. క్షయ, కుష్టు, సీజనల్ వ్యాధుల నివారణ ప్రోగ్రాం అధికారిగా బాధ్యతలు చేపట్టారు. టీహబ్, బ్లడ్ బ్యాంక్ కేంద్రం ఇన్చార్జిగా వ్యవహరిస్తున్నారు. విధినిర్వహణలో నిక్కచ్కిగా ఉండటం.. సిబ్బంది స్పందించేలా చూడటం వీరి ప్రత్యేకత. వీరి పిల్లలు ఇద్దరూ వైద్య విద్యనే అభ్యసిస్తున్నారు. భార్య కొడంగల్ మున్సిపాలిటీ కౌన్సిలర్గా, మరోవైపు డాక్టర్గా ప్రజలకు సేవలందిస్తున్నారు.
జిల్లాలోని వివిధ విభాగాల్లో ప్రభుత్వ వైద్యులు
సిద్దిపేట 396
సంగారెడ్డి 340
మెదక్ 98
వికారాబాద్ 196
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఉపాధి కోర్సులకు ఆదరణ కరవు
[ 03-07-2024]
పారిశ్రామిక శిక్షణా నైపుణ్యం కలిగిన విద్యార్థులకు ఉద్యోగావకాశాలు తలుపుతడుతున్నాయి. తక్కువ సమయంలో కొలువులు సాధించి.. స్థిరపడాలనుకునే యువతకు పారిశ్రామిక శిక్షణ సంస్థ(ఐటీఐ) చక్కటి అవకాశం కల్పిస్తోంది. -
బీమా లేదు.. పరిహారం రాదు
[ 03-07-2024]
మెదక్ పురపాలికలో చెత్త తరలించే ట్రాక్టర్లు, స్వచ్ఛ ఆటో ట్రాలీలకు కనీసం బీమా చేయించడం లేదు. నిత్యం రహదారులపై తిరిగే వాహనాల వల్ల ఏదైనా ప్రమాదం జరిగితే బాధిత కుటుంబాలను ఎవరు ఆదుకుంటారని ప్రజలు నిలదీస్తున్నారు. -
అమ్మ లాలన.. మొక్క రక్షణ
[ 03-07-2024]
అమ్మ.. నవమాసాలు మోస్తుంది. పురిటినొప్పులు భరిస్తూనే శిశువుకు జన్మనిస్తుంది. కంటికి రెప్పలా కాపాడుతుంది. ఏమి ఆశించక పెంచి పెద్ద చేస్తుంది. జీవితంలో తన కుమారుడి ఎదుగదలను చూసి.. ఆనందాన్ని పొందుతుంది. -
ఆనందం అంతలోనే పెను విషాదం
[ 03-07-2024]
చిన్నప్పటి నుంచి కలిసి పెరిగారు.. ఏ ఆనందమైనా, విషాదమైన కలిసే పంచుకున్నారు.. ఒకరికి ఒకరు తోడుగా నిలిచారు. అందరూ కలిసి ఉత్సాహంగా పర్యటక ప్రాంతాలను చూసి వద్దామని బయలు దేరారు. -
చైతన్యం తీసుకొచ్చి.. భూసారం పరీక్షించి..
[ 03-07-2024]
భూసారంపై సరైన అవగాహన లేక ఎంతోమంది రైతులు పరీక్ష చేయించకుండానే పంటలు సాగు చేసి నష్టపోతున్నారు. అందుకే ప్రభుత్వాలు సైతం భూసార పరీక్షలకు ప్రాధాన్యం ఇస్తూ రైతులకు అవగాహన కల్పిస్తున్నాయి. -
ఉద్యోగాల పేరిట దర్జాగా మోసం
[ 03-07-2024]
వివిధ స్వచ్ఛంద సంస్థలు, సంఘాల్లో కేంద్ర, రాష్ట్ర కమిటీల ప్రతినిధిగా పరిచయం చేసుకున్న ఓ మోసగాడు.. దర్జాగా అమాయకులను నట్టేట ముంచాడు. చివరకు మోసపోయామని గ్రహించిన ఇద్దరు బాధితులు పోలీసులను ఆశ్రయించడంతో అసలు విషయం బయటపడింది. -
పక్కాగా పర్యవేక్షణ.. అతిసారం నియంత్రణ
[ 03-07-2024]
వర్షాకాలంలో సాధారణంగా సీజనల్ వ్యాధులు ప్రబలుతుంటాయి. ప్రభుత్వ యంత్రాంగమైనా, వ్యాపారస్థులైనా, కుటుంబ సభ్యులైనా ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా మొదటికే మోసం వస్తుంది. -
వన మహోత్సవానికి సిద్ధం
[ 03-07-2024]
జిల్లాలో పచ్చదనం పెంపే లక్ష్యంగా వన మహోత్సవాన్ని నిర్వహించేందుకు యంత్రాంగం సన్నద్ధమైంది. మరో వారం రోజుల్లో ఊరూరా కార్యక్రమాన్ని చేపట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే నర్సరీల్లో మొక్కలు పంపిణీకి సిద్ధమయ్యాయి. -
ఎస్జీటీ.. ఆశలు ఆవిరి!
[ 03-07-2024]
ఆరేళ్ల తరవాత ఉపాధ్యాయ బదిలీలయ్యాయి. పనిచేస్తున్న స్థానం నుంచి మరో బడికి వెళుతున్నామన్న ఆనందం ఎస్జీటీ ఉపాధ్యాయులకు ఒక్క రోజైనా లేకుండా పోయింది. రేషనలైజేషన్కు బదిలీల ప్రక్రియతో ముడిపెట్టారు. దీంతో బదిలీ అయిన వారి స్థానంలో కొత్తవారు రాకుంటే అక్కడే పనిచేయాల్సి ఉంటుంది. -
అడ్డంకుల అధిగమనం.. ఏదీ ప్రారంభోత్సవం?
[ 03-07-2024]
కొమురవెల్లి పోలీస్ స్టేషన్ కొత్త భవనాన్ని ప్రారంభించడానికి గ్రహణం పట్టినట్టుగా వాయిదా పడుతూనే ఉంది. పనులు మొదలు పెట్టినప్పటినుంచీ అడ్డంకులు ఎదురవుతున్నాయి. -
మల్గిలో దారుణం!
[ 03-07-2024]
అన్నదమ్ముల మధ్య తలెత్తిన ఆస్తి తగాదా హత్యకు దారితీసింది. ఇంట్లో సోదరుల వాటాను కొనుగోలు చేసినా... రిజిస్ట్రేషన్ చేయకపోవడంతో జరిగిన గొడవల్లో సొంత అన్నపై సోదరుడు కర్రలు, బండరాళ్లతో దాడి చేయడంతో తీవ్రంగా గాయపడి ఆసుపత్రికి తరలించేలోపే మృత్యువాత పడిన ఘటన సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం మల్గిలో మంగళవారం చోటుచేసుకుంది. -
ఆదాయం అందిస్తున్నా అద్దెల్లోనే..
[ 03-07-2024]
ఏటా కోట్ల రూపాయల ఆదాయం ఉన్న ప్రభుత్వ కార్యాలయాలకు సొంత భవనాలు లేక అద్దె భవనాల్లో అరకొర వసతుల మధ్య కునారిల్లుతున్నాయి. హుస్నాబాద్లో ఆబ్కారీ, సబ్రిజిస్ట్రార్ కార్యాలయాలు నలభై ఏళ్లుగా అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. -
గురువు కోసం గుండెలు కరిగేలా..
[ 03-07-2024]
కొందరు ఉపాధ్యాయులు ఎన్నో ఏళ్లుగా విద్యార్థులను సొంత బిడ్డల్లా చూసుకుంటూ విద్యాబుద్ధులు చెబుతుంటారు. ఇలాంటి వారు బదిలీపై వెళ్తుంటే చిన్నారులు కన్నీరు పెడుతుంటారు. -
పోలీస్ స్టేషన్లో మహిళ ఆత్మహత్యాయత్నం
[ 03-07-2024]
దాయాదుల మధ్య భూవివాదానికి సంబంధించి తనతోపాటు భర్త, కుమారులపై పోలీసులు కేసు నమోదు చేశారని మనస్తాపంతో ఓ మహిళ సిద్దిపేట జిల్లా దుబ్బాక పోలీస్ స్టేషన్లో మంగళవారం రాత్రి ఆత్మహత్యాయత్నం చేశారు. సిద్దిపేట జిల్లా ఆసుపత్రిలో ఆమెకు చికిత్స అందిస్తున్నారు.